1 ENS Live Breaking News

డిసెంబర్ నాటికి 2744 టిడ్కో ఇళ్లు సిద్ధం

పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేయాలన్న ప్రభుత్వ సంకల్పం సాకారం కాబోతోంది. అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 160 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న టిడ్కో ఇళ్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అనకాపల్లి  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇళ్లు లేని పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న సంకల్పించారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనకాపల్లి జిల్లాలో  టిడ్కో ఇళ్లను ఒక ఉద్యమంగా చేపట్టి అర్హులైన వారందరికీ అందించాలని మంత్రి అమర్నాథ్ ఆదిశగా అడుగులు ముందుకు వేశారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురంలో 2744 టిడ్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి కానుంది. ఇక్కడ పనులను మంత్రి అమర్ నాథ్ సోమవారం స్వయంగా పరిశీలించారు.

 సంబంధిత అధికారులతో సమావేశమై నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. 2744 ఇళ్లలో 300 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 2292 ఉన్నాయి. 365 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 96, 430 ఎస్.ఎఫ్.టి ఇళ్లు 365 వున్నాయి.  వీటిలో 1352 మందికి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు మంత్రి అమరనాథ తెలియజేశారు. సుమారు 136.67 కోట్ల  రూపాయలతో 29 ఎకరాల్లో  ఈ ఇళ్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 95 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మరో రెండు మూడు నెలల్లో మౌలికసదుపాయాల పనులు పూర్తవుతాయని అధికారులు మంత్రి తెలియజేశారు. మౌలిక సదుపాయాలకు 18.6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశామని, మురుగునీరు పోయేoదుకు నాలుగు కోట్ల రూపాయలతో సివరేజ్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పూర్తిగా అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని, ఇల్లు తీసుకోవడానికి ఎవరైనా ముందుకు రాకపోతే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి, ఇక్కడ ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించారు.

Anakapalle

2022-08-29 13:36:09

స్పందనకు హాజరుకాకపోతే చర్యలు తప్పవు

పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన  స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు భావన ప్రజలనుండి వినతులు స్వీకరించారు.  ప్రజల సమస్యలను సంబంధిత జిల్లా అధికారులకు నేరుగా అందజేసి  త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ   ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని , స్పందన ప్రజల హృదయ స్పందనగా భావించి వాటి పరిష్కారంలో చొరవ చూపాలన్నారు.  ఆర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా మాట్లాడాలని తద్వారా వారి సమస్య పూర్తిగా అర్థం అవుతుందని, ప్రతి సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  సంయుక్త కలెక్టరు ఒ.ఆనంద్  మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, నిర్లక్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా స్పందన కార్యక్రమానికి  ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వినతులు అందజేసారు. 118 వినతులు అందాయి. 

2022-08-29 13:27:34

ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి

తెలుగు ఆధునిక భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జయంతి సంధర్బం గా  "తెలుగు భాషా దినోత్సవం" సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి  జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టరు ఒ. ఆనంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేట గ్రామంలో జన్మించిన  గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగుబాషాభివృద్దికి విశేషకృషిచేసారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసిగా వ్యవహారిక భాషా ఉద్యమానికి ముఖ్యంగా సవర, గిరిజన బాషల అభివృద్దికి అవిశ్రాంతంగా కృషిచేసారని తెలిపారు. 

  అన్ని శాఖల అధికారులు తెలుగు భాషను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాద్యాయులు మరియు కవులు తెలుగుబాషాభివృద్దికి కృషిచేసిన  బెళగం భీమేశ్వరరావు,  చింతా అప్పలనాయుడు లను జిల్లా కలెక్టర్  నిశాంత్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు భావన, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఉమామహేశ్వరరావు,  జిల్లా అధికారులు, కలెక్టరు కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

