1 ENS Live Breaking News

అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు

అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 350 గ్రామాల్లో రీ సర్వే లక్ష్యం కాగా ఇంత వరకు 236 గ్రామంల్లో 80 వేల 617 ఎకరాలు రీ సర్వే పూర్తి అయిందని వివరించారు.  జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే శాఖ ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:32:25

తిరుమలో ఉప విచారణ కేంద్రం పరిశీలన

తిరుమ‌ల‌లో ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్ధిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రాన్నిగురువారం  టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమలలోని మరో 19  వ‌స‌తి ఉప విచారణ కార్యాలయాలను కూడా ఇదే విధంగా త్వ‌రిత గ‌తిన ఆధునీక‌రించాల‌ని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  ప్రారంభోత్సవం త‌రువాత‌ కొత్త కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు కేటాయించారు. నూత‌నంగా ఆధునీక‌రించిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రంలో మూడు గ‌దులు కేటాయింపు కౌంటర్లు, 25 మంది యాత్రికులు కుర్చునే విధంగా  ఏర్పాటు చేశారు. భక్తులకు మ‌రింత  ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దేవతా చిత్రాలు, "శ్రీనివాస కళ్యాణం" యొక్క భారీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న‌ది.  

     ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో(ఆర్‌-2)  భాస్కర్, ఇఇలు  సురేందర్ రెడ్డి,  జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎల‌క్ట్రిక‌ల్‌)  రవిశంకర్ రెడ్డి, విజివోలు  బాలిరెడ్డి,  మనోహర్, రిసెప్ష‌న్  ఏఈవో రాజేంద్ర‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-01 13:10:01

ఇసుక నిల్వల ప్రాంతాల‌ను గుర్తించాలి

కాకినాడ జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాల‌కు అనువైన ప్రాంతాల‌ను గుర్తించి, వారంలోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ వివేకానంద‌హాల్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ (డీఎల్‌ఎస్సీ), జిల్లా ఖ‌నిజ ఫౌండేష‌న్ (డీఎంఎఫ్‌) స‌మావేశాలు జ‌రిగాయి. కాకినాడ ఎంపీ వంగా గీత‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ, వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో జిల్లాలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఇసుక‌, ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌న నిర్మాణాలు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం అమ‌లుకు అవ‌స‌ర‌మైన ఇసుక‌, ఖ‌నిజ ఫౌండేష‌న్ కింద చేప‌ట్టిన ప‌నుల్లో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రీచ్‌ల గుర్తింపున‌కు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల బృందం క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు జ‌ర‌పాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో ఆరు డిపోల ప‌రిధిలో 2.38 ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుక అందుబాటులో ఉంద‌ని.. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; ఆర్‌బీకేలు త‌దిత‌ర ప్ర‌భుత్వ శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని జేపీ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్ర‌తినిధుల‌కు సూచించారు.

 అదే విధంగా జిల్లాలో జిల్లా ఖనిజ ఫౌండేష‌న్ (డీఎంఎఫ్‌) కింద మంజూరైన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని స‌ర్వ శిక్షా అభియాన్‌; ర‌హ‌దారులు, భ‌వ‌నాలు; ఇరిగేష‌న్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జిల్లాలో తొమ్మిది మండ‌లాల ప‌రిధిలో మైనింగ్ కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఈ కార్య‌క‌లాపాల‌తో ప్ర‌త్య‌క్షంగా (10 కి.మీ. ప‌రిధి), ప‌రోక్షంగా (10-25 కి.మీ. ప‌రిధి) ప్ర‌భావిత‌మ‌వుతున్న గ్రామాలు/ఆవాసాల్లో డీఎంఎఫ్ నిధుల‌తో ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రూ. 81 ల‌క్ష‌ల‌తో ప‌లు అంగ‌న్‌వాడీ భ‌వ‌నాల ప‌నుల‌కు, తొండంగి మండ‌లంలో రూ. 19 ల‌క్ష‌ల‌తో అయిదు అభివృద్ధి ప‌నుల‌కు తాజా స‌మావేశం ఆమోదం తెలిపిన‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, మైన్స్ అండ్ జియాల‌జీ డీడీ ఇ.నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, ఆర్ అండ్ బీ ఎస్ఈ కె.హ‌రిప్ర‌సాద్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-30 13:30:41

ప్రజలకు గణనాధుడి ఆశీస్సులుండాలి

నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాల్లో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ హరిత మంగళవారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలు విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా కార్పొరేషన్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసంతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Nellore

