1 ENS Live Breaking News

భూ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..

భూ రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లు తో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని 29 పూర్తి అయ్యాయని మిగిలినవి త్వరిత గతిన పూర్తిచేయడం జరుగుతుందన్నారు. గతంలో డ్రోన్ల ద్వారా 10 నుండి 12 కి.మీ వరకు సర్వే జరిగేదని, అయితే సాంకేతిక లోపాలు కారణంగా ప్రస్తుతం 6 కి.మీ వరకే సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనివలన సర్వేలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, డిఆర్ఓ ఎం.రాజేశ్వరి , సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ ఎడి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 08:54:30

మన్యానికి సున్నావడ్డీ రూ.13.68 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద శుక్రవారం సంