1 ENS Live Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు

పార్వతీపురంజిల్లాలో రోడ్డు  ప్రమాదాలు జరుగుచున్న ప్రదేశాలలో నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టర్  కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన  జిల్లా  రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రమాద ప్రదేశాలుగా  గుర్తించిన ఆరు ప్రదేశాలలో వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.  బ్లాక్ స్పాట్ లుగా గుర్తించిన ఇరవై ఏడు ప్రదేశాలలో కుడా ప్రమాదాలు నివారణకు తెసుకోవలసిన చర్యల గూర్చి ప్రతిపాదనలు సిద్దం చేయాలని రోడ్డు,భవనాలు శాఖ అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులలో  రోడ్డు సేప్టీపనులను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల అధికారులకు అదేశించారు.   

అనుమతి లేని బ్యాన్లర్లు తొలగించాలని, అటువంటివాటిపై అపరాదరుసుం విధించాలని, అనుమతిలేని బ్యానర్లు, హోర్డింగులను గుర్తించి చర్యలు తీసుకొనుటకు ప్రత్యేక స్క్వాడ్ ను నియమించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. హోటల్లు, డాబాల వద్ద పార్కింగు ఏర్పాట్లుచేయాలని, నిబంధనలు పాటించని వాటిని గుర్తించి  చర్యలు తీసుకోవలసినదిగా  తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా వాహనాలలో మనుషుల ప్రయాణం నిషేదమని, ట్రాక్టర్లు, గూడ్సు వాహనాలలో మనుషుల రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు.   ఆర్.టి.సి. డ్రైవర్లు కొంతమంది నిర్లక్షంగా, దురుసుగా డ్రైవింగు చేయడం గుర్తించడమైనదని అటువంటి వారిని గుర్తించి చర్యలుతీసుకొనుటకు ప్రత్యేకంగా ప్రతిరూటులో పర్యవేక్షకులను నియమించాలని తెలిపారు. ప్రతి 108 వాహనంనకు జి.పి.ఎస్. వ్యవస్థ ఉండాలని తెలిపారు. 

 జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి ఎం . శశికుమార్ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రణాళిక గూర్చి వివరించారు. జిల్లాలో  రోడ్డుప్రమాదాలు జరుగుచున్న ఆరు అత్యంత ప్రమాద, ఇరవైఏడు బ్లాక స్టాట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు.  అక్కడ ప్రమాదాలు జరుగుచున్న కారణాలను గుర్తించటకు , నివారణ చర్యలు చేటట్టుటకు  వివిధశాఖల అధికారులతో కమిటీ వేసి తీసుకోవలసిన చర్యలపై నివేదిక తయారుచేసినట్లు తెలిపారు.  జంగిల్ క్లియరెన్స్ చేయాలని, రోడ్డు సిగ్నల్స్ కన్పించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై కాలేజీలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై గీతలు వేయించాలన్నారు.  ట్రిబుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగు చేస్తున్న వారికి కౌన్సిలింగు నిర్వహించి, అపరాద రుసుము విదిస్తున్నట్లు తెలిపారు. పరిమిత వేగం  మించి వెళ్లుటవలన ఎక్కువ ప్రమాదాలు జరుగుచున్నాయని స్పీడ్ గన్లద్వారా అటువంటివారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. 

అడిషనల్ ఎస్.పి. ఒ. దిలీప్ కుమార్ మాట్లాడుతూ  రాష్ర్టంలో అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో  ఈ జిల్లాలో ఆరు ఉన్నట్లు తెలిపారు. అక్కడ వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్లాక్ స్పాట్ గా గుర్తించిన ప్రదేశాల వద్ద సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయుటద్వారా ప్రమాదం చేసిన వాహనం గుర్తించి చర్యలు తీసుకొనుటకు వీలవుతుందని తెలిపారు. రోడ్డుప్రక్కన పశువులను కట్టకుండా నివారించాలన్నారు. అటువంటి పశువులను తరలించుటకు, సంరక్షించుటకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పాలకొండ డి.ఎస్.పి . ఎం .శ్రావణి  ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్, వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లారీ యూనియన్ నాయకుడు  ఎం .వి.రమణ మాట్లాడుతూ రోడ్లు నిర్వహణ చేపట్టాలని, రోడ్లుపై గుంతలు వలన వాహనములు పాడవుతున్నాయని, నిర్వహణ భారం పెరుగుతుందని కోరగా రోడ్లుభవనాల శాఖ అధికారులను వెంటనే రోడ్డుమరమ్మత్తుపనులు చేపట్టివలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి ఆనంద్, పోలీసు,  రవాణాశాఖ, రోడ్లు, భవనాలు, మున్సిపల్ శాఖ, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-30 08:03:56

