1 ENS Live Breaking News

కేవీ విద్యార్ధులంతా సురక్షితంగానే ఉన్నారు..

కాకినాడ రూరల్, వలసపాలక లోని  కేంద్రీయ విద్యాలయంలో అస్వస్థతకు లోనైన విద్యార్థులందరూ కోలుకుని, నిలకడైన ఆరోగ్యంతో సురక్షితంగా ఉన్నారని  కాకినాడ జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. మంగళవారం ఉదయం కాకినాడ రూరల్ మండలం వలసపాకల లోని కేంద్రీయ విద్యాలయంలో 5, 6 తరగతులు చదువుతున్న 18 మంది విద్యార్థులు ఊపిరి ఆడక పోవడం, ఛాతీలో మంట లక్షణాలతో కూడి అస్వస్థతకు లోను కావడంతో, జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై వారందరినీ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్య సహాయం అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా, కాకినాడ ఎంపి వంగా గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు,సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. 

 అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి ఆందోళన చెందవద్దని, వారందరూ పూర్తి  స్వస్థత పొందేవరకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.  ఈ సందర్భంగా హాజరైన మీడియాతో జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9-30 గంటలకు తరగతులకు హాజరైన 5, 6, 7 తరగతుల విద్యార్థులు తమకు ఊపిరి ఆడటం లేదని, గుండెల్లో మంటగా ఉందని తెలియజేయడంతో వారందరినీ ఉపాధ్యాయులు ఆరుబయట వెంటిలేటెడ్ ప్రదేశానికి తరలించారని, తీవ్ర అస్వస్థతకు లోనైన 18 మంది వెంటనే 108 ఆంబులెన్స్ లలో కాకినాడ జిజిహెచ్ కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించడం జరిగిందన్నారు.  5వ తరగతి విద్యార్థులు ముగ్గురు, 6వ తరగతి విద్యార్థులు ఎనిమిది మంది, 7వ తరగతి విద్యార్థులు ఏడుగురు ఈ అస్వస్థతకు గురైయ్యారన్నారు.   

 చికిత్స పొందుతున్న 18 మంది తిరిగ కోలుకున్నారని, వారి ఆరోగ్యానికి ఎటువంటి భయం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. అందరి బిపి, ఆక్సిజన్ లెవల్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయని ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారన్నారు.    విద్యార్థుల అస్వస్థతకు కారణాలు ఇంకా ఇదమిద్దంగా నిర్థారణ కాలేదని, సమాచార అందిన వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫాక్టరీస్, అగ్నిమాపక అధికారులను కేంద్రీయ విద్యాలయానికి పంపి ప్రాధమిక విచారణ నిర్వహించడం జరిగందని, తరగతి గదులు, పాఠశాల ప్రాంగణాల్లో ఎటువంటి రసాయినిక, విష వాయువుల ఉనికి లేదని విచారణ బృంద తెలిపిందన్నారు.  పాఠశాల పరిశ్రమలకు దూరంగా, జన నివాసాల మద్యలో ఉందని, ఆ ప్రాంతంలో కలుషిత వాయువు ప్రభావం ఉన్నట్లు పరిసర ప్రజలెవరూ తెలిజేయలేదన్నారు.   విద్యార్థుల అస్వస్థతకు కారణాలను నిర్థారించేందుకు వైద్యులు, ఫుడ్ కంట్రోలర్, ప్యాక్టరీస్, పొల్యూషన్ బోర్డు అధికారులు సభ్యులుగా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, 24 గంటలలో  నివేదిక అందజేయాలని ఈ కమిటీని కోరామన్నారు.   అలాగే విద్యార్థుల బ్లడ్ శాంపిళ్లను, పాఠశాలలోని త్రాగునీరు శాంపిళ్లను లాబొరేటరీకి పంపామని, ఈ పరీక్షలలో వారి అస్వస్థతకు కారణాలను విశ్లేషించడం జరుగుతుందన్నారు. 

  కాకినాడ ఎంపి వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ విద్యార్థుల అస్వస్థత సమాచరం అందిన వెంటనే జిల్లా యంత్రాంగ తక్షణం స్పందించి వైద్య సహాయం అందించిందన్నారు. అలాగే కొంత మంది ప్రచారం చేస్తున్న వందంతులను నమ్మి ఆందోళనకు గురి కాకుండా  దైర్యంగా ఉండి వైద్య సేవలకు తల్లిదండ్రులు సహకరించారన్నారు.  భగవంతుడు దయ వల్ల విద్యార్థులు అందరూ క్షేమంగా కొలుకున్నారని, శాంపిల్ పరిక్షలు, విచారణ కమిటీ పరిశీలనలో ఈ సంఘటనకు కారణాలు నిర్థారణ అవుతాయన్నారు. పిల్లలు పూర్తిగా కోలుకుని, తల్లిదండ్రులు సంతృప్తి చెందే వరకూ జిజిహెచ్ లో ప్రత్యక వార్డులో ఉంచి వైద్య పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందన్నారు.   కేంద్రీయ విద్యాలయం ప్రస్తుతం కాకినాడ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించడం జరుగుతోందని, త్వరలోనే పండూరు సమీపంలోని  పి.వెంకటాపురంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో శాశ్వత భవనాలు నిర్మించ నున్నామని  ఎంపి తెలియజేశారు.  ఇందుకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేశామని, త్వరలోనే భూమి స్వాధీనం చేసుకుని పనులు 15 నుండి 20 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్లు నిన్ననే కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ లోని కేంద్రీయ విద్యాలయ కమీషనరేట్ నుండి తనకు తెలియజేశారని ఎంపి తెలిపారు.  ఈ లోపున ప్రస్తుతం విద్యాలయం నడుస్తున్న కాకినాడ పబ్లిక్ స్కూల్లో తరగతి గదుల ఇబ్బంది లేకుండా అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తామని తెలిపారు.  