2022-08-30 13:23:14

మత్స్యకార యువత పథకాలు వినియోగించుకోవాలి..డిడి నిర్మలకుమారి

మత్స్యకారుల్లోని ఔత్సాహిక యువత ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సమీకృత ఇరిగేషన్, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ 2022-23లో భాగంగా  స్థానిక నెహ్రు యువ కేంద్రం ఆవరణలో మత్స్య  శాఖ ఉద్యోగులకు మత్స్య కార్యకలాపాలపై అవగాహనా కార్యక్రమం సపోర్టింగ్ ఆర్గనైజేషన్ IRPWA ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి మాట్లాడుతూ,  మత్స్య  శాఖ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వంచే అందజేయబడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు, రైతులకు, మత్స్యకార సంఘాల సభ్యులకు, ఔత్సాహికులకు ఆ పథకాలను వివరించాలన్నారు. తద్వారా ఔత్సాహిక యువత ముందుకు రావడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఫిష్  ఆంధ్ర షాపుల నిర్వహణ ద్వారా స్థానికంగా చేపల వినియోగం పెంచి తద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, మత్స్యకారులు జీవన ప్రమాణాల అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఈ ఫిష్ ఆంధ్ర షాపుల ఏర్పాటుకి ముందుకొస్తే  మహిళలు, ఎస్.సి, ఎస్.టి లకు  60%, ఇతరులకు 40% రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు.  అలాగే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సబ్సిడీతో కూడిన పధకాలు అందజేస్తుందన్నారు. వాటిలో ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, ఫిష్ వెండింగ్ యూనిట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు, ఫిష్ కియాస్కులు తదితర పథకాలకు సత్వరమే లబ్దిదారులను గుర్తించి, ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేయించాల్సిందిగా ఆదేశించారు. 

మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం  అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని డిడి వివరించారు. అంతేకాకుండా  వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ. 10.00 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మత్స్యకారులంతా  ఈ-శ్రమ్ లో నమోదు చేశుకుంటే అదనంగా మరో రూ. 2. 00 లక్షలు లభిస్తాయని తెలియజేశారు. పథకాలకు వ్యాపార పెట్టుబడి నిమిత్తం అత్యంత తక్కువ వడ్డీ రేటుతో కిషాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నవిషయాన్ని మత్స్యకారులకు తెలియజేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటినా  అర్హుడైన ప్రతీ మత్స్యకారుని నెలకు రూ. 2,500/- పెన్షన్ ను,  స్వదేశీ మత్స్యకారులకు నామమాత్రపు లీజుతో చెరువులను కేటాయిస్తారని, అలాగే తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయములో సకాలం లోనే రూ. 10,000/- నేరుగా వారి ఖాతాకు జమ చేస్తారని చెప్పారు.  హెచ్ఎస్డీ ఆయిల్ కార్డుల మంజూరు ద్వారా డీజిల్ పోయించుకొనే సమయంలోనే సబ్సిడీ వర్తింపుని కూడా అమలు చేస్తారన్నారు. ఆక్వా రైతులకు విధ్యుత్  రాయితీలు వస్తాయని తెలియజేశారు. 

 APSADA చట్టం ద్వారా రూపొందించిన ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా ఎలాంటి ఆలస్యం, అలసత్వం లేకుండా  సత్వర ఆక్వా కల్చర్ అనుమతులు, నీరు, మట్టి, మైక్రో బయాలజీ పరీక్షల కోసం ఆక్వా ల్యాబ్ లో సేవలు అందిస్తారని.. మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్దతి(RAS, BIOFLOC)  లో చేపల సాగు చేయుట మొదలగు వాటి గూర్చి క్షేత్ర స్థాయిలో పనిచేసే మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు,  మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు, గ్రామ మత్స్య సహయ కులు వివరంగా వివరించి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో APIIATP, ఏపీడీ రామారావు, IRPWA ఆర్గనైజింగ్ చీఫ్ ప్రకాష్, ఎఫ్డీఓ యు.చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు సంతోష్, వేంకటెష్, ప్రసాద్, గ్రామ మత్స్య సహయ కులు తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-08-30 12:06:49

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.         ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు ఈ అభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-08-30 11:41:15

బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లో గ‌ల క‌మాండ్ కంట్రోల్ రూమ్ స‌మావేశ మందిరంలో ఈ స‌మీక్ష జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజైన సెప్టెంబ‌రు 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న కోసం బందోబ‌స్తు, వాహ‌న‌సేవ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగ‌త‌నాలు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు, క్యూలైన్ల‌లో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్ల‌లో కూంబింగ్‌, రాత్రి గ‌స్తీ విధులు, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు తెప్పించుకోవ‌డం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద పోగ‌యిన వ్య‌ర్థాల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

          అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య, విజివో  బాలిరెడ్డి, ఇఇ  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ  వేణుగోపాల్‌, సిఐలు  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌,  సాయిగిరిధ‌ర్‌,  మ‌నోహ‌ర్‌,  శివ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-08-30 11:39:51

జిల్లాప్ర‌జ‌ల‌ను గ‌ణ‌నాథుడు చ‌ల్ల‌గాచూడాలి

స‌క‌ల విఘ్నాల‌ను తొల‌గించి,  ప్ర‌జ‌ల‌ను ఆ విఘ్నేశ్వ‌రుడు చ‌ల్ల‌గా చూడాల‌ని విజయ నగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. ఆ గ‌ణ‌నాథుడి ద‌య‌తో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆమె ఒక ప్ర‌క‌ట‌న ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. బుద్దికి, జ్ఞానానికి ప్ర‌తీక‌గా ఆ గ‌ణ‌నాథుడిని ఆరాధిస్తార‌ని చెప్పారు. జ్ఞానం, ల‌క్ష్య సాధ‌న‌, నైతిక విలువ‌లు, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ వంటి ఎన్నో సుగుణాల‌ను ఈ పండుగ మ‌న‌కు నేర్పుతుంద‌ని పేర్కొన్నారు. హిందువుల తొలి పండుగ అయిన ఈ గ‌ణేష్ చ‌తుర్ధిని ప్ర‌జ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించుకోవాల‌ని కోరారు. పందిళ్ల‌లో, మంట‌పాల్లో వినాయ‌క ఉత్స‌వాల‌ను నిర్వ‌హించే చోట‌, త‌గిన ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని, నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా వేడుక‌ల‌ను నిర్వ‌హించుకోవాల‌ని తెలిపారు. ముఖ్యంగా వినాయ‌క నిమ‌జ్జ‌నాలు చేసేట‌ప్పుడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Vizianagaram

2022-08-30 11:25:00

విఘ్నాలు తొల‌గిపోయేలా పండుగ చేసుకోవాలి

తెలుగువారి తొలి పండుగ వినాయ‌క చ‌వితిని జిల్లా ప్ర‌జ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకోవాల‌ని, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కోరారు. గ‌ణేష్ చ‌తుర్ధి సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌లంతా మట్టిగణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఆ గ‌ణ‌నాధుని చ‌ల్ల‌ని చూపుతో, ప్ర‌జ‌లంతా సుఖఃసంతోషాల‌తో ఉండాల‌ని, మ‌న‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతూ విఘ్నాలు తొల‌గిపోవాల‌ని కోరారు. వినాయ‌క‌చ‌వితి జ‌రుపుకొనే విష‌యంలో ప్ర‌భుత్వం కొత్త‌గా ఎటువంటి నిబంధ‌న‌లు పెట్ట‌లేద‌ని, ఇదంతా ప్ర‌తిప‌క్షాల దుష్ప్ర‌చార‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణ హితంగా పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని, మ‌ట్టి విగ్రాహాల‌ను వినియోగించడం ద్వారా మరికొందరికి ఆదర్శంగా నిలవచ్చునన్నారు. 

Vizianagaram

2022-08-30 11:03:44

ఖాతాలు తెరిచినవెంటనే గృహనిర్మాణాలు

గృహనిర్మాణ లబ్ధిదారులంతా ఐసీఐసీఐ బ్యాంకులో వేగంగా ఖాతాలు తెరిచి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అగ్రిమెంట్లపైసంతకాలు చేస్తే ఇంటి నిర్మాణాలు ప్రారంభమ వుతాయని కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.రమేష్‌ చెప్పారు. స్థానిక పేర్రాజుపేటలోని 5వ డివిజన్‌  సచివాలయంలో మంగళవారం బ్యాంకు ఖాతాల తెరిచే ప్రక్రియను కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13500 మంది గృహనిర్మాణ లబ్ధిదారులకు గాను ఇప్పటికే 10వేల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారన్నారు. మిగిలిన 3,500 ఖాతాలను కూడా త్వరగా తెరిపించి వీరంతా వేగంగా అగ్రిమెంట్లపై సంతకాలు చేసి ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిఅయితే డిసెంబర్‌ నాటికల్లా ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 సందర్భంగా బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసేందుకు వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీపీఆర్వో కృష్ణమోహన్, ఐదవ డివిజన్‌ కార్పొరేటర్‌నల్లబెల్లి సుజాత, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