ప్రాధాన్యత పనులు సత్వరమే ప్రారంభించండి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనులకు  అక్టోబర్ 5 లోగా మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, అక్టోబర్ చివరికి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం లో స్థిరమైన వృద్ధి సాధించాలన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు జీ ఎస్, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల  నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు - భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా సీ యం సమీక్షిస్తూ  అత్యంత ప్రతిష్టత్మకంగా  చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డ్ సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన పెండింగ్ మరియు  నూతన పనులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి కృషి  తోడ్పాటును అందించాలని  ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనం నిర్మానాలు, ఈ - క్రాఫ్ వంటి విషయంలో జిల్లాలో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు  క్షేత్ర స్థాయిలో  పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టర్ కార్యాలయం  నుండి  జిల్లా కలెక్టర్  పి.  ప్రశాంతి , ఎస్ పి యు. రవిప్రకాష్ , జాయింట్ కలెక్టర్  జె వి మురళి, డి ఆర్ ఓ కె. కృష్ణ వేణి,  పంచాయతీరాజ్ ఎస్ ఈ . శ్రీనివాసరావు, సీపీవో  కె  .శ్రీనివాస్ , జిల్లా హోసింగ్ అధికారి   రామరాజు ,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  జ.వెంకటేశ్వరరావు ,  డ్వామా పి డి, రాజేశ్వరరావు , డి ఎల్ డి వో లు  కె .సి హెచ్ అప్పారావు  తదితరులు  పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-29 13:18:50

నవరత్నాల పథకాలు పూర్తిచేయాలి

నవరత్నాలు పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందించేందుకు జిల్లా కలెక్టర్లు  క్రుషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి సూచించారు. గురువారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  గడప గడపకు మన ప్రభుత్వం లో ఇచ్చిన పనుల మంజూరు ఉత్తర్వులు, ఈ-క్రాప్ నమోదు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్స్ , డిజిటల్ లైబ్రరీ భవనాల  నిర్మాణం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జగనన్న ఇండ్లు, టిడ్కో గృహాలు, జగనన్న భూ హక్కు - భూ రక్షా సర్వే, స్పందన, జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా  చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పరిధి లో ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఇంటింటి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం తో పాటు ఆయా గ్రామాలకు సంబందించిన అవసరమయిన  పనులు మంజూరు చేసి  అభివృద్ధికి   తోడ్పాటు అందించాలన్నారు.  ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మానాలు, ఈ-క్రాఫ్ వంటి విషయాలలో  కలెక్టర్లు,  జిల్లా మండల వ్యవసాయ అధికారులు  క్షేత్ర స్థాయిలో  పర్యవేక్షణ చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అనకాపల్లి నుండి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి జిల్లా ఎస్పీ గౌతమి శాలి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. 

Anakapalle

2022-09-29 13:06:30

ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణతో పెండింగ్ ప‌నులు పూర్తి

విజ‌య‌న‌గ‌రంజిల్లాలో వివిధ ప‌థ‌కాలు, ప్రాజెక్టుల‌కు సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించామ‌ని, ప్ర‌ణాళికాయుతంగా ముందుకెళ్లి నిర్ణీత కాలంలో ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌, వెఎస్సార్ అర్బ‌న పీహెచ్‌సీల నిర్మాణానికి సంబంధించిన పనులు దాదాపు పూర్త‌య్యాయ‌ని మిగిలిన ప‌నుల‌ను త్వ‌రిగ‌తిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ సేవ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. డిజిట‌ల్ లైబ్ర‌రీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి వీలైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రితో గురువారం జ‌రిగిన వీసీలో పాల్గొన్న ఆమె జిల్లాలో చేప‌ట్టిన సంక్షేమ‌, అభివృద్ధి ప‌నుల గురించి వివ‌రించారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువాంర తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గడప గడపకు మ‌న‌ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన ప‌నులు, మంజూరైన ప‌నులు, ఈ-క్రాపింగ్‌, ఉపాధి హామీ ప‌నులు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, యూపీహెచ్‌సీలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు త‌దిత‌ర ప‌నులపై, ప‌థ‌కాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.  భ‌విష్య‌త్తులో చేరుకోవాల్సిన ల‌క్ష్యాల‌ను నిర్దేశించారు. జ‌గ‌న‌న్న పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కంలో భాగంగా ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాల‌ని, అర్హులంద‌రికీ ప‌ట్టాలు పంపిణీ చేయాలని, రీ స‌ర్వే ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌లు, యూపీహెచ్‌సీల ప‌నుల్లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, డిజిట‌ల్ లైబ్ర‌రీల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ఉత్త‌మ ఫ‌లితాలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి జిల్లా క‌లెక్ట‌ర్‌కు సూచించారు.

వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారితో పాటు, ఎస్పీ దీపికా ఎం. పాటిల్‌, జేసీ మ‌యూర్ అశోక్‌, కె.ఆర్‌.ఆర్.సి. ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్ సూర్య‌నారాయ‌ణ‌, సీపీవో బాలాజీ, జ‌డ్పీ సీఈవో అశోక్ కుమార్‌, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి తార‌క రామారావు, పంచాయ‌తీ రాజ్ ఎస్‌.ఈ. ఆర్‌.ఎస్‌. గుప్తా, డ్వామా పీడీ ఉమా ప‌ర‌మేశ్వ‌రి, హౌసింగ్ పీడీ ర‌మ‌ణ‌మూర్తి, స‌ర్వే విభాగం స‌హాయ సంచాల‌కులు త్రివిక్ర‌మ‌రావు, టిడ్కో ఈఈ జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-29 12:49:26

ఈ-క్రాప్ బుకింగ్‌ను సత్వరమే పూర్తిచేయాలి

కాకినాడ జిల్లాలో ఈ-క్రాప్ బుకింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయాలని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా వ్య‌వ‌సాయ‌, రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. గురువారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా 26 జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీలు, జాయింట్ క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌.. వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం కింద ఒక్కో గ్రామ‌/వార్డు స‌చివాల‌యానికి రూ. 20 ల‌క్ష‌లు కేటాయించిన నేప‌థ్యంలో ఆయా స‌చివాల‌యాల ప‌రిధిలో ప్రాధాన్య ప‌నుల మంజూరు, ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌న నిర్మాణాలైన స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు, డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, డిజిట‌ల్ లైబ్ర‌రీల నిర్మాణాల్లో పురోగ‌తి, ఈ-క్రాప్ బుకింగ్‌, జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు-భూర‌క్ష‌, స్పంద‌న కార్య‌క్ర‌మం, సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు (ఎస్‌డీజీ), జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌కు భూ సేక‌ర‌ణ, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్ల లేఅవుట్ల‌లో మౌలిక స‌దుపాయాలు, ఇళ్ల నిర్మాణాలు త‌దిత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి.. దిశానిర్దేశం చేశారు.

 వీడియో కాన్ఫ‌రెన్స్ అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న వివిధ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌లుకు ఈ-క్రాప్ బుకింగ్ డేటా కీల‌క‌మైనందున ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా ఉన్న వీఏఏ, వీఆర్‌వోల పంట పొలాల సంద‌ర్శ‌న‌లు, ఫొటోల అప్‌లోడ్‌, రైతుల ఈ-కేవైసీ త‌దిత‌ర ద‌శ‌ల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో జెడ్పీ సీఈవో ఎన్.వి.వి.సత్యనారాయణ, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌ల‌క్ష్మి, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ ప‌ట్నాయ‌క్‌, ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, పీఆర్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, ఐసీడీఎస్ పీడీ కె.ప్ర‌వీణ‌, జిల్లా వ్య‌వ‌సాయ అధికారి ఎన్‌.విజ‌య్‌కుమార్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-09-29 12:01:48

సంక్షేమ పథకాలపై ప్రత్యేక శ్రద్ద కనబరచాలి

రాష్టంలో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లను కోరారు. గడప గడపకు మన ప్రభుత్వం, ఇ-క్రాప్, ఉపాధిహామీ, వై.ఎస్.ఆర్. అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణాలు, గృహాల మంజూరు, జగనన్న భూహక్కు మరియు భూరక్ష, స్పందన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు,ఎస్.పిలు,సంయుక్త కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధిహామీ పనులు బాగా జరుగుతున్నాయని, ఉపాధిహామీ, స్పందనలో మంచి ప్రగతిని కనబరచారని, ఇందుకు సహకరించిన కలెక్టర్లను అభినందిస్తున్నట్లు తెలిపారు.  ఉపాధిహామీ పనుల్లో వేతనదారులు కనీస వేతనం రూ.240లు అందుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, ఏఎంసియులు, బిఎంసియులు, వై.ఎస్.ఆర్.డిజిటల్ లైబ్రరీలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.  ఇ-క్రాప్ పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొదటి దశలో వి.ఆర్.ఓ, వి.ఏ.ఓలు క్షేత్ర స్థాయిలో  రైతుల భూములను పరిశీలించి ఫోటోలు తీసి సెప్టెంబర్ 30నాటికి ప్రక్రియను పూర్తిచేయాలని అన్నారు. రెండవ దశలో వి.ఆర్.ఓ, వి.ఏ.ఓలు బయోమెట్రిక్ ద్వారా దృవీకరించాలని, మూడవ దశలో రైతుల బయోమెట్రిక్  దృవీకరణతో ఇ-క్రాప్ ప్రోసెస్ అంతా పూర్తవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమం వచ్చే నెల 10నాటికి పూర్తిచేసి, డిజిటల్ మెసేజ్ ద్వారా రైతులకు రసీదును అందించాలని అన్నారు. అక్టోబర్ 15 నుండి 22 వరకు సోషల్ ఆడిట్ కావాలని, తదుపరి 25 నుండి 31వరకు రైతుల తుది జాబితాను పబ్లిష్ చేసి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని సూచించారు. నవంబర్ 1 నుండి వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. తక్కువ సమయం ఉన్నందున కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

2022 మే 11నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం అయిందని, రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామాలను సంబంధిత మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు బృందంగా ప్రతి ఇంటిని సందర్శించడం జరిగిందన్నారు. ప్రతి బృందం నెలలో ఆరు సచివాలయాలను, రెండు రోజుల పాటు పర్యటిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఒక్కో సచివాలయానికి రూ.20 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులను శాసనసభ్యుల ఆమోదంతో పనులు చేపట్టేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చే సమస్యలపై తక్షణమే కలెక్టర్లు స్పందించాలని, ఇందులో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వచ్చే నెల 5 నాటికి చేపట్టవలసిన పనులపై కలెక్టర్లు మంజూరు ఉత్తర్వులు జారీచేయాలని, అక్టోబర్ చివరి నాటికి పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వివరించారు. 

