1 ENS Live Breaking News

28న జిల్లాలో ఇళ్ల పట్టాల పండుగ..

ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. 28వ తేదీన  రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం పట్టణం పరిధిలో ఉన్న విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు పట్టాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.  324 ఎకరాల్లో లే అవుట్ వేసినట్లు చెప్పారు.  జివిఎంసి పరిధిలో ఉన్న ప్రజలకు భూ సేకరణ చేసి పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.  పెందుర్తి శాసన  సభ్యులు అదీప్ రాజ్ మాట్లాడుతూ 28వ తేదీన పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 50 వేల మందికి పట్టాలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో డిఐజి ఎస్. హరికృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ పఠాన్ శెట్టి రవి శభాష్, పెందుర్తి శాసన సభ్యులు అదీప్ రాజ్, జివిఎంసి కమీషనర్ లక్ష్మీశా, ఎస్పీ గౌతమ్ శాలిని, జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అదనపు ఎస్పీ కె. శ్రావణి, ఆర్డీవో, అనకాపల్లి చిన్ని కృష్ణ, ఉప కలెక్టర్ గున్నయ్య, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-23 13:52:59

25న నిడదవోలులో నియోజకవర్గ స్పందన

నియోకవర్గం స్థాయి లో స్పందన కార్యక్రమం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 25 సోమవారం నిడదవోలు లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల వద్దకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నా మన్నారు. ఆదిశలోనే ప్రతి నియోజకర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసే విధానం లో తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గం లో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నిడదవోలు నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు మండలాలు అయిన నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాలకు చెందిన ప్రజలు కోసం ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం యధాతధంగా నిర్వహించడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ నందు డిఆర్వో, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఆర్టీసి బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు తెలియచేశారు. స్పందన ఫిర్యాదులు మీ మీ గ్రామ వార్డ్ సచివాలయంలో , మండల పరిధిలో తీసుకోవడం జరుతుందన్నారు. 

Rajahmundry

2022-04-23 12:30:05

వలంటీర్లు మరింతగా సేవలందించాలి

రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, ఆర్థిక సాధికారికత దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం కొవ్వూరులో సుందర స్థాయి కళ్యాణ మంటపం లో  వాలంటీర్ సన్మాన కార్యక్రమం, సున్న వడ్డీ చెక్కుల పంపిణీ కార్య్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో 4,596 సంఘాలకు రు.45.51 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ ని అందించామన్నారు. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలోని 4576 గ్రూపులో ఉన్న మహిళలకు రు.6.68 కోట్ల మేర సున్న వడ్డీ రాయతీ నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేశామన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వా నికి వారధిగా నిలుస్తున్నారని తానేటి వనిత పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ తగిన రీతిన సత్కరించిన సందర్భం ఎప్పుడు జరుగలేదని, కేవలం జగనన్న హాయంలో  అటువంటి గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమా రి, మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ గండ్రోతు అంజలీ దేవి, మాజి ఎమ్మెల్సీ కోడూరి శివరామ కృ ష్ణ, అక్షయ పాత్ర శ్రీని వాస రవీం ద్ర,  ఆర్. భాస్కర రావు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు  తదితరులు పా ల్గొన్నారు.

Kovvur

2022-04-23 12:26:57

తిరుమలలో ఈఓ విస్త్రుత తనిఖీలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దృష్టిలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి శనివారం అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తుల క్యూలైన్లు, లగేజీ డిపాజిట్ కౌంటర్లు, స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. అక్కడి ఉచిత వైద్యశాలలో భక్తులకు అందుతున్న వైద్యసేవలు తనిఖీ చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు పంపిణీ చేసేందుకు అన్నప్రసాదాలు తయారు చేసే వంటశాలను పరిశీలించారు. కంపార్ట్మెంట్ల నిర్వహణ, కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి వదలడం, తోపులాటలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో సెల్లార్ లో మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందుతున్న ప్రసాదాల వితరణ విధానాన్ని, వంటశాలను పరిశీలించారు.  ఆ తర్వాత పిఎసి-1, 2, 3లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. కళ్యాణకట్ట, లాకర్ల కేటాయింపు విధానం, డార్మిటరీల్లో భక్తులకు కల్పించిన వసతులను పరిశీలించారు. ఈవో వెంట డెప్యూటీ ఈఓలు  రమేష్ బాబు,  హరీంద్రనాథ్,  పద్మావతి, భాస్కర్,  రామారావు, విజిఓ  బాలిరెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్ఓ   శ్రీనివాసులురెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్  శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.

