1 ENS Live Breaking News

ప్రేరణ కల్పించి సమాజాన్ని తీర్చిదిద్దాలి


ప్రేరణ కల్పించి.. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని పార్వతీపురం మన్యం  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు ఉన్నత లక్ష్యాల కోసం పనిచేయడమే కాకుండా భావిభారత పౌరులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దాలని కోరారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గిరి మిత్ర సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమ వారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా కలెక్టర్ ప్రధానం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించారని ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగానన్నారు. ఐ.ఏ.ఎస్ అధికారిగా ప్రజలకు మేలు చేయవచ్చని నా ఉపాధ్యాయుల మార్గదర్శకం చేయడంతో ఐ.ఏ.ఎస్ అధికారి కాగలిగాను అన్నారు. 

సమాజానికి మార్గదర్శకులుగా, ప్రామాణిక విద్యకు చిరునామాగా ఉపాధ్యాయులు నిలవాలని సూచించారు. ఉన్నత విలువలకు పాఠశాల ప్రథమ సోపానం కావాలని పిలుపునిచ్చారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు కీర్తించారని చెప్పారు. రాధాకృష్ణన్ స్పూర్తితో జిల్లాలో ఆదర్శాలకు మారుపేరుగా ఉపాధ్యాయులు నిలవాలని ఆయన అన్నారు. ఉపాధ్యాయులకు  సమస్యలు ఉంటే పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. అందరూ సమయాన్ని అనుసరించాలని, విద్యార్థులకు సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం ముఖ గుర్తింపు హాజరును ప్రవేశ పెట్టిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు ముఖ హాజరుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులుగా సమాజానికి దిశాదశ నిర్దేశం చేయడంలో క్రీయాశీలకంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కొన్ని విద్యా సంస్థలలో బాలికల పట్ల వివక్ష, లైంగిక వేదింపులు జరుగుతున్నాయని, అటువంటి సంఘటనలలో ఉపాధ్యాయులు కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. జిల్లాలో అటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులు నిబద్దతతో వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అటువంటి కార్యకలాపాలు చోటు చేసుకొనుటకు అవకాశం ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మునిసిపల్ చైర్ పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లా విద్యా శాఖ అధికారి పి. బ్రహ్మాజీ రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-05 09:27:10

రైలు ప్రయాణికుల అవసరాలను గుర్తించాలి

రైలు ప్రయాణికుల అవసరాలు డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వాటికి రైల్వే శాఖ ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని గాంధీభవన్ లో జిల్లా, కాకినాడ టౌన్ ప్రయాణికుల సంఘ సమావేశం అధ్యక్షుడు వై డి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గీత మాట్లాడుతూ దేశం మొత్తంగా రైల్వే శాఖకు  అధిక ఆదాయం మన దక్షిణ మధ్య రైల్వే నుండి లభిస్తుందన్నారు. కోస్టల్ కారిడార్ విస్తరణ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానన్నారు. కొన్ని  ఎక్స్ప్రెస్ రైళ్లు సామర్లకోటలో నిలుపుదల చేయడానికి కృషి చేయగా అధికారులు స్పందించి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు, సిటీ బస్సులు ఏర్పాటుకు గాను ఆర్టీసీ అధికారులతో సంప్రదిస్తానని గీత తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి అడ్డూరి రవిరాజా, ఉపాధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, ఏ .వెంకటేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.


Kakinada

2022-09-05 06:48:31

అపోలోకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఉంది

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆసుపత్రి) అపోలో ఆసుపత్రికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో వైద్య సేవలు అందిస్తోందని అపోలో ఆసుపత్రుల అధినేత డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్పారు. కుటుంబ సమేతంగా సోమవారం ఆయన శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని సందర్శించారు.. జనరల్ వార్డు, ఐసియూ లు, ఆపరేషన్ థియేటర్లు, క్యాత్ ల్యాబ్ విభాగాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే 600 మందికి పైగా చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవోఎ వి ధర్మారెడ్డి డాక్టర్ ప్రతాప్ రెడ్డికి వివరించారు. బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల నుంచి కూడా తల్లి తండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి ఆపరేషన్లు చేయించుకుని వెళ్లారని ఆయన తెలిపారు. త్వరలోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