Kakinada

2022-09-06 12:55:57

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదు

విశాఖజిల్లాలో ప్రభుత్వ భూములు ఎట్టి పరిస్థితులలో  అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ ఉద్యోగులపై ఉందని జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  అన్నారు.  మంగళవారం జిల్లా కలక్టర్ కార్యాలయంలో  నిర్వహించిన  రెవెన్యూ అధికారుల వర్క్ షాప్ లో  జిల్లా కలక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యు అధికారులు నూతన చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకొని, సాంకేతికత  పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ మంచి ఫలితాలు సాధించాలన్నారు.   ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలిసిన వెంటనే  సర్వేయర్, రెవెన్యూ అధికారులు సంబంధిత భూ కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.  అవసరమైతే   జాయింట్ కలక్టర్, రెవెన్యూ డివిజన్ అధికార్లు తనిఖీలు నిర్వహించి  ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలన్నారు. 

అదే విదంగా  అన్యాక్రాంతమైన  ప్రభుత్వ భూములను రక్షించిన వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా గెడ్డలు, పోరంబోకు, కాలువలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. ప్రజలు వారి యొక్క సమస్యలతో కార్యాలయంనకు వచ్చినపుడు వారితో సహనంతో మాట్లాడి వారి యొక్క సమస్యలను తీర్చే విదంగా రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు.  దీర్ఝకాలిక సమస్యలపై దృష్టి సారించాలని, ఒక నిర్ణయం ద్వారా అనేక మంది ప్రజలకు ఉపయోగపడే సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి  పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా  జిల్లాలో  1,40,000 ఇళ్ల స్థల పట్టాలు పంపిణీకి భూసేకరణ మరియు ఇతర పనులకు నిరంతరం శ్రమించిన అధికారులను అభినందించారు.  

త్వరలో ఒకేసారి  సుమారు  లక్ష ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా ప్రారంభించి ముందుకు వెళ్లేందుకు  ప్రతి ఒక్కరూ సన్నద్దం కావాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అధికారులందరూ ముందుగా రావాలన్నారు.  త్వరలో  ఒక మండలంను ఒక యూనిట్ గా జిల్లా కలక్టర్ తో పాటు జిల్లా అధికారులందరూ  రాత్రి బస చేసి ఆ మండలంలో నున్న అన్ని కార్యాలయాలతో పాటు చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు వారంలో మూడు రోజుల పాటు క్షేత్ర పరిశీలన చేయాలని సదరు వివరాలను కలక్టర్ కు తెలపాలన్నారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలక్టర్ కె.యస్.విశ్వాథన్, డి.ఆర్.ఓ శ్రీనివాసమూర్తి, విశాఖపట్నం, భీమిలి ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటి తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2022-09-06 11:41:07

ఐసిడిఎస్ పథకాలపై అవగాహనకల్పించాలి

సంపూర్ణ పోషకాహార పథకం పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి ఐ సి డి ఏస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరు కార్యాలయంలోని తన ఛాంబర్ లో  ఐ సి డి ఎస్ పిడి  ,సిడిపిఓ లతో  సంపూర్ణ పోషకాహార పథకం అమలు ,ఇతర పథకాలపై జిల్లా  కలెక్టరు  సమీక్షించారు. ఈ సందర్భంగా  కలెక్టరు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో , మండలాలలో  గర్భిణీలు బాలింతలు కు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి సంపూర్ణ పోషకాహార పథకం ప్రజలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.  సంపూర్ణ పోషకాహార మాసోత్సవాలు ఈనెల 30 వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. ఈ మాసోవోత్సవాల్లో పోషకాహార  సంపూర్ణ పోషకాహారం  యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసే విధంగా వర్క్ షాప్ లు నిర్వహించాలని ఆమె అన్నారు. 

ఈ కార్యక్రమంలో సి డి పి వోలు ముఖ్యపాత్ర పోషించాలని కలెక్టరు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణం సృష్టించడం ,  ఆశా వర్కర్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ ,  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ యొక్క న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసి, ఇచ్చిన వస్తువులను ఉపయోగించి సంపూర్ణ పోషకాహారం ఏవిధంగా పొందవచ్చునో వారికి వివరించాలని కలెక్టరు సూచించారు.  వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అందిస్తున్న రాగి  ,సజ్జ , జొన్న , అటుకులు, ఎండు ఖర్జూరం , బెల్లం వేరుశనగ చిక్కీలు వంటి బలవర్ధకమైన ఆహారం తో పాటు పాలు  ,గుడ్లు వినియోగాన్ని వారికి  వివరించాలని  కలెక్టరు సూచించారు.  

వీటిపై ప్రదర్శనలను నిర్వహించాలని ప్రజాప్రతినిధులు  , కమ్యూనిటీ ప్రభావశీలుర్లను ఆహ్వానించడం ద్వారా సంపూర్ణ పోషకాహార పథకం  యొక్క ప్రాముఖ్యతపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. పోషకాహార మహోత్సవాలలో గర్భిణీలు , బాలింతలు, చిన్నారులు ఏ ఆహారం తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి వివరించాలని కలెక్టరు సూచించారు. జిల్లాలో ఎక్కడ పోషకాహారం లోపంతో పిల్లలు , గర్భిణీలు , బాలింతలు ఎవరు ఉండకూడదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐ సి డి ఎస్ పి డి   బి. సుజాత రాణీ,  సిడిపిఓలు వి. వాణి విజయ రత్నం,సి హెచ్ ఇందిర,బి. ఊర్మిళ, టి యల్ సరస్వతి,పి ఆర్ రత్న కుమారి, మేరీ ఏలిజబెత్,శ్రీ లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు .

Bhimavaram

2022-09-06 10:52:07

భూముల రీసర్వే తో పక్కాగా రికార్డులు

భూములరీ సర్వేతో పక్కా రికార్డులు రూపొందుతాయని, భూమి కొలతల  విషయంలో  గతంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే   సరిదిద్దడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. మంగళవారం ఆమె అనకాపల్లి జిల్లా కసింకోట మండలం లో పర్యటించారు. తాసిల్దార్ కార్యాలయంలో రీసర్వే రికార్డులను పరిశీలించారు. చిన్న పొరపాటైనా జరుగకుండా సర్వే పక్కాగా జరగాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రీసర్వే పై అధికారులు ఉద్యోగుల తో సమీక్షించారు. తరువాత వెదురుపర్తి గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్వే చేసిన భూమి వివరాలు ప్రదర్శించారా, సర్వే పనులు ఎలా ఉన్నాయి అని అడిగారు.  సర్వే పనులు సంతృప్తిగా ఉన్నాయని , భూమి వివరాలు పెట్టారని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ నాయుడు, సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలి

అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల్లో గృహ నిర్మాణ లక్ష్యాలను వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవి లత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక  జిల్లా కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న గృహ నిర్మాణాలపై హౌసింగ్ ఆధికారులు, అనపర్తి, రాజానగరం నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గం లో 7252 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1806 ఇళ్ళు పూ ర్తి అయ్యాయని 5446 ఇళ్ళు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.  అనపర్తి నియోజకవర్గం లో 9324 ఇళ్ళు నిర్మించి పూర్తి చేయాల్సి ఉండగా 1136 ఇళ్ళు పూర్తి అయ్యాయన్నారు.  8188 ఇళ్ళు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.   వర్షాలు తగ్గాయి కాబట్టి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు నూరు శాతం పూర్తి  అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

ప్రత్యేక అధికారులు, హౌసింగ్ అధికారులు ప్రతిరోజు గృహ నిర్మాణాలపై మండల స్థాయిలో హౌసింగ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లుతో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారులకు అవగాహన పెంచాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. మండలాల్లో ఇసుక, సిమెంట్ , ఇనుము కొరత లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.  ప్రతీ ఇంటికి 20 టన్నుల ఇసుక ను హోసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కూపన్లు ఏర్పాటు చేసి, ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఈ వారం రోజుల్లో లక్ష్యాల్లో భాగంగా కోరుకొండ మండలం లో 311 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 24 ఇళ్ళు పూర్తి చేయడం జరిగిందన్నా రు. రాజానగరం లో 466 ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 93 ఇళ్ళు   పూర్తి చేయడం జరిగిందన్నారు.

సీతానగరం లో 185  ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 13 ఇళ్ళు   పూర్తి చేయడం జరిగిందన్నారు.  అనపర్తి లో 438  ఇళ్ళు నిర్మిం చాల్సి ఉండగా 34 ఇళ్ళు పూ  ర్తి చేయడం జరిగిందన్నారు.  బిక్కవోలు లో 390  ఇళ్ళు నిర్మించాల్సి ఉండగా 45  ఇళ్ళు పూర్తి చే యడం జరిగిందన్నారు.  రంగం పేట లో 647  ఇళ్ళు నిర్మిం చాల్సి ఉండగా 98 ఇళ్ళు పూ  ర్తి చేయడం జరిగిందన్నారు. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేసే దిశలో వారానికి లక్ష్యం పెట్టుకుని, సచివాలయ కార్యదర్శి లకు ఒక్కొక్కరికి ట్యాగ్ చేయ్యాడం ద్వారా మరింత గా పనుల పర్యవేక్షణ, స్టేజ్ కన్వర్షన్ సాధ్యం అవుతుందని,. ఆ దిశలో చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ఈ. ఈ, జి. పరశురామ్, డి. ఈ, జి. వేణుగోపాల స్వామీ నియోజకవర్గాల మండల తా హిసీల్దార్ లు, యం. పి. డి. ఓ లు, ఇరిగేషన్, సర్వే అధికా రులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-09-06 10:47:45

దివ్యాంగులకు పునరావాస కేంద్రాలు నిర్మాణం

పార్వతీపురం మన్యం జిల్లాలో దివ్యాగుల పునరావాస కేంద్రం నిర్మించి నిర్వహణ చేపట్టేం దుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం. కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  విభిన్న ప్రతిభావంతులకు సేవలు అందుబాటులోకి తెచ్చుటకు ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లాలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయుటకు జిల్లా పర్యవేక్షణ కమిటీని స్థాపించామని అన్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి,నోడల్ ఏజెన్సీని ఎంపిక చేయుటకు ఆసక్తి గల స్వచ్చంద సంస్థలు, రెడ్ క్రాస్ వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. దరఖాస్తులు  ఈనెల 8వ తేదీలోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు,హిజ్రాలు, వయోవృద్ధుల శాఖ, పార్వతీపురం కార్యాలయంలో  సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు www.socialjustice.gov.in వైబ్సైట్, 9441416375 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని ఆ ప్రకటనలో వివరించారు.

Parvathipuram

2022-09-06 10:11:10

ఉత్తరాంధ్ర కళాకారుల ప్రతిభ ప్రశంసనీయం

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే కవులు, కళాకారులుకు ప్రసిద్ధిగా పేరుగాంచిందని, అటువంటి కళాకారులను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందని  శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్లశ్రీనుబాబు కొనియాడారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురుపూజోత్సవం సందర్భంగా గురుశిష్య ప్రతిభా పురస్కార్ అవార్డులను రమేష్ ఎంటర్ టైనర్ అదినేత చదల వాడ రమేష్ బాబు(గురువు ), ఆర్టీసీ కండక్టర్ ఘాన్సీ (శిష్యురాలు) లకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కవులు, రచయితలు, స్వచ్చంధ సంస్థలతో పాటు కళాకారులు పాత్ర కూడా అత్యంత ప్రశంసనీయమన్నారు.

 ఆయా రంగాల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వారిని గుర్తించి తమ సంస్థ ద్వారా సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా  గతంలో 45 మంది మహిళా పోలీసులను సత్కరించామని, ఆ తరువాత కళాకారుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులను, స్కూల్ ఆఫ్ దియేటర్ ఆర్ట్స్ బాల కళాకారులను సత్కరించామన్నారు. ఇక గురుపూజోత్సవం సందర్భంగా ఏటా గురువులను సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గణేష్ యువజన సేవా సంఘం గడచిన 39 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది గాజువాకకు చెందిన రమేష్ ఎంటర్ టైనర్స్ అధినేత చదలవాడ రమేష్ బాబు(గురువు), ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ (శిష్యురాలు)లకు ఈ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగిందన్నారు.

 వీరితో పాటు మరో 13 మంది కళాకారులను సత్కరించామని శ్రీనుబాబు వివరించారు. భవిష్యత్తులో కూడా ఆయా రంగాల్లో రాణించిన వారిని గుర్తించి గౌరవంగా సత్కరించుకోవడం జరుగుతుందన్నారు. కొంత మొత్తం ఆర్థిక సహాయం వీరికీ అందచేశారు. సన్మానగ్రహీతలు చదలవాడ రమేష్ బాబు, ఝాన్సీలు మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించి అవార్డులను అందజేసిన గణేష్ యవజన సేవా సంఘంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలుగు రాష్ర్టాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజల మన్ననలు మరింత పొందే విధంగా అందరి ఆశీస్సులు కోరుతున్నామన్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా తమ కళాకారుల బృందం అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. కళాకారులు మెరుగ్గా ఉంటేనే ఆయా ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు.

 ప్రతిభాపాటవాలు ఉంటే ఎప్పటికైనా తమకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి తాజాగా తమకు లభించిన ఆదరణే నిదర్శనమన్నారు. ప్రభుత్వము కూడ కళాకారులని ఆదుకోవాలని వీరు కొరారు.. ఈ సందర్భము గా రమేష్ మాస్టర్ బృందం నిర్వహించిన డాన్స్ లు అలరింఛాయీ. ఈ కార్య క్రమంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వాహకుడు అర్. నాగరాజ్ పట్నాయక్, రేస్ ఈవెంట్స్ అదినేత దాడి రవి కుమార్ తదితరులుపాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-05 10:23:07

ప్రేరణ కల్పించి సమాజాన్ని తీర్చిదిద్దాలి


ప్రేరణ కల్పించి.. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని పార్వతీపురం మన్యం  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఉన్నత లక్ష్యాల కోసం పనిచేయడమే కాకుండా భావిభారత పౌరులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దాలని కోరారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గిరి మిత్ర సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా కలెక్టర్ ప్రధానం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించారని ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగానన్నారు. ఐ.ఏ.ఎస్ అధికారిగా ప్రజలకు మేలు చేయవచ్చని నా ఉపాధ్యాయుల మార్గదర్శకం చేయడంతో ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగాను అన్నారు. 

సమాజానికి మార్గదర్శకులుగా, ప్రామాణిక విద్యకు చిరునామాగా ఉపాధ్యాయులు నిలవాలని సూచించారు. ఉన్నత విలువలకు పాఠశాల ప్రథమ సోపానం కావాలని పిలుపునిచ్చారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు కీర్తించారని చెప్పారు. రాధాకృష్ణన్ స్పూర్తితో జిల్లాలో ఆదర్శాలకు మారుపేరుగా ఉపాధ్యాయులు నిలవాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయులకు  సమస్యలు ఉంటే పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. అందరూ సమయాన్ని అనుసరించాలని, విద్యార్థులకు సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ముఖ గుర్తింపు హాజరును ప్రవేశ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ముఖ హాజరుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులుగా సమాజానికి దిశాదశ నిర్దేశం చేయడంలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొన్ని విద్యా సంస్థలలో బాలికల పట్ల వివక్ష, లైంగిక వేదింపులు జరుగుతున్నాయని, అటువంటి సంఘటనలలో ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. జిల్లాలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులు నిబద్దతతో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అటువంటి కార్యకలాపాలు చోటు చేసుకొనుటకు అవకాశం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మునిసిపల్ చైర్ పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-05 09:27:10

రైలు ప్రయాణికుల అవసరాలను గుర్తించాలి

రైలు ప్రయాణికుల అవసరాలు డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వాటికి రైల్వే శాఖ ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని గాంధీభవన్ లో జిల్లా, కాకినాడ టౌన్ ప్రయాణికుల సంఘ సమావేశం అధ్యక్షుడు వై డి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గీత మాట్లాడుతూ దేశం మొత్తంగా రైల్వే శాఖకు  అధిక ఆదాయం మన దక్షిణ మధ్య రైల్వే నుండి లభిస్తుందన్నారు. కోస్టల్ కారిడార్ విస్తరణ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానన్నారు. కొన్ని  ఎక్స్ప్రెస్ రైళ్లు సామర్లకోటలో నిలుపుదల చేయడానికి కృషి చేయగా అధికారులు స్పందించి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు, సిటీ బస్సులు ఏర్పాటుకు గాను ఆర్టీసీ అధికారులతో సంప్రదిస్తానని గీత తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి అడ్డూరి రవిరాజా, ఉపాధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, ఏ .వెంకటేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.


Kakinada

2022-09-05 06:48:31

అపోలోకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి) అపోలో ఆసుపత్రికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వైద్య సేవలు అందిస్తోందని అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. కుటుంబ సమేతంగా సోమవారం ఆయన శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని సందర్శించారు.. జనరల్ వార్డు, ఐసియూ లు, ఆపరేషన్ థియేటర్లు, క్యాత్ ల్యాబ్ విభాగాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే 600 మందికి పైగా చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవోఎ వి ధర్మారెడ్డి డాక్టర్ ప్రతాప్ రెడ్డికి వివరించారు. బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల నుంచి కూడా తల్లి తండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారని ఆయన తెలిపారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

          అనంతరం డాక్టర్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల హృదయాలయంలో శుభ్రత, ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే చర్యలు, వైద్య సేవలు, సర్జరీలు చేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది ఆత్మ విశ్వాసం ఎంతో గొప్పగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే  600 మంది చిన్నారులకు డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారని అభినందించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే యంత్ర సామగ్రి మొత్తం తమ కుటుంబం విరాళంగా అందిస్తుందని ప్రకటించారు. అలాగే అపోలో ఆసుపత్రుల నుంచి డాక్టర్లు ఇక్కడికొచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. విదేశాల్లో తమ ఆసుపత్రులకు సాంకేతిక, వైద్య సహకారం అందిస్తున్న పేరొందిన చిన్న పిల్లల ఆసుపత్రుల సేవలు కూడా అందేలా ఏర్పాటు చేస్తానని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తనకు ఇచ్చిన గొప్ప  అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో టీటీడీ ప్రజల కోసం ఎంతో గొప్ప సేవలు అందించిందని ఆయన అభినందించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి క్యాత్ ల్యాబ్ నిర్వహణ, ఆపరేషన్లు చేసేందుకు పాటిస్తున్న  విధానాలను డాక్టర్ ప్రతాప్ రెడ్డి కి వివరించారు.

