1 ENS Live Breaking News

కోవిడ్ రోగులకు సకాలంలో వైద్యసేవలు..

కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల్లో భాగంగా 2,219 పడకలు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయగా అందులో భాగంగా చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 530 పడకలు, 50 వెంటిలేటర్లు, మదనపల్లె జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 120 పడకలు, శ్రీ పద్మావతి ఆసుపత్రి (స్విమ్స్)లో 654 పడకలు, వెంటిలేటర్లు 60, రుయాలో 890 బెడ్లు, 138 వెంటిలేటర్లు, ఈఎస్ఐ తిరుపతిలో 250 పడకలు, ఎస్.వి ఆయుర్వేదిక్ ఆసుపత్రి నందు 210 పడకలు, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు 50 పడకలు, కుప్పం ఏరియా ఆసుపత్రి నందు 60 పడకలు ఏర్పాటు చేయడమైనది తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 36 ప్రైవేట్ ఆసుపత్రులో ఐసియు మరియు నాన్ ఐసియు పడకలతో కలిపి 2,380 పడకలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 
వీటితో పాటు కోవిడ్ కేర్ కేంద్రాలైన తిరుపతి పద్మావతి నిలయం – 1100, శ్రీనివాసం – 1270, విష్ణు నివాసం – 1034, ఆర్ వి ఎస్, చిత్తూరు – 170, మదనపల్లె లోని ఎస్ టి బాయ్స్ హాస్టల్ – 100 మరియు వశిష్టా పాఠశాల – 200, కార్వేటి నగరం లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ – 100, వాయల్పాడు ఏ పి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ – 300, పలమనేరు పాలిటెక్నిక్ కాలేజీలో 128 పడకలను ఏర్పాటు చేయడమైనదని, కోవిడ్ బాధితులు వైద్య సూచనల మేరకు వారికి అందుబాటులో ఉన్న  కోవిడ్ కేర్ కేంద్రాల నందు వైద్య సేవలు పొందవచ్చునని, అక్కడ అంబులెన్స్ సౌకర్యంతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉండి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఈసిజి, ఎక్స్ – రే, రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. 
కోవిడ్ లక్షణాలు ఉన్నట్లైతే పాజిటివ్ కాకున్నా స్థానిక పి హెచ్ సి, మెడికల్ అధికారులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల దగ్గర వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జ్వరం, టైఫాయిడ్ అని చెప్పి కాలయాపన చేయకుండా జ్వరం తీవ్రత ఎక్కువై చివరి నిమిషంలో ఆసుపత్రిలకు చేరుకోవడం కంటే ముందుగానే కోవిడ్ లక్షణాలు ఉన్నట్లైతే పరీక్ష చేయించుకుని ట్రయాజింగ్ సెంటర్లో సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్, ఆసుపత్రికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన బాధితులకు వైద్యుల సూచనల మేరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఆక్సిజన్ అందిస్తేనే . . రెమిడిసివర్ ఇంజక్షన్ ఇస్తేనే కరోనా నయం అవుతుందన్నది అపోహ మాత్రమే అని, అధిక ధర చెల్లించి ఆక్సిజన్ సరఫరా రెమిడిసివర్ ఇంజక్షన్లు కొనుగోలు చేయరాదని, ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ బెడ్ మరియు రెమిడిసివర్ ఇంజక్షన్ అవసరం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కరోనా భయంతోనే ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారని, మంచి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంను స్వేకరిస్తూ మనో ధైర్యంతో యోగా, ప్రాణాయామం లాంటి జాగ్రత్తలు పాటిస్తూ కోలుకోవచ్చునన్నారు. ఒక వేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లకు తెలియజేయాలని, వారు వెంటనే పరీక్షించి ఎక్కడకి పంపాలన్నది నిర్ణయించి సత్వర చికిత్సలు అందించేలా అన్ని చర్యలు చేపడతారని, సమస్య తీవ్రమైన తరువాత ఆసుపత్రులకు వచ్చి చేరడం కంటే కరోనా లక్షణాలు ఉన్న వెంటనే జాగ్రత్త పడి వైద్యుల సలహా మేరకు చికిత్స పొంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తిరుపతి

2021-05-05 14:40:46

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే విధులు..

