1 ENS Live Breaking News

మలేరియా నివారణే ధ్యేయంగా పనిచేయాలి

మలేరియా నివారణే ధ్యేయం కావాలని, ఆ ధిశగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మలేరియా అవగాహన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మలేరియా ప్రభలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పక్కా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, నిర్దేశిత సమయంలో స్ప్రేయింగ్ జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని విధంగా పర్యవేక్షణ ఉండాలని ఆయన అన్నారు. ప్రతి ఇంటి పైనా దృష్టి కేంద్రీకరించాలని, క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సహా తహశీల్దార్, మండల అధికారులు, జిల్లా అధికారులు మలేరియా నివారణ చర్యలపై తనిఖీలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మలేరియాపై ప్రజలలో మంచి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-25 09:27:34

మండలాధికారులు స్పందన నిర్వహించాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో  సోమవారం స్పందన కార్యక్రమాన్ని మండల అధికారులు విధిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. స్పందనకు ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తుందని ఆయన పేర్కొంటూ సోమ వారం ఉదయం పూట మండల స్థాయి సమావేశాలు నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సోమవారం జరిగింది. 204 మంది వినతి పత్రాలు సమర్పించారు.  తోటపల్లి ప్రాజెక్ట్ పునరావాసంలో భాగంగా కొత్తవలస గ్రీన్ఫీల్డ్ కాలనీలో  నిర్వాసితులకు ఇల్లు కేటాయించారని, అదే స్థలాల్లో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టినందున ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అడ్డాపు శీల మండలం బంటు వాని వలస గ్రామ సర్పంచ్ సిహెచ్.గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు.  గ్రామ రాయుడు చెరువు లోని ఏ.33.61 సెంట్ల విస్తీర్ణం కలిగిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్నందున  ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా చెరువులో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు జరగకుండా కొందరు అడ్డుకుంటున్నారని, విచారణ జరిపి ఉపాధి హామీ పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వీరఘట్టం మండలం వండువ గ్రామానికి చెందిన బాసూరు విశ్వేశ్వరరావు ఫిర్యాదును అందించారు. 2019 సంవత్సరంలో గ్రామ స్మశాన వాటిక కు చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు మంజూరు చేయాలని గురుగుబిల్లి మండలం సన్యాసి రాజు పేట గ్రామానికి చెందిన జాగాన వెంకట నాయుడు కోరారు. తొంపాలపాడు చౌక ధరల దుకాణం నుండి నిత్యవసర సరుకులు తీసుకువచ్చేందుకు ప్రజలు నానావస్థలు పడుతున్నందున ప్రజల సౌకర్యార్థం జరడ గ్రామం వద్ద నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కురుపాం మండలం బొడ్డమాను గ్రామానికి చెందిన బిడ్డికొలు సుదర్శన్ అర్జీ అందజేశారు.

 గుమ్మలక్ష్మిపురం మండలం  గోయిపాక పంచాయితి కుంటేసు గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి నాడు నేడు క్రింద  అభివృద్ధి చేశారని, అలాగే రెండో విడతలో మరి కొన్ని పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని గోయిపాక గ్రామానికి చెందిన సామల కృష్ణ మూర్తి వినతి సమర్పించారు.  గ్రామంలో నిర్మాణ పనులు పూర్తిచేసిన అంగన్వాడి కేంద్రం భవనానికి బిల్లులు మంజూరు చేయాలని గుమ్మ లక్ష్మీ పురం గ్రామానికి చెందిన కే.రాజేష్ కోరారు. దివ్యాంగురాలు అయిన తనకు ఎటువంటి ఆధారం లేనందున ఉపాధి అవకాశం కల్పించాలని మండలంలోని కవిటీ భద్ర గ్రామానికి చెందిన తుమరాడ దుర్గమ్మ అర్జీ అందజేశారు. కురుపాం మండలం నీలకంటాపురం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్ట్ లో వైద్యుని నియమించాలని అదే గ్రామానికి చెందిన ఏ.మన్మధరావు కోరారు. స్పందనకు వచ్చిన వినతులలో ఎక్కువగా రేషన్ కార్డు, సదరం దృవీకన పత్రాలు మంజూరు చేయాలని, భూసమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-25 09:25:15

కాకినాడ పోలీసు స్పందనకి 47 ఫిర్యాదులు

కాకినాడ జిల్లా పోలీస్ స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలుతీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ద్వారా 47 మంది నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు ఎస్పీ ముందు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి యొక్క సమస్యలపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఆపై సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-25 09:06:31

నియోజకవర్గంలో ఒక్కోసారి స్పందన..

పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక శాసన సభ్యులు జి.శ్రీనివాసనాయుడు, జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ లతో కలిసి  స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి (సచివాలయం) వరకు స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతోందన్నారు. నూతన జిల్లాలు ఏర్పడడంతో జిల్లా యంత్రాంగం మరింత చేరువ కావడానికి తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మండల పరిధిలోనే అధికారులు అందుబాటులో ఉంటున్నా రన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు, తదుపరి వారం నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించడం జరుగుతుందన్నారు.  ఫిర్యాదుల స్థాయిపై నిరంతర పర్యవేక్షణ వలన వెంటనే పరిష్కారం చూపడానికి క్షేత్ర స్థాయిలో స్పందన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మాధవీలత తెలిపారు. 

శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కి వెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లు తీసుకుని వచ్చారన్నారు.  ప్రజా సమస్య  పరిష్కార వేదికగా ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో స్పందన ను ఏర్పాటు చేసి , ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల పరిమితి నిబంధన అమలు చేస్తున్నట్లు తెలిపారు.  నూతన జిల్లా కలెక్టర్ గా వొచ్చిన డా. మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి మన నియోజకవర్గం లో తొలి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలు తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. స్పందన పిర్యాదు ల పరిష్కారాన్ని తదుపరి స్పందన లో తీసుకున్న చర్యలపై  సమీక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమానికి జేసీ సిహెచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, జిల్లా అధికారులు, మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయకుమారి, ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారి డి.బాలశంకర రావు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, జెడి మత్స్యాశాఖ ఈ.కృష్ణారావు, డీఎస్ఓ పి.ప్రసాదరావు, డీసీఎస్ఎం కె.తులసి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి  ఎస్.మాధవరావు, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వరరావు,  నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల అధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nidadavole

2022-04-25 08:55:40

తక్షణమే వికలాంగ పించను మంజూరు

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో  సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార  ఫేషియల్, డి ఆర్ ఓ పి వెంకట రమణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వచ్చి స్పందనలో తమ సమస్యలను తెలియజేస్తూ దరఖాస్తులు సమర్పించుకున్నారు. దేవరాపల్లి మండలం వాలాబు గ్రామానికి చెందిన టి. హేమలత మెక్సికా ఫేషియల్ వ్యాధితో చికిత్స పొందుతూ సహాయం కోసం   తల్లిదండ్రులతో కలసి వచ్చి స్పందన లో దరఖాస్తు చేసుకున్నారు.  దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సీతామహాలక్ష్మిని పిలచి వివరాలను తెలుసుకుని సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు.  బాలికకు వెంటనే వికలాంగ పింఛను మంజూరు చేయవలసిందిగా డీ ఆర్ డి ఎ ఏపీడిని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేయించాల్సిందిగా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ను ఆదేశించారు.  తక్షణ సహాయం అందించిన కలెక్టర్ కు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Anakapalle

2022-04-25 08:48:28

శ్రీకాకుళం-పార్వతీపురం బస్సు ప్రారంభం

ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీకాకుళం ఆర్.టి.సి రెండవ డిపో మేనేజర్ టి.కవిత తెలిపారు. సోమవారం ఉదయం బస్ సర్వీస్ ప్రారంభించిన అనంతరం మేనేజర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల, ప్రయాణికుల వినతులు మేరకు రోజు ఉదయం 7.00 గంటలకు  బయలు దేరి, 9.30 చేరుకుంటుందని అలాగే పార్వతీపురం నుండి సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం 8.30 చేరుకుంటుందని పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించడం తో అక్కడకు వివిధ పనులపై వెళ్లి ఉద్యోగులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Srikakulam

