1 ENS Live Breaking News

రామతీర్థలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని సీతారామ కోనేరు చెంతన జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హరిత విజయనగరం, చేయూత ఫౌండేషన్ సొసైటీ, ఎన్.వి.వి. సొసైటీ బృంద సభ్యులతో కలిసి 150 ఆక్సీజన్ (క్రోటాన్) మొక్కలు నాటి నీరు పోశారు. చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం చెంతన ఉన్న సీతారామ కొనేరును సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కోనేరు అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. త్వరలో చుట్టూ దేవతా వృక్షాలను పెంచాలని, దానికి తగిన చర్యలు తీసుకోవాలని హరిత విజయనగరం బృంద సభ్యులకు, స్థానిక ఎంపిడిఓ కు సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మొక్కల పెంపకం వల్ల స్వచ్ఛమైన గాలి, నీరు లభిస్తుందని తద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. గ్రామ పరిసరాలను, చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు. చెరువుల్లో వ్యర్థాలు వేసి కలుషితం చేయవద్దని చెప్పారు. ఈ సందర్భంగా మొక్కలు స్పాన్సెర్ చేసిన శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ ఎ.శ్రీ రామమూర్తిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డి.ఎఫ్.వో. బి.జానకీ రావు, హరిత విజయనగరం కో - ఆర్డినేటర్ ఎం. రామ్మోహన్ రావు, నెల్లిమర్ల ఎంపిడిఓ కె. రాజ్ కుమార్, తహశీల్దార్ జి. రాము, చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.రాము, ఉపాధ్యక్షురాలు ఎల్.సంధ్య, ఎన్.వి.వి. సొసైటీ అధ్యక్షురాలు జి.విశాలాక్షి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యక్షులు ఎస్.అచ్చిరెడ్డి, డా.వెంకటేశ్వరరావు, రామతీర్థం ఆలయ ఈవో, ఎన్.ఆర్.జి.ఎస్., వెలుగు, సచివాలయ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Nellimarla

2021-01-17 20:56:53

19న సుల‌భ‌త‌ర వాణిజ్యంపై స‌ద‌స్సు..

విజయనగరంలో సుల‌భ‌త‌ర వాణిజ్య విధానాల్లో భాగంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అనుమ‌తుల మంజూరులో పారిశ్రామిక వేత్త‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ల‌క్ష్యంతో జిల్లా కేంద్రంలోని క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జ‌న‌వ‌రి 19న పారిశ్రామిక వేత్త‌ల‌తో ఒక స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్టు ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జిల్లా మేనేజ‌ర్ కోట ప్ర‌సాద‌రావు తెలిపారు.ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ సద‌స్సు(out reach programme)లో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాలు, పెట్టుబ‌డులు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి పాల్గొంటార‌ని పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ పోర్ట‌ల్ వినియోగించే పారిశ్రామిక వేత్త‌లు ఎదుర్కొనే నిర్ధుష్ట‌మైన స‌మ‌స్య‌లపై చ‌ర్చించి వాటిపై త‌గిన వివ‌ర‌ణ‌లు, ప‌రిష్కారాలు తెలియ‌జేస్తార‌ని జిల్లా మేనేజ‌ర్ పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సులో ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్‌, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రుకానున్నార‌ని వెల్ల‌డించారు. ఈ స‌ద‌స్సుకు జిల్లాలోని భారీ, మెగా ప‌రిశ్ర‌మ‌దారులు, సింగిల్ డెస్క్ పోర్ట‌ల్ వినియోగ‌దారులు,  స్థానిక పారిశ్రామిక అసోసియేష‌న్‌లు, ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ అసోసియేష‌న్లు, స్థానిక‌ ఆర్కిటెక్ట్‌ ఇంజ‌నీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు హాజ‌రు కావాల‌ని కోరారు.

Vizianagaram

2021-01-17 20:55:14

విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ..