Tirupati

2022-09-05 06:40:16

ఈఅవనిలో గురువులే నవసమాజ నిర్మాతలు

గురు శిష్య సంప్రదాయం మానవ జాతికి శ్రీరామ రక్ష అని సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖలోని డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సహకారంతో విశాఖ వెబ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన  తమకు ఆ ఆత్మసంతృప్తి ఎప్పుడూ ఉంటుందని, ఉపాధ్యాయుడిగా, అధ్యాపకులుగా సమాజము లో అందుకున్న గౌరవంతో పాటు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతా మన్నారు. ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డివిఆర్ మూర్తి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్రతీ రోజు తరగతి గదిలో సరికొత్త అంశాలను మేళవించి  విద్యార్ధులు కి అర్థమైన రీతిలో పాఠ్యాంశాలు బోధించాల్సిన అవసరం ఉందన్నారు..

 విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతతో పాటు సమాజానికి కూడా ఉపాధ్యాయుల సేవలు ఎంతగానో అవసరమని వీరంతా అభిప్రాయపడ్డారు.  తమ విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తే ఆ సంతృప్తి జీవితాంతం అంతులేని ఆనందం కలిగిస్తుందన్నారు. రాష్ట్రపతి నారీ శక్తి అవార్డు గ్రహీత, ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ మాట్లాడుతూ,  ప్రతి విద్యార్థి గురువులకు తమ పిల్లలతో సమానమే అన్నారు.. గురుపూజోత్సవం సందర్భంగా తమ సేవలను గుర్తించి జర్నలిస్ట్ లు సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ప్రముఖ కతక్  డాన్స్ టీచర్, అధ్యాపకురాలు ఇప్సాత్ రాయ్  మాట్లాడుతూ, జర్నలిస్టుల తోనే నవసమాజ ప్రగతి సాధ్యమని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవార్డు గ్రహీత ఎస్టి పి  లక్ష్మి కుమార్ మాట్లాడుతూ, గురువు ఎక్కడైతే గుర్తించబడతారో అక్కడ చదువులమ్మ కొలువుదీరి వుంటుందన్నారు. 

విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, గురుపూజోత్సవం సందర్భంగా గురువులను  సత్కరించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా అవకాశం కల్పించిన విశాఖ వెబ్ జర్నలిస్టు అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు. విజేఎఫ్ సెక్రటరీ దాడి రవి కుమార్, ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ,  గురువులు గొప్పతనము తెలియ జేశారు.  అంతకు ముందు ఆచార్య జీఎస్ఎన్ రాజు, ఏయూ జర్నలిజం విభాగం అధ్యాపకులు ఆచార్య డివిఆర్ మూర్తి, రాష్ట్రపతి నారీ శక్తి అవార్డు గ్రహీత,  ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవార్డు గ్రహీత ఎస్టి పి  లక్ష్మి కుమార్. ప్రముఖ కతక్  డాన్స్ టీచర్, అధ్యాపకురాలు ఇప్సాత్ రాయ్ లను  దుస్సాలువాలతో ఘనంగా  సన్మానించి సత్కరించారు.

  ఈ కార్యక్రమంలో విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వర రావు, సీనియర్ పాత్రికేయుడు బండారు శివప్రసాద్, వెబ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, టీవిఎన్ ప్రసాద్, గురు ప్రసాద్, మదన్, రవి, గోపీనాథ్, బుద్ధ భాస్కర్, ఉదయ్, జనా, రాము తదితరులు  పాల్గొన్నారు.  స్కూలు ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్య క్రమాలుతో సభికులను అలరించాయి.


Visakhapatnam

2022-09-05 04:50:48

పకడ్బందీగా గడపగడపకూ ప్రభుత్వం

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ ఆదేశించారు. ఆదివారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పై  మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు వర్క్ షాప్ నిర్వహించారు.  ఈ వర్క్ షాప్ లో కలెక్టర్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు యొక్క అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం  ఈ కార్యక్రమం చేపట్టిందని ఆమె తెలిపారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇచ్చి పనులు ప్రతిపాదించాలని ఆమె సూచించారు.  ప్రతి సచివాలయానికి   ప్రజలు సూచించిన పనులు చేపట్టేందుకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు.

  ఈ నిధులను వినియోగించుకొని మంచినీటి సరఫరా, రోడ్లు,  డ్రైన్లు ,  విద్యుత్ సదుపాయాలు వంటి పనులు చేపట్టేందుకు సంబంధిత నియోజకవర్గం ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రతిపాదనలు, అంచనాల రూపొందించి పంపించాలని కలెక్టర్ సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు,  పనులు ప్రతిపాదనలు అన్నింటిని  సకాలం లీక్ పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనులు ఏ విధంగా అప్లోడ్ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో  సి పి  కె. శ్రీనివాసరావు ,  డిఎల్డి ఓ ,సి హెచ్ అప్పారావు   , మున్సిపల్ కమిషనర్లు ,  మండల అభివృద్ధి అధికారులు. , డిజిటల్ అసిస్టెంట్లు,  వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు .

Bhimavaram

2022-09-04 09:52:05

6న తిరుపతిలో సీఎం వైస్ జగన్ పర్యటన

సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈనెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు జిల్లా పోలీసు అధికారి పరమేశ్వర్ రెడ్డి  ఇతర  పోలీసు అధికారులతో భద్రతా సమీక్షను నిర్వహించారు. అనంతకం కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం జగన్ మోహనరెడ్డి కొవ్వూరు హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2:30 గం. కు బయల్దేరి 2.50 గంటలకు తిరుపతి ఏర్పోర్ట్ చేరుకుంటారన్నారు.  మూడు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో తిరుగుపయనం కానున్నారని పేర్కొన్నారు.

ఈ  సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల పరిశీలన ASL లో భాగంగా జిల్లా కలెక్టర్,  లు సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ రూమ్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, ఎస్ ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ కృష్ణారెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి బాలకృష్ణన్, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి  రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్, సురేంద్ర, రేణిగుంట తహసిల్దారు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2022-09-04 09:42:58

మెరిట్ ఆధారంగా వైద్య‌ుల నియామకాలు

మెరిట్ ఆధారంగానే వైద్య‌శాఖ‌ పోస్టుల భ‌ర్తీ జ‌రుగుతుంద‌ని విజయనగరం జిల్లా  కలెక్టర్, జిల్లా సెలెక్షన్ కమిటి చైర్మన్ ఎ.సూర్య కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. నియామకాలు అన్నీ ప్రభుత్వ నియమ నిబంధనుల మేరకు, అత్యంత పారదర్శకంగా, రోస్ట‌ర్ ప్ర‌కారం జరుగుతాయని,  ఏ ఒక్క అభ్యర్ధి కూడా ఎటువంటి  ప్రలోభాలకు గురికావద్దని, వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. అభ్యర్ధులు వివిధ కేట‌గిరీల‌ పోస్టులకు దరఖాస్తు చేసినప్పటికీ, కౌన్సిలింగ్  రోజున ఎంపిక కాబడిన పోస్టు లోనే నియామకం చేయడం జరుగుతుందన్నారు. వైద్యారోగ్య‌శాఖ‌, వైద్య విధాన‌ప‌రిష‌త్‌, మెడిక‌ల్ క‌ళాశాల‌, బోధ‌నాసుప‌త్రిలలో దేనికి ఎంపిక అయితే, ఆ విభాగం ప‌రిధిలోనే  ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని, విభాగాల్లో ఎటువంటి మార్పుల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని స్పష్టం చేసారు. 

ఈ నోటిఫికేష‌న్‌లో జారీ చేసిన 194 పోస్టుల్లో ఎక్క‌డైనా, ఏడాది లోప‌ల‌ ఖాళీలు ఏర్ప‌డితే,  ఆ మెరిట్ జాబితాను నుంచి మాత్ర‌మే భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని, వేరేగా నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం జ‌ర‌గ‌ద‌ని తెలిపారు.  కౌన్సిలింగ్ అనంతరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని, తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించినచో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించారు. కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.  విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యంజిల్లాల్లో  వైద్య శాఖకు సంబంధించిన  వివిధ కేటగిరీలలో 194 కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్‌ పోస్టులకు ఆగష్టు 29  నాటికీ ఉన్న ఖాళీలతో  రోస్టర్ వారీగా  నోటిఫికేషన్ ఇప్ప‌టికే జారీ చేయడం జరిగిందని తెలిపారు.  జిల్లా  వైద్య మరియు ఆరోగ్య శాఖ , వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీ, బోధనా ఆసుపత్రి ప‌రిధిలో ప‌నిచేయ‌డానికి ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్టు వివ‌రించారు.