2022-04-25 06:58:58

అన్నమాచార్య జ్ఞాపకాల పునః నిర్మించాలి

తిరుమల కొండపై కనుమరుగైన అన్నమాచార్య జ్ఞాపకాల పునః నిర్మాణాన్ని టిటిడి దేవస్థానం చేపట్టాలని కాకినాడలో శ్రీవారి భక్తులు కోరారు. ఈ అంశాన్ని డిమాండ్ చేస్తూ 25న తిరుమల కొండపై సనాతన సమధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యాన విశిష్ట స్వాములు చేపట్టిన మౌనదీక్షలకు మద్దతుగా సోమవారం ఉదయం నుంచి కాకినాడ భోగిగణపతి పీఠంలో శ్రీవారిభక్తులు  గోవిందసహస్ర నామ పారాయణ నిర్వహించి సంఘీభావం తెలిపారు.పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు విన్నూత్న రీతిలో శంఖాన్ని పూరించివిశిష్ట స్వాముల మౌన దీక్షలకు మద్దతు ప్రకటిం చారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ శ్రీవారి కొండపై అన్నమయ్య నివసించిన ఇల్లు, మండపం, ఆరాధించిన దేవతావిగ్రహాలు అన్నమాచార్యుని ఏకశిలావిగ్రహం భవిష్యత్తు తరాల కోసం ప్రతిష్టిం చాలని డిమాండ్ చేశారు. కొండమీద 365రోజులు 24గంటల పాటు నిత్యం భజన కీర్తనలు నిర్వహించే జానపద కళాకారుల ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్దరణ చేయాలని కోరారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగివేమన మున్నగు మఠాలను విశిష్టంగా అభివృద్ధి చేయాలని.. తిరుమల కొండమీద దక్షిణాది మఠాలకు తగిన ప్రాధాన్యత వుండాలని కోరారు. భజనసామ్రాట్ పట్టా రామదాసు అఖండ మంగళహారతి అందజేశారు. మహాలక్ష్మి సూర్యనారాయణమ్మ మంగతాయారు భాగ్యలక్ష్మి సీత పద్మలత తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-25 06:56:29

ప్రణాళిక ప్రకారం గ్రుహనిర్మాలు జరగాలి

సీఎం ప్రాధాన్యత కార్యక్రమమైన పేదలందరికీ ఇల్లు పథకం లో  గృహ నిర్మాణాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్నిచోట్ల ప్రశంసనీయమైన పని జరిగిందని, మరికొన్ని చోట్ల సమస్యలు వచ్చాయని తెలిసిందన్నారు.   సమన్వయం లేక సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిచోట్ల పని మందకొడిగా సాగుతోంది అన్నారు. సమస్య ఎక్కడ ఉన్నదో కనుగొని పరిష్కరించి నట్లయితే పనులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. అనకాపల్లి మండలం లో జరుగుతున్న పనుల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.  చిన్న చిన్న సమస్యలను మండల స్థాయి ప్రజాప్రతినిధులతో పరిష్కరించుకోవచ్చన్నారు. గృహ నిర్మాణాల తో సంబంధమున్న ఆయా శాఖల అధికారులు తరచు చర్చించుకోవాలన్నారు.  తాసిల్దార్ స్థాయిలోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని లేనట్లయితే ఆర్డీవో దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా డాక్యుమెంటేషన్ చేసినట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న గృహ నిర్మాణాలను  ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. మండల స్థాయిలో హౌసింగ్ అసిస్టెంట్లతో ప్రతిరోజు సమీక్షించాలని ఏ ఈ లను ఆదేశించారు. నిర్మాణాలు ఆగి పోవడం లేదా మందకొడిగా సాగడానికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ గోవిందరావు జిల్లా గృహనిర్మాణ అధికారి రఘురామ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-24 13:29:13

నియోజకవర్గ స్పందన మీకోసమే..

నిడదవోలు నియోకవర్గం స్థాయిలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం మీడియాకి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఆదిశలోనే ప్రతి నియోజకర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసే విధానం లో తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గం లో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు మండలాలు అయిన నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన ప్రజలు కోసం ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో  ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.

Rajahmundry

2022-04-24 13:23:53

కేంద్ర ఆరోగ్య మంద్రి పర్యటన ఖరారు

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ  జిల్లా ప‌ర్య‌ట‌న ఖ‌రార‌య్యింది. ఆయ‌న విస్తృత‌ ప‌ర్య‌ట‌న‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రమంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ సోమ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి మ‌న్సుఖ్‌ జిల్లాకు చేరుకొని, విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని ఎస్‌-క‌న్వెన్ష‌న్ హాలులో మేధావులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు, పార్టీ నాయకులతో స‌మావేశ‌మ‌వుతారు. రాత్రి జెడ్‌పి అతిధిగృహంలో బ‌సచేస్తారు.  26వ తేదీ ఉద‌యం 8.30కు బ‌య‌లుదేరి, గుంక‌లాం మెగా హౌసింగ్ లేఅవుట్‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డినుంచి 9.30 గంట‌ల‌కు బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాం జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను చేరుకొని, నాడూ-నేడు ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డినుంచి బ‌య‌లుదేరి, 10.15 గంటలకు నెల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధం చేరుకొని, శ్రీ సీతారామ‌స్వామి వారి ఆల‌యాన్ని సంద‌ర్శిస్తారు. స్వామివారి ద‌ర్శ‌నం అనంత‌రం 10.30 గంట‌ల‌కు పూస‌పాటిరేగ మండ‌లం కుమిలి చేరుకొని, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కంలో భాగంగా జ‌రుగుతున్నఅభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. రైతుల‌తో, వ‌లంటీర్ల‌తో మాట్లాడ‌తారు. పేద‌ల ఇంటింటికీ నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసే ఎండియు యూనిట్‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డినుంచి బ‌య‌లుదేరి 11.45కి విజ‌య‌న‌గ‌రంలోని జిల్లా కేంద్రాసుప‌త్రిని సంద‌ర్శిస్తారు. తిరిగి 12.45కి జిల్లా ప‌రిష‌త్ అతిధిగృహానికి చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 1.45 గంట‌ల‌కు అక్క‌డినుంచి బ‌య‌లుదేరి, క‌లెక్ట‌రేట్ ఆడిటోరియం వ‌ద్ద ఏర్పాటు చేయ‌నున్న ఫొటో ఎగ్జిబిష‌న్‌ను తిల‌కిస్తారు. 2.15 గంట‌ల‌కు క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి ఆధ్వర్యంలో అధికారులతో సాయంత్రం 4 గంటలు వరకు  స‌మావేశాన్ని నిర్వ‌హిస్తారు. ఈ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా పాల్గొంటారు. సమావేశం అనంత‌రం విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టుకు బ‌య‌లుదేరి వెళ్తారు.

Vizianagaram

2022-04-24 13:18:16

కేంద్ర మంత్రి పర్యటన విజయవంతం చేయాలి

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్ట‌ర్‌ మ‌న్సుఖ్ మాండ‌వీయ విజయనగరం జిల్లా ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను, క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదివారం స్వ‌యంగా ప‌ర‌శీలించారు. ఈనెల 25వ తేదీన కేంద్ర‌మంత్రి జిల్లాకు చేరుకొని, 26వ తేదీన ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాంలో నిర్మాణంలో ఉన్న‌ జ‌గ‌న‌న్న కాల‌నీని కేంద్ర‌మంత్రి సంద‌ర్శించ‌నున్న నేప‌థ్యంలో,  క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి ఈ కాల‌నీని ప‌రిశీలించారు. అధికారుల‌తో మాట్లాడి, ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, ఇత‌ర అధికారుల‌కు ప‌లు ఆదేశాల‌ను జారీ చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో హౌసింగ్ ఇఇ శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర ఇంజ‌నీర్లు పాల్గొన్నారు. జిల్లా మ‌హారాజా ప్ర‌భుత్వ‌ కేంద్రాసుప‌త్రిని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. మంత్రి ప‌ర్య‌ట‌న‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను స‌మీక్షించారు. డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్ డాక్ట‌ర్ సీతారామ‌రాజు, ఇత‌ర అధికారుల‌తో చ‌ర్చించారు.  ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్భందీగా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Vizianagaram

2022-04-24 13:10:06

పాఠశాల భవనాలు పరిపాలనకా సిగ్గు సిగ్గు

కాకినాడ సాలిపేట గరల్స్ హైస్కూల్ ప్రాంగణంలో 2002న సర్వ శిక్షా అభియాన్ నిధులతో హిందూ స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ కు నిర్మించిన భవనాన్ని పాఠశాలల విలీనంతో విద్యాశాఖ ఉప తనిఖీ అధికారి కార్యాలయంగా వినియోగించడాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తప్పుబడుతోంది. విద్యానిలయాలను విద్యకు మాత్రమే వినియగియోగించాలని, అంతేతప్పా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగించడం విద్యాహక్కు చట్టానికి విరుద్దమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు ఆరోపించారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాల భవనాన్ని ఖాళీ చేసి.. దానిని బాలికలతరగతి గదులకు వినియోగిం డిమాండ్ చేశారు. హైస్కూల్ మేడ మీద గదులను విద్యాశాఖ ఆధీనంలోవుంచడం ఎంత వరకూ భావ్యం కదాని హితవు పలికారు. ఈ విషయంలో వక్తలు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. చెట్లక్రింద తరగతుల నిర్వాహాణ జరుగుతున్నందుకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రు లు కౌన్సిల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హైస్కూల్ స్థలంలో వున్న భవనాన్ని తరగతి గదులకు అప్పగించాల ని విద్యాశాఖ ఉప కార్యాలయానికి ఇచ్చిన కౌన్సిల్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విజిట్ చేసి సాలిపేట గరల్స్ హైస్కూల్  సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Kakinada

2022-04-24 08:35:05

మే3న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం..

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం ,భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో  మే 3న అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవము జరగనుంది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయజర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు  తెలిపారు. ఈ మేరకు సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన  పాత్రికేయులతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఈ నెల 26న తొలివిడత చందనం అరగ తీత  కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుందన్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. మంగళ వారం తెల్లవారుజామున సింహాద్రి నాథుడును సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన చేస్తారన్నారు. అనంతరం గంగ ధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారన్నారు. తదుపరి వేద మంత్రోచ్ఛారణలు మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ చందనము చెక్కలను శిరస్సుపై ఉంచుకొని అర్చక స్వాములు  ఆలయ బేడా మండపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారన్నారు. తొలుత వాటికి విశ్వక్సేన, పుణ్యాహవాచనం ఆరాధన కార్యక్రమంలు నిర్వహించి శాస్త్రోక్తంగా అరగతీత ప్రారంభమవుతుందని శ్రీనుబాబు తెలియజేశారు. తొలిసారిగా అరగదీసిన చందనాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి అర్చన గావిస్తారన్నారు... ఇలా నాలుగు రోజుల పాటు అరగదీసిన మూడు మణుగుల (125 కేజీ లు) చందనానికి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరచడం జరుగుతుందన్నారు.. నిజరూప దర్శనం రోజు రాత్రికి  ( మే 3) వివిధ రకాల ఫల, పుష్పా సీతలాదులతో కూడిన సహస్ర ఘటాభిషేకం స్వామి కి నిర్వహించి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని ఆ స్వామి కి సమర్పిస్తారనీ  శ్రీను బాబు వివరించారు.  ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎంవీ  సూర్యకళ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారని ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షన చేస్తున్నట్లు చెప్పారు.