నవరత్నాల్లో భాగంగా చేపట్టిన  పేదలందరికి ఇల్లు నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. గృహ నిర్మాణాల్లో ఎటువంటి బిల్లులు పెండింగ్ లేవని స్పష్టం చేశారు. సకాలంలో అన్ని గృహ నిర్మాణాలు పూర్తిచేసి లబ్దిదారులకి అందించాలని అన్నారు. ప్రతి గృహానికి తాగునీరు, విద్యుత్, మురుగునీటి కాల్వల సదుపాయంతో పాటు మంచి రంగులు వేయాలని సూచించారు. ప్రతి జగనన్న కాలనీకి స్వాగతం పలికే ఆర్చ్ ఉండాలని, దాన్ని చూడగానే మంచి అభిప్రాయం లబ్ధిదారులకు కలిగేలా  ఏర్పాటు చేయాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ గృహాలు కోల్పోరాదని, మూడవ విడతలో అందరికి ఇల్లు మంజూరు కావాలని ఆదేశించారు. జగనన్న భూహక్కు - భూరక్ష వచ్చే నెలలో ప్రారంభం కానుందని, రానున్న 90 రోజుల్లో పట్టాల కార్యక్రమం పూర్తికావాలని ఆయన ఆకాక్షించారు. లబ్దిదారుని ఫోటోతో భూహక్కు పట్టాలు పంపిణీ చేయనున్నందున ఎటువంటి తప్పులకు తావులేకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. 

గ్రామ సచివాలయాల పరిధిలోని అధికారులు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్పందనపై వచ్చే వినతుల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అన్ని సమస్యలు సచివాలయాల పరిధిలోనే పరిష్కారం కావాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో 14400 ఏ.సి.బి నెంబరును కనిపించే విధంగా బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ప్రతి విశ్వ విద్యాలయం, కళాశాలల్లో దిశా పోలీస్ స్టేషన్ నెంబర్లను అందరికి కనిపించే విధంగా ఉంచాలని సూచించారు. అక్టోబర్ 26న రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీని, నవంబర్ 10న వసతి దీవెన అందిస్తామని వివరించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ జే శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడిఎ పిఒ రోణంకి గోపాల కృష్ణ, డిఎంహెచ్ఓ డా.బి సుజాత, డిపిఓ కొండల రావు, డిఆర్డిఎ  పిడి వి. మురళి వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు ఎస్ బి ఎస్.  నందు, రమేష్ కుమార్, హౌసింగ్ పిడి శ్రీనివాస రావు, పిఐయు ఇఇ కే. లావణ్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-09-29 11:55:10

అధిక దిగుబడులకే ఈ పరిశోధనా కేంద్రాలు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన  అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అధిక దిగుబడులు అందజేయడానికే ఈ పరిశోధనా కేంద్రమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్  శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అతిథులు వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం కృషి ఎంతో ఉందని అన్నారు.  రైతాంగానికి అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభివర్ణించారు. 

కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో 20 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఒకటి శ్రీకాకుళం బూర్జ మండలం పెద్దపేట లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే పరిశోధనా కేంద్రం మంజూరు చేసిన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం అంటే వరి మాత్రమే కాదని, ఉద్యాన, పట్టుపరిశ్రమ, పోలి కల్చర్ మరెన్నో పంటలు కూడా వ్యవసాయమేనని సభాపతి గుర్తుచేశారు. ఉద్యాన పంటలు పండించి మంచి లాభాలు పొందాలని రైతులని కోరారు. పేదరికం విద్యకు, వైద్యానికి అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అండగా ఉన్నారన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదరికాన్ని పారద్రోలేలా మన ముఖ్యమంత్రి అనేక పథకాలు అందజేస్తున్నారు అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు నష్టపోతున్నా వారికి అండగా ఈ ప్రభుత్వ నిలుస్తోందని వివరించారు.

కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస రావు మాట్లాడుతూ వ్యవసాయం ఒక దండగ వ్యవహారం అన్న రాష్ట్ర పరిస్థితిని వ్యవసాయం ఒక పండగ అన్న స్థానానికి తీసుకు వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు విత్తనం నుండి విక్రయం వరకు నేనున్నాను అని రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం, ఎరువు అందజేస్తున్నారు అన్నారు. జగనన్న పాలనలో రైతులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. వ్యవసాయమే కాదు ఉద్యాన పంటలపై దృష్టి సారించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు.

ఎమ్మెల్సీ పాలవలస రాజ శేఖర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తండ్రి అడుగుజాడల్లో ముఖ్య మంత్రి ముందుకు సాగుతున్నారన్నరు. ఈ పరిశోధనా కేంద్రం ద్వారా మరిన్ని మెళుకువలు తెలుసుకొని మరింత లాభం కలిగేలా పంటలు వేసుకోవాలని అన్నారు. రైతు దళారుల చేతిలో మోసపోకుండా చేపడుతున్న కార్యక్రమాలపై వివరించారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.

మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే నాలెడ్జ్ షేరింగ్ ఉండాలనే ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఏ పంట వేస్తే రైతుకు లాభదాయకం ఉంటుందో అన్న పలు సమాచారం రైతుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడానికి పరిశోధనా కేంద్రం ఎంతో అవసరమని గుర్తించి శ్రీకాకుళం జిల్లాకు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతుకు సంపూర్ణ మద్దతు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వెస్తుందన్నారు. రైతు ఏటువంటి అపద వచ్చినా నేనున్నానని అన్ని విధాలుగా సహాయ సహకారాలు వై.ఎస్.ఆర్.ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు. ముఖ్య మంత్రిగా భాద్యతలు తీసుకున్న నాటి నుండి నేటివరకు తండ్రి బాటలో అడుగులు వేస్తూ రైతుకు అండగా ఈ ప్రభుత్వ నిలిచిందన్నారు. అంతే కాకుండా మహిళకు సమాజం లో ఒక అగ్రస్థానం కల్పించాలని ప్రతి పథకం మహిళలకే అందజేస్తున్నారు అన్నారు.

కార్యక్రమంలో డా.వై.ఎస్.ఆర్.హెచ్.యు వైస్ ఛాన్సలర్ డా.జానకి రామ్ ప్రారంభ ఉపన్యాసం గావించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి రాబోయే తరాలకు ఏంటో అవసరమని గుర్తించి ముందుచూపుతో 2007లో ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రారంభించారు. మన గౌరవ ముఖ్య మంత్రి ఉద్యాన పరిశోధన ప్రాధాన్యతను గుర్తించి మరింత ప్రాధాన్యత కల్పిస్తూన్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో  ఈ పరిశోధనా కేంద్రం ప్రారంభం చరిత్రలోనే గుర్తు ఉంటుందన్నారు. పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఎన్నో పరిశోధనలు చేసి అందజేయడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ నూక సన్యాసి రావు ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ఎక్సిబిషన్ స్టాల్స్ సందర్శించారు,  పరిశోధనలకు సంబంధించిన గోడ ప్రతి, కరపత్రం అతిథులు విడుదల చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి, శాసన మండలి సభ్యులు పాలవలస రాజశేఖర్, దువ్వాడ శ్రీనివాస్, కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మెన్ అందవరపు సూరిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, డి.సి.సి.బి. చైర్మెన్ కరిమి రాజేశ్వర రావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీ, బూర్జ ఎం.పి.పి కర్నేన దీప, జెడ్.పి.టి.సి బి.రామారావు, పెద్దపేట సర్పంచ్ అనెపు వరలక్ష్మి, ఎం.పి.టి.సి ఖండాపు నవీన, ఆముదాలవలస నియోజక వర్గంలో రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Srikakulam

2022-09-29 11:47:31

వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు

రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, ఇది శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2వందల  సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని, అన్ని బ్యాంకులు లాభాల బాటలో నడుస్తున్నామని ఇది శుభసూచికమని తెలిపారు. గతంలో సహకార బ్యాంకులు అఫ్పుల ఊబిలో ఉండేవని, వాటిని లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని తెలిపారు. తద్వారా రూ.1800కోట్ల ఆర్ధిక లావాదేవీలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉందని, ఇతర వాణిజ్య బ్యాంకులకు ధీటుగా ఈ బ్యాంకు పనిచేయడం ఆనందదాయకమన్నారు. 20 సంచార ఏటిఎంలతో,   25 బ్రాంచులతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని అన్నారు.  లాభాపేక్షతో కాకుండా అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యాంగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు.

 ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకువస్తే వారికి ప్రభుత్వం తరపున అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేసారు. గతంలో రైతులకు ప్రభుత్వమే వ్యవసాయ యాంత్రీకరణపై సూచనలిస్తూ యాంత్రీకరణను నిర్ధేశించడం జరిగిందని, ప్రస్తుతం రైతు సంఘాలకు నచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను 40శాతం రాయితీతో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛను రైతులకు కల్పించడం జరిగిందని తెలిపారు. సున్నావడ్డీతో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను కొనుగోలు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించామని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.

 రైతుల సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా భావిస్తూ రైతులకు అండదండలుగా ఉండేందుకు కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, రైతులకు మరింత చేరువ చేసేందుకు ఇ-క్రాప్ రుణాలను మంజూరుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. సహకార బ్యాంకులు, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ అభివృద్ధిలో తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు మంత్రికి దుశ్శాలువ, జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గత రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డా.వై.యస్.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, ఆ తదుపరి తనయుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతమైన పాలనతో రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు అన్నివిధాల కృషిచేస్తున్నారని తెలిపారు. 

