1 ENS Live Breaking News

కార్పోరేషన్ ఆధ్వర్యంలో చలి వేంద్రాలు

ప్రస్తుత వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాకినాడ నగరపాలక సంస్థ  రద్దీగా ఉండే  16 ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. రూ 3 లక్షలు వెచ్చించి చలివేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వసతులు కల్పించారు. నగరపాలక సంస్థ ద్వారా  స్వచ్ఛమైన చల్లటి నీటితో  ఈ చలివేంద్రాలు ద్వారా  ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నగరపాలక సంస్థ చలివేంద్రాలు ద్వారా మంచినీటి అందించి ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. కేవలం మంచి నీరే కాకుండా  భానుగుడి జంక్షన్, టౌన్ హాల్, ప్రభుత్వాసుపత్రి, జగన్నాధపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్, అన్నమ్మ ఘాటీ సెంటర్ వంటి ముఖ్యమైన 5 ప్రాంతాలలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మజ్జిగ చలివేంద్రాలు  మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు  పని చేయనున్నాయి. చలి వేంద్రాలు ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి  నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఎస్ ఈ సత్య కుమారి,  ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఏర్పాటు  చేసిన చలివేంద్రాల లో  ఎటువంటి నీటి  సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఈ మేరకు ఆయా చలివేంద్రాలను   పర్యవేక్షించే సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ నాగ నరసింహారావు కోరారు.

Kakinada

2022-04-26 13:24:23

విజయవాడ ఘటనను ప్రతీఒక్కరూ ఖండించాలి

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఆ సంఘటన ద్వారా  రాజకీయంగా  ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు ఆరాటపడడం సహేతుకం కాదని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎంపి మార్గాని భరత్ రామ్ తో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత  మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఘటన ను ఎవ్వరూ హర్షించరని పేర్కొన్నారు. అటువంటివి సమాజంలో జరగ కూడదన్నారు. ఆ సంఘటన లోని బాధిత కుటుంబాల, బాధితురాలి వివరాలు బహిర్గతం చెయ్యరాదని చట్టాలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేత మీడియా తో కలిసి ప్రచారం కోసం చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొందరు ప్రతి పక్ష నాయకులకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని మంత్రి తెలిపారు. అత్యాచార బాధితురాలి పరామర్శను కూడా ప్రతిపక్ష నాయకుడు రాజకీయం చేశారన్నారు. పోలీసు శాఖ మూడు గంటల్లోనే అత్యాచార నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. అంతే కాదు బాధితురాలికి ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చాము. ఆ కుటుంబంలో ని బాధిత రాలికి, లేదా ఆమె తల్లికీ ఉద్యోగం కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. స్వంత ఇంటిని , స్థలాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, గృహ నిర్మాణ శాఖ మంత్రి తో ఈ విషయం పై మాట్లాడినట్లు తెలిపారు. హోం మంత్రి గా ఉన్న నన్ను ట్రోల్ చేయడం మహిళలకు ఇచ్చే  గౌరవమా..? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఛైర్మన్ తో ప్రతిపక్షా లకు చెందిన మహిళలు , వర్గాలు అడ్డు తగలడం   కొట్లాటాలా వ్యవహరించి, మహిళలు పట్ల వారి కున్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో అప్పటి సీఎం హోదాలో చేసిన  పంచాయతీని మంత్రి ఒకసారి గుర్తు చేశారు. మహిళలంతా సీఎం జగన్ వెనక ఉండటాన్ని ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. సర్వేల ఫలితాలు తెలుసుకుని, అధికారం రాదని తెలుసుకుని ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయన్నారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో  మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కాదని.. మా ప్రభుత్వంపై  నమ్మకంతో బాధితులు  బయటకు వస్తున్నారు. దిశ యాప్ ద్వారా చాలా మంది మహిళలు తమని తాము రక్షించుకున్న ఘటనలు మంత్రి ప్రస్తావించారు. హక్కుల కోసం పోరాడటాన్ని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా హర్షిస్తారని తెలిపారు. ఐతే ఇక్కడ జరిగింది ,సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యు.టి.ఎఫ్  యత్నించడం అని, ఇది ఎంతవరకు సరైనదని ఆలోచించుకోవాలి.రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ గారి పాలనపై పూర్తి నమ్మకంతో వున్నారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు నాయకులు విషప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని రాజకీయ లబ్దికోసం ఉపయోగించు కోవాలని కొందరు చూస్తున్నారన్నారు.

ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతివిషయాన్ని గమనిస్తున్నారని, ప్రభుత్వంపై అన్యాయంగా చేస్తున్న విష ప్రచారాలను గమనిస్తూనే వున్నారని , తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు, కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంపి మార్గని భరత్ మాట్లాడుతూ, దిశా చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి, తదుపరి చర్య కోసం హోం మంత్రిత్వ శాఖ కు సిఫార్సు చేసిందని తెలిపారు.  తదుపరి పార్లమెంట్ లో కూడా తదుపరి సానుకూల నిర్ణయం రావడం దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలిపారు.

Rajahmundry

2022-04-26 13:19:50

ప్రజలకు ఈ-గవర్నెస్ చేరువచేయాలి

ప్రజలకు మరింత చేరువగా పారదర్శకంగా ఈ గవర్నెస్ ద్వారా మరింత మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని,  ఆ ఉద్దేశ్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా యంత్రాంగంతో ముఖ్యమంత్రి  తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి హౌసింగ్, ఓటీఎస్ , జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, గ్రామ, వార్డు, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్ భవనాలు,  స్పందన, జగనన్న కాలనీలు, ఉపాధి హామీ, నాడు నేడు స్కూల్స్, ఆసుపత్రులు, అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత  పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారు లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలు  ఎందుకు చేసింది అన్న విషయంలో కలెక్టర్లు, జేసిలు, ఎస్పీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింతగా మెరుగైన, త్వరితగతిన పరిపాలన సౌలభ్యం అందించాలన్నదే ఉద్దేశ్యం అన్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని, లక్ష్యాలను ఛేదించే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి గృహాల ను నిర్మించే కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, దాదాపురూ.13 వేల కోట్లు ఈ పథకం కొరకు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. జిల్లా కలక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమీక్ష చేస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాలు నూరు శాతం సాధించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా ప్రగతి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు,  ఎస్ ఈ.(పిఆర్)  ఏ బివి ప్రసాద్, డి ఎమ్ & హెచ్ ఓ డా. ఆర్ స్వర్ణలత, డిటి సి ఓ డా. ఎన్. వసుంధర, డి ఎస్ సి ఓ . పి. లక్ష్మణ రావు,  డిప్యూటీ డి ఎమ్ & హెచ్ ఓ లు   డా. కె. సుధాకర్, డా. జీ. వరలక్ష్మి, డ్వామా అడిషనల్ పిడి  ఏ. మోక్షలింగం, డిఎఓ(అగ్రి) ఎస్ . మాధవరావు, డిపిఆర్వో ఐ. కాశయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-26 13:15:51

శాస్వత లైసెన్సులు చేయించుకోవాలి..

శ్రీకాకుళం  జిల్లాలో మోటారు వాహనాల లెర్నర్ లైసెన్సులు పొంది నేటివరకు శాస్వత లైసెన్సులు పొందని వారందరూ త్వరితగతిన శాస్వత లైసెన్సులను పొందాలని ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్ర రవాణా శాఖ కార్యకలాపాలన్ని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ఎన్.ఐ.సి ద్వారా నిర్వహించ బడుచున్న VAHAN  మరియు SARATHI  సేవలకు అనుసంధానించబడనున్నట్లు చెప్పారు. అందువలన ఎవరైతే లెర్నర్ లైసెన్సులను పొంది ఇప్పటివరకు శాస్వత లైసెన్సులను పొందకుండా ఉన్నారో వారందరూ త్వరితగతిన శాస్వత లైసెన్సులను పొందాలని కోరారు. లేనిఎడల సదరు LLR లన్నీ రద్దుకాబడతాయని, కావున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2022-04-26 13:02:49

గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి

రాష్ట్రంలో పేదలకు నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ ,రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ , ఏఎంసియు & బిఎంసియు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, జగనన్న గృహ నిర్మాణాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, 90 రోజుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, జగనన్న భూ హక్కు- భూ రక్ష, భూసేకరణ, నాడు - నేడు పనులు, హెల్త్, ఎడ్యుకేషన్, స్పందన గ్రీవెన్స్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన వాటిపై పీరియాడికల్ గా సమీక్షలు నిర్వహించి పనులను పర్యవేక్షించాలని సూచించారు. జగనన్న కాలనీ పెద్ద లే అవుట్ ల పై ప్రత్యేక దృష్టి సారించి అప్రోచ్ రోడ్లు, మౌలిక వసతులు కల్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద పెండింగ్ రిజిస్ట్రేషన్ లను పూర్తి చేయాలని అన్నారు. ప్రజల నుండి స్పందనకు వచ్చిన వినతులను నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. విజయనగరం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హాజరుకాగా, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి  జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, డి అర్ ఓ జల్లేపల్లి వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-26 12:56:21

జిల్లాలో ఫీవర్ సర్వే సక్రమంగా చేపట్టాలి

ఫీవర్ సర్వే సక్రమంగా చేసి వేగంగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలోని ఎంపీడీఓలు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు,గ్రామ వాలంటర్లు సమన్వయంతో  పనిచేసి పగడ్బందీగా ఫీవర్  సర్వే చేయాలని ఆదేశించారు. ఎంపిడిఓ లు క్షేత్ర స్థాయి సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. ఎం పి డి ఓ లు ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి మనబడి నాడు నేడు రెండవ విడత పనులకు సాంకేతిక పరమైన అనుమతులు పొందాలని సూచించారు. బ్యాంక్ ఖాతాలు తెరవాలని స్పష్టం చేసారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన పనిదినాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడుతూ 212 గ్రామ సచివాలయం భవనాలు,209 రైతు భరోసా కేంద్రాలు,112 వెల్నెస్ సెంటర్లు నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.84 రైతు భరోసా కేంద్రాలు 90శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. ప్రతీ వారం అధికారులతో నిర్మాణాలు, ఉపాధి పనులు పురోగతి పై సమీక్ష చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎహెచ్ ఓ డా.రామ్మోహన్, ఎంపిడిఓ లు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-26 12:53:15

రోజుకి లక్ష పనిదినాల ఉపాధి పనులు

ప్రతి జిల్లాలోను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజుకు లక్ష పనిదినాలు కల్పిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లీనిక్‌లు గృహ నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న భూ హక్కు, ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు నేడు , స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో జిల్లాలో రోజుకు లక్ష పనిదినాలు కల్పించాలని, నెలకు 25 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏప్రిల్, మే నెలలో ముమ్మరంగా ఉపాధి పనులు జరగాలన్నారు. ఈ మూడు నెలలో పనులపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డ్వమా పిడిలు, ఎంపిడి ఓలు దృష్టి పెట్టాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశ మన బడి నాడు నేడు కింద రూ.3800 కోట్ల తో 15,750 పాఠశాలలను అభివృద్థి చేసామన్నారు. రెండవ దశలో రూ.8 వేల కోట్లతో 26,451 పాఠశాలలను అభివృధ్ధి చేస్తామని మే 2 వ తేదీ నుండి పనులకు శంకుస్థాపనులు చేస్తామన్నారు. పాఠశాల కమిటీలు నాడు నేడు పనులు చేస్తాయని, కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు, డి ఇ ఓ లు పనులు తనిఖీ చేయాలని అన్నారు. కంపెనీల నుండి సిమెంటు సరఫరా ఇబ్బందులు నోడల్ అధికారిని నియమించి ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలకు ఇసుక,సిమెంటు, ఇనుము, మెటల్ సరఫరా బాధ్యతలు అప్పంగించాలని అన్నారు. భవన నిర్మానాణాల పనులన్సీ ఒకరికే అప్పగించకుండా ఎక్కువ మందికి అప్పగిస్తే పనులు వేగంగా జరుగుతాయన్నారు. తొలిదశలో 15.6లక్షల ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెల 28 వతేదీన విశాఖపట్నంలో 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. స్పందన ఫిర్యాదలు పరిష్కారంలో నాణ్యతలు పాటించాలని చెప్పారు. ఫిర్యాదులను ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారులకు తెలియ జేయాలన్నారు.ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డి ఇ ఓ డా.పి.రమేష్, గిరిజన సంక్షేమశాఖ డిడి , సి . ఎ. మణికుమార్, ఇ ఇ డివి ఆర్ ఎం రాజు,రహదారులు భవనాల శాఖ ఇ ఇ పి. బాల సుందర బాబు, ఆర్ డబ్లూ ఎస్ ఇ ఇ జవహార్ కుమార్, ఉపాది హామీ ఎపిడి జె.గిరిబాబు, వెలుగు ఎపిడి మురళి, గృహనిర్మాణ శాఖ ఇ ఇ ఎస్ రఘుభూషణ రావు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-26 12:52:01