Kakinada

2022-08-30 10:25:38

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారాసీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన కరణంగారి జంక్షన్, కృష్ణానగర్‌ బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. వర్షాకాలం దృష్ట్యా డెంగీ వంటి వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా వర్షపునీరు, స్వచ్ఛమైన నీటిలో డెంగీ దోమ వృద్ధి చెంది వాటి ద్వారా ప్రజలు అనారోగ్యాలపాలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్యకార్యక్రమాలతోపాటు ప్రజలు కూడా తమతమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వనీటిని తొలగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు.

 ముఖ్యంగా పూలకుండీలు, వాడిపడేసిన కొబ్బరి బొండాలు,టైర్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని వ్యాధులు ప్రభలకుండా చూసుకోవాలని కమిషనర్‌ కోరారు. అలాగే పారిశుద్ధ్య పనులను కూడా ఆయన తనిఖీ చేశారు. ప్రజలు తడిపొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృద్విచరణ్ తదితరులు ఉన్నారు.

Kakinada

2022-08-30 10:23:32

డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలి

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 8న ప్రతి పాఠశాల, జూనియర్ కళాశాలలో జరగనున్న డీ – వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో పి.హెచ్.సి.,సి.హెచ్.సి వైద్యాధికారులతో డీ-వార్మింగ్ డే మరియు ఫీవర్ సర్వే, వైద్యాధికారుల సేవలు తదితర అంశాలపై ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 8న జరగనున్న డీ – వార్మింగ్ డేను జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. డీ-వార్మింగ్ మాత్రలు ముందుగానే ప్రతి గ్రామ సచివాలయానికి సంబంధిత ఏఎన్ఎంల ద్వారా చేరవేసి, ప్రతి పిల్లవాడితో పాటు  19 ఏళ్ల వయస్సులోపు గల వారందరికీ అందేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. 

పి.హెచ్.సిలకు కేటాయించిన లక్ష్యాలను సాధించని కొరిగాం, నిమ్మాడ. తాడివలస, గుప్పిడిపేట. సైరిగాం, జి.సిగడాం వైద్యాధికారులు ఇకపై వెనుకంజలో ఉండరాదని, వెనుకంజలో ఉన్నవారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పి.హెచ్.సి వైద్యాధికారులు తమకు అప్పగించిన లక్ష్యాలను తూ.చ తప్పకుండా శతశాతం సాధించాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రతి రోజూ ఉదయం 09.00గం.ల నుండి సాయంత్రం 04.00గం.ల వరకు పి.హెచ్.సి వైద్యాధికారులు అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. 

బయోమెట్రిక్ తప్పనిసరి అని, లేనివారిపై  చర్యలు తీసుకుంటామని ఉద్భోదించారు. ప్రతి బిడ్డకు, గర్భిణీ స్త్రీలకు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందేటట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ఆశావర్కర్, ఏఎన్ఎం ఖచ్చితంగా ఫీవర్ సర్వే చేయాలని, సర్వేలో జ్వరం లేదా టి.బి కేసులు ఉన్నట్లయితే వారికి దగ్గరలోని ప్రాథమిక లేదా సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సూచించారు. విలేజ్ క్లినిక్ లో పనిచేస్తున్నఎం.సి.హెచ్.పిలు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషిచేయాలన్నారు. ప్రతి పి.హెచ్.సిలో ఎల్.టిలు క్షయ వ్యాధి కేసులను గుర్తించి, వారికి  కెల్ల పరీక్షలు నిర్వహించి నిర్ధారించిన పిదప వారిని క్షయవ్యాధి నివారణ కేంద్రానికి తరలించాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సిలో అన్నిరకాల మందులు నిల్వ ఉండేటట్లు చూసుకోవాలని, మందుల కోసం సంబంధిత ప్రోగ్రామ్ అధికారుల ద్వారా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండి పొందాలని తెలిపారు. 