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రూ.1800 కోట్లతో ఇతర బ్యాంకులకు ధీటుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తుందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 25 సహకార బ్యాంకులు, 49 ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్తలు పనిచేస్తున్నాయని అన్ని లాభాల బాటలో నడుస్తున్నట్లు చెప్పారు. మరో 11 కొత్త బ్రాంచులను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయడం జరిగిందని, త్వరలో వాటిని కూడా త్వరలో వినియోగదారులకు అంకితం చేయనున్నట్లు చెప్పారు. అలాగే జిల్లావ్యాప్తంగా 10 ఏటియంలతో పాటు 20 సంచార ఏటిఎంలు పనిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. సహకార లక్ష్మీ పథకం ద్వారా 444 రోజులకు చేసే డిపాజిట్లపై 6.60% అత్యధిక వడ్డీని అందిస్తున్న ఏకైక బ్యాంకు కేంద్ర సహకార బ్యాంకు అని, అలాగే అతితక్కువ వడ్డీకే  రైతులకు, స్వయం సహాయక బృందాలకు, బంగారు ఆభరణాలపై మరియు వ్యవసాయ రుణాలను అందిస్తున్న ఏకైక బ్యాంకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అని ఆయన స్పష్టం చేసారు. ఈవేశంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ ఛైర్ పర్సన్ సుగుణ, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శిమ్మ నేతాజీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యులు మిరియాబెల్లి శ్యామసుందర రావు, బొడ్డేపల్లి నారాయణ రావు, గొండు నిర్మల, దండాసి ఎండమ్మ,నడిమింటి రామ్మూర్తి, బంకి లక్ష్మణమూర్తి, ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-29 08:16:44

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాథరావు తెలిపారు.  బుధవారం  ఆయన పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి ని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్. వాగ్దేవితో కలిసి ఆసుపత్రిలో పలు విభాగాలను పర్యవేక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.  నవజాత శిశువు ల ప్రత్యేక చికిత్సా విభాగంలో అందిస్తున్న చికిత్సను ఆ విభాగపు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి న్యూట్రిషన్ రీహేబిలిటేషన్ కేంద్రాన్ని పర్యవేక్షణ చేసి అక్కడ పిల్లలకు ఇస్తున్న పౌష్ఠికాహారాన్ని, వారి తల్లులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తలసేమియా వైద్య సేవలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ రికార్డులను పరిశీలించి తలసేమియా మరియు సికిల్ సెల్ రక్తహీనత రోగులకు ఇస్తున్న మందులు , చికిత్సా విధానాన్ని పరిశీలించారు. 

పి.పి. యూనిట్ విభాగాన్ని సందర్శించి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న  వారిని పర్యవేక్షణ చేసి వారికి ఇస్తున్న సేవలగూర్చి వైద్యులు డాక్టర్ విజయ్ మోహన్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతాల వారీగా కూడా ఈ  కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స లు అమలు జరపాలని అందుకు గల కార్యాచరణ ప్రణాళికలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి ఇమ్యు నైజేషన్ అధికారి డాక్టర్ టి. జగన్మోహన్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 13:52:42

మత్స్యకారులు సంయమనం పాటించాలి..

మత్స్యకారులు సంయమనం పాటించాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాధన్ సూచించారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళనలకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్యకార సంఘాలతో జాయింట్ కలెక్టర్   ఆర్డీవో, మత్స్యకార సహాయ సంచాలకులు తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా మత్స్యకార సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.  గతంలో పోర్ట్ యాజమాన్యంతో జరిగిన ఒప్పందాలను జాయింట్ కలెక్టర్ కు వివరించారు.  అనంతరం జాయింట్ కలెక్టర్  మాట్లాడుతూ వివాద పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. మత్స్యకార సంఘాల నాయకులు ఈ సమస్యకు సంబంధించి ఏమైనా వినతులు ఉంటే ఆర్డీవో కి సమర్పించాలని అన్నారు. 

త్వరలోనే ఈ విషయమై ఉన్నతాధికారులతో సమీక్షించి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతవరకు ప్రభుత్వ ఆదేశాలను గౌరవించాలని కోరారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఓడముతిల పెంటయ్య, అధ్యక్షులు సురకల జయకుమార్‌ (జంపన్న), వైస్ ప్రెసిడెంట్ తాతాజీ, సెక్రెటరీ అయ్యప్పరాజు, నగర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్, తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-28 12:04:08

మన్యం జిల్లాలో పర్యాటకం శోభిల్లాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకం శోభిల్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని ఆయన చెప్పారు. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో ఎకో టూరిజం క్రింద గిరిజన ఒకటి, రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకులు ఒక రోజు గ్రామంలో గడిపి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద కన్వెన్షన్ సెంటర్, వ్యూ పాయింట్, ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఇందుకు పార్వతీపుం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జలవనరుల శాఖ అధికారులతో సహా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. 

 భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్, రివర్ ఫ్రంట్ కాటేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బ్యాటరీ ట్రైన్ సౌకర్యం కల్పించి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించుటకు అవకాశాలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో పర్యాటక, జాతీయ రహదారి కలుపుతూ తూర్పు కనుమల కారిడార్ (ఈస్టర్న్ ఘాట్స్ కారిడార్) ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని, సామాన్య ప్రజల ఆదాయం వృద్ది చెందగలదని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రెండు నుండి ఐదు ఎకరాల స్థలంలో శిల్పారామం, బడ్జెట్ హోటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో టూరిజం కార్పొరేషన్ డివిజన్ (ఎకో టూరిజం) కార్యాలయం, డెప్యూటీడిఇ , ఏఇలతో కూడిన టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

పర్యాటక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక విశేషాలు తెలియజేస్తూ వెబ్ సైట్ రూపొందించాలని, ఇతర ప్రధాన వెబ్ సైట్లుతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:58:06

మన్యం జిల్లాలో 306 ధాన్యం సేకరణ కేంద్రాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటుచేస్తున్న  ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా     రైతులనుండి ధాన్యం సేకరణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేసమందిరం లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, వ్యవసాయ, కోపరేటివ్, బ్యాంకు అధికారులు, మిల్లర్ లతో  సమావేశం  నిర్వహించారు.   ఈ సందర్భంగా జాల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  గత సంవత్సరం ధాన్యం సేకరణ లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని  సేకరణ పనులు సక్రమంగా జరిగేటట్లు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు .  రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం తేమ, నాణ్యత చూసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని,  రైతులకు కుడా అవగాహన కల్పించాలన్నారు.  ధాన్యం మిల్లుకు వెళ్ళిన తరువాత తేమ,నాణ్యత విషయం లో తేడాలు రాకుండా సేకరణ కార్యక్రమం జరగాలని తెలిపారు.  టె

క్నికల్ సహాయకులకు తగిన శిక్షణ ఇవ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కూలీలు, రవాణా ఎర్పాట్లు చేయాలని తెలిపారు.  మిల్లర్ లకు బ్యాంకులలో పెండింగ్ బిల్ల్స్ సంబందించిన పనులు వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. వీరఘట్టం మండలం లో మిల్లులు తక్కువగా ఉన్నాయని, పంట ఎక్కువని కావున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.    మిల్లర్లు  బ్యాంకు గ్యారంటీ సకాలంలో అందజేయాలని తెలిపారు. జెసి ఒ.ఆనంద్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు అవసరమైన సంచులు సిద్దం చేయాలని తెలిపారు.  పాత సంచులు కూడా సిద్దం చేసుకోవాలని, మిగిలినవి సేకరించాలని తెలిపారు.  సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ దేవులనాయక్  ధాన్యం సేకరణకు రూపొందించిన నివేదికను వివరించారు.  కేంద్ర ప్రభుత్యం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్యం వరి పంటకు  కనీస మద్దతు ధర కల్పించుటకు  ఏ గ్రేడ్ రకానికి  క్వింటాకు రెండు వేల అరవై రూపాయలు , సాదారణ రకానికి రెండు వేల నలబై రూపాయలు ప్రకారం చెల్లించ నున్నట్లు తెలిపారు.  

జిల్లాలో 71,371 హెక్టార్లలో వరిపంట వేసారని, సుమారు నాలుగు లక్షల మూడువేల మెట్రిక్  టన్నులు దిగుబడి అంచనా వేయగా అందులో మూడులక్షల పదమూడు వేల మెట్రిక్  టన్నులు మార్కెట్ కు రావచ్చని తెలిపారు.  86.5 శాతం ఇ-క్రాప్ బుకింగ్ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సవరం మొత్తం సేకరణ ప్రక్రియ మొబైల్ యాప్ ద్వారానే జరుగుతుందని, మిల్స్ సెలక్షన్  ఆటోమేటిక్ గా రాండమ్ సెలక్షన్ ద్వారా జరుగుతుందని తెలిపారు.  ప్రతి ధాన్యం సేకరణ కేంద్రం, రైతు భరోసా కేంద్రం వద్ద ప్రోక్రూర్మెంట్ అసిస్టెంట్ మరియు రూట్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో  తొంబదిఒక్క మిల్లులు ఉన్నాయని, డబ్బదిఎనిమిది  లక్షల ముప్పైఒక్కవేల గోనె సంచులు అవసరంకాగా  మూడు లక్షల ముప్పదిరెండు వేల సంచులు నిల్వఉన్నట్లు తెలిపారు. జిల్లాలో గల ఏజెన్సీల వద్ద పది ప్రదేశాలలో లక్షా పదివేల నాలుగువందల డబ్బదిమూడు మెట్రిక్ టన్నుల నిల్వసామర్ద్యంగల గొడౌన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 

రెవిన్యూ, వ్యవసాయ అధికారులు, ధాన్యం సేకరణ ఏజెన్సీల అధికారులు, సివిల్ సప్లయి అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియలో వారు నిర్వర్తించవలసిన విధులు గూర్చి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు యిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింటు డైరెక్టరు రాబర్ట్ పాల్, జిల్లా సివిల్ సప్లయి అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. ఎం .అశోక్ కుమార్, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.కాశీరామ్, జిల్లా కోపరేటివ్ అధికారి బి. సన్యాశినాయుడు, ఎపిఎస్ఐసి రీజనల్ మేనేజర్ ఎస్.రవికుమార్, జి.సి.సి. డివిజినల్ మేనేజర్ జి.సంద్యారాణి ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:56:17

గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ మార్కెట్ కల్పించాలి

గిరిజనులు వన్ ధన్  వికాస్ కేంద్రాలు ద్వారా ఉత్పత్తిచేస్తున్న వస్తువులకు బ్రాండింగు కల్పించుట ద్వారా మార్కెటింగు అవకాశాలు మెరుగుపరచవచ్చునని జిల్లాకలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చాంబరులో ఐ.టి.డి.ఎ. అధికారులతో గిరిజన ఉత్పత్తులు, మార్కెటింగు సదుపాయాలుపై  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వెదురు, జీడిమామిడి, చింతపండు, ఫైనాపిల్, పసుపు, తృణధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అమ్ముట ద్వారా గిరిజనులకు లాభం చేకూర్చవచ్చునని తెలిపారు. ఉత్పత్తులకు పార్వతీపురం జిల్లాకు చెందినట్లుగా బ్యాండింగు ఇచ్చుట ద్వారా అమ్మకాలు పెంచవచ్చునని సూచించారు.

 పేకింగు,   బ్రాండింగుతో డిజైన్ తయారుచేయాలన్నారు. ఆర్గానికి ఉత్పత్తులైన  జీడిపప్పు, తృణదాన్యాలతో బిస్కెట్స్, తీపిపదార్దాలు  తయారుచేసి మార్కెటింగు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకు సీతంపేట, పార్వతీపురం, జి.ఎల్.పురంలలో రిటైల్ షాపులను ఏర్పాటు చేయాలన్నారు.  క్వాలిటీ, పేకింగు బాగుండాలని తెలిపారు. జీడిపప్పు, బిస్కెట్ మార్కెటింగుకు బహుళజాతి సంస్థలు, విమానయాన సంస్థలతో మాట్లాడాలన్నారు. జాయింటు కలెక్టరు, పార్వతీపురం ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి ఒ.ఆనంద్ మాట్లాడుతూ చింతపండు లాభదాయకంగా ఉందని, జీడి పండ్లు వృదాగా పోతున్నాయని, వాటితో కూడా ఉత్పత్తులకు గల అవకాశాలను  పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

సీతంపేట ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి బి.నవ్య మాట్లాడుతూ జీడిపప్పు వ్యాపారం అభివృద్ది చేయుటకు, దిగుబడి పెంచుటకు జీడి పిక్కలు ప్రాసెంసింగు యూనిట్లకు ఆర్డరు పెట్టినట్లు తెలిపారు. వన్ ధన్  వికాస్ కేంద్రాలు ద్వారా ఉత్పత్తి చేస్తున్న పసుపు, అగరబత్తి మొదలైన ఉత్పత్తులను గూర్చి వివరించారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఎ.  ప్రోజెక్టు అధికారి వై.సత్యంనాయుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:51:11

మన్యంలో 3వ తేదీన దసరా ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో దసరా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీన నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి  చేనేత వస్త్ర ప్రదర్శన - విక్రయం, గిరిజన సాంప్రదాయ వస్తువుల ప్రదర్శన, వన్ ధన్ కేంద్రాల ఉత్పత్తులు, సవర కళాకృతుల ప్రదర్శన, జీసిసి ఉత్పత్తులు, ఆప్కో, అటవీశాఖ, వెదురు ఉత్పత్తుల ప్రదర్శన, ఆహార పదార్థాల విక్రయ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటవస్తువులు ఏర్పాటు,  బాణసంచా తదితర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 3వ తేదీ మధ్యాహ్నం నుండి కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయం చేయాలని ఆయన అన్నారు. 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:48:19

అలక్ష్యం వహించే సిబ్బందిని ఇంటికి పంపిస్తా

విజయనగరంలోని వార్డు స‌చివాల‌య సిబ్బందిపై క‌లెక్ట‌ర్ ఎ.సూర్యకుమారి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌చివాల‌యాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచాల‌ని, సిబ్బంది ప‌నితీరును మెరుగు ప‌ర్చాల‌ని ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న 37 వ స‌చివాల‌యాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా రికార్డుల‌ను, హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించారు. వివిధ ప‌థ‌కాల అమ‌లు తీరును, స్పంద‌న గ్రీవెన్స్‌ను ప‌రిశీలించారు. మ‌హిళా పోలీసు, ఎఎన్ఎం ల‌ను ప్ర‌శ్నించారు. వారి ప‌నితీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సచివాల‌య సిబ్బంది ప‌నితీరు మెరుగుప‌డాల‌ని, ఇదే తీరు చూపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతానని, తేడాగా వ్యవహరించే సిబ్బందిని ఇంటికి పంపిస్తానని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి, మున్సిప‌ల్ హెల్తాఫీస‌ర్ డాక్ట‌ర్ కెవి స‌త్య‌నారాయ‌ణ‌, స‌చివాల‌యాల క‌న్వీన‌ర్ హ‌రీష్ పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-27 17:22:18