1 ENS Live Breaking News

కోవిడ్ వేక్సినేషన్ సత్వరమే పూర్తిచేయాలి

కోవిడ్ వాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జె.నివాస్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శని వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాక్సినేషన్ వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ వ్యాప్తి జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించే విధంగా అవగాహన కల్పించాలని తద్వారా నాలుగవ దశ వ్యాప్తిని నివారించుటకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలను గుర్తించి వారి ప్రసవ తేదీల జాబితాను సిద్ధం చేసి ఆసుపత్రిలో ముందుగానే చేర్చాలని ఆయన సూచించారు. తద్వారా ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావని ఆయన స్పష్టం చేశారు. వైద్య అధికారులు, సిబ్బంది విధిగా బయో మెట్రిక్ వేయాలని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-23 09:11:26

శ్రీకాకుళం-మన్యం ఆర్టీసీ ఎక్స్ ప్రెస్..

శ్రీకాకుళం నుంచి మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం వరకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ జిల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మేనేజర్ ఏ.విజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన శనివారం విడుదల చేశారు. ఏప్రిల్ 25వ తేదీ, సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. 7 గంటలకు ప్రారంభమైన బస్సు పాలకొండ మీదుగా పార్వతీపురం ఉదయం 9.30 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. పార్వతిపురంలో  ఉదయం 9.30 గంటలకు,  సాయంత్రం 6 గంటలకు బస్సు బయలు దేరుతుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళంలో ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం బస్సు బయలుదేరుతుందని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రం నుండి జిల్లా కేంద్రం వరకు ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసులు ఉండాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

Parvathipuram

2022-04-23 08:40:44

ఎండ తీవ్రత పట్ల అప్రమత్త అవసరం

విశాఖ స్మార్ట్ సిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ లో 2.0 లో విశాఖకు 4వ స్టార్ రేటింగ్ వచ్చిన సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి .లక్ష్మిశ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని కలిశారు. శనివారము ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె చాంబర్లో పర్యావరణ లో 4 స్టార్ రేటింగ్ లో వచ్చిన అవార్డులను నగర మేయర్ కు చూపించారు. ఈ సందర్భంగా కమిషనర్ సూరత్ లో పర్యావరణం పై అవలంబిస్తున్న పద్ధతులను  మేయర్ కు  వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ సిటీ ఎసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2.0 లో విశాఖకు 4 స్టార్ రేటింగ్ రావడంపై మేయర్ కమిషనర్ ను అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో అధికారుల నుండి కార్పొరేటర్ల వరకు  టీం వర్క్ గా పని చేయాలని, అందుకు  ప్రణాళికలను సిద్ధం  చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,   వారంలో ఒకరోజు ఆఫీసుకు సైకిల్ ను, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్  ఉపయోగించి రావడం తదితర అంశాలపై దృష్టిసారించి అని తెలిపారు. మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన సోలార్ ను, బ్యాటరీ  వాహనాలను ఉపయోగించడం ద్వారా కొంతవరకైనా పర్యావరణాన్ని   కాపాడుగలుతామని ఆమె తెలిపారు. కమిషనర్ తెలిపిన విధంగా పర్యావరణం పరిరక్షణ కొరకు కౌన్సిల్లో కొన్ని తీర్మానాలు  చేయవలసిన అవసరం ఉందని తెలిపారు

Visakhapatnam

2022-04-23 08:27:17

ఎండల తీవ్రత పట్ల అప్రమత్త అవసరం

ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్  కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. వేసవి రీత్యా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అత్యవసర పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు వెళ్లాలని లేదంటే ఇంటి వద్దనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బయటకు అత్యవసర సమయాల్లో వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపి తరలించాలని, లేతరంగు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిదని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నీడపట్టున ఉండటం మంచిదని సూచించారు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు తిరగవద్దు అని ఆయన కోరారు. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు తీసుకోవద్దని, అధిక ప్రోటీన్ ఉండే పదార్థాలను కూడా తీసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం కలిగిఉండటం, మత్తు నిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ లక్షణాలని వీటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక వాతావరణ సమాచారాన్ని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. తరచూ మంచి నీటిని తాగాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీరు తాగవచ్చని ఆయన అన్నారు. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తలతిరుగుట, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఇంటి వాతావరణం వీలైనంత మేరకు చల్లదనం ఉండే విధంగా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సూచించారు. ఎండ వేడిమిని గమనిస్తూ ఎవరూ వడదెబ్బకు, అనారోగ్యానికి గురి కావద్దని సూచనలు జారీ చేశారు.