కోవిడ్ జాగ్రత్తలు నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను కోరారు. బుధవారం ఆమె ఛాంబర్ లో జోనల్ కమిషనర్లు, ప్రధాన వైధ్యాధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కోవిడ్ రెండవ దశ చాలా ఉధృతంగా ఉన్నందున అధికారులు ఇంకా ముమ్మరంగా చర్యలు చేపట్టాలని, ప్రతీ వార్డులో కార్పొరేటర్ సూచనలు పాటిస్తూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయాలని సూచించారు. కొన్ని జోన్లలో వార్డులు ఎక్కువుగా ఉన్నందున, జోన్ ఒక్కొక్కటికి, ఒక టాటా ఏస్ మాత్రమే ఉన్నందున వాటి సమయం పెంచి రెండు పూటలా సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారి చేసే విధంగా చూడాలని ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. వార్డు వాలంటీర్ల ద్వారా హోమ్ ఐసొలేషన్లో ఎంత మంది ఉన్నారో, వారి ప్రైమరీ కాంటాక్ట్స్, వారికి కోవిడ్ మందులు కిట్స్ అందించే విధానం పై ఆరా తీసి, ఆయా వివరాలు తెలపాలని ఆదేశించారు. కోవిడ్ పేషంట్లు ఉన్న ఏరియాలలో సోడియం హైపోక్లోరైట్, వీధులలోనే కాకుండా ఇంటి పరిసరరాలలోను, ఇళ్ళల్లోనూ  చల్లించాలని ఆ చట్టు ప్రక్కల బ్లీచింగు కూడా చల్లించాలని ఆదేశించారు. వార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన స్పెషల్ అఫీసర్సుతో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. వార్డు అడ్మిన్, హెల్త్, శానిటరి, వెల్ఫేర్ మొదలగు వార్డు కార్యదర్శులు, ప్రతీ రోజు ఒక గంట వార్డులో తిరిగే విధంగా చూడాలని సూచించారు. ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి 250 బెడ్లు సమకూరుస్తున్నారని వాటిని మన కోవిడ్ సెంటర్లలో ఏర్పాటు చేస్తామని, ఈ రెండు సెంటర్లలో ఆక్సిజన్ ఉండే ఏర్పాట్లు అధికారులతో చేయించేలా చర్చిస్తున్నామని తెలిపారు. ఇంటివద్ద మరణించిన కోవిడ్ పేషంట్ ను తీసుకువెళ్ళుటకు చాలా ఇబ్బందిగా ఉందని, అందుకు వారి కొరకు జోనుకు ఒకటి చొప్పున ఒక మహా ప్రస్థానం (అంతిమ యాత్ర) వాహనం  ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టామని, ప్రతీ జోన్లో కోవిడ్ తో మరణించిన వారి కొరకు ఒక స్మశాన వాటికను ఏర్పాటు చేసే ప్రక్రియ పరిశీలించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. నగర పరిధిలోగల మొత్తం 72అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరియు కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అనువుగా ఉన్న కమ్మ్యునిటీ హాల్స్ గాని, ప్రైవేట్ బిల్డింగ్స్ గాని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, జోనల్ కమిషనర్లు అడిగిన పలు ప్రశ్నలకు మేయర్ మరియు ప్రధాన వైద్యాధికారి సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రీ, జోనల్ కమిషనర్లు గోవింద రావు, బొడ్డేపల్లి రాము, ఫణిరాం, సింహాచలం, శ్రీధర్, చక్రవర్తి, బయోలజిస్ట్ (పైడిరాజు), తదితరులు పాల్గొన్నారు. 

విశాఖపట్నం

2021-05-05 13:38:34

విధుల్లోకి చేరిన జెసి జి.రాజకుమారి

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి బుధవారం విధుల్లోకి చేరారు. ఏప్రిల్ 05 నుంచి 30వ తేది వరకు లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ,ముస్సోరి లో ఐఏఎస్ శిక్షణ విజయవంతంగా  పూర్తిచేసుకుని తిరిగి కాకినాడ చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల నుంచి 70 మంది ఐఎస్ లు ట్రైనింగ్ లో పాల్గొనగా ఈ ట్రైనింగ్ కాలంలో నిర్వహించిన అన్ని అంశాలలో  మొదటి స్థానం సంపాదించిన జి రాజకుమారి ఉత్తమ ప్రతిభకు గాను  ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా జేసి రాజకుమారి మాట్లాడుతూ  123వ ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని  విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గతంలో  కంటే  మరింత అంకితభావం, సేవాభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు కృషి చేస్తానిని ఆమె తెలిపారు. ఈ శిక్షణ తనకు విధినిర్వహణకు ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. నేటి నంచి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాటు సంక్షేమ పథకాల పర్యవేక్షణ, కోవిడ్ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తానని జేసీ రాజకుమారి తెలిపారు.