Parvathipuram

2022-08-29 13:21:01

విజయనగరం స్పందనకు 212 దరఖాస్తులు

విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం  నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 212 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 09, డి.ఆర్.డి.ఏ కు 20, అందగా అత్యధికంగా   రెవిన్యూ కు సంబంధించి 143 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు,   ఉప కలెక్టర్లు సుదర్శన  దొర, సూర్యనారాయణ, స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారం లో నాణ్యత ఉండేలా చూడలంబరు.   అర్జీదారు తో మాట్లాడి వారికి సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వాలని ఆదేశించారు.  అప్పుడు మాత్రమే రీ ఓపెన్ లోకి వెళ్లకుండా డిస్పోజల్  అవుతుందని అన్నారు.  సమాధానానికి తగు ఫొటోగ్రాఫ్ ను కూడా అప్లోడ్ చేయాలన్నారు.  ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు. అధికారులు స్పందన లాగిన్ లో స్వయంగా వినతులు పరిశీలించి, సమాధానం నాణ్యత ఉండేలా పరిష్కారం చేయా లన్నారు. అనంతరం  స్పందన లో వికలాంగుల శాఖ ద్వారా శరీరీక వికలాంగునుకి రూ . 40 వేల  విలువ గల లాప్టాప్ ను కలెక్టర్ అందజేశారు. వివిధ జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 13:14:12

చవితి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలి

విజయనగరం జిల్లాలో వినాయక నిమజ్జన సమయంలో భద్రత దృష్ట్యా ప్రతి సంవత్సరం సూచనలు ఇచ్చినట్లే కొన్నిఈ ఏడాదికి కూడా ఇచ్చినట్టు  జిల్లా కలెక్టర్ సూర్య  కుమారి సోమవారం ఒక ప్రకటన లో  పేర్కొన్నారు.  భద్రత దృష్ట్యా ఎప్పటిలాగే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కలెక్టర్  గుర్తు చేశారు. వినాయక విగ్రహ ప్రతిష్ట సందర్బంగా కొన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.  వినాయక విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకోదలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని,  ఫైర్, విద్యుత్ శాఖల అనుమతితో పాటు వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు, మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసారు.  నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం,  విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను కూడా  దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అన్నారు.

 పోలీసులు అనుమతించిన నిమజ్జన మార్గాలలోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలని, పందిళ్ళు, మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం ఇతరులకు ఇబ్బంది కలగకుండా  స్పీకర్లను ఉపయోగించాలని తెలిపారు.  ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలని,  మండపాల వద్ద క్యూ లను మేనేజ్ చేసే భాద్యతను పోల్లీసు శాఖ తో పాటు ఆర్గనైజయింగ్ కమిటీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం ఉందని స్పష్టం చేసారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలని,  వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో వేషధారణలు, డీజే వంటివాటికిపైన ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, పోలీసు సిబ్బంది సైతం నిమజ్జన కమిటీలతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్  సూచించారు.

Vizianagaram

2022-08-29 13:10:12

స‌చివాల‌యాల్లో 2రోజులు ఈ-శ్ర‌మ్ రిజిస్ట్రేష‌న్

అసంఘ‌టిత రంగ కార్మికుల ప్ర‌యోజ‌నార్థం కేంద్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-శ్ర‌మ్ ప‌థ‌కంలో చేరేందుకు ఇంకా రిజిస్ట్రేష‌న్ చేయించుకోనివారి కోసం ఆగ‌స్టు 30, 31వ తేదీల్లో ప్ర‌త్యేకంగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌త్యేకాధికారి బాలాజీ తెలిపారు. ఈ ప‌థకంలో చేర‌టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టే అన్ని పథకాలను పొంద‌వ‌చ్చ‌ని, ప్ర‌మాదాలు లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల చ‌నిపోయిన వారికి రూ.2 ల‌క్ష‌ల ఆర్థిక సాయంతో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు పొంద‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. కావున జిల్లాలోని అసంఘటిత రంగంలో ప‌ని చేస్తున్న‌ వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, వాలంటీర్లు, కొరియర్ బాయ్స్, చిల్లర వర్తకులు, తోపుడు బండి వర్తకులు, పాల వ్యాపారులు, చేతి వృత్తి పనివారు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, ఉపాధి కూలీలు, మహిళా సంఘాలకు చెందిన స‌భ్యులు త‌దిత‌రులు స‌మీపంలోని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాల‌ని ఆయ‌న సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న ద్వారా  కోరారు. మొబైల్ నెంబ‌ర్‌తో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా మొద‌టి పేజీ జెరాక్సు కాపీల‌ను స‌చివాల‌యంలో అంద‌జేయాల‌ని సూచించారు.