Parvathipuram

2022-04-23 07:43:53

ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలి

ప్రతీ ఎకరాకు నీరు అందాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో చేపట్టాలని ఆయన సూచించారు. జలవనరుల శాఖతో కలెక్టర్ కార్యాలయంలో శని వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌళిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మౌళిక సదుపాయాలు కల్పన వలన ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, ఎక్కువ ఆయకట్టుకు నీరు అందాలని ఆయన పేర్కొన్నారు. పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జలవనరుల కాలువల పూడిక తీతతో పాటు గట్లను బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. సహాయ ఇంజినీర్లు వారీగా వారం రోజులలో పనులను గుర్తించి సమాచారం అందించాలని ఆయన ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉండే ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి పని పట్ల స్పష్టమైన సమాచారం ఉండాలని ఆయన చెప్పారు.జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు తోటపల్లి పనులు రూ.52 కోట్లుతో  అవుతున్నాయన్నారు. రెండు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. 12 ఎకరాలు భూసేకరణ అవసరం ఉందని, భూసేకరణ అంశాలు కొన్ని పరిష్కారం కావల్సి ఉందని,  కొన్ని ప్రాంతాల్లో డి పట్టాలు కలిసి ఉన్నాయని వివరించారు. 

మన్యం జిల్లాలో తోటపల్లి భారీ తరహా జలవనరుల ప్రాజెక్టు అని చెప్పారు. నందివానివలస ఆర్ అండ్ ఆర్ కాలనీ అంశాలు పరిష్కారం కావల్సి ఉందని ఆయన తెలిపారు. వరి ప్రధాన పంట అని, రబీలో అపరాల సాగు ప్రధానంగా జరుగుతుందని అన్నారు. మన్యం జిల్లాలో తోటపల్లి క్రింద పాత ఆయకట్టు 41 వేల ఎకరాలు, కొత్త ఆయకట్టు 15 వేల ఎకరాలు సాగు అవుతోందని వివరించారు. జంఝావతి ప్రాజెక్ట్ పై రబ్బరు డ్యాం నిర్మించి 9 వేల ఎకరాలకు సాగు నీరు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. హై లెవెల్, లో లెవెల్ కెనాల్ ఉందన్నారు. జిల్లాలో మధ్య తరహా జలవనరుల ప్రాజెక్టుల క్రింద 74 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 

ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్.రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (జంజావతి) ఎన్. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) పార్వతీపురం ఆర్. అప్పలనాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (తోటపల్లి) ఆర్. రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్) శ్రీకాకుళం డి.శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్.ఐ.డివిజన్) పి. అప్పలనాయుడు, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-23 06:55:54

సున్నావడ్డీ అల్లూరి జిల్లాకు రూ.4 కోట్లు

వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడవ విడతలో భాగంగా సీతారామరాజు జిల్లాకు చెందిన 12,087 ఎస్ హెచ్ జిల నుండి 1,28,201 మందికి లబ్ధి చేకూరిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్  జె సుభద్ర, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంగోలు నుండి వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడవ విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో లబ్ధిదారులు తోపాటు  జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, జిల్లా కలెక్టర్ కుమార్ సుమిత్ కుమార్, పాడేరు అరకు శాసనసభ్యులు కే భాగ్యలక్ష్మి, షెట్టి ఫాల్గుణ ట్రైకార్ ఛైర్మన్ సతక బుల్లి బాబు ఎస్ హెచ్ జి సభ్యులు వీక్షించారు.  జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం లో భాగంగా మూడవ విడత రూ.1261 కోట్లు విడుదల చేయడం జరిగిందని ఒక కోటి రెండు లక్షల మందికిపైగా లబ్ధి చేకూరిందని తెలిపారు.  2020లో మొదటి విడతగా 1258 కోట్లు, 2020లో రెండవ విడతగా 1100 కోట్లు కలిపి మూడేళ్లలో మూడు వేల ఆరు వందల కోట్లు అందజేశామన్నారు.  గత ప్రభుత్వ చర్యల వల్ల 18.36 శాతం స్వయం సహాయక సంఘాలు దిగజారిపోయారు దిగజారిపోయాయని , ప్రస్తుతము ఆ సంఘాలన్నీ పొందుతూ ఉన్నాయన కేవలం 0.73  శాతం మాత్రమే పుంజుకోవలసి ఉందన్నారు. అదేవిధంగా వైయస్సార్ చేయూత, వైఎస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఇల్లు కేటాయింపు, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ పెన్షన్, జగనన్న గోరుముద్దలు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ తదితర పథకాల గురించి ముఖ్యమంత్రి వివరించారు.  ఎటువంటి లంచాలు, ఆలస్యం, వివక్ష లేకుండా అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