Tirumala

2022-04-23 12:15:04

నాడు-నేడుతో రూపురేఖలు మారిపోవాలి

అనకాపల్లిజిల్లాకు మంజూరైన రెండవ విడత నాడు-నేడు పనులు మొదటి విడత లానే విద్యార్థులకు  సౌకర్యవంతంగా సుందరంగా  తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం నాడు నేడు పనులపై సర్వ శిక్ష అభియాన్, ఏ పీ ఈ డబల్ యు ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ నాడు నేడు రెండో విడతలో జిల్లాకు 379 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయన్నారు.  నాడు నేడు పనుల మూలంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు అన్నారు.  పాఠశాలను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం తో పాటు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి సర్వ శిక్ష అభియాన్ ఈ ఈ నరసింహారావు ఏపీఈ డబ్ల్యుఐడిసి డి.ఈ. మృత్యుంజయరావు ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-23 12:11:45

సచివాలయాల్లో సకాలంలో సేవలదాలి

అర్హులందరికీ సచివాలయాల ద్వారా వివిధ సేవలను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి ఆదేశించారు శనివారం ఆయన సబ్బవరం మండలం అసకపల్లి, గొట్టివాడ సచివాలయాల ను సందర్శించి పనితీరును పరిశీలించారు.  సచివాలయానికి పనులపై వచ్చిన వారు నిరాశగా వెనుకకు పోరాదన్నారు.  అర్హులైనప్పటికి కొందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన ఉండదని అటువంటి వారికి పథకాలను గూర్చి తెలియజేయాలన్నారు.  అసకపల్లి లో హౌసింగ్ లే అవుట్లను, నిర్మాణాలను పరిశీలించారు. ఇసుక సిమెంటు సరఫరాపై లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.


Anakapalle

2022-04-23 12:06:09

జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగంపెంచాలి

అనకాపల్లి జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో చేపట్టిన లేఅవుట్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు.  శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలకు సంబంధించి విద్యుత్ సరఫరా బోరుబావులు అప్రోచ్ రోడ్ల పనులు తక్షణం పూర్తయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇళ్ల నిర్మాణం పై క్షుణ్ణంగా చర్చించారు. ప్రతిపాదించిన లేఅవుట్లు, మంజూరు చేసిన గృహాల నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న ఇళ్ళ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో లబ్ధిదారులను ప్రోత్సహించి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.  ఏ.ఈ, డీ.ఈ. లు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. అవసరమైన చోట్ల బోరుబావులను వెంటనే ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు లేఅవుట్ల నిర్మాణాల్లో, గృహ నిర్మాణాలు ప్రారంభించడంలో ప్రగతి చూపించిన పెందుర్తి, ఎలమంచిలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో మిగిలిన వారు కూడా పనిచేసి గృహనిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు.  నిర్మాణాలు మందకొడిగా ఉన్న మండలాలను పరిశీలించవలసిందిగా అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో లను ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పై అధికారులకు తెలియజేస్తూ ఉండాలన్నారు. నిర్మాణ సామాగ్రి ప్రణాళికాయుతంగా సరఫరా చేస్తూ ఉండాలన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి, నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారులు చిన్నికృష్ణ, గోవిందరావు, నర్సీపట్నం డి ఎల్ డి ఓ సత్యనారాయణ జిల్లా గృహనిర్మాణ అధికారి రఘురామ, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఉమా శంకర్ గృహ నిర్మాణ శాఖ ఈ.ఈ.లు  డి.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-23 12:03:52