Vizianagaram

2022-08-29 13:01:53

నులిపురుగుల దినోత్సవంపై అవగాహన

విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 8,9 తేదీలు లో జరిగే నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమన్నీ పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో విజయవంతం అయ్యేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు పనిచేయాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె ఛాంబర్ లో డి-వార్మింగ్ కార్యక్రమం పై జిల్లా ప్రాధమిక ఆరోగ్య కేంద్రల్లో ఉండే మెడికల్ ఆఫీసర్లు తో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ ఆఫీసర్లు ఆయా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో ఉండే పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడి కేంద్రాల్లో ఉండే టీచర్లు, లైన్ డిపార్ట్మెంట్లు తో ఏ.ఎన్. ఎం. , ఆశా వర్కర్స్ సహాయం తీసుకొని ప్రేత్యేక అవగాహన సమావేశం నిర్వహించాలని తెలిపారు. 

అలాగే ఒకటవ ఏడాది పిల్లలు నుండి 19 ఏళ్ళు వయసు కలిగిన పిల్లలు వరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి టీచర్ పర్యవేక్షణ లో
అల్బెన్డ్ జోల్ మాత్ర మింగకుండా, చప్పరించే విధంగా చూడాలి అని తెలిపారు. ఈ మాత్రలు ఆరోగ్యం బాగోలేని వారికి, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారికి వెయ్యదు అని తెలిపారు. సెప్టెంబర్ 8,9 తేదీల్లో  అనివార్య కారణాలు వల్ల రాలేని వారికి , తిరిగి సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరిగే మాప్ అప్ డే లో మాత్రలు వెయ్యాలి అని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు చేతికి మాత్రలు ఇవ్వవద్దు అని, అంగన్ వాడి , పాఠశాల, కళాశాలలో మాత్రమే వెయ్యాలి అని తెలిపారు.   ప్రతి పి.హెచ్.సి లో అల్బెన్డ్ జోల్ మాత్రలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి అని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.బి.ఎస్.కె. ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ పి.రవి కుమార్, డి.ఈ.ఐ.సి. మేనేజర్ లోకనాధ్, తదితరులు పోల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 12:59:20

విశాఖలో ఘనంగా తెలుగుభాష జయంతి..