     ముఖ్యమంత్రి సందేశం అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోగల 12,087 ఎస్ హెచ్ జిల నుండి 1,28,201 మందికి లబ్ధి చేకూరుస్తూ నాలుగు కోట్ల 5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. అందులో అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల్లో 3098 గ్రూపులలోని 35,071 మందికి రూ. 62 లక్షలు, పాడేరు నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల్లోని 2658 గ్రూపులలోని 29,631 మందికి రూ. 83 లక్షలు, రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన 11 మండలాల్లోని  6331  గ్రూపులలోని 63499 మందికి రూ. 2.6 కోట్ల తో లబ్ధి చేకూరింది. 

      ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం క్రింద రుణాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవడం వీడిని ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారులతో మాట్లాడి, వారి వార సాధకబాధకాలు తెలుసుకున్నారు.  ప్రతి గ్రూపులోని సభ్యులు ఇతర గ్రూపులను ప్రోత్సహించే విధంగా వారి వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించాలని సూచించారు.
         కార్యక్రమంలో భాగంగా హుకుంపేట కు చెందిన మజ్జి పార్వతి మాట్లాడుతూ వారి ఇంట్లో వారి ఆత్తకు ఆమ్మకు పెన్షన్ అందుతుందని, ఇద్దరు అబ్బాయిలకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందుతున్నాయని, రైతు భరోసా కింద తనకు కూడా పోడు భూమికి సైతం లబ్ధి చేకూరిందని ఆనంద వ్యక్తపరిచారు.  ముంచంగిపుట్టుకి  చెందిన సిహెచ్ దుర్గాదేవి మాట్లాడుతూ కూరగాయల వ్యాపారం చేస్తున్నానని, నా జీవితం సాఫీగా సాగిపోతుందని, వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ఆసరాగా నిలిచిందని తెలిపారు. 

Paderu

2022-04-22 11:55:17

ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవిలత ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి లో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు.  ఈ సమావేశం లో నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్, శానసభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్ పర్సన్ షర్మిల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులు, సర్జికల్ పరికరాలు, ల్యాబ్ కి అవసరం అయిన సామగ్రి పూర్తి స్థాయిలో అందుబాటు లో ఉంచాలన్నారు. 
రోగులు మరియు పేషెంట్ అటెండెంట్ల భద్రతకు నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.  మందులు, సర్జికల్స్, ల్యాబ్ వస్తువులు, ఆర్థో పరికరాలు ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ద్వారా పేర్కొనబడని వస్తువుల కోసం టెండర్లు పిలవడానికి అనుమతి  కోరడం జరిగింది. కొనుగోలు కమిటీ రిజల్యూషన్ మేరకు టెండర్లను పిలవడానికి, అత్యవసర అవసరాలను ఖరారు చేయడానికి జిల్లా కొనుగోలు కమిటీకి సూచనలను జారీ చేయడానికి సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.  కొత్త క్యాంటీన్ భవన నిర్మాణానికి కొత్త స్థలానికి, మరమ్మతులు & రూఫ్ లీకేజీలు, ప్లంబింగ్, శానిటరీ & వాటర్ సప్లై రీప్లేస్‌మెంట్ల కోసం చర్చించారు.   వికాస్ ఫార్మసీ కళాశాల, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో తాత్కాలిక పేషెంట్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి దర్శిని, ఔట్ పేషెంట్స్ & ఇన్ పేషెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహించడంపై సమావేశంలో దిశా నిర్దేశనం చేశారు. .  

 డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద చేసిన ఖర్చుల ధృవీకరణ కోసం , ఆరోగ్యశ్రీ ఫండ్ అభ్యర్థన నుండి రెండు బాడీ ఫ్రీజర్‌లను కొనుగోలు చేయడానికి అనుమతి.  ధృవీకరణ కోసం సమర్పించబడింది.  కమీషనర్, ఏపి వివిపి, విజయవాడ వారి సూచనల మేరకు ప్రతి నెల 5వ తేదీన అభివృద్ధి కమిటీ మీటింగ్‌ను నిర్వహించడం.  క్యాజువాలిటీని 24X7 సమర్థవంతంగా అమలు చేయడానికి జాతీయ ఆరోగ్య మిషన్  కింద ఖాళీగా ఉన్న ఏడు ముఖ్య మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకం.  రూ.49.80 లక్షల వ్యయంతో నిర్దిష్ట సివిల్ & ఎలక్ట్రికల్ పనుల అనుమతి, కొన్ని సివిల్ పనులకు మంజూరైన మరియు మెడికల్ కాలేజీ పనుల కారణంగా వినియోగించ బడని బ్యాలెన్స్ నిధులపై చర్చించారు. ఐ సి యూ యూనిట్స్, ఎసి మరమ్మతులు,  రెండు టన్నుల  ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు,  ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ టేబుల్స్, తదితర సామగ్రి కొనుగోలు పై సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఆసుపత్రి కి వొచ్చే రోగులకు ఇబ్బందులకు గురిచేయ్యకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఒక మంచి ఉద్దేశ్య ముతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశలో నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసి, కార్పొరేట్ తరహా వైద్య సేవలు పేదలకు అందుబాటు లోకి తెచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టం చేశారన్నారు. జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం మరింతగా నిధులు కేటాయించాలని కోరుతామన్నరు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కె. దినేష్ కుమార్, రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, డిసి హెచ్ ఎస్ డా. సనత్ కుమారి, డిఎమ్అండ్ హేచ్ఓ డా. బి. మీనాక్షి సూపరింటెండెంట్ బి. పి. సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ టివివి కే భాగ్యలక్ష్మి, అభివృద్ధి సభ్యులు మార్గని రాము, కే. సత్తిబాబు, తదితులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-22 11:52:55

స్పందన దరఖాస్తులకి అత్యధిక ప్రాధాన్యత

స్పందనకు వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటిడిఏ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, డి ఆర్ ఓ బలివాడ దయానిధితో కలిసి వివిద మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముందుగా అధికారులతో స్పందన సమస్యల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనలో వివిద శాఖలకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. ఆర్దిక, ఆర్దికేతర ఫిర్యాదులను విభజించి సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలన్నారు. అధికారులు కచ్చితంగా క్షేత్ర పర్యటనలు చేయాలన్నారు. రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుండి 92 ఫిర్యాదులు స్వీకరించారు. తాగునీటి సమస్యలు, ఉపాధి కల్పన, రోడ్లు నిర్మాణాలు, సామాజిక పింఛన్లు, భూ సమస్యలపై ఎక్కవగా ఫిర్యాదులు అందాయి.స్వీరిస్తున్న ఫిర్యాదులపై అక్కడికక్కడే అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసారు.

స్పందనలో కొన్ని ఫిర్యాదులు ఇలా..
హుకుంపేట మండలం రంగశీల గ్రామానికి చెందిన సాగిరి రామారావు తన పట్టానెం 124 సర్వే నెం. 91-1 , 0.34 సెంట్ల భూమి సాగిరి మాణిక్యాలరావు పట్టాలో కలిసి పోయిందని దానిని సర్వేనెం.90-1 నమోదు చేయాలని వినతి ప్రత్రం సమర్పించారు. హుకుంపేట మండలం సంతారి గ్రామ సర్పంచ్ పాడి అప్పల నాయుడు చిన బూరుగుపుట్టు గ్రామంలో చేతి పంపు ఉందని తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని, సోలార్ సిస్టం ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ గత్తరగుడ గ్రామానికి చెందిన వికలాంగుడు కొర్రా గోవింద్, పాడేరు మండలం కందమామిడి గ్రామస్తురాలు ఎం.లక్ష్మి కుమారి ఉద్యోగం కోసం దరఖాస్తులను సమర్పించారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ చేరువీది గ్రామస్తులు కె.చిట్టిబాబు, ఎ.బొంజునాయుడు, కె.చిలకమ్మ, తదితర 26 మంది గిరిజనులు చేరువీది గ్రామం నుండి పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ కింత్రేలు గ్రామం వరకు తారురోడ్డు నిర్మించాలని కోరారు. డుంబ్రిగుడ మండల గుంటగన్నెల పంచాయతీ జాకరవలస గ్రామానికి చెందిన తెడబారికి రాజారావు వృధ్ధాప్య పింఛను మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఆదివాసీ మహా సభ అధ్యక్షులు కొర్రా అప్పారావు హుకుంపేట మండలం బిజ్జాపల్లి పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మించాలని దరఖాస్తును అందజేసారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ఎపి ఓలు వి ఎస్ ప్రభాకర రావు, ఎం. వేంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు సి ఎ మణికుమార్, రహదారులు భవనాల శాఖ ఇ ఇ బాల సుందరరావు, జిల్లా వైద్యాధికారి డా. ఎల్.రామ్మోహన్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ జవహార్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-22 11:34:07

పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత

పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్. శంకర్ నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించడం కొరకు విభూతి బ్రదర్స్ కళాజాత బృందం వారిచే రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి పుడమిని కాపాడుకోవాలని అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జ్యూట్, వస్త్ర మరియు కాగితంతో తయారుచేసిన సంచులు వాడడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చనే అంశాలపై ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం లలో పలు ప్రాంతాలలో వీధి నాటికలు ప్రదర్శించి ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ అధికారి ఎస్.శంకర్ నాయక్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎన్విరాల్మెంట్. ఇంజనీర్ హరీష్ నాటక ప్రదర్శనకు ముందు సభ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ నిమిత్తం చేపట్టవలసిన పనులను వివరించారు.

Srikakulam

2022-04-22 10:09:38

స్టాండింగ్ కమిటీ నిలువుదోపీడీని ఆపాలి

కాకినాడనగర పాలకసంస్థ స్టాండింగ్ కమిటీ  తీర్మానాలను జిల్లా కలెక్టర్ నిలుపు చేయాలని పౌరసంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మరో2నెలల్లో కాకినాడస్థానిక ఎన్నికలనోటిఫి కేషన్ రానుందని అత్యవసరమైన పనులు త్రాగునీరు..పూడికలు తీయించడం.. పారిశుద్ధ్యపనుల కు.. మినహా ఇతర పనులకు కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్న  ఆఖరి 5నెలలలో అనుమతిం చే అధికారం వుండదని పేర్కొన్నారు. స్టాండింగ్  సప్లిమెంట్'బులిటెన్లలో సాధారణపనులకురు.10కోట్లు కేటాయిం చే 22అంశాలు చేర్చారని పేర్కొన్నారు.ఇవి కాకుండా బోటుక్లబ్బుపార్కు వివేకానందపార్కుగాంధీనగర్ పార్కుల  పర్యవేక్ష ణపేరిట కోటిన్నర కేటా యించడం అనుచితం గా వుందన్నారు. మరెన్ని సప్లిమెంట్లు వస్తాయో అర్థంకాని దుస్తితివుందన్నారు. ఇప్పటికే రు.29కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బకాయిలున్నాయని-స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆగిపోయే పరిస్థితిలో రు.300కోట్ల రూపా యల భారం పడనుం దన్నారు. జనరల్ నిధులు రు.150 కోట్లు ఇతర ప్రభుత్వ విభాగా లకు మళ్లించారని ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ ఆస్తిపన్ను బకాయి రు.66కోట్లు వాటి అదనపు భవనాల కొలతలు తీయని అంచనాపన్ను పెరిగిన 15శాతం పన్ను కలిపి మరో రు.5కోట్లు వుంటుందని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఇదే అజెండాలో 32వ అంశం నందు ద్వారంపూడి పేరిట 6గొడౌన్లకు 50 శాతం పన్నురాయితీ ఇవ్వడం ద్వారా రు.6 లక్షలు రిఫండ్  ఇచ్చే అంశం తేవడం విడ్డూరంగా ఉందన్నా రు. తీవ్రఆర్థిక మాంద్యం లో వున్న కాకినాడ నగర పాలక సంస్థకు రాబోయే వర్షాల్లో ముంపు కు గురయ్యే ప్రమాదం ఎదురుకానుందని హెచ్చరించారు. జనరల్ నిధుల్లో ఇప్పటికే రు.50కోట్ల రూపాయల పనులు నిలిచిపోయా యని వీటికి తోడుగా మరిన్నిఅత్యవసరంకాని పనులు ఆమోదిస్తేఆర్థికభవిష్యత్తు అంధకార మవుతుందన్నారు.
10శాతం కమీషన్ కోసంకక్కుర్తి పడుతున్న కార్పొరేటర్లు కార్పోరేషన్  భవితవ్యం కోసం కించిత్ ఆలోచన లేకపోవడం దుర్మార్గపు  చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే కౌన్సిల్ దుర్వినియో గాన్ని నియంత్రణ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు కొత్త కౌన్సిల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేయాలని కోరారు. పరిసర 6గ్రామాలు విలీనం చేసుకునే తీర్మానం అమలుచేయించి కాకినాడ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Kakinada

2022-04-22 10:07:08

24నుంచి పాడి రైతులకు రుణాలు..