విశాఖజిల్లాలో కరోనా వ్యాక్సిన్  ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నదని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆసుపత్రిలో కరోనా టీకాలు  వేసే కేంద్రాన్ని సందర్శించారు.   ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ అన్నది రాష్ట్రంలోనే కాక మొత్తం దేశ చరిత్రలోనే గొప్ప పరిణామమని తెలిపారు.  తమది  చేతల ప్రభుత్వమని అనవసర ఆర్భాటాలకు పోకుండా వేక్సినేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ముందుగా వైద్య సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తరువాత పారిశుధ్య, పోలీస్ సిబ్బందికి వేక్సిన్ వేస్తారని తెలిపారు. ప్రజలు ఎటువంటి అనుమానాలకు తావివ్వరాదన్నారు.  అంతకు ముందు మంత్రి ఆసుపత్రిలో వేక్సిన్ ఎంత వచ్చినది,  ఎంతమందికి టీకాలు వేస్తున్నదీ, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి వైద్యులను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గూర్చి విమ్స్ డైరెక్టర్ డాక్టర్ సత్య వరప్రసాద్ మంత్రికి వివరించారు. ఇంకా వేక్సిన్ ఏ విధంగా వేస్తున్నది మంత్రి పరిశీలించారు. వేక్సిన్ వేసిన తర్వాత ఎలావుందన్న విషయాన్ని వ్యాక్సిన్ వేసుకున్న ఎమ్.ఎన్.వో. ఎమ్. రాజబాబు, ఎఫ్.ఎన్.వో. సిరిపురపు గౌరిలను అడుగగా ఎటువంటి ఇబ్బందులు కలుగ లేదని, ఉత్సాహంగానే వుందని వారు మంత్రికి చెప్పారు.  కరోనా మహమ్మారి ఎంతో భయంకరంగా ప్రారంభమైందని, ఏమి చేయాలో పాలుపోని స్థితి నుండి వైద్యనిపుణుల సలహాల ప్రకారం లాక్ డౌన్ లు విధించారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో వివేకంతో  ముందస్తు చర్యలను తీసుకొని కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగారన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం పరిచారన్నారు. కరోనా టెస్టులు చేయడం, ప్రజలందరికీ అవగాహన కల్పించడం అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావడం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి.అరుణ్ కుమార్, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, ఆర్డీవో కె.పెంచల కిషోర్, కె.కె.రాజు, కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-17 20:48:32

సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా పక్షపాతి..

ప్రతి గ్రామంలో  ఇళ్లు లేని పేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి   ఆశయమని   రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి   ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.  భీమిలి  నియోజకవర్గం  టి.నగరపాలెం, దాకమర్రి, మూలకుద్దు గ్రామంలలో  ఇంటిస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మూలకుద్దు గ్రామంలో జరిగిన ఇంటిస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమ్మఒడి, వాహనమిత్ర వంటి  22 పధకాల ద్వారా ఈ గ్రామానికి రూ.5కోట్ల 60 లక్షల రూపాయలు అందించటం జరిగిందని అన్నారు.  వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందిస్తున్నామని తెలిపారు.  ఇంటిస్థల పట్టా కూడా మహిళల పేరునే అందించి  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఈ గ్రామంలో అందిస్తున్న ఇంటి స్థలం 15 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు.  త్వరలోనే విశాఖపట్నం పరిపాలనారాజధానిగా వస్తున్నదని కావున మీకు యిస్తున్న ఇంటి స్థలాలు, భూములు అమ్ముకోవద్దని తెలిపారు.  ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి డబ్బులతో  పిల్లలను చక్కగా చదివించుకోవాలని తెలిపారు.  దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ ప్రభుత్వం  సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులకు సచివాలయ ఉద్యోగులుగా, వలంటీర్లుగా నియామకాలు చేపట్టిందని తెలిపారు.   కార్యక్రమంలో  ఇంటి స్థలం పొందలేనివారైవరైనా ఉన్నారా అని మంత్రి అడుగగా ముగ్గరు మహిళలు రేషనుకార్డు సమస్యలతో స్థలం మంజూరు కాలేదని తెలుపగా వెంటనే వారి సమస్యలను పరిష్కరించి వారి ఇంటిస్థలం కేటాయించవలసినదిగా గ్రామరెవిన్యూ అధికారి, గ్రామ వలంటీరు ను అదేశించి, వెంటనే సమస్యను పరిష్కరించవలసినదిగా తహశీల్దారుకు సభాముఖంగా సూచించారు.  ఈ కార్యక్రమంలో  తహశీల్దారు,  ఎం .పి.డి.ఒ. ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.   

Bheemili

2021-01-17 20:44:21

విశాఖలో ఘనంగా పైలాశివతేజ వర్ధంతి..

విశాఖలో జర్నలిస్టు దివాకర్ తనయుడు పైల శివతేజ వర్ధంతి శనివారం ఘనంగాా నిర్వహించారు. ప్రతీఏటా శివతేజ వర్ధంతి సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో నిరుపేదలకి అన్నదానంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు దివాకర్ దంపతులు నగరంలోని రైల్వే న్యూకాలనీలోని పలువురు అనాధలకు అల్పాహారం అందించారు. అనంతరం షిర్డీసాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ, ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలికి మంచి డ్రైవింగ్ నేర్పించిన తరువాత మాత్రమే వాహనాలు అందించటం అలవాటు చేసుకోవాలన్నారు. డ్రైవింగ్ ను ప్రోత్సహించవద్దని కోరారు. పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే వారికిచ్చే వాననాలు, డ్రైవింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తన కొడుకులా మరో కుటింబానికి పిల్లలు వాహన ప్రమాదంలో దూరం కాకుండా ఉండాలని దేవాది దేవతలను కోరుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆయన భార్య పాల్గొన్నారు.

Visakhapatnam

2021-01-16 23:25:20

డీప్ వాటర్ పోర్టు ద్వారానే ఎగుమతులు..

యాంకరేజ్ పోర్టుకు వచ్చే అదనపు సరుకును కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండ డీప్ వాటర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరగనుందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీ శ తెలిపారు.  శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జెసి లక్ష్మీ శ,ఏపీ మారి టైం బోర్డు సీఈవో రామకృష్ణ రెడ్డి తో కలిసి రైస్ ఎక్స్ పోర్టర్స అసోసియేషన్ ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కాకినాడ యాంకర్ ఏజ్ పోర్ట్ నుంచి బియ్యం దేశ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఎగుమతి సామర్థ్యాన్ని పెంచే విధంగా యాంకరేజ్ పోర్టుకు వచ్చే అదనపు సరుకును కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా డీప్ వాటర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను, సూచనలు సోమవారం నాటికి తెలియపరచాలని జెసి సూచించారు.   ఈ సమావేశంలో పోర్టు అధికారి కెప్టెన్ ధర్నా, రైస్ ఎక్స్ పొర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.వి కృష్ణారావు, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వి.వి.రాఘవులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం బుల్లి రాణి,కార్మిక సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-01-16 21:45:13

తూర్పులో 2211 మందికి కోవిడ్ వేక్సిన్..

తూర్పుగోదావ‌రి జిల్లాలో తొలిరోజు శ‌నివారం మొత్తం 2211 మందికి కోవిడ్‌-19 వ్యాక్సిన్ వేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆయన మీడియాకి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మొత్తం 33 టీకా కేంద్రాల ద్వారా తొలిరోజు 3300 మందికి వ్యాక్సిన్ వేయాల‌ని లక్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు తెలిపారు.  వివిధ కేంద్రాల్లో జ‌రిగిన టీకా పంపిణీ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్న‌ట్లు వెల్ల‌డించారు. కాకినాడ ఎంపీ వంగా గీత‌, అమ‌లాపురం ఎంపీ చింతా అనురాధ‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రాం,  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణతో పాటు ఆయా ప్రాంతాల‌కు చెందిన స్థానిక ఎమ్మెల్యేలు టీకా పంపిణీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు.

Kakinada

2021-01-16 21:40:23

నరేగా పనులు ప్రజలకు ఉపాది పెంచాలి..

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగం గా పులిచర్ల మండలం సువ్వారపు వారి పల్లిలో ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద చేపట్టిన హార్టికల్చర్ ప్లానిటేషన్(మామిడి తోట) ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్  ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులతో గల కమిటీ  పరిశీలించింది.. అనంతరం మతుకు వారిపల్లి లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కమిటీ పరిశీలిం చింది. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న 16 రకాల సేవలైన పి‌ఎం- కిసాన్ -వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఈ-క్రాప్ బుకింగ్, డి-కృషి (సీడ్-డిస్ట్రిబ్యూషన్), సి‌ఎం యాప్, వై.ఎస్.ఆర్ యాప్, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలం బడి, క్రాప్ ఇన్సూరెన్స్ , జె.ఎల్.జి గ్రూప్స్, అగ్రో అడ్వైజరి బోర్డ్ ల గురించి మరియు రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సలహాలు, సూచనలకు సంబందించిన అంశాలన్నింటిపై రాజంపేట, చిత్తూరు ఎం.పి లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప కమిటీకి వివరించగా..  ఉ. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు అందిస్తున్న సేవల గురించి అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆదునిక పద్దతిలో వ్యవసాయ సాగు అంశాలన్నింటిపై సమగ్రంగా వ్యవసాయ అధికారి కమిటీకి సవివరంగా వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలను సులభతరం చేసేందుకు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ కు సంబందించి మతుకు వారి పల్లె లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంధర్భంగా సచివాలయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన అర్హుల జాబితాను పరిశీలించిగా సచివాలయ వ్యవస్థ ద్వారా 545 పౌర  సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు సచివాలయ సిబ్బంధి కమిటీకి వివరించారు.  తదుపరి కల్లూరు వద్ద ఎస్‌డబ్ల్యూ‌పి‌సి కింద నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించగా చెత్త సేకరణ దాన్ని ఎరువుగా తయారు చేసే విధానం గురించి అధికారులు కమిటీకి వివరించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ జే‌డి విజయ కుమార్, డి.పి.ఓ దశరామిరెడ్డి, ఎస్.ఈ పంచాయతీ రాజ్ అమర నాధ్ రెడ్డి,ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సి‌ఈ‌ఓ ప్రభాకర్ రెడ్డి, ఎం‌పి‌డి‌ఓ దేవేంద్ర బాబు, ఎం‌ఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికా రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Pulicherla

2021-01-16 21:29:53

రైతు భరోసా సేవలు అభినందనీయం..

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగం గా పులిచర్ల మండలం సువ్వారపు వారి పల్లిలో ఎన్‌ఆర్‌ఈజి్‌ఎస్ కింద చేపట్టిన హార్టికల్చర్ ప్లానిటేషన్(మామిడి తోట) ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, గౌ.షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులతో గల కమిటీ  పరిశీలించింది..అనంతరం మతుకు వారి పల్లి లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కమిటీ పరిశీలిం చింది.  రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న 16 రకాల సేవలైన పి‌ఎం- కిసాన్ -వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఈ-క్రాప్ బుకింగ్, డి-కృషి (సీడ్-డిస్ట్రిబ్యూషన్), సి‌ఎం యాప్, వై.ఎస్.ఆర్ యాప్, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలం బడి, క్రాప్ ఇన్సూరెన్స్ , జె.ఎల్.జి గ్రూప్స్, అగ్రో అడ్వైజరి బోర్డ్ ల గురించి మరియు రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సలహాలు, సూచనలకు సంబందించిన అంశాలన్నింటిపై రాజంపేట, చిత్తూరు ఎం.పి లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప కమిటీకి వివరించగా..  ఉ. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు అందిస్తున్న సేవల గురించి అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆదునిక పద్దతిలో వ్యవసాయ సాగు అంశాలన్నింటిపై సమగ్రంగా వ్యవసాయ అధికారి కమిటీకి సవివరంగా వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలను సులభతరం చేసేందుకు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ కు సంబందించి మతుకు వారి పల్లె లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంధర్భంగా సచివాలయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన అర్హుల జాబితాను పరిశీలించిగా సచివాలయ వ్యవస్థ ద్వారా 545 పౌర  సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు సచివాలయ సిబ్బంధి కమిటీకి వివరించారు.  తదుపరి కల్లూరు వద్ద ఎస్‌డబ్ల్యూ‌పి‌సి కింద నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించగా చెత్త సేకరణ దాన్ని ఎరువుగా తయారు చేసే విధానం గురించి అధికారులు కమిటీకి వివరించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ జే‌డి విజయ కుమార్, డి.పి.ఓ దశరామిరెడ్డి, ఎస్.ఈ పంచాయతీ రాజ్ అమర నాధ్ రెడ్డి,ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సి‌ఈ‌ఓ ప్రభాకర్ రెడ్డి, ఎం‌పి‌డి‌ఓ దేవేంద్ర బాబు, ఎం‌ఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికా రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Pulicherla

2021-01-16 21:24:31

మహిళా సాధికారత కనిపిస్తోంది..

మహిళా సాధికారత కనిపిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్  ప్రతాప్ రావు జాధవ్ పేర్కొన్నారు. శనివారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా పులిచెర్ల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం కల్లూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటైన సమావేశంలో  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్  గౌ.ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, గౌ.సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, గౌ.షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులు సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళలను ఉద్దేశించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గౌ.చైర్ పర్సన్  మాట్లాడుతూ ఒక్కప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితమయ్యే వారని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని పేదరిక నిర్మూలన కొరకు అమలుచేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటున్నారని మహిళా సాధికారత కనిపిస్తున్నదని తెలిపారు.           పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మరియు జమ్మూ కాశ్మీర్ ఎం.పి గౌ.నజీర్ అహ్మద్ లవాయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పధకాలైన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ బాగున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాల పై ప్రత్యేక దృష్టి సారించి అమలు చేస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలుగా ముస్లిం మహిళలు కూడా ఉంటూ ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు తోడ్పడుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు.           రాజంపేట ఎం.పి.మిధున్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు రావడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేస్తుందని పధకాలన్నింటిని మహిళల పేరు మీదనే అందిస్తూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నదని, మధ్యపాన నిషేదాన్ని దశల వారిగా అమలు చేస్తూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుందన్నారు.           ఈ సమావేశంలో స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన కావేటి గారి పల్లికి చెందిన రెడ్డమ్మ సంఘం ద్వారా తాను ఆర్ధికంగా అభివృద్ది చెందిన విధానం గురించి కమిటీ కి వివరిస్తూ తాను 2007 లో సంఘంలో సభ్యురాలిగా చేరడం జరిగిందని, సంఘం పేరు రాఘవేంద్ర సంఘం అని సంఘంలో చేరక మునుపు కూలీ పనులకు వెళ్ళే వారమని సంఘంలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు విడతల వారీగా దాదాపు 20 లక్షల రూపాయలు రుణం తీసుకొని ఆర్ధికంగా తన కుటుంబాన్ని అభివృద్ది చేసుకునేందుకు వినియోగించుకోవడం జరిగిందని, ఉన్న ఒక ఎకరా పొలంలో వరి, వేరు శెనగ పంటలు పండించడం జరిగిందని, సంఘం అండదండలతో మరియు లోన్ సహాయంతో  ట్రాక్టర్ ను కొనుగోలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే పధకాలైన అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్ ఆసరా, సున్నా వడ్డీల కింద తాను లబ్ది పొందానని తాను సంఘంలో సభ్యురాలిగా ఉండడం వలనే ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు అవకాశం ఏర్పడిందని సంతోషంతో హింది బాషలో అనర్హళoగా కమిటీ సభ్యులకు వివరించింది.           కల్లూరు కు చెందిన మరో సభ్యురాలైన షహీన ప్రభుత్వ పధకాల ద్వారా పొందిన లబ్దిని వివరిస్తూ తనకు గల ఎకరా భూమిలో ఉపాధి హామీ పధకం కింద మామిడి చెట్లను పెంచుతున్నామని తన పొలంలో తాను పని చేస్తూ ఉపాధి పొందుతున్నానని అందుకు వేతనంగా రోజుకు రూ.200 అందుతుందని రైతు భరోసా పధకం, కిసాన్ యోజన పధకాల కింద అందిన ఆర్ధిక సాయంను మామిడి తోట అభివృద్దికి వినియోగించుకోవడం జరిగిందని, ఈ వచ్చే ఆదాయంతో నా కొడుకును బి.టెక్ చదివిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులందరికి చేరుతున్నాయన్నారు.           కల్లూరు జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన విధ్యార్ధి భవ్య గత 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  అభివృద్ది సంక్షేమ పధకాలైన నవరత్నాలు, వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఉచిత విధ్యుత్, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ, దశల వారీగా మధ్యపాన నిషేధం, అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న తోడు, జగనన్న విధ్య దీవెన, వసతి దీవెన పధకాల గురించి సవివరంగా వివరించి అందరినీ ఆకట్టుకున్నది.   ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, డ్వామా, డి.ఆర్.డి.ఏ పి.డి లు చంద్రశేఖర్, తులసి, డి.పి.ఓ దశదరామిరెడ్డి, ఇండియన్ బ్యాంక్ జెనరల్ మేనేజర్ ఏ.కె మహాపాత్రా, యూనియన్ బ్యాంక్ జి.ఎం.లాల్ సింగ్, ఎల్.డి.ఎం గణపతి, ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సి‌ఈ‌ఓ ప్రభాకర్ రెడ్డి, ఎం‌పి‌డి‌ఓ దేవేంద్ర బాబు, ఎం‌ఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Chittoor

2021-01-16 21:21:09

లబ్ధిదారుల ఎంపిక సత్వరమే పూర్తిచేయండి..

ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ లో భాగంగా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తక్షణమే పూర్తిచేయాలని  జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)  డా.జి. లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు.    శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి లక్ష్మీశ, జేసి (అభివృద్ధి) కీర్తి చేకూరి తో కలిసి సివిల్ సప్లయి, ఎస్సీ ,బీసీ ,మైనార్టీ కార్పొరేషన్ల అధికారులతో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లకు లబ్ధిదారులు ఎంపిక, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. దీనికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ తక్షణమే పూర్తిచేయాలని ఆయన తెలిపారు. మొత్తం 1076 మంది లబ్ధిదారులకు మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరలోనే రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అన్నారు.లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు,బ్యాంకు ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జేసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ డీయం ఇ.లక్ష్మీ రెడ్డి,బిసి, మైనారిటీ కార్పొరేషన్ అధికారులు ఎస్ వి ఎస్.సుబ్బలక్ష్మీ, పి ఎస్.ప్రభాకర్ రావు, టాటా, సుజుకి వాహనాల కంపెనీ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-01-16 21:08:41

కిసాన్ రైల్ ప్రాజెక్ట్ కు స్కోచ్ అవార్డు..

ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు జిల్లాకు వరించింది. అనంతపురం నుంచి న్యూఢిల్లీకి దేశంలోనే 2వ కిసాన్ రైల్ గా వినూత్నంగా ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ ప్రాజెక్ట్ కు స్కోచ్ అవార్డు లభించిందని ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు తెలిపారు. శనివారం 70వ స్కోచ్ అవార్డుల ఎంపిక కోసం స్కోచ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ గురుశరన్ దంజాల్, రాజ్యసభ మెంబర్ సురేష్ ప్రభు, స్కోచ్ గ్రూపు చైర్మన్ సమీర్ కొచ్చర్ లు జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, అనంతపురం నుంచి జూమ్ కాన్ఫరెన్స్లో హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.  అనంతపురం నుంచి న్యూఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తులు తరలించేందుకు కోసం వినూత్నంగా కిసాన్ రైల్ ప్రాజెక్ట్ రావడానికి ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులు ఎంతో కృషి చేశారన్నారు. కిసాన్ రైల్ కు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కిందని, ఇందుకోసం కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీఎంఐపీ పీడీ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 161 మంది స్కోచ్ అవార్డు కోసం సెమీఫైనల్లో పోటీపడగా, ఫైనల్లో మిగిలిన 20 మందిలో మన జిల్లా నుంచి కిసాన్ రైలు ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా మాత్రమే స్కోచ్ అవార్డు జాబితాలో ప్రథమంగా ముందంజలో నిలిచామని తెలిపారు. స్కోచ్ అవార్డు ఎంపిక కోసం ఆన్లైన్ ఓటింగ్ లో పెనుగొండ హార్టికల్చర్ ఏ డి చంద్రశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొని సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కేందుకు ఎంతో కృషి చేశారన్నారు. స్కోచ్ అవార్డు వచ్చేలా రైతులు, టమోటా మండి మార్కెట్ యజమానులు, హార్టికల్చర్ అధికారులు, సిబ్బంది ఎంతగానో కష్టపడి పని చేశారని, వారికి అభినందనలు తెలియజేశారు. జూమ్ కాన్ఫరెన్స్లో ఏపీ డి లు నరసింహరాజు ఫిరోజ్, సూపరింటెండెంట్ ప్రసాద్ లు పాల్గొన్నారు.

Anantapur

2021-01-16 21:03:46

విజయనగరంలో 15 కేంద్రాల్లో కరోనా వేక్సిన్ పంపిణీ..