దేశంలో ఎన్ని భాషలు వాడుకలో  ఉన్న తెలుగు భాష తియ్యదనం కలిగిన భాష అని జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున  అన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఉడా చిల్డ్రన్ ధియేటర్ లో  తెలుగు భాషా దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  జిల్లా కలెక్టర్  డా. ఏ మల్లిఖార్జున పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యాన్ని సరళీకరించి,  తెలుగు భాష తీయ్యదనాన్ని సామాన్యునికి చేరేలా కృషి చేసిన మహోన్నత వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులుగారన్నారు. తెలుగు భాష సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా  నిలిచిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. పాఠశాలల్లో, విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు 5 నిమిషాల పాటు ఇంగ్లీషు పదాలు  ఉపయోగించకుండా  మాట్లాడటం, వ్రాయడం వంటి  కాంపిటీషన్స్ నిర్వహించాలన్నారు. ప్రజలు సందర్శించే ప్రదేశాల్లో తెలుగు లో  హోర్డింగులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తెలుగు అధికార భాష సంఘం అద్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ గ్రాంధిక భాష నుండి సంకెళ్ళు విడిపించి తెలుగు భాష  సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో  వాడుకలోకి తీసుకురావడానికి కృషి చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అన్నారు. ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం అన్నారు. భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి  శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశంలో హిందీ తర్వాత తెలుగు భాష చరిత్ర కలిగిన భాష అని అన్నారు. ఎంతో మంది కవులు, కళాకారులు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఇతర భాషలు  ఎన్ని నేర్చుకున్నా, తెలుగు భాష కమనీయ తియ్యదనం మర్చిపోకూడదన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ముని మనుమడు గిడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రాంధిక భాష లో విద్యనభ్యసించినచో సామాన్య ప్రజలకు అర్థం కాదని, పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో వాడుకలోకి తెలుగు భాష తీసుకు రావడానికి గిడుగు - పిడుగై సపళీకృతం కాగలిగారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు ఉన్నంత కాలం తెలుగు భాష ఉంటుందని తెలిపారు.

అంతకు ముందు  జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరగా  రాష్ట్ర స్థాయి లో తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన 44 మంది మహనీయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో  ఎ యూ  వైస్ ఛాన్సలర్ ప్రసాదరావు, ఉడా  చైర్ పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, జెడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర , ఎమ్ ఎల్ సి వరుదు కళ్యాణి,  వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు  కెకె రాజు, చొక్కాకుల లక్ష్మి, మధుసూదనరావు, వంగపండు ఉష, కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జున రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-29 10:35:03

తెలుగు మాధుర్యాన్ని అందించిన గిడుగు

పండితులకు మాత్రమే పరిమితమైన భాషను ప్రజలందరి వాడుక భాషగా రూపుదిద్దేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు, సంస్కర్త గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేషు అన్నారు. తెలుగుభాషతో పాటు సవర లిపి కనుగొని భాషోధ్యమానికి చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహుదూర్ అని బిరుదాకింతులు పొందిన కీర్తి గిడుగు సొంతమన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు నూతన విగ్రహాన్ని కమిషనర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మాధుర్యాన్ని సామాన్య ప్రజల చెంతకు చేర్చిన ఘనత గిడుగుదే అన్నారు. సరుబుజ్జిలి మండలం పర్వతాల పేటకు చెందిన గిడుగు ఖ్యాతి తెలుగు భాష మాదిరిగా ఖండాంతరాలు వ్యాపించిందన్నారు. 

ప్రభుత్వం మాతృభాషలోని పరిపాలన ప్రజలకు అందించే దిశగా ఎన్నో చర్యలు చేపట్టిందని కమిషనర్ వివరించారు. ప్రజల భాష ఎప్పుడూ సజీవంగా ఉండేందుకు పౌర సమాజం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పరిపాలనలో తెలుగు భాష వాడకం పెరిగిందని కమిషనర్ తెలిపారు. జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, మేనేజర్ రమణ బృందం గిడుగు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విగ్రహదాత, హిందీ ఉపాధ్యాయులు మందపల్లి రామకృష్ణను కమిషన  పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సత్కరించారు. అలాగే తెలుగు తల్లి వేషధారణలో గాయత్రీ, నృత్య శిక్షకురాలు సుశీల బృందాన్ని మెమెంటో ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర సమన్వయ బృందం సురంగి మోహన్‌రావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్, మహిబుల్లాఖాన్, పొన్నాడ రవికుమార్, మెట్ట అనంతంభట్లు, నక్క శంకరరావు, గుత్తు చిన్నారావు, నిక్కు హరిసత్యనారాయణ, తర్జాడ అప్పలనాయుడు తదితరులున్నారు.