వ్యాపారాల కోసం రోడ్లు పాడు చేస్తారా

ఒక వైపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు ఏర్పాటు చేస్తుంటే మీ వ్యాపారాల కోసం రోడ్లు ధ్వంసం చేస్తారా అని నగర మేయర్ మహమ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ నుండి హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వరకు ఇటీవల వేసిన బిటి రోడ్డు ను శనివారం మేయర్ వసీం పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ వ్యాపారాలు కోసం షామియానాలు వేసుకుని వాటి మేకులను బీటీ రోడ్ పై కొట్టి ఉండటంతో వాటిని గమనించిన మేయర్ వసీం వ్యాపారులను పిలిపించి రోడ్లు ధ్వంసం అయ్యేలా ఎలా మేకులు ఇష్టారాజ్యంగా కొడతారని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటివి చేస్తే వ్యాపారులతో సప్లయర్ యజమానులకు కూడా ఫైన్ లు వేయాలని అధికారులకు సూచించారు. సచివాలయ సిబ్బంది కూడా రోడ్లు ధ్వంసం అయ్యేలా ఎవరన్నా వ్యవహరిస్తుంటే అలాంటి వారిపై కఠినంగా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అనీల్ కుమార్ రెడ్డి,సంపంగి రామాంజనేయులు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-04-23 12:01:11

కోవిడ్ వేక్సినేషన్ సత్వరమే పూర్తిచేయాలి

కోవిడ్ వాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జె.నివాస్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శని వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాక్సినేషన్ వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని తద్వారా నాలుగవ దశ వ్యాప్తిని నివారించుటకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలను గుర్తించి వారి ప్రసవ తేదీల జాబితాను సిద్ధం చేసి ఆసుపత్రిలో ముందుగానే చేర్చాలని ఆయన సూచించారు. తద్వారా ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావని ఆయన స్పష్టం చేశారు. వైద్య అధికారులు, సిబ్బంది విధిగా బయో మెట్రిక్ వేయాలని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-23 09:11:26

శ్రీకాకుళం-మన్యం ఆర్టీసీ ఎక్స్ ప్రెస్..

శ్రీకాకుళం నుంచి మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం వరకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ జిల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మేనేజర్ ఏ.విజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన శనివారం విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీ, సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. 7 గంటలకు ప్రారంభమైన బస్సు పాలకొండ మీదుగా పార్వతీపురం ఉదయం 9.30 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. పార్వతిపురంలో  ఉదయం 9.30 గంటలకు,  సాయంత్రం 6 గంటలకు బస్సు బయలు దేరుతుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం బస్సు బయలుదేరుతుందని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసులు ఉండాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

Parvathipuram

2022-04-23 08:40:44

ఎండ తీవ్రత పట్ల అప్రమత్త అవసరం

విశాఖ స్మార్ట్ సిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ లో 2.0 లో విశాఖకు 4వ స్టార్ రేటింగ్ వచ్చిన సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి .లక్ష్మిశ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని కలిశారు. శనివారము ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె చాంబర్లో పర్యావరణ లో 4 స్టార్ రేటింగ్ లో వచ్చిన అవార్డులను నగర మేయర్ కు చూపించారు. ఈ సందర్భంగా కమిషనర్ సూరత్ లో పర్యావరణం పై అవలంబిస్తున్న పద్ధతులను  మేయర్ కు  వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ సిటీ ఎసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 లో విశాఖకు 4 స్టార్ రేటింగ్ రావడంపై మేయర్ కమిషనర్ ను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో అధికారుల నుండి కార్పొరేటర్ల వరకు  టీం వర్క్ గా పని చేయాలని, అందుకు  ప్రణాళికలను సిద్ధం  చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,   వారంలో ఒకరోజు ఆఫీసుకు సైకిల్ ను, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  ఉపయోగించి రావడం తదితర అంశాలపై దృష్టిసారించి అని తెలిపారు. మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన సోలార్ ను, బ్యాటరీ  వాహనాలను ఉపయోగించడం ద్వారా కొంతవరకైనా పర్యావరణాన్ని   కాపాడుగలుతామని ఆమె తెలిపారు. కమిషనర్ తెలిపిన విధంగా పర్యావరణం పరిరక్షణ కొరకు కౌన్సిల్లో కొన్ని తీర్మానాలు  చేయవలసిన అవసరం ఉందని తెలిపారు