          అనంతరం డాక్టర్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న పిల్లల హృదయాలయంలో శుభ్రత, ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించే చర్యలు, వైద్య సేవలు, సర్జరీలు చేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది ఆత్మ విశ్వాసం ఎంతో గొప్పగా ఉన్నాయన్నారు. ఆసుపత్రి ప్రారంభించిన ఏడాది లోపే  600 మంది చిన్నారులకు డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారని అభినందించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే యంత్ర సామగ్రి మొత్తం తమ కుటుంబం విరాళంగా అందిస్తుందని ప్రకటించారు. అలాగే అపోలో ఆసుపత్రుల నుంచి డాక్టర్లు ఇక్కడికొచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని తెలిపారు. విదేశాల్లో తమ ఆసుపత్రులకు సాంకేతిక, వైద్య సహకారం అందిస్తున్న పేరొందిన చిన్న పిల్లల ఆసుపత్రుల సేవలు కూడా అందేలా ఏర్పాటు చేస్తానని డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 

ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తనకు ఇచ్చిన గొప్ప  అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో టీటీడీ ప్రజల కోసం ఎంతో గొప్ప సేవలు అందించిందని ఆయన అభినందించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి క్యాత్ ల్యాబ్ నిర్వహణ, ఆపరేషన్లు చేసేందుకు పాటిస్తున్న  విధానాలను డాక్టర్ ప్రతాప్ రెడ్డి కి వివరించారు.

Tirupati

2022-09-05 06:40:16

ఈఅవనిలో గురువులే నవసమాజ నిర్మాతలు

గురు శిష్య సంప్రదాయం మానవ జాతికి శ్రీరామ రక్ష అని సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు అన్నారు. విశాఖలోని డాబాగార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సహకారంతో విశాఖ వెబ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన  తమకు ఆ ఆత్మసంతృప్తి ఎప్పుడూ ఉంటుందని, ఉపాధ్యాయుడిగా, అధ్యాపకులుగా సమాజము లో అందుకున్న గౌరవంతో పాటు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతా మన్నారు. ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డివిఆర్ మూర్తి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్రతీ రోజు తరగతి గదిలో సరికొత్త అంశాలను మేళవించి  విద్యార్ధులు కి అర్థమైన రీతిలో పాఠ్యాంశాలు బోధించాల్సిన అవసరం ఉందన్నారు..

 విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతతో పాటు సమాజానికి కూడా ఉపాధ్యాయుల సేవలు ఎంతగానో అవసరమని వీరంతా అభిప్రాయపడ్డారు.  తమ విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తే ఆ సంతృప్తి జీవితాంతం అంతులేని ఆనందం కలిగిస్తుందన్నారు. రాష్ట్రపతి నారీ శక్తి అవార్డు గ్రహీత, ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ మాట్లాడుతూ,  ప్రతి విద్యార్థి గురువులకు తమ పిల్లలతో సమానమే అన్నారు.. గురుపూజోత్సవం సందర్భంగా తమ సేవలను గుర్తించి జర్నలిస్ట్ లు సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ప్రముఖ కతక్  డాన్స్ టీచర్, అధ్యాపకురాలు ఇప్సాత్ రాయ్  మాట్లాడుతూ, జర్నలిస్టుల తోనే నవసమాజ ప్రగతి సాధ్యమని, వారి వల్లే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవార్డు గ్రహీత ఎస్టి పి  లక్ష్మి కుమార్ మాట్లాడుతూ, గురువు ఎక్కడైతే గుర్తించబడతారో అక్కడ చదువులమ్మ కొలువుదీరి వుంటుందన్నారు. 

విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, గురుపూజోత్సవం సందర్భంగా గురువులను  సత్కరించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా అవకాశం కల్పించిన విశాఖ వెబ్ జర్నలిస్టు అసోసియేషన్ నిర్వాహకులను అభినందించారు. విజేఎఫ్ సెక్రటరీ దాడి రవి కుమార్, ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్ లు మాట్లాడుతూ,  గురువులు గొప్పతనము తెలియ జేశారు.  అంతకు ముందు ఆచార్య జీఎస్ఎన్ రాజు, ఏయూ జర్నలిజం విభాగం అధ్యాపకులు ఆచార్య డివిఆర్ మూర్తి, రాష్ట్రపతి నారీ శక్తి అవార్డు గ్రహీత,  ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవార్డు గ్రహీత ఎస్టి పి  లక్ష్మి కుమార్. ప్రముఖ కతక్  డాన్స్ టీచర్, అధ్యాపకురాలు ఇప్సాత్ రాయ్ లను  దుస్సాలువాలతో ఘనంగా  సన్మానించి సత్కరించారు.