Simhachalam

2022-04-24 07:41:30

ఎండలపట్ల అప్రమత్తత అవసరం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌త కొద్ది రోజులుగా రోజురోజుకూ ఉష్ణోగ్ర‌త పెరుగుతున్న‌ కార‌ణంగా, వ‌డ‌గాలుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌ట‌న‌లో కోరారు. మ‌రికొద్ది రోజుల‌పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌న్న వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌ల‌ను బ‌ట్టి ప్ర‌తీఒక్క‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అన్నారు. ఎండ‌వేడిమి ఉండే స‌మ‌యాల్లో వీలైనంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని, త‌ప్పనిస‌రి ప‌రిస్థితిల్లో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌క్షంలో, వేడినుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు టోపీలు, గొడులు లాంటి ప‌రిక‌రాల‌ను వినియోగించాల‌ని, త‌మ చెంత మంచినీటిని ఉంచుకోవాల‌ని సూచించారు. ఈ వేస‌విలో లూజుగా ఉన్న కాట‌న్ దుస్తుల‌ను, తెలుపు రంగు దుస్తుల‌ను ధ‌రించ‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని తెలిపారు. ముఖ్యంగా వృద్దులు, చిన్న‌పిల్ల‌ల‌ ప‌ట్ల మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.  ఎక్కువ‌గా ఎండ కాసే ఉద‌యం 10 గంట‌లు నుంచి సాయంత్రం 4 గంట‌లు మ‌ధ్య బ‌య‌ట తిర‌గ‌డం, ఆరుబ‌య‌ట ప‌నిచేయ‌డం లాంటివి చేయ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ వేస‌వి కాలంలో చ‌ల్ల‌ని శీత‌ల పాణీయాల‌ను త్రాగ‌కూడ‌ద‌ని, రోడ్ల ప్ర‌క్క‌న అమ్మే క‌లుషిత ఆహారాన్ని తిన‌కూడ‌ద‌ని, మాంసారాన్ని, మ‌సాలాల‌ను తిన‌కూడ‌ద‌ని, మ‌ద్యం సేవించ‌కూడ‌ద‌ని తెలిపారు.

               వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ప్ర‌తీఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండి, త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ఎక్కువ‌గా ద్ర‌వ‌ప‌దార్ధాల‌ను, ఓఆర్ఎస్ లాంటి ద్రావ‌కాల‌ను తీసుకోవాల‌న్నారు. ఎండ తీవ్ర‌త వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త ఒక్క‌సారిగా 104.9 డిగ్రీల వ‌ర‌కు పెరిగిపోయి, దానిని నియంత్రించే శ‌క్తికి శ‌రీరం కోల్పోవ‌డ‌మే వ‌డ‌దెబ్బ‌గా ప‌రిగ‌ణిస్తార‌ని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంత‌క‌మ‌ని పేర్కొన్నారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టం, వ‌ణుకు పుట్ట‌డం, మ‌గ‌త నిద్ర లేదా క‌ల‌వ‌రింత‌లు, ఫిట్స్ లేదా పాక్షికంగా అప‌స్మార‌క స్థితి వ‌డ‌దెబ్బ ల‌క్ష‌ణాల‌ని తెలిపారు.  ప్ర‌మాద‌వ‌శాత్తూ ఎవ‌రైనా వ‌డ‌దెబ్బ‌కు గురి అయితే, వారిని నీడ‌లో ఉంచి, గాలి త‌గిలేలా చేసి, త‌డి గుడ్డ‌తో తుడిచి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చాల‌ని సూచించారు. వీలైతే వారికి ఉప్పు క‌లిపిన మ‌జ్జిగ‌ను, గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివాటిని ఇవ్వాల‌ని చెప్పారు. అయితే వ‌డ‌దెబ్బ‌కు గురై, అప‌స్మార‌క స్థితికి చేరిన‌వారికి మాత్రం నీరు త్రాగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. వారిని వీలైనంత త్వ‌ర‌గా ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని సూచించారు. వ‌డ‌దెబ్బకు త‌క్ష‌ణ చికిత్స నందించేందుకు అవ‌స‌ర‌మైన మందుల‌ను అన్ని ఆసుప‌త్రుల్లో సిద్దంగా ఉంచామ‌ని క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-04-24 07:19:24

విద్య ఒక్కటే బలమైన ఆయుధం..