ఆసుపత్రులు త్వరితగతిన ప్రారంభించాలి

ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు-నేడు కింద చేపట్టిన నిర్మాణ పనుల‌ను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు-నేడు కింద చేపట్టిన ఆసుపత్రుల నూతన నిర్మాణ పనులు, మరమ్మతులు, ఆధునికీక‌ర‌ణ పనుల పురోగతి తదితర అంశాలపై కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా.. జిల్లా వైద్య ఆరోగ్య, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాల అధికారులు,  పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షీంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు రూ. 45 కోట్లతో ఏలేశ్వరం, ప్రత్తిపాడు సీహెచ్‌సీల‌లో 30 నుంచి 50 పడకలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఇతర సీహెచ్‌సీల‌లో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల‌ ప్రకారం ఆధునికీకర‌ణ పనులు చేపట్టనున్న‌ట్లు తెలిపారు. కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రితో పాటు తుని ఏరియా ఆసుపత్రి, ప్రత్తిపాడు, జగ్గంపేట, రౌతులపూడి, ఏలేశ్వరం, తాళ్ల‌రేవు తదితర సీహెచ్సీలలో చేపట్టిన నిర్మాణ పనుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌న్నారు. ఇంజనీరింగ్ అధికారులు పనులలో పురోగతి చూపి నిర్దేశ గడువులోపు లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారిణి డా. బి.మీనాక్షి, జీజీహెచ్ సుపరింటెండెండ్ డా. పి.వెంకటబుద్ధ, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డా. డి.ఎస్.వి.ఎల్.నరసింహ, డీసీహెచ్ఎస్ డా. పీవీ.విష్ణువర్థిని, ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు‌, అర్ అండ్ బి ఎస్ఈ హరిప్రసాద్‌బాబు ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2022-04-26 12:12:19

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చేనెల 6వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, పగద్భందిగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై డీ అర్ ఓ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మే 6వ తేది నుంచి 23 వరకు, రెండో సంవ్సరం పరీక్షలు మే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం గం.9.00 నుంచి గం.12.00 వరకు జరుగుతాయని అన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 10349 మంది విద్యార్థులు, సెకెండ్ ఇయర్ పరీక్షలకు 10093 మంది కాగా మొత్తం 20442 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 14 పరీక్షా ప్రశ్నా పత్రాలు భద్రపరిచే కేంద్రాల నుంచి సంబంధిత పరీక్షా కేంద్రాల వద్దకు తరలించేందుకు పటిష్ట బందోబస్తు కల్పించాలని పోలీస్ అధికారులను సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద త్రాగు నీరు, ఓ అర్ ఎస్ ప్యాకెట్లను సరఫరా చేయాలని, అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్య కార్యకర్తలకు నియమించాలని ఆదేశించారు.  విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో చేరుకొనేవిధంగా ఉ.గం.6.00 నుంచి గం.8.00ల మధ్య కొమరాడ, కురుపాం మండలం కేంద్రం నుంచి  బస్సు సర్వీసులు నడపాలని అర్ టి సి సహాయ మేనేజర్ గంగ రాజును సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు  సహకరించాలని కోరారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించి ప్రతిఒక్కరూ మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎమ్.ఆదినారాయణ, డి వి ఈ ఓ ఎస్.బి.శంకర రావు, డి ఈ ఓ కె.గంగా భవాని, పోస్టల్ సహాయ పర్యవేక్షకులు పి.ఎస్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-26 10:11:37