  ఈ కార్యక్రమంలో విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు ఎం ఎస్ ఆర్ ప్రసాద్, ఇరోతి ఈశ్వర రావు, సీనియర్ పాత్రికేయుడు బండారు శివప్రసాద్, వెబ్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, టీవిఎన్ ప్రసాద్, గురు ప్రసాద్, మదన్, రవి, గోపీనాథ్, బుద్ధ భాస్కర్, ఉదయ్, జనా, రాము తదితరులు  పాల్గొన్నారు.  స్కూలు ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్య క్రమాలుతో సభికులను అలరించాయి.


Visakhapatnam

2022-09-05 04:50:48

పకడ్బందీగా గడపగడపకూ ప్రభుత్వం

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ ఆదేశించారు. ఆదివారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరములో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పై  మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు వర్క్ షాప్ నిర్వహించారు.  ఈ వర్క్ షాప్ లో కలెక్టర్ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు యొక్క అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం  ఈ కార్యక్రమం చేపట్టిందని ఆమె తెలిపారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇచ్చి పనులు ప్రతిపాదించాలని ఆమె సూచించారు.  ప్రతి సచివాలయానికి   ప్రజలు సూచించిన పనులు చేపట్టేందుకు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని ఆమె తెలిపారు.

  ఈ నిధులను వినియోగించుకొని మంచినీటి సరఫరా, రోడ్లు,  డ్రైన్లు ,  విద్యుత్ సదుపాయాలు వంటి పనులు చేపట్టేందుకు సంబంధిత నియోజకవర్గం ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ప్రతిపాదనలు, అంచనాల రూపొందించి పంపించాలని కలెక్టర్ సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు,  పనులు ప్రతిపాదనలు అన్నింటిని  సకాలం లీక్ పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు. 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనులు ఏ విధంగా అప్లోడ్ చేయాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో  సి పి  కె. శ్రీనివాసరావు ,  డిఎల్డి ఓ ,సి హెచ్ అప్పారావు   , మున్సిపల్ కమిషనర్లు ,  మండల అభివృద్ధి అధికారులు. , డిజిటల్ అసిస్టెంట్లు,  వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు .

Bhimavaram

2022-09-04 09:52:05

6న తిరుపతిలో సీఎం వైస్ జగన్ పర్యటన

సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈనెల 6వ తేదీన నెల్లూరు జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఈ మేరకు జిల్లా పోలీసు అధికారి పరమేశ్వర్ రెడ్డి  ఇతర  పోలీసు అధికారులతో భద్రతా సమీక్షను నిర్వహించారు. అనంతకం కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం జగన్ మోహనరెడ్డి కొవ్వూరు హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2:30 గం. కు బయల్దేరి 2.50 గంటలకు తిరుపతి ఏర్పోర్ట్ చేరుకుంటారన్నారు.  మూడు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో తిరుగుపయనం కానున్నారని పేర్కొన్నారు.

ఈ  సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల పరిశీలన ASL లో భాగంగా జిల్లా కలెక్టర్,  లు సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ రూమ్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, ఎస్ ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ కృష్ణారెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి బాలకృష్ణన్, జిల్లా ఫైర్ అధికారి రమనయ్య, ఆర్డీవో శ్రీకాళహస్తి  రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, చంద్ర శేఖర్, సురేంద్ర, రేణిగుంట తహసిల్దారు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2022-09-04 09:42:58