Srikakulam

2022-08-29 07:25:40

తెలుగుభాష గొప్పతనం చాటిచెప్పిన గిడుగు

తెలుగు భాష ప్రాశ‌స్త్యాన్ని ప్ర‌పంచ దేశాల‌కు చాటి చెప్ప‌టంలో.. తెలుగు భాష‌ ఔన్న‌త్యాన్ని కాపాడ‌టంలో విశేష‌మైన పాత్ర పోషించిన మ‌హ‌నీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. నిత్యం జీవితంలో వినియోగించే భాష‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేస్తూ సుల‌భ‌త‌ర రీతిలో ర‌చ‌న‌లు సాగించిన ఘ‌నుడు అని కీర్తించారు. తెలుగు భాషకు ఒక అంద‌మైన భావాన్ని తీసుకొచ్చి ప్రాముఖ్య‌త‌ను పెంచ‌టంలో ఎన‌లేని కృషి చేశార‌ని కొనియాడారు. తెలుగు వ్య‌వ‌హారికా భాషోద్య‌మ పితామ‌హుడు గిడుగు రామ్మూర్తి పంతులు జ‌యింతిని పుర‌స్క‌రించుకొని క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం తెలుగు భాషా దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. గిడుగు రామ్మూర్తి పంతులు చిత్ర‌ప‌టానికి క‌లెక్ట‌ర్, డీఆర్వో, ప్ర‌త్యేక ఉప‌క‌లెక్ట‌ర్లు, జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాష ఔన్న‌త్యాన్ని కాపాడ‌టంలో పోషించిన పాత్ర గురించి.. చేసిన కృషి గురించి వివ‌రించారు. ఆయ‌న‌కు స్పందించే గుణం ఎక్కువ అని అందుకే ప్ర‌జ‌లు వినియోగించే వాడుక ప‌దాల ఆధారంగా ఎన్నో ర‌చ‌న‌లు చేశార‌ని గుర్తు చేశారు. స‌వ‌ర భాష‌పై ప్ర‌త్యేక‌మైన ప‌రిశోధ‌న చేసి దానికి ప్ర‌త్యేక గుర్తింపును క‌ల్పించార‌ని చెప్పారు. రామ్మూర్తి పంతులు చేప‌ట్టిన‌ ఉద్యమం వల్ల కొంద‌రికే పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింద‌ని వివ‌రించారు. ఆయ‌న జీవిత‌మంతా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే సాగింద‌ని గుర్తు చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులును ఆద‌ర్శంగా తీసుకొని ఈ రోజు నుంచి మ‌నంద‌రం సాధ్య‌మైనంత మేర‌కు తెలుగు భాష‌లోనే ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌రుపుదామ‌ని ఈ సంద‌ర్భంగా కలెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఆక‌ట్టుకున్న చిన్నారుల ప్ర‌ద‌ర్శ‌న‌
గిడుగు రామ్మూర్తి పంతులును అభిన‌యిస్తూ సంగీత క‌ళాశాల‌ విద్యార్థులు చేసిన ప్ర‌ద‌ర్శ‌న చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంది. తెలుగు భాషకు గిడుగు చేసిన కృషిని తెలుపుతూ ప్ర‌ద‌ర్శ‌న సాగింది. చిన్నారుల‌ను క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ప్ర‌త్యేకంగా అభినందించారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డీఆర్వో గ‌ణ‌పతిరావు, ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు సూర్య‌నారాయ‌ణ రాజు, సుద‌ర్శ‌న దొర‌, జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి ర‌మేశ్‌, జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-29 06:59:47

జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో మెలగాలి

వర్కింగ్ జర్నలిస్టులు చేస్తున్న వ్రుత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు అవసరమైన మెళకువలను నేర్చుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి, వాస్తవాలను త్వరిగతిన ప్రజలకు చేరవేయడానికి ఆస్కారం వుంటుందని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పూర్వ ఉప కులపతి ఆచార్య బాల మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. ఆదివారం అల్లూరి సీతారామజరాజు స్మారక విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  నిర్వహించిన ఒక రోజు పునఃశ్చరణ  తరగతులులో ఆచార్య వి. బాలమోహన్ దాస్ మాట్లాడుతూ, పలు అంశాలను ప్రస్తుతించారు. జర్నలిస్టులు అంకిత భావం, సమయపాలన పాటించడం అలవాటు చేసుకోవాలన్నారు. చేస్తున్న పనిలో మరింత విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను కలిగి ఉండాలన్నారు. దానిని ఆచరణలో అమలు చేసుకుని స్వీయ వృద్ధిని సాధించుకోవాలన్నారు. రాసే వార్తా కథనాలు, న్యూస్ అన్ని పత్రికల్లోనూ ఒకే రీతిగా ఉండకూడదనీ చెప్పారు. అలా ఉంటే కాపీ న్యూస్ పాఠకులు భావించే అవకాశం ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు తమని తాము సాంకేతికత పరంగా వృద్ధి చేసుకోవాలన్నారు. స్మార్ట్ సిటి రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, చాలా కాలంగా అనుకుంటున్న వర్కింగ్ జర్నలిస్టులకు పునశ్చరణ తరగతులు ఎన్ఎన్ఆర్ సహకారంతో నిర్వహించినట్లుగా చెప్పారు. ఈ వర్కు షాప్ నిర్వహణ సాటి జర్నలిస్టుగా, నిర్వాహక సంస్థ వ్యవస్థాపకునిగా తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు విధి నిర్వహణలో నైపుణ్యాలనూ, మెళకువలనూ తెలిపే వర్కుషాపుల నిర్వహిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వర రావు  మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహించడం ప్రభుత్వం చేసినట్లుగా బంగారు  అశోక్ కుమార్  రూపొందించారన్నారు. నెల రోజుల కృషి ఫలితం ఇందులో ఉందన్నారు. నిధుల సమీకరణ మొదలు అనేక ప్రయాశలకు ఓర్చి అధ్యక్షులు అశోక్ కుమార్ వహించిన పాత్ర.. విజయం వర్ణించలేనిదన్నారు. 

నూరు శాతం ప్రయోజనాత్మక  వర్కుషాప్..
ఒక రోజు కార్యశాలలో పలువురు జర్నలిజం ఉద్దండులు తమ ప్రజ్ఞాపాటవాలతో  చైతన్య దీప్తిలుగా నిలిచారు. అయిదు అంశాల్లో అయిదుగురు ఉద్దండులైనా లబ్ధప్రతిష్టులతో నిర్వాహకులు ఏర్పాటు చేసిన గెస్టు లెక్చర్స్ ప్రతి జర్నలిస్టుకూ తమ రంగంలో కొత్త ఉత్సాహాన్ని మార్గదర్శకత్వంను నింపింది. తొలుత ప్రారంభ ఉపన్యాసం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విశ్విద్యాలయం శ్రీకాకుళం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ రెడ్డి తిరుపతిరావు వర్త రచన, చట్ట నింబంధనలు, క్రైం న్యూస్ సోషల్ మీడియాలో ఎదురవుతున్న సవాళ్లుపై ప్రసంగించారు. జర్నలిజం బోధకులు, సామాజిక పరిశోధకులూ, నవ  రచయిత డాక్టర్ జికెడి ప్రసాద్ తెలుగు జర్నలిజం నూతన ఆవిష్కరణలు అంశంపైనా,   విజయవాడ నుంచి వచ్చిన సీనియర్ పాత్రికేయులు బి.నగేష్ ఎలక్ట్రానిక్ మీడియాకు వార్తలు రాయడం ఎలా, సవాళ్లు పరిష్కారాలు అంశంపై విశ్లేషనాత్మక ప్రసంగం చేశారు. వార్త రచనలో నూతన పోకడలూ పత్రికలు, టెలివిజన్ మీడియాలపై ప్రభావం అంశం పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ జి. లీలా వర ప్రసాదరావు ప్రసంగించారు. చివరిగా వార్తలు సేకరణ, రచన, భాష, పత్యేక విభాగాలు (బీట్) అంశంపై విశాఖపట్నం రచయిత, సీనియర్ పాత్రికేయులు ఎన్ నాగేశ్వర రావు (ఎన్ఎన్ఆర్ఆ) వివరించారు. అనంతరం బాదంగీర్ సాయి వంటి జర్నలిస్టులు తమ ప్రస్తానం గురించి వివరించారు. కార్యక్రమం నిర్వహణలో కార్యవర్గ సభ్యులూ భాగం అయ్యారు. ఏకబిగిన సాగిన ఈ వర్కుషాప్ లో పాల్గొన్న పాత్రికేయులకు సర్టిఫికేట్లను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వి. విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన వార్తల ప్రజెంటేషన్ తీరు తెన్నులు పాటించాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.