క‌రోనా నుంచి విముక్తి కోసం ప్ర‌జ‌లంతా ఎంత‌గానో ఎదురుచూస్తున్న టీకాలు వేసే కార్య‌క్ర‌మం శ‌నివారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో ప్రారంభ‌మ‌య్యింది. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నీసం ఒక కేంద్రం ఏర్పాటుచేస్తూ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌య్యింది. జిల్లాకు చెందిన పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ న‌గ‌రంలోని స్థానిక ఘోషాసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో వున్న ప‌ట్ట‌ణ కుటుంబ ఆరోగ్య కేంద్రంలో ఈ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో సంబంధిత శాస‌న‌స‌భ్యులు, అధికారులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. తొలుత వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టే విధానం గురించి వైద్యాధికారుల ద్వారా మంత్రి తెలుసుకున్నారు. అనంత‌రం వ్యాక్సిన్ వుండే బాక్సును జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారికి అందించి వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇక్క‌డి ఆసుప‌త్రిలో స్టాఫ్ న‌ర్సుగా ప‌నిచేస్తున్న జాన‌క‌మ్మ అనే ఆరోగ్య కార్య‌క‌ర్త‌కు తొలి టీకాను వేశారు. ఆమెను మంత్రి బొత్స‌తోపాటు, శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ త‌దిత‌రులు అభినందించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ జిల్లాలోని 15 ఆసుప‌త్రుల్లో కోవిడ్-19 వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని తెలిపారు. దీనికోసం జిల్లాకు 21,500 డోసుల వ్యాక్సిన్ వ‌చ్చింద‌న్నారు. జిల్లాలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ప‌నిచేస్తున్న అన్ని స్థాయిల్లోని వైద్య ఆరోగ్య సిబ్బందికి, వైద్యాధికారుల‌కు ఈ టీకా వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఒక్కో కేంద్రం ద్వారా రోజుకు 100 మందికి టీకాలు వేసే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తార‌ని చెప్పారు. జిల్లాలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లోని 26 వేల ఆరోగ్య సిబ్బందికి తొలిద‌శ‌లో వ్యాక్సినేష‌న్ చేస్తామ‌న్నారు. త‌దుప‌రి ద‌శ‌ల్లో పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, 50 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు క‌లిగిన వారు, ఇత‌రుల‌కు టీకా వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రికీ టీకా వేస్తార‌ని ఎవ‌రూ ఆతృత చెందాల్సిన ప‌నిలేద‌న్నారు. 18 ఏళ్ల‌లోపు వ‌య‌స్సు క‌లిగిన వారు, గ‌ర్భిణీలు, బాలింత‌లు త‌దిత‌ర వ‌ర్గాల వారికి మాత్రం టీకా వేయ‌ర‌ని పేర్కొన్నారు. మొద‌టి డోసు తీసుకున్న 28 రోజుల త‌ర్వాత రెండో డోసు టీకాను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవ‌ల‌సి వుంటుంద‌ని చెప్పారు. తొలుత ఏ సంస్థ వ్యాక్సిన్‌ను వేస్తారో రెండో డోసు కూడా అదే సంస్థ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి వుంటుంద‌న్నారు. దీనిని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి పార‌ద్రోలేందుకు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డా.సీతారామ‌రాజు, జిల్లా ఇమ్యూనైజేష‌న్ అధికారి డా.నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. చీపురుప‌ల్లి క‌మ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన క‌రోనా టీకా కార్య‌క్ర‌మాన్ని కూడా మంత్రి బొత్స ప్రారంభించారు. ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్, జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, వై.ఎస్‌.ఆర్‌.సి.పి. నాయ‌కుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, జిల్లా ఆసుప‌త్రుల స‌మ‌న్వ‌య అధికారి డా.జి.నాగ‌భూష‌ణ రావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, భూసేక‌ర‌ణ ప్ర‌త్యేక అధికారి సాల్మ‌న్ రాజు, డిపిఓ సునీల్ రాజ్‌కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని సంబంధిత శాస‌న‌స‌భ్యులు ప్రారంభించారు. బొబ్బిలి మండ‌లం బాడంగిలో శాస‌న‌స‌భ్యులు శంబంగి వెంక‌ట చినప్ప‌ల నాయుడు, సాలూరు ప‌రిధిలోని పాచిపెంట మండ‌లం గురివినాయుడు వ‌ల‌స పి.హెచ్‌.సి.లో ఎమ్మెల్యే రాజ‌న్న‌దొర‌, పార్వ‌తీపురం మండ‌లం జ‌గ‌న్నాధపురం పి.హెచ్‌.సి.లో ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు, నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి భోగాపురంలో వ్యాక్సిన్ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు ప్రారంభించారు. విజ‌య‌న‌గ‌రంలోని పూల్ బాగ్‌లో వున్న ప‌ట్ట‌ణ ఆరోగ్య‌కేంద్రంలో 61 ఏళ్ల మాన‌సిక వైద్య నిపుణుడు డా.స‌త్యనారాయ‌ణ డి.ఎం.హెచ్‌.ఓ డా. ఎస్‌.వి.ర‌మ‌ణ కుమారి ఆధ్వ‌ర్యంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. త‌న‌కు ఏ ర‌క‌మైన ఆందోళ‌న గాని సైడ్ ఎఫెక్ట్సు గాని లేవ‌ని క‌నీసం టీకా వేసుకున్నాన‌నే భావ‌న కూడా లేద‌న్నారు డా.స‌త్య‌నారాయ‌ణ‌. ప్ర‌తిఒక్క‌రూ ఏమాత్రం సంకోచించ‌కుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవ‌చ్చ‌ని పేర్కొంటూ దీనిపై సందేహాలు అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌ధానమంత్రి నోట‌... గుర‌జాడ మాట‌... కోవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తూ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోడి మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు ర‌చించిన దేశ‌భ‌క్తి గేయాన్ని గుర్తు‌చేసుకున్నారు. సొంత లాభం కొంత‌మానుకొని పొరుగు వారికి తోడుప‌డ‌వోయ్, దేశ‌మంటే మ‌ట్టికాదోయ్‌, దేశ‌మంటే మ‌నుషులోయ్ అన్న గేయంలోని పంక్తుల‌ను చ‌దివి వి‌నిపించి ప్ర‌తిఒక్క‌రూ త‌మ పొరుగువారికి ఎంతోకొంత స‌హాయం చేయ‌డాన్ని అల‌వ‌ర్చుకోవాల‌ని దేశ‌ప్ర‌జ‌ల‌కు సూచించారు. త‌ద్వారా మ‌హాక‌వి గుర‌జాడ ఔన్న‌త్యాన్ని, ఆయ‌న ర‌చ‌న‌ల విశిష్ట‌త‌ను దేశ ప్ర‌జ‌లంద‌రికీ చేర‌వేశారు.

Vizianagaram

2021-01-16 20:44:24

విజయనగరంలో 954 మందికి వ్యాక్సిన్‌..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభించిన తొలిరోజైన శ‌నివారం 954 మంది వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది క‌రోనా టీకాలు  వేయించుకున్న‌ట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్‌.వి.ర‌మ‌ణ‌కుమారి తెలిపారు. జిల్లాలో 1441 మంది తొలిరోజు టీకా వేయించుకొనేందుకు కోవిన్ యాప్‌లో న‌మోదు చేసుకోగా వారిలో 1057 మంది టీకాల కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యార‌ని,  954 మంది టీకాలు వేయించుకున్న‌ట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఇద్ద‌రు మాత్ర‌మే స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని, అది కూడా చిన్న‌పాటి అనారోగ్యం మాత్ర‌మేన‌ని తెలిపారు. బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గం జ‌గ‌న్నాధ‌పురం పి.హెచ్‌.సి.లో ఒక‌రు, ఎస్‌.కోట‌లో ఒక‌రు మాత్ర‌మే కొద్దిపాటి అనారోగ్యానికి గురై వెంట‌నే వైద్యుల చికిత్స‌తో కోలుకున్నార‌ని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యింద‌న్నారు.

Vizianagaram

2021-01-16 20:40:35

ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తిచేయండి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రదేశంలో ఆర్‌&ఆర్ పనులు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని, నిర్వాసిత కాల‌నీల్లో వ‌స‌తుల క‌ల్ప‌న‌కు తక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుర‌పాల‌క శాఖా మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. ‌స‌వ‌రించిన నోటిఫికేష‌న్ ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణానికి అవ‌స‌ర‌మైన 135 ఎక‌రాల‌ భూ సేకర‌ణ క్ర‌తువు స‌వ్యంగా చేయాల‌ని మంత్రి సూచించారు. జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించిన‌  వివిధ అంశాల‌పై క‌లెక్ట‌ర్‌, జేసీలు వివిధ విభాగాల‌ జిల్లా స్థాయి అధికారుల‌తో క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో మంత్రి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప‌రిధిలో జ‌రిగే భూసేక‌ర‌ణ‌, ఆర్‌&ఆర్ ప‌నులు, ఇళ్ల నిర్మాణం, డ్రెయిన్ల నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై మాట్లాడారు. ఆయా విభాగాల అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని ప‌లు సూచ‌న‌లు, మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారుల‌తో  ఫోన్లో మాట్లాడి స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి చ‌ర్య‌లు తీసుకున్నారు. ముందుగా భోగాపురం ఎయిర్ పోర్టు ప‌రిధిలో నిర్వాసిత కాల‌‌నీల్లో క‌నీస‌ వ‌స‌తులైన రోడ్లు, డ్రెయి‌న్లు, తాగునీరు, విద్యుత్తు తదిత‌ర మౌలిక స‌దుపాయాల‌ను త‌క్ష‌ణ‌మే క‌ల్పించి వీలైనంత త్వ‌ర‌గా కంప‌నీ యాజ‌మాన్యానికి భూమి అప్ప‌గించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మా‌ణాల‌కు అనుగుణంగా భూమి చ‌దును చేయాల‌ని, హౌసింగ్ విభాగం మ‌రియు పంచాయతీ రాజ్ విభాగాల వారు సంయుక్తంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. గూడెపు వ‌ల‌స గ్రామంలో ఉన్న ల్యాండ్ ఫి‌ల్లింగ్ ప‌నుల‌కు సంబంధించి ఉన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు అధికారులు క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న చేయాల‌ని ఆదేశించారు. అక్క‌డ జ‌రిగే నిర్మాణాల‌కు హౌసింగ్ విభాగం ద్వారా ఇసుక స‌ర‌ఫ‌రా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. అలాగే పోలెప‌ల్లి గ్రామంలో ఇళ్లు, డ్రెయిన్‌, రోడ్లు, పాఠ‌శాల‌లు, ఆల‌యాలు, ఎప్రోచ్ రోడ్ల‌‌ నిర్మాణానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. పోలెప‌ల్లి గ్రామం మీదుగా ఎయిర్ పోర్టు ప్రాంతానికి చేరుకొనేందుకు ప్ర‌త్యామ్నాయ రోడ్డును నిర్మించాల‌ని ఆదేశించారు. ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రాంతంలో చెట్లు తొల‌గించేందుకు అనుమ‌తులు మంజూరుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. పంచాయ‌తీ రాజ్ క‌మిష‌న‌ర్ తో ఫోన్లో మాట్లాడారు. ఆ గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి ప‌నులు ఈ నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఒక డెవలెప్‌మెంట్ క‌మిటీని ఏర్పాటు చేసుకొని ప‌నుల‌ను స‌మీక్షించుకోవాల‌ని మంత్రి సూచించారు. ఇప్ప‌టి వ‌రకు పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌నల్లో రాష్ట్ర స్థాయి అధికారుల‌తో మాట్లాడి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని.. ఈ లోగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నిధుల‌తో ప‌నులు పూర్తి చేయాల‌ని సూచించారు. అక్క‌డ నిర్మించ‌ద‌లచిన సచివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాల‌కు సాధారణ ప్ర‌భుత్వ నిధుల‌ను వినియోగించాల‌ని చెప్పారు.  కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌, సంయుక్త కలెక్ట‌ర్లు జి.సి. కిషోర్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావు, ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంక‌ర్‌, హౌసింగ్ పీడీ ఎస్‌.వి. ర‌మ‌ణ‌మూర్తి, ఆర్‌డ‌బ్ల్యుఎస్ ఎస్‌.ఈ. ర‌వికుమార్‌, పంచాయ‌తీ రాజ్‌, గ‌నుల‌శాఖ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-01-16 20:34:25