మెరిట్ ఆధారంగా వైద్య‌ుల నియామకాలు

మెరిట్ ఆధారంగానే వైద్య‌శాఖ‌ పోస్టుల భ‌ర్తీ జ‌రుగుతుంద‌ని విజయనగరం జిల్లా  కలెక్టర్, జిల్లా సెలెక్షన్ కమిటి చైర్మన్ ఎ.సూర్య కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. నియామకాలు అన్నీ ప్రభుత్వ నియమ నిబంధనుల మేరకు, అత్యంత పారదర్శకంగా, రోస్ట‌ర్ ప్ర‌కారం జరుగుతాయని,  ఏ ఒక్క అభ్యర్ధి కూడా ఎటువంటి  ప్రలోభాలకు గురికావద్దని, వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. అభ్యర్ధులు వివిధ కేట‌గిరీల‌ పోస్టులకు దరఖాస్తు చేసినప్పటికీ, కౌన్సిలింగ్  రోజున ఎంపిక కాబడిన పోస్టు లోనే నియామకం చేయడం జరుగుతుందన్నారు. వైద్యారోగ్య‌శాఖ‌, వైద్య విధాన‌ప‌రిష‌త్‌, మెడిక‌ల్ క‌ళాశాల‌, బోధ‌నాసుప‌త్రిలలో దేనికి ఎంపిక అయితే, ఆ విభాగం ప‌రిధిలోనే  ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని, విభాగాల్లో ఎటువంటి మార్పుల‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని స్పష్టం చేసారు. 

ఈ నోటిఫికేష‌న్‌లో జారీ చేసిన 194 పోస్టుల్లో ఎక్క‌డైనా, ఏడాది లోప‌ల‌ ఖాళీలు ఏర్ప‌డితే,  ఆ మెరిట్ జాబితాను నుంచి మాత్ర‌మే భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని, వేరేగా నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం జ‌ర‌గ‌ద‌ని తెలిపారు.  కౌన్సిలింగ్ అనంతరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని, తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించినచో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చ‌రించారు. కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.  విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యంజిల్లాల్లో  వైద్య శాఖకు సంబంధించిన  వివిధ కేటగిరీలలో 194 కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్‌ పోస్టులకు ఆగష్టు 29  నాటికీ ఉన్న ఖాళీలతో  రోస్టర్ వారీగా  నోటిఫికేషన్ ఇప్ప‌టికే జారీ చేయడం జరిగిందని తెలిపారు.  జిల్లా  వైద్య మరియు ఆరోగ్య శాఖ , వైద్య విధాన పరిషత్, మెడికల్ కాలేజీ, బోధనా ఆసుపత్రి ప‌రిధిలో ప‌నిచేయ‌డానికి ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్టు వివ‌రించారు.

 కోర్టు కేసు కార‌ణంగా మెడిక‌ల్ రికార్డు టెక్నీషియ‌న్  పోస్టులు రెండు మిన‌హా, 192 పోస్టుల‌కు ప్ర‌స్తుతం భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. జిల్లా వైద్యారోగ్య‌శాఖ 13, ఎపి వైద్య విధాన ప‌రిష‌త్ 29, మెడిక‌ల్ కాలేజ్  42, బోధ‌నాసుప‌త్రి లో 110  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చిన‌ట్లు వివ‌రించారు. ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసిన‌వారి ప్రొవిజనల్ జాబితాను, పోస్టులు, రోస్టర్ , రిజర్వేషన్ తదితర  వివరాలను  ఆన్ లైన్ లో  http://vizianagaram.ap.gov.in (or) http://vizianagaram.nic.in“ నందు పొందుపరచడం జరిగిందని తెలిపారు.  దీనికి సంబందించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లు అయితే పూర్తి ఆధారాలతో,  సర్వీసు సర్టిఫికేట్‌ ఉన్నవారు, తమ సర్టిఫికేట్ అసలు కాపీని నియామక అధికారితో కౌంటరు సిగ్నేచర్ చేస్తూ,  నియామక ఉత్తర్వులు కూడా జత చేసి గెజిటెడ్ ఆఫీసరు వారితో   ధ్రువీకరణ చేయించి నేరుగా  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయమునకు ఈ నెల 6 వ తేదీ  సాయంత్రం 5.గ.ల లోపు తమ గ్రీవెన్స్‌ సమర్పించ వలసి ఉంటుందని తెలిపారు.            
.........................
ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం పోస్టులు ః 194
జిల్లా వైద్యారోగ్య‌శాఖ ః 13
ఎపి వైద్య విధాన ప‌రిష‌త్ ః 29
మెడిక‌ల్ కాలేజ్ ః 42
బోధ‌నాసుప‌త్రి ః 110