Visakhapatnam

2022-08-28 16:26:08

పులి దాడిలో ఆవుల‌కు ప‌రిహారం పంపిణీ

పులి దాడిలో మృతి చెందిన రెండు ఆవుల‌కు రూ.35,000 ప‌రిహారంగా అంద‌జేసిన‌ట్లు జిల్లా అట‌వీ అధికారి ఎస్‌.వెంక‌టేష్ తెలిపారు. గ‌జ‌ప‌తిన‌గ‌రం శాస‌న‌స‌భ్యులు బొత్స అప్ప‌ల‌నర‌స‌య్య  ఆవుల‌ను కోల్పోయిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు చెక్కు రూపంలో ఆదివారం ఈ స‌హాయం అంద‌జేశామ‌ని పేర్కొన్ంనారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి పులి బోను ర‌ప్పించామ‌న్నారు. వైల్డ్ లైఫ్ రెస్క్యూ వ్యాన్ కూడా జిల్లాలో అందుబాటులో వుంచామ‌న్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పులికి సంబంధించి ఒక ప‌రిష్కారం ల‌భించ‌గ‌ల‌ద‌ని క‌న్స‌ర్వేట‌ర్ ఆశాభావం వ్య‌క్తంచేశారు. ఎవరూ దిగాలు చెందాల్సిన పనిలేదని..పులిని పట్టుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకున్నట్టు అటవీశాఖ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంతో విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-28 16:15:23

ఆ ప్రాంతంలో ఒంటరిగా తిరగడం ప్రమాదం

విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచి పులి త‌న ఆవాసాల‌కు చేరే వ‌ర‌కు ప్ర‌జ‌లు సంయ‌మ‌నంతో వుంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని విశాఖలోని అట‌వీ సంర‌క్ష‌ణాధికారి(క‌న్స‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్‌) పి.రామ్మోహ‌న రావు కోరారు. ముఖ్యంగా పులి రాత్రి వేళ‌ల్లో తెల్ల‌వారు ఝామున సంచ‌రించే అవ‌కాశం వుంద‌ని, నాలుగు కాళ్ల జంతువుల‌ను ఆహారంగా తీసుకుంటుంద‌ని అందువ‌ల్ల పులి సంచ‌రించే ప్రాంతాల్లో ప్ర‌జ‌లు రాత్రివేళ‌ల్లో ఆరుబ‌య‌ట సంచ‌రించ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరారు. జిల్లా అట‌వీ అధికారి ఎస్‌.వెంక‌టేష్‌, పార్వ‌తీపురం స‌బ్ డివిజ‌న‌ల్ అట‌వీ అధికారి బి.రాజారావుల‌తో క‌ల‌సి ఇటీవ‌ల పులి సంచ‌రించిన పులిగుమ్మి, షికారుగంజి గ్రామాల‌ అట‌వీ ప్రాంతం, ప‌రిస‌ర గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప‌ర్య‌టించి పాద‌ముద్ర‌లు ప‌రిశీలించారు. ఆయా గ్రామాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారికి జాగ్ర‌త్త‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పులి స్వ‌త‌హాగా బిడియ స్వ‌భావం క‌లిగిన జంతువ‌ని, మ‌నుషుల నుంచి సాధ్య‌మైనంత దూరంగా వుండ‌టానికి ప్ర‌య‌త్నిస్తూ క‌న‌ప‌డ‌కుండా వుండేందుకు ఇష్ట‌ప‌డుతుంద‌న్నారు. ఆక‌స్మాత్తుగా మ‌నుషుల ఉనికిని గ్ర‌హించిన‌ట్ల‌యితే పులి దాడిచేసే అవ‌కాశం వుంటుంద‌న్నారు. అందువ‌ల్ల బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌డం, ప్ర‌జ‌లు ఆరుబ‌య‌ట నిద్రించడం, సంచారం లేని ప్ర‌దేశాల్లో ఒంట‌రిగా తిర‌గ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2022-08-28 16:12:47