Visakhapatnam

2022-04-23 08:27:17

ఎండల తీవ్రత పట్ల అప్రమత్త అవసరం

ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. వేసవి రీత్యా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలని లేదంటే ఇంటి వద్దనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయటకు అత్యవసర సమయాల్లో వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపి తరలించాలని, లేతరంగు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిదని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నీడపట్టున ఉండటం మంచిదని సూచించారు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు తిరగవద్దు అని ఆయన కోరారు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు తీసుకోవద్దని, అధిక ప్రోటీన్ ఉండే పదార్థాలను కూడా తీసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం కలిగిఉండటం, మత్తు నిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ లక్షణాలని వీటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక వాతావరణ సమాచారాన్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. తరచూ మంచి నీటిని తాగాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీరు తాగవచ్చని ఆయన అన్నారు. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తలతిరుగుట, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఇంటి వాతావరణం వీలైనంత మేరకు చల్లదనం ఉండే విధంగా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సూచించారు. ఎండ వేడిమిని గమనిస్తూ ఎవరూ వడదెబ్బకు, అనారోగ్యానికి గురి కావద్దని సూచనలు జారీ చేశారు.

Parvathipuram

2022-04-23 07:43:53

ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలి

ప్రతీ ఎకరాకు నీరు అందాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో చేపట్టాలని ఆయన సూచించారు. జలవనరుల శాఖతో కలెక్టర్ కార్యాలయంలో శని వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మౌళిక సదుపాయాలు కల్పన వలన ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందాలని ఆయన పేర్కొన్నారు. పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జలవనరుల కాలువల పూడిక తీతతో పాటు గట్లను బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. సహాయ ఇంజినీర్లు వారీగా వారం రోజులలో పనులను గుర్తించి సమాచారం అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉండే ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి పని పట్ల స్పష్టమైన సమాచారం ఉండాలని ఆయన చెప్పారు.జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు తోటపల్లి పనులు రూ.52 కోట్లుతో  అవుతున్నాయన్నారు. రెండు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. 12 ఎకరాలు భూసేకరణ అవసరం ఉందని, భూసేకరణ అంశాలు కొన్ని పరిష్కారం కావల్సి ఉందని,  కొన్ని ప్రాంతాల్లో డి పట్టాలు కలిసి ఉన్నాయని వివరించారు. 

మన్యం జిల్లాలో తోటపల్లి భారీ తరహా జలవనరుల ప్రాజెక్టు అని చెప్పారు. నందివానివలస ఆర్ అండ్ ఆర్ కాలనీ అంశాలు పరిష్కారం కావల్సి ఉందని ఆయన తెలిపారు. వరి ప్రధాన పంట అని, రబీలో అపరాల సాగు ప్రధానంగా జరుగుతుందని అన్నారు. మన్యం జిల్లాలో తోటపల్లి క్రింద పాత ఆయకట్టు 41 వేల ఎకరాలు, కొత్త ఆయకట్టు 15 వేల ఎకరాలు సాగు అవుతోందని వివరించారు. జంఝావతి ప్రాజెక్ట్ పై రబ్బరు డ్యాం నిర్మించి 9 వేల ఎకరాలకు సాగు నీరు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. హై లెవెల్, లో లెవెల్ కెనాల్ ఉందన్నారు. జిల్లాలో మధ్య తరహా జలవనరుల ప్రాజెక్టుల క్రింద 74 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 

ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (జంజావతి) ఎన్. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) పార్వతీపురం ఆర్. అప్పలనాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (తోటపల్లి) ఆర్. రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) శ్రీకాకుళం డి.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్.ఐ.డివిజన్) పి. అప్పలనాయుడు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-23 06:55:54

సున్నావడ్డీ అల్లూరి జిల్లాకు రూ.4 కోట్లు

వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో భాగంగా సీతారామరాజు జిల్లాకు చెందిన 12,087 ఎస్ హెచ్ జిల నుండి 1,28,201 మందికి లబ్ధి చేకూరిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్  జె సుభద్ర, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నుండి వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడవ విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో లబ్ధిదారులు తోపాటు  జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ కుమార్ సుమిత్ కుమార్, పాడేరు అరకు శాసనసభ్యులు కే భాగ్యలక్ష్మి, షెట్టి ఫాల్గుణ ట్రైకార్ ఛైర్మన్ సతక బుల్లి బాబు ఎస్ హెచ్ జి సభ్యులు వీక్షించారు.  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం లో భాగంగా మూడవ విడత రూ.1261 కోట్లు విడుదల చేయడం జరిగిందని ఒక కోటి రెండు లక్షల మందికిపైగా లబ్ధి చేకూరిందని తెలిపారు.  2020లో మొదటి విడతగా 1258 కోట్లు, 2020లో రెండవ విడతగా 1100 కోట్లు కలిపి మూడేళ్లలో మూడు వేల ఆరు వందల కోట్లు అందజేశామన్నారు.  గత ప్రభుత్వ చర్యల వల్ల 18.36 శాతం స్వయం సహాయక సంఘాలు దిగజారిపోయారు దిగజారిపోయాయని , ప్రస్తుతము ఆ సంఘాలన్నీ పొందుతూ ఉన్నాయన కేవలం 0.73  శాతం మాత్రమే పుంజుకోవలసి ఉందన్నారు. అదేవిధంగా వైయస్సార్ చేయూత, వైఎస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఇల్లు కేటాయింపు, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ పెన్షన్, జగనన్న గోరుముద్దలు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి ముఖ్యమంత్రి వివరించారు.  ఎటువంటి లంచాలు, ఆలస్యం, వివక్ష లేకుండా అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

     ముఖ్యమంత్రి సందేశం అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోగల 12,087 ఎస్ హెచ్ జిల నుండి 1,28,201 మందికి లబ్ధి చేకూరుస్తూ నాలుగు కోట్ల 5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. అందులో అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల్లో 3098 గ్రూపులలోని 35,071 మందికి రూ. 62 లక్షలు, పాడేరు నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల్లోని 2658 గ్రూపులలోని 29,631 మందికి రూ. 83 లక్షలు, రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన 11 మండలాల్లోని  6331  గ్రూపులలోని 63499 మందికి రూ. 2.6 కోట్ల తో లబ్ధి చేకూరింది. 

      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం క్రింద రుణాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవడం వీడిని ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారులతో మాట్లాడి, వారి వార సాధకబాధకాలు తెలుసుకున్నారు.  ప్రతి గ్రూపులోని సభ్యులు ఇతర గ్రూపులను ప్రోత్సహించే విధంగా వారి వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించాలని సూచించారు.
         కార్యక్రమంలో భాగంగా హుకుంపేట కు చెందిన మజ్జి పార్వతి మాట్లాడుతూ వారి ఇంట్లో వారి ఆత్తకు ఆమ్మకు పెన్షన్ అందుతుందని, ఇద్దరు అబ్బాయిలకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందుతున్నాయని, రైతు భరోసా కింద తనకు కూడా పోడు భూమికి సైతం లబ్ధి చేకూరిందని ఆనంద వ్యక్తపరిచారు.  ముంచంగిపుట్టుకి  చెందిన సిహెచ్ దుర్గాదేవి మాట్లాడుతూ కూరగాయల వ్యాపారం చేస్తున్నానని, నా జీవితం సాఫీగా సాగిపోతుందని, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఆసరాగా నిలిచిందని తెలిపారు. 