Vizianagaram

2022-09-04 09:18:28

నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగు

నేత్ర దానం చేయడం ద్వారా మరోకరి జీవితంలో వెలుగు నింపిన వారమౌతామని  విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.యస్.విశ్వనాథన్ అన్నారు. ఆదివారం ఉదయం ఆర్.కె. బీచ్  కాళీమాత ఆలయం వద్ద నుండి 37 వ జాతీయ నేత్రదాన అవగాహన ర్యాలీని జెసి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ మరియు అనీల్ నీరు కొండ ఆసుపత్రి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్త దానం చేయడం వల్ల ఎంతో మందికి జీవితం నిలబెట్టిన వారవుతారని,  నేత్ర దానం చేయడం వల్ల  ఇంకోకరి జీవితం లో వెలుగు నింపిన వారమౌతామని అన్నారు. నేత్ర దానం పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఇటువంటి ర్యాలీలు ఎంతో  ప్రభావం చూపుతాయని జాయింట్ కలెక్టర్ తెలిపారు. 

అంతకు ముందు జాయింట్ కలెక్టర్ కె యస్ విశ్వనాథన్ తన మరణానంతరం తన రెండు కళ్ళు దానం చేస్తున్నట్లు  ప్రకటించి అందుకు సంబంధించిన ఫారం లో సంతకం చేశారు.ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి  కె. విజయ లక్ష్మి , పలువురు వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది విద్యార్థులు , అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-04 09:08:42

నిర్మాణాలకు ఇసుక కొరత ఉండకూడదు

ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సరఫరా లో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి జిల్లాలో ఇసుక నిల్వలు, సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనబడి నాడు-నేడు, జగనన్న కాలనీలు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు ఆటంకం కలగని విధంగా ఎప్పటికప్పుడు ఇసుక సరఫరా చేయాలని జెపి పవర్ వెంచర్స్  ప్రతినిధిని ఆదేశించారు.  ఏ రోజు ఎంత మొత్తంలో ఇసుక అవసరం ఉందో ముందుగానే అంచనావేసి మైన్స్ శాఖ ఎడి ద్వారా ఇసుక సరఫరా కంపెనీకి తెలియజేయాలన్నారు. అలాగే భీమవరం, నరసాపురంలలో కొత్తగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.  

జిల్లాలో  సిద్ధాంతం, నడిపూడి, కరుగోరుమిల్లి కోడేరులలో నాలుగు ఓపెన్ రీచ్ లు ఉన్నాయని, బోట్స్ మెన్ సొసైటీలు 11 ఉన్నాయని, ప్రస్తుతం మూడు యలమంచిలి లంక, అబ్బిరాజుపాలెం, చించినాడ బోట్స్ మెన్ సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. వరద నీటి కారణంగా 4 ఓపెన్ రీచులు , 8  బోట్స్ మెన్  వినియోగంలో లేవని తెలిపారు. మనబడి నాడు-నేడు కింద 1,200 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే జిల్లాకు  అర్బన్ పీహెచ్ సిలు మంజూరయ్యాయని, త్వరలో వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను కూడా సిద్ధం చేయాలన్నారు.  వర్షాకాలం రాకముందే ఎక్కువ మొత్తంలో ఇసుకను ఎందుకు డంప్ చేసుకోలేదని జెపి ప్రతినిధిని కలెక్టర్  ప్రశ్నించారు.  

 ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జెపి ప్రతినిధిని ఆదేశించారు. ఈ సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి.మురళీ, ఇన్చార్జ్ డిఆర్ఓ దాసిరాజు, ట్రైనింగ్ డిప్యూటీ కలెక్టర్ కుమారి డి. అఖిల, మైన్స్ శాఖ ఏడి సుబ్రమణ్యం, జిల్లా వాటర్ రిసోర్స్ అధికారి పి. నాగార్జున రావు, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కెఎస్ఎస్. శ్రీనివాస రావు, హౌసింగ్ పీడీ ఎ.వి. రామరాజు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ కె.డి. ఆనంద్, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ అర్.విజయ్ పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-03 11:38:54