మందుల అవసరాలను బట్టి ఎప్పటికపుడు మందులు తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని, డి.ఐ.ఓ విభాగం నుండి సిరంజీలు, కాటన్ పొందాలన్నారు. గర్భిణీ స్త్రీల నుండి పుట్టబోయే బిడ్డ వరకు ప్రభుత్వం అందిస్తున్నపథకాలను అందించాలని, అలాగే వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో సేవలు పొందుతున్న గర్భిణీలు, పిల్లలకు తప్పనిసరిగా గుర్తింపు నెంబరును కేటాయించాలని, పొగాకు, గుట్కా వంటి వాటిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏ.ఎన్.ఎంలకు ట్యాబులు వచ్చాయని, వాటిని సెప్టెంబర్ 12,13వ తేదీల్లో పంపిణీచేయనున్నట్లు చెప్పారు. వాటి సహాయంతో ప్రతి ఏఎన్ఎం అభయ ఐ.డిని కేటాయించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.ఎన్.అనూరాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ.డి.టి జె.కృష్ణమోహన్, పరిపాలన అధికారి సువర్ణ, డి.ఎం.ఓ సత్యనారాయణ, డి.పి.ఎం.ఓ వి.వి.అప్పలనాయుడు, జిల్లా మాస్ మీడియా అధికారి పి.వెంకటరమణ, పి.హెచ్.సి, సి.హెచ్.సిల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2022-08-30 10:19:33

2024నాటికి ప్రతీ ఇంటికీ సురక్షిత మంచినీరు

ప్ర‌తి గ్రామంలో 2024 నాటికి అన్ని ఇళ్లకు సుర‌క్షిత మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో అమ‌ల‌వుతున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు గ్రామ‌స్థాయి నీరు, పారిశుద్ధ్య క‌మిటీలు కీల‌క‌పాత్ర పోషించాల్సి ఉంటుంద‌ని జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం కాకినాడ జెడ్‌పీ స‌మావేశ మందిరంలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌పై ఇంప్లిమెంటేష‌న్ స‌పోర్ట్ ఏజెన్సీ (ఐఎస్ఏ) ప్ర‌తినిధుల‌కు వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి ఇంటికీ సుర‌క్షిత తాగునీటిని అందించి.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించి, వారికి అవ‌గాహ‌న క‌ల్పించి భాగ‌స్వాముల‌ను చేసి మిష‌న్ విజ‌య‌వంతానికి మ‌ద్ద‌తు సంస్థ‌లు, అధికారులు స‌మ‌న్వ‌యంలో ప‌నిచేయాల‌ని సూచించారు. 

వివిధ ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా ఎప్పుడూ ముందుంటోంద‌ని.. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మం అమ‌ల్లోనూ జిల్లా ముందుండేలా కృషిచేయాల‌ని సీఈవో సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ నీటి స‌ర‌ఫ‌రా ప‌థకం కోసం గ్రామీణ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక (వీఏపీ)ను రూపొందించ‌డం, నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించ‌డం, యాజ‌మాన్యీక‌రించ‌డం, అమ‌లు చేయ‌డం వంటి వాటిలో గ్రామ నీరు, పారిశుద్ధ్య క‌మిటీలు కీల‌క‌పాత్ర పోషించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. గ్రామ అవ‌స‌రాలు, వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌, ప్ర‌జా భాగ‌స్వామ్యం, హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ గ్రామాలుగా ప్ర‌క‌ట‌న త‌దిత‌ర విష‌యాల‌పై స‌పోర్ట్ ఏజెన్సీలు అవ‌గాహ‌న పెంపొందించుకోవాల‌న్నారు. ఇంప్లిమెంటేష‌న్ స‌పోర్ట్ ఏజెన్సీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త వీరాస్వామి.. వ‌ర్క్‌షాప్‌లో మిష‌న్ ల‌క్ష్యాలు, గ్రామ నీరు, పారిశుద్ధ్య క‌మిటీల కూర్పు, బాధ్య‌తలు; గ్రామస్థాయి ప్ర‌ణాళిక‌లు, నీటి నాణ్య‌త ప‌రీక్ష‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్రజా భాగ‌స్వామ్యం త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఈఈ వి.గిరి, ఇత‌ర ఇంజ‌నీరింగ్ అధికారులు, ఎన్‌జీవోల ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-08-30 09:59:57