Paderu

2022-04-22 11:55:17

ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవిలత ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.  ఈ సమావేశం లో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్, శానసభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్ పర్సన్ షర్మిల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులు, సర్జికల్ పరికరాలు, ల్యాబ్ కి అవసరం అయిన సామగ్రి పూర్తి స్థాయిలో అందుబాటు లో ఉంచాలన్నారు. 
రోగులు మరియు పేషెంట్ అటెండెంట్ల భద్రతకు నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.  మందులు, సర్జికల్స్, ల్యాబ్ వస్తువులు, ఆర్థో పరికరాలు ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా పేర్కొనబడని వస్తువుల కోసం టెండర్లు పిలవడానికి అనుమతి  కోరడం జరిగింది. కొనుగోలు కమిటీ రిజల్యూషన్ మేరకు టెండర్లను పిలవడానికి, అత్యవసర అవసరాలను ఖరారు చేయడానికి జిల్లా కొనుగోలు కమిటీకి సూచనలను జారీ చేయడానికి సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.  కొత్త క్యాంటీన్ భవన నిర్మాణానికి కొత్త స్థలానికి, మరమ్మతులు & రూఫ్ లీకేజీలు, ప్లంబింగ్, శానిటరీ & వాటర్ సప్లై రీప్లేస్‌మెంట్ల కోసం చర్చించారు.   వికాస్ ఫార్మసీ కళాశాల, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తాత్కాలిక పేషెంట్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి దర్శిని, ఔట్ పేషెంట్స్ & ఇన్ పేషెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించడంపై సమావేశంలో దిశా నిర్దేశనం చేశారు. .  

 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద చేసిన ఖర్చుల ధృవీకరణ కోసం , ఆరోగ్యశ్రీ ఫండ్ అభ్యర్థన నుండి రెండు బాడీ ఫ్రీజర్‌లను కొనుగోలు చేయడానికి అనుమతి.  ధృవీకరణ కోసం సమర్పించబడింది.  కమీషనర్, ఏపి వివిపి, విజయవాడ వారి సూచనల మేరకు ప్రతి నెల 5వ తేదీన అభివృద్ధి కమిటీ మీటింగ్‌ను నిర్వహించడం.  క్యాజువాలిటీని 24X7 సమర్థవంతంగా అమలు చేయడానికి జాతీయ ఆరోగ్య మిషన్  కింద ఖాళీగా ఉన్న ఏడు ముఖ్య మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకం.  రూ.49.80 లక్షల వ్యయంతో నిర్దిష్ట సివిల్ & ఎలక్ట్రికల్ పనుల అనుమతి, కొన్ని సివిల్ పనులకు మంజూరైన మరియు మెడికల్ కాలేజీ పనుల కారణంగా వినియోగించ బడని బ్యాలెన్స్ నిధులపై చర్చించారు. ఐ సి యూ యూనిట్స్, ఎసి మరమ్మతులు,  రెండు టన్నుల  ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు,  ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ టేబుల్స్, తదితర సామగ్రి కొనుగోలు పై సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఆసుపత్రి కి వొచ్చే రోగులకు ఇబ్బందులకు గురిచేయ్యకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఒక మంచి ఉద్దేశ్య ముతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశలో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసి, కార్పొరేట్ తరహా వైద్య సేవలు పేదలకు అందుబాటు లోకి తెచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టం చేశారన్నారు. జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం మరింతగా నిధులు కేటాయించాలని కోరుతామన్నరు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కె. దినేష్ కుమార్, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, డిసి హెచ్ ఎస్ డా. సనత్ కుమారి, డిఎమ్అండ్ హేచ్ఓ డా. బి. మీనాక్షి సూపరింటెండెంట్ బి. పి. సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ టివివి కే భాగ్యలక్ష్మి, అభివృద్ధి సభ్యులు మార్గని రాము, కే. సత్తిబాబు, తదితులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-22 11:52:55