మలేరియా రహిత జిల్లాగా చేయాలి

విజయనగరం జిల్లాలో ఎక్కడా దోమలు ఉండే అవకాశం లేకుండా చూడాలని, తద్వారా జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి పేర్కొన్నారు.  ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా  సోమవారం కలెక్టరేట్ నందు  మలేరియా నిర్మూలన పై  జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహ కలిగించడం కోసం ముద్రించిన పోస్టర్స్,, కరపత్రాలను కలెక్టర్  ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. నిలువ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా లార్వి సైడ్ మందులు  స్ప్రే చేయాలన్నారు. ఇండ్లలో కూడా దోమల మందులను స్ప్రే చేయాలన్నారు.  డ్రై డే లను పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా రానున్న మూడు రోజులు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో  ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  మజ్జిగ, ఓ.ఆర్.ఎస్, తాగు నీటిని వెంట పెట్టుకోవాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని అన్నారు. ఎండలో కి వెళ్లవలసి వస్తే టోపి లేదా గొడుగు ధరించాలన్నారు.    పరీక్షా కేంద్రాల్లోనూ ప్రతి గది వద్ద తాగు నీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారుల కూడా విధి నిర్వహణ లో  వేశవికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి పాల్గొన్నారు.

Vizianagaram

2022-04-25 16:15:12

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఘనస్వాగతం

 కేంద్ర మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ కు సోమవారం విశాఖ విమానాశ్రయంలో ఘస స్వాగతం లభించింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పుష్పగుచ్చం అందజేసి  ఆహ్వానం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా విజయనగరంలోని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న అన్నారు.  జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్వీ రమణ కుమారి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాత్రికి ఇక్కడే బసచేస్తారు. మంగళవారం ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆయన వెంట జిల్లా అధికార యంత్రాంగం కూడా కార్యక్రమాల్లో పాల్గొంటుందని జిల్లా కలెక్టర్ ఈ మేరకు ప్రకటించారు.

Vizianagaram

2022-04-25 16:11:12

గడువు లోగా వినతుల పరిష్కరించాలి

విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 129 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం  వైద్య శాఖకు 28, డి.ఆర్.డి.ఏ కు 6 వినతులు  అందగా  రెవిన్యూ కు సంబంధించి 95వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,రీ సర్వే,  గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,  డి.ఆర్.ఓ గణపతి రావు ఉప కలెక్టర్ సూర్యనారాయణ స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత  గడువు  దాటి ఉన్న వినతుల పై ఆయా అధికారులు దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క శాఖ వద్ద ఏ ఒక్క స్పందన దరఖాస్తు  గడువు దాటి ఉన్నా సహించేసి లేదని స్పష్టం చేశారు.

Vizianagaram

2022-04-25 15:13:15

రేపు ఏఎన్ఎంలకు శాఖాపరమైన పరీక్ష

ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో సేవ‌లందిస్తున్న గ్రేడ్ -3 ఎంపీహెచ్ఏలు, ఏఎన్ఎంల‌కు ఏపీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం ప్ర‌త్యేకంగా శాఖాప‌ర‌మైన ప‌రీక్ష నిర్వ‌హించనున్న‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు తెలిపారు. ఈ మేర‌కు పటిష్ఠ‌ ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై సోమ‌వారం త‌న కార్యాలయంలో వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ప‌రీక్ష‌లు స‌జావుగా జ‌రిగేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. ప‌రీక్ష ఉద‌యం 9.00 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వర‌కు జ‌రుగుతుంద‌ని సంబంధిత ఏర్పాట్లు ప‌క్కాగా చేసుకోవాల‌ని అన్ని విభాగాల అధికారుల‌కు సూచించారు. గాజుల‌రేగ‌లోని ఐయాన్ డిజిట‌ల్‌, సీతం క‌ళాశాల కేంద్రాలుగా నిర్వ‌హించే ప‌రీక్ష‌కు మొత్తం 584 మంది హాజ‌ర‌వుతున్నార‌ని, ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. వేస‌విని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, ఫ‌స్ట్ ఎయిడ్ కిట్ల‌ను కేంద్రాల వ‌ద్ద అందుబాటులో ఉంచుకోవాల‌ని చెప్పారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. లైజ‌న్ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అంద‌రి అధికారుల‌తో స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించి ప‌రీక్ష ప్ర‌శాంతంగా జ‌రిగేలా చూసుకోవాల‌ని చెప్పారు. ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యేవారు ఎలాంటి పుస్త‌కాలు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు తీసుకురాకూడ‌ద‌ని హెచ్చ‌రించారు. అంద‌రూ నిర్ణీత స‌మ‌యంలోగా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని, నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. స‌మావేశంలో ఏపీపీఎస్సీ ప్ర‌తినిధి స‌త్య‌నారాయ‌ణ‌, డీప్యూటీ డీఎం & హెచ్‌వో డా. నారాయ‌ణ‌రావు, ఐయాన్ డిజిట‌ల్ ప్ర‌తినిధి అవినాష్ బాబు, లైజెన్ అధికారులు, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజయనగరం

2022-04-25 15:04:23

మలేరియా నివారణే ధ్యేయంగా పనిచేయాలి

మలేరియా నివారణే ధ్యేయం కావాలని, ఆ ధిశగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మలేరియా అవగాహన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మలేరియా ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పక్కా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, నిర్దేశిత సమయంలో స్ప్రేయింగ్ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు. ప్రతి ఇంటి పైనా దృష్టి కేంద్రీకరించాలని, క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సహా తహశీల్దార్, మండల అధికారులు, జిల్లా అధికారులు మలేరియా నివారణ చర్యలపై తనిఖీలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మలేరియాపై ప్రజలలో మంచి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-25 09:27:34

మండలాధికారులు స్పందన నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో  సోమవారం స్పందన కార్యక్రమాన్ని మండల అధికారులు విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. స్పందనకు ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తుందని ఆయన పేర్కొంటూ సోమ వారం ఉదయం పూట మండల స్థాయి సమావేశాలు నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. 204 మంది వినతి పత్రాలు సమర్పించారు.  తోటపల్లి ప్రాజెక్ట్ పునరావాసంలో భాగంగా కొత్తవలస గ్రీన్ఫీల్డ్ కాలనీలో  నిర్వాసితులకు ఇల్లు కేటాయించారని, అదే స్థలాల్లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టినందున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అడ్డాపు శీల మండలం బంటు వాని వలస గ్రామ సర్పంచ్ సిహెచ్.గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు.  గ్రామ రాయుడు చెరువు లోని ఏ.33.61 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్నందున  ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా చెరువులో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరగకుండా కొందరు అడ్డుకుంటున్నారని, విచారణ జరిపి ఉపాధి హామీ పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వీరఘట్టం మండలం వండువ గ్రామానికి చెందిన బాసూరు విశ్వేశ్వరరావు ఫిర్యాదును అందించారు. 2019 సంవత్సరంలో గ్రామ స్మశాన వాటిక కు చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు మంజూరు చేయాలని గురుగుబిల్లి మండలం సన్యాసి రాజు పేట గ్రామానికి చెందిన జాగాన వెంకట నాయుడు కోరారు. తొంపాలపాడు చౌక ధరల దుకాణం నుండి నిత్యవసర సరుకులు తీసుకువచ్చేందుకు ప్రజలు నానావస్థలు పడుతున్నందున ప్రజల సౌకర్యార్థం జరడ గ్రామం వద్ద నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కురుపాం మండలం బొడ్డమాను గ్రామానికి చెందిన బిడ్డికొలు సుదర్శన్ అర్జీ అందజేశారు.

 గుమ్మలక్ష్మిపురం మండలం  గోయిపాక పంచాయితి కుంటేసు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి నాడు నేడు క్రింద  అభివృద్ధి చేశారని, అలాగే రెండో విడతలో మరి కొన్ని పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని గోయిపాక గ్రామానికి చెందిన సామల కృష్ణ మూర్తి వినతి సమర్పించారు.  గ్రామంలో నిర్మాణ పనులు పూర్తిచేసిన అంగన్వాడి కేంద్రం భవనానికి బిల్లులు మంజూరు చేయాలని గుమ్మ లక్ష్మీ పురం గ్రామానికి చెందిన కే.రాజేష్ కోరారు. దివ్యాంగురాలు అయిన తనకు ఎటువంటి ఆధారం లేనందున ఉపాధి అవకాశం కల్పించాలని మండలంలోని కవిటీ భద్ర గ్రామానికి చెందిన తుమరాడ దుర్గమ్మ అర్జీ అందజేశారు. కురుపాం మండలం నీలకంటాపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్ట్ లో వైద్యుని నియమించాలని అదే గ్రామానికి చెందిన ఏ.మన్మధరావు కోరారు. స్పందనకు వచ్చిన వినతులలో ఎక్కువగా రేషన్ కార్డు, సదరం దృవీకన పత్రాలు మంజూరు చేయాలని, భూసమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-25 09:25:15