సమస్యల పరిష్కారానికే మేమున్నది

కాకినాడ 12వ డివిజన్‌ పర్లోపేటలో శుక్రవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి  డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ళ ప్రభుత్వపాలనలో  ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ రూపొందించిన బుక్‌లెట్‌లను ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర మాల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, మేయర్‌ సుంకర శివప్రసన్న సాగర్, కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, అధికారులు, కార్పొరేటర్లు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డివిజన్‌ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో రూ కోటి వ్యయంతో మోడ్రన్‌ ఫిష్‌మార్కెట్‌ యార్డు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ సచివాలయానికి రూ.20లక్షల చొప్పున నిధులు విడుదల చేసేందుకు  ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీని వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ ఇంటికి వెళ్ళి  సమస్యలు తెలుసుకుంటామని ఎలాంటి అంశానైనా పరిష్కరిస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ ఛైర్మన్‌ బెండా విష్ణుమూర్తి,  డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేషన్ కార్యదర్శి ఏసుబాబు, టి పి ఆర్ ఓ కృష్ణమోహన్, డి ఈ మాధవి, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత,  మీసాల శ్రీదేవి, కామాడి సీత,  పినపోతు సత్తిబాబు, గోడి సత్యవతి, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, పలువురు అధికారులు ఉన్నారు.

Kakinada

2022-08-27 13:52:01

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వివిధ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని  వైద్యులను   జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున ఆదేశించారు. శనివారం ఉదయం  స్థానిక ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్ నందు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ అధ్యక్షతన హాస్పిటల్   డెవలప్ మెంట్ సొసైటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కొరకు మెరుగైన వైద్య సేవలు అందించే కార్యక్రమం లో భాగంగా  షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ ఫండ్ నుంచి 10  కంప్యూటర్లు  కొనుగోలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అవసరమైన  అనస్థీషియా మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది   పోస్టుల మంజూరు కొరకై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రతిపాదనలు సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను  ఆదేశించారు. 

 ఆంధ్ర మెడికల్ కాలేజ్ డెవలప్ మెంట్ ఫండ్ నుండి పి.జి రూమ్ మరియు ఈ-లైబ్రరీలను ఆధునీకరించాలని సూచించారు. రోగుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు నాన్-ఎసి రూములకు రూ.400/- ఏసీ రూములు రూ.500/- గా ఉండాలన్నారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ తో మాట్లాడి మహా ప్రస్థానం వాహనం ఏర్పాటు చేసుకోవాలని చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలిపారు. నాడు - నేడు కింద ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రభుత్వ  చెస్ట్ ఆసుపత్రి రోడ్డుకు ఇరువైపులా ఉన్న  చెత్త తొలగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ మెంబర్ డాక్టర్ రవి కుమార్, ఆంధ్ర యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ డి. పుల్లారావు, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి. బుచ్చిరాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె. విజయలక్ష్మి, డాక్టర్ టి రమేష్ కిషోర్, డాక్టర్ సునీల్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-08-27 13:18:21