కాకినాడ

2021-05-05 13:27:50

తూ.గో.జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు..

తూర్పుగోదావరి జిల్లాలో ఆక్సిజన్ సంబంధించి ఎక్కడా కొరత లేదని, రోగులకు అవసరమైనంత ఆక్సీజన్ అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు.  బుధవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఈఎన్టీ బ్లాక్ వద్ద ఉన్న కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ (డి)కీర్తి చేకూరి , వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశ కోవిడ్ చాలా ఉధ్థృతంగా వ్యాపిస్తుదన్నారు. గతంలో 70% హోం ఐసోలేషన్ లోను,15% కొవిడ్
కేర్ సెంటర్ లోను,15%హాస్పిటల్ కి మాత్రమే ప్రజలు వచ్చే వారున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఆసుపత్రులకే వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు అపోహలను విడిచిపెట్టి కోవిడ్ పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, రోగులకు రోజువారీ అవసరమైన ఆక్సిజన్  అందుబాటులో ఉందన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆక్సిజన్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నరన్నారు. ఆక్సిజన్ దుర్వినియోగం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , ఇప్పటికే కొన్ని  ఆస్పత్రులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సంబంధించి ప్రజల రద్దీని నివారించే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. డ్యూటీ డాక్టర్స్ వాహనాలు,అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలు మినహా ఇతరుల వాహనాలు జిజిహెచ్ లోపలకి రానివ్వకుండా చర్యలు చేపట్టలన్నారు. ఒక పేషెంట్ కి ఒక అటెండర్ మాత్రమే ఉండేవిధంగా పాసులు జారీ చేయబడతాయన్నారు. డిశ్చార్జి ప్రోటోకాల్ సంబంధించి  ఇద్దరు డాక్టర్లకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇక నుంచి కోవిడ్ సోకి, వైద్య సేవలు పొంది , ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని క్రమంగా డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. ఆక్సిజన్ అవసరం లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా హోం ఐసోలేషన్ లో ఉండేవిధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రజలు ఇప్పటికైనా మేల్కొనలి... కలెక్టర్.

   రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం వల్ల మాత్రమే కాకుండా కరోనా వైరస్ పట్ల ఇప్పటికైనా  అవగాహనతో, బాధ్యతాయుతంగా ప్రజలు వ్యవహరించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 12 గంటలకు అత్యవసరాలకు  సంబంధించినవి తప్ప మిగిలినవన్నీ మూసి వేయడం జరుగుతుందని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికి పరిమితం కావాలని కలెక్టర్ తెలిపారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పీ వెంకట బుద్ధ, ఆర్ యమ్ ఓ  డా ఇ. గిరిధర్, నోడల్ అధికారులు డా.ఎం కిరణ్, డా .హెచ్ విజయ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు.

కాకినాడ

2021-05-05 13:23:59

144 సెక్షన్ అమలులో వుంటుంది..