 కోర్టు కేసు కార‌ణంగా మెడిక‌ల్ రికార్డు టెక్నీషియ‌న్  పోస్టులు రెండు మిన‌హా, 192 పోస్టుల‌కు ప్ర‌స్తుతం భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. జిల్లా వైద్యారోగ్య‌శాఖ 13, ఎపి వైద్య విధాన ప‌రిష‌త్ 29, మెడిక‌ల్ కాలేజ్  42, బోధ‌నాసుప‌త్రి లో 110  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసిన‌వారి ప్రొవిజనల్ జాబితాను, పోస్టులు, రోస్టర్ , రిజర్వేషన్ తదితర  వివరాలను  ఆన్ లైన్ లో  http://vizianagaram.ap.gov.in (or) http://vizianagaram.nic.in“ నందు పొందుపరచడం జరిగిందని తెలిపారు.  దీనికి సంబందించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు అయితే పూర్తి ఆధారాలతో,  సర్వీసు సర్టిఫికేట్‌ ఉన్నవారు, తమ సర్టిఫికేట్ అసలు కాపీని నియామక అధికారితో కౌంటరు సిగ్నేచర్ చేస్తూ,  నియామక ఉత్తర్వులు కూడా జత చేసి గెజిటెడ్ ఆఫీసరు వారితో   ధ్రువీకరణ చేయించి నేరుగా  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయమునకు ఈ నెల 6 వ తేదీ  సాయంత్రం 5.గ.ల లోపు తమ గ్రీవెన్స్‌ సమర్పించ వలసి ఉంటుందని తెలిపారు.            
.........................
ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం పోస్టులు ః 194
జిల్లా వైద్యారోగ్య‌శాఖ ః 13
ఎపి వైద్య విధాన ప‌రిష‌త్ ః 29
మెడిక‌ల్ కాలేజ్ ః 42
బోధ‌నాసుప‌త్రి ః 110

Vizianagaram

2022-09-04 09:18:28

నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగు

నేత్ర దానం చేయడం ద్వారా మరోకరి జీవితంలో వెలుగు నింపిన వారమౌతామని  విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.యస్.విశ్వనాథన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆర్.కె. బీచ్  కాళీమాత ఆలయం వద్ద నుండి 37 వ జాతీయ నేత్రదాన అవగాహన ర్యాలీని జెసి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ మరియు అనీల్ నీరు కొండ ఆసుపత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్త దానం చేయడం వల్ల ఎంతో మందికి జీవితం నిలబెట్టిన వారవుతారని,  నేత్ర దానం చేయడం వల్ల  ఇంకోకరి జీవితం లో వెలుగు నింపిన వారమౌతామని అన్నారు. నేత్ర దానం పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇటువంటి ర్యాలీలు ఎంతో  ప్రభావం చూపుతాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. 

అంతకు ముందు జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ తన మరణానంతరం తన రెండు కళ్ళు దానం చేస్తున్నట్లు  ప్రకటించి అందుకు సంబంధించిన ఫారం లో సంతకం చేశారు.ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి  కె. విజయ లక్ష్మి , పలువురు వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది విద్యార్థులు , అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-04 09:08:42

నిర్మాణాలకు ఇసుక కొరత ఉండకూడదు

ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సరఫరా లో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి జిల్లాలో ఇసుక నిల్వలు, సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనబడి నాడు-నేడు, జగనన్న కాలనీలు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు ఆటంకం కలగని విధంగా ఎప్పటికప్పుడు ఇసుక సరఫరా చేయాలని జెపి పవర్ వెంచర్స్  ప్రతినిధిని ఆదేశించారు.  ఏ రోజు ఎంత మొత్తంలో ఇసుక అవసరం ఉందో ముందుగానే అంచనావేసి మైన్స్ శాఖ ఎడి ద్వారా ఇసుక సరఫరా కంపెనీకి తెలియజేయాలన్నారు. అలాగే భీమవరం, నరసాపురంలలో కొత్తగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.  

జిల్లాలో  సిద్ధాంతం, నడిపూడి, కరుగోరుమిల్లి కోడేరులలో నాలుగు ఓపెన్ రీచ్ లు ఉన్నాయని, బోట్స్ మెన్ సొసైటీలు 11 ఉన్నాయని, ప్రస్తుతం మూడు యలమంచిలి లంక, అబ్బిరాజుపాలెం, చించినాడ బోట్స్ మెన్ సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. వరద నీటి కారణంగా 4 ఓపెన్ రీచులు , 8  బోట్స్ మెన్  వినియోగంలో లేవని తెలిపారు. మనబడి నాడు-నేడు కింద 1,200 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాకు  అర్బన్ పీహెచ్ సిలు మంజూరయ్యాయని, త్వరలో వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా సిద్ధం చేయాలన్నారు.  వర్షాకాలం రాకముందే ఎక్కువ మొత్తంలో ఇసుకను ఎందుకు డంప్ చేసుకోలేదని జెపి ప్రతినిధిని కలెక్టర్  ప్రశ్నించారు.  

 ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జెపి ప్రతినిధిని ఆదేశించారు. ఈ సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి.మురళీ, ఇన్చార్జ్ డిఆర్ఓ దాసిరాజు, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ కుమారి డి. అఖిల, మైన్స్ శాఖ ఏడి సుబ్రమణ్యం, జిల్లా వాటర్ రిసోర్స్ అధికారి పి. నాగార్జున రావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కెఎస్ఎస్. శ్రీనివాస రావు, హౌసింగ్ పీడీ ఎ.వి. రామరాజు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ కె.డి. ఆనంద్, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ అర్.విజయ్ పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-03 11:38:54