ఆ భూముల్లో జ్యూడిషియల్ విచారణ జరగాలి

కాకినాడ బీచ్ రోడ్ మార్గంలో వున్న విలువైన దుమ్ములపేట భూముల్లో పేదలకు పట్టాలు గృహనిర్మాణం పనులు సత్వరం చేపట్టకుండా గత ప్రభుత్వంలో శిలా ఫలకాలతో నిర్లక్ష్యం చేసారని..  పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల పూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని కబ్జా చేయడానికి చేస్తున్న యత్నాలు గత ఏడాది నుండి జరగడం దురదృష్టకరమని.. 1983 లో ఎన్ టి ఆర్ ను కోరి మరీ తీసుకున్న అక్కడి భూమి మనిషి నిలువెత్తు లోతులో వుండగా వాటిని మెరక చేసుకోవడానికి అక్కడి మత్సకారుల కుటుంబా లకు పాతికేళ్ళు పట్టిందని పేర్కొన్నారు.. ఎన్ టి ఆర్ నగర్ గా ఆ ప్రాంతాన్ని నామకరణం చేసి పేదలకు ఇచ్చిన పట్టాలు కొనసాగించి ప్రభుత్వ గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. 

గత ఏడాది నుండి  దుమ్ముల పేట స్థలంలో ఆర్ టి సి మార్కెట్ ఏర్పాటు అంటూ చేసిన కౌన్సిల్ ప్రతిపాదనలు వివాదా స్పదం కాగా ప్రజల నివాసం లేని చోట రు.50 లక్షలు నిధులు కేటాయించిన తీర్మానం వెనుక ఉద్దేశ్యపూర్వక ఎత్తుగడలువున్నాయ న్నారు. ప్రశాంత మైన నగరంలో కంచే చేను మేస్తున చందంగా జరుగుతున్న కబ్జాల సంస్కృతి పెరగకుండా రాజకీయ అలజడి సృష్టిస్తున్న ధోరణి ప్రభలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్ముల పేట భూములపై జ్యూడిషియల్ విచారణ చేయాలని రమణరాజు కోరారు.

Kakinada

2022-09-03 11:35:16

పిఠాపురం స్పందన వినియోగించుకోవాలి

సెప్టెంబర్ నెల మొదటి  సోమవారం 5వ తేదీన  జిల్లాస్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని పిఠాపురంలోని రెడ్డి రాజా కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను పిఠాపురంలో స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి సెప్టెంబర్ 5వ తేదీన తమ అర్జీలను పిఠాపురంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ  సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే పిఠాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


Kakinada

2022-09-03 11:30:25

ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే

ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల భ‌ద్ర‌త‌, కాలుష్య నియంత్ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌రాల‌కు సంబంధించి నియ‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని.. ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా స్ప‌ష్టం చేశారు. శ‌నివారం కాకినాడ క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో ప‌రిశ్ర‌మ‌లు, క‌ర్మాగారాలు, కాలుష్య నియంత్ర‌ణ‌, విప‌త్తుల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు జిల్లాలోని వివిధ ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఇటీవ‌ల వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో నలుగురు మ‌ర‌ణించ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని.. ఇక‌పై జిల్లాలో ఒక్క ప్ర‌మాదం కూడా జ‌ర‌క్కుండా చూడాల‌న్నారు. 

భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ ప‌నిప్ర‌దేశాల‌ను అత్యంత సుర‌క్షితంగా ఉండేలా చూసుకోవాల‌ని.. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం పెను ప్ర‌మాదానికి దారితీయొచ్చ‌నే విష‌యాన్ని గుర్తించి, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. త్వ‌ర‌లో జిల్లాలోని అన్ని పారిశ్రామిక యూనిట్ల‌లో సేఫ్టీ ఆడిట్‌, త‌నిఖీలు చేప‌ట్టేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. ఈ క‌మిటీలో జిల్లా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్ట‌రీస్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ లేబ‌ర్‌, ఏపీపీసీబీ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజీనీర్‌, జిల్లా అగ్నిమాప‌క అధికారి, ఎల‌క్ట్రిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌దిత‌రులు స‌భ్యులుగా ఉంటార‌ని వివరించారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో ప్రారంభించి.. ద‌శ‌ల వారీగా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌నిఖీలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