కోవిడ్-19 మహమ్మారి కట్టడి లక్ష్యంగా జిల్లాలోని పబ్లిక్ ప్రదేశాలలో 5గురు అంత కంటె ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడాన్ని నిషేదిస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి సిఆర్పిసి సెక్షన్-144 సెక్షన్ అమలుపై బుధవారం ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఆదేశాలు ఈ నెల 18వ తేదీ వరకూ అమలులో ఉంటాయని, కర్ఫ్యూ సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులలోని పేరా-3 నందు మినహాయించిన సంస్థలు, సేవలకు సంబంధించిన వ్యక్తులు తప్ప మరెవరూ మద్యాహ్నం 12 గం.ల నుండి మరుసటి రోజు ఉదయం 6 గం.ల వరకూ పబ్లిక్ ప్రదేశాలలో సంచరించ కూడదని ఆయన ఆదేశించారు.  పేరా-3లో అనుమతించిన సంస్థలు, కార్యాలయాలు, సేవలు మినహా తక్కిన అన్ని సంస్థలు, షాపులు, ఎస్టాబ్లిష్మెంటులు, కార్యాలయాలు, రెస్టారెంట్లను విధిగా మద్యాహ్నం 12 గం.లకు మూసివేసి, తదుపరి రోజు 6 గం.లకు తెరవాలన్నారు. రాష్ట ప్రభుత్వ జిఓ.192 ఉత్తర్వులు మేరకు కర్ఫ్యూ వేళలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, ఫార్మసీలతో పాటు అత్యవసర సేవలు అందించే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, బ్రాడ్ కాస్టింగ్, ఐటి, ఐటి ఎనేబుల్డ్ సర్వీసులు, పెట్రోల్ పంపులు, ఎల్పిజి, సిఎన్జి, పెట్రోలియం అండ్ గ్యాస్ అవుట్ లెట్ల కు అనుమతి ఉందన్నారు.  అలాగే పవర్ జనరేషన్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లయి, శానిటేషన్, కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, ప్రయివేట్ సిక్యూరిటీ సేవలకు అనుమతి ఉందన్నారు. అన్ని వ్యవసాయ కార్యకలాపాలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ఉత్పాదక పరిశ్రమలు  సంబంధిత వ్యవసాయ, పరిశ్రమల శాఖలు నిర్థేశించిన కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ నిర్వహించవచ్చునని తెలిపారు. అనుమతించిన సంస్థలు, సేవలకు హాజరైయ్యే  వ్యక్తులు తగిన గుర్తింపు కార్డు చూపాల్సి ఉంటుందన్నారు.   అంతర జిల్లా, అంతర రాష్ట్ర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి లేదని, అత్యవసర సరుకుల రవాణా వాహనాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఆటోలు, టాక్సీలు, సిటి బస్సులు వంటి లోకల్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉదయం 6 నుండి మద్యాహ్నం 12 గం.ల మద్య మాత్రమే కోవిడ్ నిబంధనల పాటించేలా అనుమతిస్తారన్నారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న వివాహాలు, ఫంక్షన్లను స్థానిక అధికారుల పర్మిషన్ తో, గరిష్టంగా 20 మంది వ్యక్తుల హాజరు మించకుండా కోవిడ్ నిబందనలు పాటిస్తూ జరుపుకోవచ్చున్నారు.  ఈ ఉత్తర్వులను సంబందిత శాఖల అధికారులు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశిస్తూ, విపత్తు నియంత్రణ, ప్రజారోగ్యరక్షణ దృష్ట్యా చేపట్టిన ఈ నియమ, నిబందనలను పాటించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాకినాడ

2021-05-05 13:22:11

కోవిడ్ రోగుల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలు అందించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని తెలియజేశారని,  రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, కరోనా కట్టడికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కరోనా సోకిన వారిని కాపాడేందుకు ఎంతయినా ఖర్చు చేస్తామన్నారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.

కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి కర్ఫ్యూ మొదలవుతుందని, ప్రతి ఒక్కరు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. కర్ఫ్యూ విధించేందుకు కోవిడ్ కేసులు పెరగడమే కారణమని, కేసులు మరిన్ని పెరగకుండా అరికట్టేందుకు, తగ్గించడానికి కర్ఫ్యూని అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది ఏ విధంగా అయితే అధికారులు సమర్థవంతంగా లాక్ డౌన్ లో పనిచేసారో కర్ఫ్యూలో కూడా అలాగే పనిచేసేలా పాలుపంచుకోవాలన్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు, కరోనా టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం వస్తున్న వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో జాతీయ రహదారుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దానిపై దృష్టి పెట్టాలన్నారు.

కరోనా సమయంలో శానిటేషన్ అనేది ముఖ్యమైన అంశమని, గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్ పై ఎలాంటి అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదన్నారు. క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ను సక్రమంగా చేపట్టాలన్నారు. కరోనా పరిస్థితులలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసేలా చూడాలన్నారు. కరోనా కట్టడికి గత ఏడాది ఏ విధంగా అయితే టీం వర్క్ తో, ఒక స్ఫూర్తి తో పని చేసామో అదేవిధంగా జిల్లా యంత్రాంగం టీం వర్క్ తో కలిసి కట్టుగా పని చేయాలన్నారు. గత ఏడాది చేసిన మాదిరిగా కోవిడ్ కేర్ సెంటర్లను పూర్తి స్థాయిలో నిర్వహించాలని,  గతేడాది లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రులపై ఒత్తిడి తక్కువగా ఉండేదని, ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రులపై ఎక్కువ ఒత్తిడి పడిందన్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కరోనా నివారణకు కట్టుదిట్టంగా పనిచేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం, వైద్య సదుపాయాలు, తదితర అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన, పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామన్నారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్, తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నోడల్ అధికారులు కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయించాలన్నారు.

హిందూపురం జిల్లా ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) ఆదేశాలు ఇచ్చారన్నారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కిట్లను ఇస్తున్నామని, వారికి తగిన సూచనలు, సలహాలు కూడా అందిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో యువత నిర్లక్ష్యంగా ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, ప్రజాసంక్షేమం, ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లాలో సరిపడినన్ని ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద, తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ప్లాంట్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్ లు ఉన్నాయన్నారు. ఆక్సిజన్ అందించే విషయమై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని, లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

అనంతపురం

2021-05-05 13:17:59

జాతీయ లోక్ అదాలత్ వాయిదా..

శ్రీకాకుళంలో ఈ నెల 8వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా వేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి కె.జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా వేసినట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ సభ్య కార్యదర్శి నుండి సమాచారం అందిందని పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తదుపరి ఉత్తర్వుల ఆధారంగా తెలియజేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. లోక్ అదాలత్ వాయిదా అంశాన్ని అధికారులు, కక్షిదారులు గమనించాలని ఆమె కోరారు.

శ్రీకాకుళం

2021-05-05 13:14:50

ఎంపీ భరత్ ఆ విధంగా విద్యా దానం చేశారు..

ఆ ఎంపీ కోటా కింద లెటరు ఇస్తే..కేంద్రీయ విద్యాలయంలో ఉచితంగా సీటు లభిస్తుంది.. వాస్తవంగా అయితే చాలా మంది ఎంపీలు ఈ అవకాశాన్ని పార్టీలో తమ కోసం పనిచేసిన కేడర్ కోసం వినియోగించి వారికి కేంద్రీయ విద్యాలయంలో చదివించే అవకాశం కల్పిస్తారు. కానీ రాజమండ్రి ఎంపీ భరత్ వినూత్నంగా ఆలోచించారు. తన కోటా కింద వచ్చే 10 సీట్లకు ప్రజల నుంచి దరఖాస్తులు కోరి వారి మద్యే డ్రా తీసి నిరుపేదలకు వాటిని అందించారు. ఎంపీ చేసిన ఈ ఉపకారంతో పది మంది నిరుపేద కుటుంబాల్లోని పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ మంచి కార్యక్రమానికి మార్గానీ ఎస్టేట్ వేదికైతే..వైఎస్సార్సీపీ నాయకులు, విద్యాలయంలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు సాక్షిగా మారారు. లక్కీ డ్రాలో సీటు పొందిన తల్లిదండ్రులంతా ఎంపీ భరత్ ను బాబూ నువ్వు చల్లగా ఉండాలి...పేదల కోసం విద్యా దానం చేసిన నీ మేలు మరిచిపోలేమంటూ బరువైన గుండెలతో..ఆనంద బాష్పాలతో దీవించారు.  ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, నేను ఎంపీగా మీ ఓటుతోనే గెలిచాను.. నేను మీకే సేవలు చేయాలి..అందుకే ఈ విధంగా సీట్లు డ్రా ద్వారా అందించాను. సీట్లు పొందిన వారంతా మంచి చదువులు చదువుకొని అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రావు, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్,  నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్లమెంట్  జిల్లా అధికార ప్రతినిధి కానుబొయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు..

రాజమహేంద్రవరం

2021-05-05 13:10:07

కలెక్టర్ ఆదేశం ఎక్స్ రే యూనిట్ ప్రత్యక్షం..

ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ కరోనా వైరస్ నియంత్రణలో అధికారులను అప్రమత్తం చేస్తూ..తాను స్వయంగా కోవిడ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ప్రజలకు సేవలందించడంలో ముందుంటున్నారు. బుధవారం ఒంగోలు కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ 500 పడకలు ఉన్న సమయంలో అత్యవసర సేవలకు ఎక్స్ రే మిషన్ లేని విషయాన్ని గుర్తించారు. అంతే ఆ విషయాన్ని  ఎస్సీ కార్పోరేషన్ ఈడి శ్రీనివాస విశ్వనాధ్ ను ఆదేశించడంతో ఆఘమేఘాలపై ఎక్స్ రే యూనిట్ ను కోవిడ్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు సర్వ శక్తులు ఒడ్డుతోందని, మనం కూడా ప్రజలను కాపాడటానికి అన్ని అవకాశాలను వినియోగించుకొని సేవలు అందించాలని సూచించారు. ఎక్కడా వైద్యసేవలు, ఆక్సిజన్, బెడ్లు లేవనే ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. పారామెడికల్ సిబ్బంది, వైద్యులు మానవతా ద్రుక్పదంతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకి రావాలి సూచించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

ఒంగోలు

2021-05-05 13:08:08

హోమ్ ఐసోలేషన్ వారికి కిట్లు ఇవ్వాల్సిందే..

కోవిడ్ వ‌చ్చిన‌వారితోపాటు, వ్యాధి రాని వారు కూడా వ‌చ్చిన‌ట్టుగానే భావించి, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ ఎంతో అప్రమ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇద‌ని అన్నారు
. ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌న‌స‌రిగా మాస్కును ధ‌రించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ, చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌భుత్వం అంద‌జేసిన మెడిక‌ల్ కిట్ల‌ను స్థానిక జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌యం వ‌ద్ద బుధ‌వారం ఎఎన్ఎంల‌కు అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విధాలుగా కోవిడ్ చికిత్స‌ను అందిస్తున్నామ‌ని చెప్పారు. వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉండీ కోవిడ్ సోకిన‌వారికి, ఆక్సీజ‌న్ ప‌రిమాణం త‌క్కువ‌గా ఉన్న‌వారికి, ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌వారికి ఆసుప‌త్రుల్లో ఉంచి చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. దీనికోసం 14 ప్ర‌భుత్వ‌, 16 ప్ర‌యివేటు ఆసుప్ర‌తుల‌ను సిద్దం చేశామ‌ని, ప్ర‌స్తుతం 997 మంది వ‌ర‌కూ కోవిడ్ పేషెంట్లు ఆసుప‌త్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపారు.                  వ్యాధి ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారినీ, ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ, హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌టానికి అవ‌కాశం లేనివారినీ ఉంచేందుకు జిల్లాలో ఏడు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. వీటిలో మొత్తం 3,600 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, 24 గంట‌లూ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోపాటు, అవ‌స‌ర‌మైతే వినియోగించేందుకు ఆక్సీజ‌న్‌, మందులు, అంబులెన్సుల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారాన్ని అందించ‌డంతోపాటు, పారిశుధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం 100 మంది వ‌ర‌కూ కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నార‌ని క‌లెక్ట‌ర్‌ చెప్పారు.

                  హోం ఐసోలేష‌న్‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తున్నామ‌ని, వ్యాధి ల‌క్ష‌ణాలు తీవ్రంగా లేనివారికి ఇళ్ల‌లోనే ఉంచి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఇలా ప్ర‌స్తుతం సుమారు 5వేల మంది వ‌ర‌కూ హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా వీరికి కోవిడ్ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దీనికోసం జిల్లాకు సుమారు 75 వేల కోవిడ్ కిట్లు వ‌చ్చాయ‌ని, వీటిలో 45 వేల కిట్ల‌ను ఇప్ప‌టికే పిహెచ్‌సిల‌కు పంపించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ఇవి కాకుండా స‌బ్ సెంట‌ర్ల ప‌రిధిలోని ఎఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌ల ద్వారా నేరుగా పంపిణీ చేసేందుకు, వారికి సుమారు 22వేల‌ కిట్ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఎంత త్వ‌ర‌గా కిట్ల‌ను పంపిణీ చేస్తే, రోగులు అంత త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటార‌ని అన్నారు. అందువ‌ల్ల‌, ఈ కిట్లు పంపిణీని కంట్రోల్ రూముద్వారా ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌న్నారు. జింకు, విట‌మిన్లు, సిట్రిజ‌న్‌, యాంటీ బ‌యాటిక్ టేబ్‌లెట్లు, వాటిని వాడే విధానాన్ని కూడా కిట్ల‌లో పొందుప‌ర్చ‌డం జ‌రిగింద‌న్నారు. వ్యాధి సోకిన‌ప్ప‌టికీ, అధైర్య ప‌డ‌కుండా ధైర్యంగా ఎదుర్కోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.   ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ చామంతి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం

2021-05-05 10:27:41

సింహాద్రి నాధుని చందోనోత్సవానికి ఏర్పాట్లు..