రైతు భాగస్వామ్యం – మన ప్రాధాన్యత ప్రత్యేక క్యాంపుల ద్వారా పాడి మరియు మత్స్య పరిశ్రమ ల కోసం ఈ నెల 24 నుండి మే 1 వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకర్లు రుణ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో ప్రత్యేక జిల్లా సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
రైతు భాగస్వామ్యం – మన ప్రాధాన్యతా క్యాంపు ల నిర్వహణ పై లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని 445 ఆర్ బి కె ల ద్వారా పి ఎం కిసాన్ లబ్దిపొందని ఆర్ బి కె పరిధిలో కనీసం 10 మందికి తక్కువ కాకుండా పాడి మరియు మత్స్య రుణాల కోసం లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు తమ పరిధిలోని ఆర్ బి కేల నుండి అందే జాబితా మేరకు అర్హత గల లబ్దిదారులను గుర్తించి వారికి రుణాలను మంజూరు చేయాలని సూచించారు. ప్రస్తుతం రుణ మేళా నిర్వహిస్తున్న నేపథ్యం లో గతం లో రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతుల జాబితాలను పరిశీలించి అర్హత మేరకు తప్పని సరి రుణాలను మంజూరు చేయాలని సూచించారు. వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య శాఖల అధికారులు సమన్వయం తో లబ్దిదారులకు అవగాహన కల్పించి మంజూరు చేయాల్సి ఉంటుందని సూచించారు. జిల్లా లో దాదాపు 8200 వరకు గృహ నిర్మాణాలు ప్రారంభం కాలేదని ఎస్ హెచ్ జి సంఘాల లబ్దిదారులకు కనీసం రూ.35 వేలు ఋణం మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. స్టాండ్ అప్ ఇండియా లోన్ ల పై కూడా దృష్టి పెట్టగలిగితే 6వేల ఎకరాల ఏ పి ఐ ఐ సి భూములు పరిశ్రమల కోసం అందుబాటులో ఉన్నాయని చాల మంది పరిశ్రమల రుణాల కోసం వేచి ఉన్నారని, జిల్లా లో అన్ని అనుకూల వసతులు ఉన్నందున బ్యాంకర్లు పరిశ్రమల రుణాల మంజూరు పై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశం లో ఈ డి ఎం నాబార్డ్ సునీల్, లీడ్ బ్యాంక్ కన్వీనర్ అరుణ, ఏ జి ఎం యూనియన్ బ్యాంక్ శర్మ, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ, మత్స్య పశు సంవర్థక శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-04-22 09:52:13

గుడ్ మార్నింగ్ ఆముదాలవలసలో స్పీకర్

గుడ్ మార్నింగ్ ఆమదాలవలస అంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇదొక వినూత్నమైన కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లక్ష్ముడిపేట వార్డు లో ఇంటింట పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో  లక్ష్మడు పేట నుండి వెంకంపేట వెళ్లే లింక్ రోడ్డు మరియు కాలువలు నిర్మించాలని ప్రజలు స్పీకర్ ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఇవ్వాళ గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంలో తిరిగినప్పుడు లక్ష్మడుపేట వార్డులో తిరిగినప్పుడు నాకు ఎక్కువగా వచ్చిన సమస్యలు డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం నా దృష్టికి వచ్చాయని అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా కొంతమంది మున్సిపల్ నకొళాయి నీటిని చౌర్యం చేస్తున్నారని మోటర్ల ద్వారా ట్యాంకులకు నింపుతున్నారని దానివలన ఎగువ ప్రాంతాల్లో ఉన్న వారికి మంచి నీరు రాక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చిందని అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి మోటార్ లను తొలగించాలని అధికారులు ఆదేశించామని తెలియజేశారు. సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నారని ఈ విధంగా తిరగడం వలన ప్రజల సమస్యలు తెలుస్తాయని దాని ద్వారా జవాబుదారితనం పెరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బోర చిన్నo నాయుడు, పొన్నాడ చిన్నారావు, మామిడి ప్రభాకర్, కూన రామకృష్ణ, స్థానిక నాయకులు దుంపల చిరంజీవి, కూన ఆంజనేయులు,    బగాది రమణ, బగాది త్రినాధరావు, పొదిలాపు తిరుపతిరావు మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్,  మున్సిపల్ ఏఈలు అప్పలనాయుడు,సృజన, ఎలక్ట్రికల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, సచివాలయం సిబ్బంది వలంటీర్లు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-22 09:49:45

జిల్లాకు రానున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర శనివారం జిల్లాకు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. శనివారం ఉదయం 6.15 గంటలకు సాలూరులో ఉపముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. 24వ తేదీన విజయనగరం జిల్లా ఎస్.కోట లో పర్యటిస్తారని, 25వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారని ఆయన చెప్పారు. 26వ తేదీన విజయనగరంలో జరిగే నీతి అయోగ్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని రాష్ట్ర కార్యాలయం పేర్కొన్నట్టు పర్యటన వివరాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

Parvathipuram

2022-04-22 09:47:36

మన్యం జిల్లాకు రూ.13.68 కోట్లు జమ..

అక్కా చెల్లెమ్మలకు మంచి చేయాలనేది ధ్యేయమని రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద సంఘాల సభ్యుల ఖాతాలకు నిధులు జమ చేసే కార్య్రమం శుక్రవారం జరిగింది. ప్రకాశం జిల్లాలో పాల్గొన్న ముఖ్య మంత్రి బటన్ నొక్కి నిధులు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ముఖ్య మంత్రి మాట్లాడుతూ సున్నా వడ్డీ పథకం క్రింద మూడు సంవత్సరాలలో రూ.3,615 కోట్లు చెల్లించామని చెప్పారు.  పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ 20,055 స్వయం సహాయక సంఘాలలోని 2,30,675 మంది సభ్యులకు రూ.13.68 కోట్లు నిధులు జమ అవుతుందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 2019 - 20 సంవత్సరానికి 16,695 సంఘాల్లోని 1,92,694 మంది సభ్యులకు రూ.11.05 కోట్లు,  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 18,868 సంఘాలలోని 2,15,165 మంది సభ్యులకు రూ.10.66 కోట్లు చెల్లించడం జరిగిందని చెప్పారు. మూడు సంవత్సరాల్లో 20,055 మహిళా సంఘాలలోని 2,30,675 సభ్యులకు మొత్తం రూ.35.39 కోట్లు విడుదల చేయడం జరిగిందని వివరించారు.

మూడవ విడత క్రింద డి.ఆర్.డి.ఏ పరిధిలో పార్వతీపురం నియోజక వర్గంలో  4337 స్వయం సహాయక సంఘాలకు రూ.2.78 కోట్లు, కురుపాం నియోజక వర్గంలో 4893 స్వయం సహాయక సంఘాలకు రూ.2.51 కోట్లు, సాలూరు నియోజక వర్గంలో 3315 స్వయం సహాయక సంఘాలకు రూ.1.70 కోట్లు, పాలకొండ నియోజక వర్గంలో 4694 స్వయం సహాయక సంఘాలకు రూ.2.43 కోట్లు విడుదల కాగా., మెప్మా పరిధిలో గల పార్వతీపురం మునిసిపాలిటీ పరిధిలో గల 1006 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.42 కోట్లు, సాలూరు మునిసిపాలిటీ పరిధిలో గల 1181 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.1.85 కోట్లు, పాలకొండ మునిసిపాలిటీ పరిధిలో గల 629 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.99 లక్షలు వెరసి రూ.4.26 కోట్లు జమ అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నమూనా చెక్కులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అలజంగి జోగారావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, మునిసిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్ పర్సన్ కె.రుక్మిణి, వైఎస్సార్ క్రాంతి పథం ఏపీడి సత్యం నాయుడు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-22 08:13:08

ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం..

ఆరోగ్య‌వంత‌మైన స‌మాజాన్ని రూపొందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, దీనికోసం ఎన్నో కార్యక్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా ప‌రిష‌త్ ఛైర్‌ప‌ర్స‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. అందుకే వైద్య రంగానికి మ‌న‌ ముఖ్య‌మంత్రి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నార‌ని చెప్పారు.  అజాదీకా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా, ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం క్రింద జిల్లా కేంద్రాసుప‌త్రిలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన‌ ఆరోగ్య మేళాను జెడ్‌పి ఛైర్మ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర్చ‌డానికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా, ఈ ఆరోగ్య మేళాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. వీటిని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని కోరారు. ఆరోగ్య మేళాల‌ను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయాల‌ని సూచించారు.  ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించి ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, దీనికి వైద్యారోగ్య‌శాఖ కృషి చేయాల‌ని కోరారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, ప్ర‌భుత్వ వైద్య సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకే ఆరోగ్య మేళాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు. ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్‌ ఐడి కార్డులు చాలా ఉప‌యోగ‌క‌ర‌మ‌ని, దీనివల్ల ఆయా వ్య‌క్తుల పూర్తి ఆరోగ్య చరిత్ర‌ను ఈ కార్డుల ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని చెప్పారు. హెల్త్ ఆధార్ లాంటి ఈ ఐడి కార్డుల‌ను ప్ర‌తీఒక్క‌రికీ త్వ‌రిత‌గ‌తిన జారీ చేయాల‌ని సూచించారు. 

మ‌న ప్రాంత ఆహార అల‌వాట్లు, సామాజిక స్థితిగ‌తుల కార‌ణంగా ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎక్కువ‌గా క్ష‌య‌, కుష్టు, సికిల్ సెల్ ఎనీమియా లాంటి వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నార‌ని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక‌, సామాజిక ప‌రిస్థితులు, విద్య‌తో సంబంధం లేకుండా, చాలా ఎక్కువ‌మంది ర‌క్త‌హీన‌త‌తో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ప్ర‌ధానంగా మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డమే దీనికి కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అత్యంత చౌక‌గా దొరికే వేరుశ‌న‌గ‌, నిమ్మ‌, ఉసిరి, బెల్లం లాంటి ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవ‌డం ద్వారా, ర‌క్తాన్ని సులువుగా పెంచుకోవ‌చ్చ‌ని సూచించారు. చిన్న వ‌య‌సులోనే వివాహాల వ‌ల్ల, మ‌హిళ‌ల్లో ఎన్నో స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయ‌ని చెప్పారు. చిన్న వ‌య‌సులో వివాహాల‌ను నివారించేందుకు, జిల్లాలో మ‌హిళా జాగృతి యాత్ర‌ల‌ను ప్రారంభించామ‌ని, ఒక ఉద్య‌మంలా ఈ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తామ‌ని  చెప్పారు. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఆరోగ్య మేళాల‌ను, అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను వినియోగించుకోవ‌డం ద్వారా, ప్ర‌తీఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా త‌మ దృక్ఫ‌థాన్ని మార్చుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

              ఆరోగ్య మేళా సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శిబిరాల‌ను జెడ్‌పి ఛైర్మ‌న్‌, క‌లెక్ట‌ర్ ముందుగా సంద‌ర్శించారు.  ఆరోగ్య ప‌రీక్ష‌ల శిబిరం, ఆయుష్మాన్ భార‌త్ ఐడి కార్డుల జారీ, అసంక్ర‌మిత వ్యాధుల నిర్ధార‌ణ, క్ష‌య‌, చెవి, గొంతు, ముక్కు వ్యాధుల విభాగం, ఎయిడ్స్‌, కుష్టువ్యాధి శిబిరం, ఆయుష్ విభాగం, ర‌క్త ప‌రీక్ష‌ల శిబిరం, మ‌లేరియా, ఫైలేరియా, డెంగ్యూ వ్యాధుల నిర్ధార‌ణా శిబిరం, కంటి విభాగం త‌దిత‌ర శిబిరాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన‌ ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభించారు. స‌హ‌జ కాన్పు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ల‌ వ‌ల్ల త‌లెత్తే స‌మ‌స్య‌ల‌పై ల‌ఘు చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. చిన్న‌వ‌య‌సులో చేసే వివాహాల వ‌ల్ల క‌లిగే అన‌ర్ధాల‌పైనా, అవ‌య‌వ‌దానం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పైనా, ప్ర‌ద‌ర్శించిన స్కిట్‌లు ఆలోచింపజేశాయి. వైద్యులు, సిబ్బంది ప్ర‌ద‌ర్శించిన యోగాస‌నాలు ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌, ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్ సీతారామ‌రాజు, ఆర్ఎంఓ డాక్ట‌ర్ స‌త్య‌శ్రీ‌నివాస్‌, మాజీ డిసిఎంఎస్ ఛైర్మ‌న్ కెవి సూర్య‌నారాయ‌ణ‌రాజు, వివిధ వైద్య విభాగాల అధిప‌తులు, ప‌లువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-04-22 07:07:42