 చెక్ లిస్ట్‌ల ప్ర‌కారం విస్తృత స్థాయి త‌నిఖీలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరుపై నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త‌, ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని.. ఆ దిశ‌గా పరిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా భ‌ద్ర‌త‌, ప‌ర్యావ‌ర‌ణ హిత చ‌ర్య‌ల‌పై ఆడిట్ జ‌ర‌గ‌నుంద‌ని వెల్ల‌డించారు. ఇంట‌ర్ లాకింగ్‌, అలార‌మ్ వంటి వ్య‌వ‌స్థ‌ల‌ను ఆధునికీక‌రించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల్లో వివిధ విభాగాల్లో ప‌నిచేసేందుకు నిబంధ‌న‌ల మేర‌కు ఆయా కార్య‌క‌లాపాల‌పై నైపుణ్య‌మున్న వారిని మాత్ర‌మే నియ‌మించుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. కార్మికుల భ‌ద్ర‌త‌తో పాటు సంక్షేమానికి సంబంధించి అన్ని నిబంధ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ‌,  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.ల‌క్ష్మీన‌ర‌స‌య్య‌, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్.అశోక్, పరిశ్రమల శాఖ ఏడీ కె.కృష్ణార్జున‌ రావు, జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి బి.యేసుబాసు, జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-03 11:26:15

శత శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాల నియంత్రణకు పాలకొండలో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు.  శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఫ్యామిలీ డాక్టరు,   బయోమెట్రిక్ హాజరు, ఆసుపత్రి ప్రసవాలు, 108, 102 తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, వాక్సిన్ ప్రక్రియ, స్కూలు విద్యార్థుల ఆరోగ్యవివరాలు నమోదు, మాతాశిశు వివరాలు నమోదు, ఆసుపత్రుల భవనాలు నిర్మాణం తదితర అంశాలపై  వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టరు అంశాలు వారీగా లక్ష్యాలు సమీక్షించారు.  ఈ సంధర్బంగా జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహిస్తూ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న  కుటుంబ డాక్టరు పధకాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. 

 ఈ పధకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,  గ్రామానికి వెళ్లినపుడు అక్కడ సచివాలయం పరిధిలో ప్రజల ఆరోగ్య వివరాలు సంబంధించిన పూర్తి సమాచారంతో గ్రామానికి వెళ్లాలన్నారు.  ఉదయం గ్రామంలో గల దీర్ఝకాల వ్యాధిగ్రస్తులు, రక్తపోటు తదితర వ్యాదులు, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడుతున్నవారికి చికిత్సనందించాలని, మద్యాహ్నం  ఇంటింటికి వెళ్లాలని, వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారి ఆరోగ్యం పరిశీలించాలని, వయోవృద్దులు, నడువలేనివారికి చికిత్స అందించాలని తెలిపారు.  ఆసుపత్రికి, పట్టణాలకు వెళ్లి పొందే వైద్యసేవలు ఇంటి వద్దనే పొందుతున్నామనే సంతృప్తి ప్రజలకు కల్పించాలని తెలిపారు.  

గర్బిణీ స్త్రీల వివరాలు నమోదు, ఆసుపత్రులు ప్రసవాలు తక్కువ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. రావివలస, సీతానగరం తదితర మండలాల ఆసుపత్రులలో ఒక్క ప్రసవం కూడా నమోదు కాకపోవడంపై వివరణ కోరారు. పాలకొండలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయవలసినదిగా ఆదేశించారు.  ఇంటింటి సర్వే, స్ప్రేయింగు, యాంటీ లార్వా కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. పాలకొండ రెవిన్యూ డివిజినల్ అధికారి, స్థానిక మున్సిపల్ కమీషనరుకు బాద్యతలు అప్పగించి పనులు పర్యవేక్షించేటట్లు అదేశాలిచ్చారు. 

నూరుశాతం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని తెలిపారు. హాజరు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య వివరాలు నమోదు 56 శాతంగాను, ఎన్.సి.డి. సర్వే 70 శాతం గాను ఉందని, కొన్ని మండలాలలో జిల్లా సరాసరి శాతం కూడా నమోదు చేయపోవడంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లలకు వ్యాక్సినేషను కార్యక్రమం 42 శాతం ఉందని నూరు శాతం పూర్తిచేయాలని, డేటా అప్ లోడ్ లో యిబ్బందులు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. 