విద్య ఒక్కట అన్ని ఆయుధాల కంటే ఎంతో శక్తివతమైనదని, మిగతావి ఏవైనా విద్య తరువాత స్థానంలో నిలవాల్సిందేనని  ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ జడ్జి, ఏ పి రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్  జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు.శనివారం ఆనం కళా కేంద్రం .. నార్ని కేదారేశ్వరుడు కళావేదిక పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్సా.. గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారకత.. అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా మాట్లాడుతూ, సమాజంలో ఒక బాధ్యత యుతమైన వ్యక్తిగా మనం ఏది చెయ్యాలో అది చెయ్యాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉందన్నారు. ఎవరైనా 20 సమస్యలు పేర్కొన్న సందర్భంలో వాటిలో ఒక్క దానికైన పరిష్కారం చూపగల గాలన్నరు. ప్రతిదీ ప్రభుత్వం, అధికారులే చెయ్యాలనే ఆలోచన విడనాడి చొరవ తీసుకుని ముందుగుడు వేయాల్సి అవశ్యకత ఎంతైనా ముఖ్యం అని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం అయిన నందున ఆత్మ విశ్వాసం తో కూడి ఉండాలని జస్టిస్ పిలుపు నిచ్చారు. మానవ సంబంధాలను కలిగి ఉండాలని, అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అన్నారు.  దేశంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. నేటికీ కనీస అవసరాలు కోసం ఎదురు చూస్తున్న సంఘటనలు చూస్తున్నామని, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా, ఇటువంటి అంశాలపై తీవ్రంగా ఆలోచన చెయ్యాల్సి ఉందన్నారు. విద్యా ద్వారా అభివృద్ధి సాధ్యమని, విద్యా అనే ఆయుధం ఉంటే సాధ్యం కానిది ఏది ఉండదని ఆయన అన్నారు. 

ఒక న్యాయవాదిగా, హై కోర్టు జడ్జి గా డి ఎస్ ఎస్ ఎ  యొక్క కీలక పాత్ర గుర్తించ లేదని, తదుపరి రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత గుర్తించానని తెలిపారు. ప్రజల కోసం సేవా చేసేందుకు ఒక గొప్ప అవకాశం గా పదవి లభించిందని భావిస్తానని, ఒక పౌరునికి కనీస అవసరాలు తీర్చే ప్రయత్నం గా పదవీని భావిస్తానని జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింభించేలా మీ నృత్య రీతులు ఆకట్టుకున్నాయ ని పేర్కొన్నారు. వాటిని సజీవంగా నిలిపేందుకు మీ కృషి అభనందనీయం అన్నారు.

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి -  జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ - ఛైర్మన్  శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన, అందరికీ చేరువ లో న్యాయ సేవలు, ఉండాలన్న లక్ష్యాలతో డి ఎల్ ఎస్ ఏ పని చేస్తుందని ఆమె తెలిపారు. సమస్య ఏదైనా డి ఎల్ ఎస్ ఏ దృష్టికి తీసుకొని వొస్తే సహాయం చేయడం జరుుతుందన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అందచేస్తున్న కార్యక్రమాలు కు పథకాలు చేరువ చెయ్యడం లో కీలక బాధ్యతలు నిర్వహించడం జరిగిందన్నారు. డబ్బులు ఉంటేనే న్యాయం జరుగుతుందనే భావనను కాకుండా అందరికి సమ న్యాయం కోసం పనిచేస్తుందని తెలిపారు.

జిల్లా కలక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, డి ఎల్ ఎస్ ఏ కి జిల్లా యత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తాన్నారు. ఆర్థిక సాధికరత సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి, జగనన్న విద్యా దివేన, వసతి దీవెన, చేయూత వంటి ఎన్నో నగదు ప్రోత్సహక పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ఆర్థిక సాధకారత సాధించాలంటే సంక్షేమ పథకాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి మాట్లాడుతూ, ప్రజలకు న్యాయ పరమైన అంశాలలో అండగా ఉంటున్నమన్నరు. ఎన్నో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకుని రావడం ద్వారా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. 

జిల్లా ప్రధాన న్యాయ మూర్తి -  జిల్లా న్యాయ సేవా ధికర సంస్థ - ఛైర్మన్  శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి, రాష్ట్ర డిఎస్ఎల్ఏ కార్యదర్శి ఎమ్.బబిత, సీనియర్ సివిల్ జడ్జి కం జడ్జి జిల్లా న్యాయ సేవ ధికార సంస్థ - సెక్రెటరీ  శ్రీమతి కె.ప్రత్యుషకుమారి ,  తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, కూడా ఎస్పీలు  ఐశ్వర్యరాస్తోగి, కే వి ఎస్ ఎస్ సుబ్బారెడ్డి,  వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్ లు ఇలాక్కియా, జీ. సూరజ్ ధనుంజయ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్లసుబ్బారావు, డిఆర్ఓ సత్తిబాబు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, లా విద్యార్ధులు, మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-23 14:24:13