విశాఖలోని సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి  చందనోత్సవానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈనెల 14న స్వామివారి చందనోత్సవం ఏకాంతంగా జరగనుంది. దానికోసం గందపు చెక్కలు సిద్ధమయ్యాయి. చందనం సాన ముహూర్తి 7వ తేదీ నుంచి చందనం తీయడం ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించడానికి చందనాన్ని సిద్దం చేస్తారు. స్వామివారి చందనోత్సవం రోజు స్వామి వారి వేసుకున్న చందనం తొడుగును వెండి బొరియలతో తొలగిస్తారు. ఆపై స్వామి ఉగ్రరూపాన్ని నిజరూప దర్శనంగా భక్తులకు కల్పిస్తారు. అరోజు నుంచి స్వామివారి శాంత పరిచేందుకు చందనం దఫ దఫాలుగా స్వామికి సమర్పిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమ శాస్త్రం ఆధారం నిర్వహించడానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సింహాచలం

2021-05-05 10:22:13

వేక్సినేషన్ తోనే కరోనాను తరిమికొట్టాలి..

విశాఖ మహానగరంలో ప్రభుత్వం నిర్ధేశించిన వారంతా ఖచ్చితంగా కోవిడ్ వేక్సిన్ వేసుకొని కరోనాను తరమికొట్టాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షలు వంశీక్రిష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చినవాల్తేర్ చిన్న హాస్పిటల్(ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం) వద్ద గల కోవిడ్ వ్యాక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. కోవిడ్ వ్యాక్షన్ తీరుపై స్థానిక వైద్య సిబ్బందిని మరియు స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కరోనా ఉధృతి, కేసులు ఎక్కువగా వున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలన్నారు.  ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు , సానీటైజర్లు వినియోగిస్తూ వ్యక్తిగత దూరం పాటించాలని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సినేషన్ లో ప్రాధన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వార్డు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

చినవాల్తేరు

2021-05-05 10:13:19

వేడుకలకు 20 మందికే అనుమతి..

కోవిడ్ వ్యాప్తి కారణంగా వివాహ కార్యక్రమాలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు, మండల అధికారులతో బుధ వారం కోవిడ్ నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. వివాహ వేడుకలకు హాజరయ్యేవారి పేర్లను తహశీల్దార్ కు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేసారు. వివాహ వేడుకలు జరిగే ప్రదేశాలను తహశీల్దార్లు తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, సంస్ధలు, హోటళ్ళు, రెస్టారెంట్లు తదితర సంస్ధలు ఉంటాయని, 12 గంటల తరువాత అత్యవసర సేవలు – మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, పాలు వంటి ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వారాలపాటు ఇది అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దుకాణాలు 12 గంటలకు మూసివేయాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. ఎక్కడా నలుగురు కంటే ఎక్కువగా ఉండరాదని ఆయన పేర్కొంటూ 144 సెక్షన్ అమలులో ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. దుకాణాల వద్ద క్యూ లైన్ లో కోవిడ్ నిబంధనల మేరకు నిలిచి ఉండవచ్చని, గుమిగూడి ఉండరాదని ఆయన పేర్కొన్నారు. గుమిగూడి రద్దీ ఉంటే 144 సెక్షన్ క్రింద కేసులు నమోదు అవుతాయని కలెక్టర్ అన్నారు.

శ్రీకాకుళం

2021-05-05 09:48:11

500 పడకలతో అతిపెద్ద ఆసుపత్రి..