108 వాహనాలలో ఎక్కువ ప్రసవాలు జరుగడంపై జిల్లా కలెక్టరు ప్రశ్నించారు. కొన్ని ఆసుపత్రులలో సున్నా ప్రసవాలు నమోదుకాగా  108 వాహనాలలో ప్రసవాలు పెరుగుతుండటంపై ఆయన ఆరా తీశారు. 108లో ప్రసవించిన వారి పూర్తి ఆరోగ్య వివరాలు సమర్పించాలని, ముందుగా వారిని ఆసుపత్రికి తరలించక పోవడానికి గల కారణాలపై నివేదిక సమర్పించాలని సంబంధిత పి.హెచ్.సి. అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రసవంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నివేదించాలని ఆయన ఆదేశించారు. నివేదిక అందిన 24 గంటలలో జిల్లా కలెక్టర్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

జిల్లాలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ, యితర  ఆసుపత్రుల నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తూ  చిన్నచిన్న మరమత్తు పనులు గల భవనాలను 10 రోజులలో పూర్తి చేయాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన పనులను సెప్టెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలు నాణ్యత విషయంలో వైద్యాధికారులు ముందుగానే తనిఖీ చేసి సంతృప్తిచెందాలన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాశాఖాధికారి బి. జగన్నాధరావు, ఆసుపత్రుల సమన్వయాధికారి బి.వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె.పైడిరాజు, ఎపిఎంఐడిసి ఇఇ సత్య ప్రభాకర రావు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, 108, ఇంజనీరింగు సిబ్బంది పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-03 11:17:16

2వ ద‌శ‌లో 111 ఆల‌యాల నిర్మాణాలు

స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ స‌హ‌కారంతో రెండో ద‌శలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 111 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో శ‌నివారం శ్రీ‌వాణి ట్ర‌స్టుపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 1342 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాలని నిర్ణ‌యించామ‌ని, మొదటి ద‌శ‌లో 502 ఆల‌యాల నిర్మాణం జ‌రిగింద‌ని తెలిపారు. రెండో ద‌శ‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 ల‌క్ష‌ల వ్య‌యంతో ఆల‌యాల నిర్మాణం జ‌రుగ‌నుంద‌న్నారు.



 వీటిలో శ్రీ‌వారి ఆల‌యాలు -9, రామాల‌యాలు -77, హ‌నుమంతుని ఆల‌యాలు -2, శివాల‌యాలు - 3, గ్రామ‌దేవ‌త‌ల ఆల‌యాలు - 20 ఉన్నాయ‌ని వివ‌రించారు. మొత్తం 1342 ఆల‌యాల నిర్మాణం రెండేళ్ల‌లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, ప్ర‌తి రెండు నెల‌లకోసారి ఆల‌యాల నిర్మాణంపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. నిర్మాణం పూర్త‌యిన 502 ఆల‌యాలకు, నిర్మాణం జ‌రుగ‌నున్న 111 ఆల‌యాల‌కు భ‌జ‌న సామ‌గ్రి అందించేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఆల‌యాల్లో అర్చ‌కులుగా నియ‌మించే వారికి శ్వేత ఆధ్వ‌ర్యంలో నిత్య‌పూజా విధానంపై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్నారు.   ఈ స‌మీక్ష‌లో టిటిడి జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో  ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, సమరసత సేవా ఫౌండేషన్ ఛైర్మన్  తాళ్లూరు విష్ణు, సెక్ర‌ట‌రీ త్రినాథ్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ  సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirupati

2022-09-03 10:54:54

ప్రణాళికాబద్దంగా విశాఖ నగరాభివ్రుద్ధి

జీవిఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాలను, వార్డులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం ఆమె 5వ జోన్ పరిధిలోని 49, 50 వార్డులలో పలు అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, స్థానిక కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, అల్లు శంకర్రావు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖ నగరంలో ఉన్న ప్రతి వార్డు నుంచి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 49 వ వార్డు లో సుమారు రూ. 49.90 లక్షల వ్యయంతో భూగర్భ మురుగునీటి పైపులైను పనులకు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, అలాగే 50 వార్డులో సాయిరామ్ నగర్, సత్య నగర్, మాధవధార, వంశీ నగర్, నరసింహ నగర్ , మురళి నగర్ తదితర ప్రాంతాలలో సిసి రోడ్లు, సిసి కాలువ నిర్మాణానికి సుమారు రూ.115.50 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేసామని తెలిపారు.

 అయ్యా  వార్డుల కార్పొరేటర్లు సమిష్టి కృషితో వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు ఈ వార్డుల్లో ఖర్చు పెట్టడం జరుగుతుందని  మేయర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, సచివాలయం సెక్రటరీలు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-09-03 06:49:12