మ్రుతులకు రూ.40లక్షలు ప్రభుత్వ ఉద్యోగం

వాకలపూడి పారిశ్రామికవాడలో సోమవారం ప్యారీ షుగర్స్ రిఫైనరీ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇరువురు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ  60 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. ప్యారీ షుగర్స్ సంస్థ యాజమాన్యంతో కాకినాడ  ఆర్డిఓ, కాకినాడ డిఎస్పి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కార్మిక సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో  సోమవారం రాత్రి జరిపిన చర్చలలో మృతుల కుటుంబాలకు ఒక్కక్కరికీ రూ.40 లక్షల పరిహారం, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్ ద్వారా మరో 5 లక్షలు సొమ్మును చెల్లించేందుకు సదరు సంస్థ ఒప్పంద అంగీకారం సమర్పించిందన్నారు.  ఈ మేరకు  ఈ దుర్ఘటనలో మరణించిన రాగం ప్రసాద్ (37సం.), తండ్రి రాగం రాంబాబు, రంగప్పచెరువు, గొల్లప్రోలు మండలం, మరోక వ్యక్తి పేరూరి సుబ్రమణ్యేశ్వరరావు (33 సం.), తండ్రి సత్యన్నారాయణ, వట్రపూడి, కె.గంగవరం మండలం కుటుంబాలకు  ఒక్కక్కరికీ కంపెనీ అందించే 45 లక్షల పరిహారం, వర్క్సుమెన్ కాంపేషేషన్ చట్టం క్రింద 10 లక్షలు, వై.ఎస్.ఆర్.భీమా పధకం క్రింద 5 లక్షలు వెరసి మొత్తం 60 లక్షలు పరిహారం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే నిబంధన మేరకు మృతుల కుటుంబాల్లోని ఒకరికి కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకరించిందన్నారు.

అలాగే సోమవారం జరిగిన ప్రమాదం నేపద్యంలో ప్యారీ షుగర్  రిఫైనరీ సంస్థలో ప్రమాణిక రక్షణ చర్యలు పాటించకుండా ఆపరేషన్స్ కొనసాగించడం వల్ల కార్మికుల భద్రతకు ముప్పు ఉన్నందున, ఫ్యాక్టరీస్ చట్టం-1948, ఏపి ఫ్యాకరీస్ రూల్స్-1950 లోని సెక్షన్ 40(2) ప్రకారం ధర్డ్ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును దృవీకరించి, తదుపరి ఉత్తర్వులు జారీ చేసి వరకూ పారీ షుగర్స్ సంస్థలో ఆపరేషన్స్ అన్నిటినీ నిలిపి వేస్తూ ఫ్యాకరీస్ శాఖ ద్వారా పొహిబిటరీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

Kakinada

2022-08-30 09:52:24

రాజరాజ నరేంద్రుని కోసం అందరికీ తెలియాలి

రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన శ్రీ రాజారాజా నరేంద్రుడు పాలనను భవిష్యత్తు తరాలకు అందించే వారు చేసిన శాసనాలను ఫోటో ఫ్రేమ్ చెయ్యడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ట్రైనింగ్ కళాశాల ప్రొఫెసర్ డా ఆర్ వి వి రాజా గోపాలా చార్యులు కలెక్టరేట్ లో ప్రదర్శనగా ఉంచేందుకు కలెక్టర్ కు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ప్రొఫెసర్ గోపాలచార్యులు మన దేశ, మన ప్రాంత చారిత్రక ఆధారాలను సేకరించి ఒకే ఫ్రేమ్ గా రూపొందించి, వాటిని అందచెయ్యడం పట్ల కృషి చేసిన తీరు ఎందరికో ఆదర్శం అన్నారు. వెయ్య సంవత్సరకాలం నాటి చారిత్రక ఆధారాలు సేకరించడం ఒక ఎత్తైతే వాటిని ఒకటి గా రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఫ్రేమ్ ను కలెక్టరేట్ లో ప్రజల సందర్శన కోసం ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 

ఈ సందర్భంగా సంబందించిన వివరాలు డా.ఆర్.వి.వి.రాజా గోపాలాచార్యులు తెలియచేస్తూ, 1912 వ సంవత్సరం లో జయంతి రామయ్య గారు ఆనాడు  శ్రీ రాజారాజా నరేంద్రుడు పాలనకు చెందిన చారిత్రక ఆధారాలతో ఒక ప్రచురణ చెయ్యడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరాన్ని తూర్పు గోదావరి జిల్లా కి ప్రధాన కార్యస్థానంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కలెక్టరేట్ కి బహూకరించడం జరిగిందన్నారు. ఇందులో ఆనాటి రాజ్యాభిషేకం సందర్భంగా శిలా శాసనం లో పేర్కొన్న సంగతులతో ఫోటో ప్రేమ్ తన స్వంత అభిలాష తో తయారు చేసి అందజేసినట్లు తెలిపారు. ఈ శాసన రాగి పత్రాలలో  ఆనాటి చారిత్రక ఆధారాలు పొందుపరిచామని పేర్కొన్నారు.

Rajamahendravaram

2022-08-30 08:39:07