కరోనా నేపథ్యంలో తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 ఆక్సిజన్ పడకలతో అతిపెద్ద ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం తాడిపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతి రోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది అనే వివరాలను అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్, ఐనొక్స్ గ్యాస్ ప్లాంట్ ఇంచార్జి శివప్రసాద్ ను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ లో ప్రతిరోజు 90 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని వారు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఎక్కడెక్కడ ఏ ఏ విభాగాలను ఏర్పాటు చేశారు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడవుంది, ఖాళీ స్థలం ఎక్కడ ఉంది తదితర వివరాలను మ్యాప్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తదనంతరం జిల్లా కలెక్టర్ అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ భూమిని పరిశీలించారు. ఖాళీ భూమికి సంబంధించి సర్వే పనులు బుధవారం లాగా పూర్తిచేయాలని సర్వేయర్ రామ్మోహన్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో తాడపత్రి సమీపంలోని అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ పక్కనున్న ఖాళీ స్థలంలో మరో 25 నుంచి 30 రోజుల్లోపు 500 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసేలా తాత్కాలిక ఆసుపత్రి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 1వ తేదీన ఆస్పత్రి ప్రారంభించేలా అత్యంత వేగవంతంగా అవసరమైన అన్ని రకాల పనులు చేపట్టాలన్నారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలంలో త్వరగా సర్వే చేపట్టి చేసి జంగిల్ క్లియరెన్స్ చేసేలా చూడాలన్నారు. డాక్టర్లకు, మెడికల్ సిబ్బంది ఉండేలా క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. తాత్కాలిక ఆస్పత్రి వద్ద ఎన్ని అంబులెన్సులు సిద్ధంగా ఉంచేలా చూడాలన్నారు. తాగునీటి సరఫరా, శానిటేషన్, మరుగుదొడ్లకు అవసరమైన నీటి ఏర్పాటు, విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, రోడ్లు వేయడం తదితర అంశాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొద్దినెలల పాటు ఉపయోగించుకునేలా తాత్కాలిక ఆసుపత్రిని వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ, డిపిసి, డిఎంఅండ్హెచ్ఓ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని పని చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గుణ భూషణ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అజయ్ కుమార్, తహసిల్దార్ నాగభూషణ, ఏపీ ఎమ్ ఎస్ఐ డి సి ఈఈ రాజగోపాల్ రెడ్డి, ఏ ఈ లోకేష్, తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-05-04 15:20:31

అక్రమ మైనింగ్ పై చర్యలకు సిఫార్సు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని  మెంటాడ మండ‌లం కొండలింగాల వ‌ల‌స పంచాయ‌తీ ప‌రిధిలోని తాడిపూడి వ‌ల‌సలో కొండ‌కు ఆనుకొని ఉన్న స‌ర్వే నెంబ‌ర్ 141 ప్ర‌భుత్వ పోరంబోకు స్థ‌లంలో జ‌రిగిన అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించామ‌ని జిల్లా మైనింగ్ శాఖ స‌హాయ సంచాల‌కులు బి. విజ‌య‌ల‌క్ష్మి తెలిపారు. త‌వ్వ‌కాల‌కు పాల్ప‌డిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న‌మాంగ‌నీస్ ఖ‌నిజాన్ని కొంత‌మంది అక్ర‌మంగా త‌వ్వి త‌రలిస్తున్నార‌ని పేర్కొంటూ ఇటీవ‌ల వివిధ ప‌త్రిక‌లు వార్త‌లు ప్ర‌చురించాయి. ఈ మేర‌కు ఆమె స్పందిస్తూ చ‌ర్‌ ల‌కు ఉప‌క్ర‌మించారు. మైనింగ్ శాఖ అధికారులు, సిబ్బంది సంబంధిత ప్రాంతంలో ప‌ర్య‌టించి విచారించార‌ని, గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అక్ర‌మంగా త‌వ్వి ఉంచిన మాంగ‌నీస్ ఖ‌నిజ నిల్వ‌ల‌ను గుర్తించార‌ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అక్క‌డున్న స్థానికుల‌ను, కూలీల‌ను విచారించ‌గా కొంత‌మంది జేసీబీ స‌హాయంతో త‌వ్వ‌కాలు జ‌రుపుతున్నార‌ని తేలింద‌న్నారు. రోడ్డు ర‌వాణా శాఖ అధికారుల స‌హాయంతో జేసీబీని, దాని య‌జ‌మాని వివ‌రాలు సేక‌రించామ‌ని తెలిపారు. అక్క‌డున్న ఖ‌నిజ నిల్వ‌ల‌ను భ‌ద్ర‌త‌ప‌రంగా స్థానిక రెవెన్యూ అధికారులకు అప్ప‌గించామ‌ని చెప్పారు. అక్ర‌మ మైనింగ్‌కు పాల్ప‌డిన వారిపై నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా మైనింగ్ శాఖ స‌హాయ సంచాల‌కులు పేర్కొన్నారు.

విజయనగరం

2021-05-04 15:16:28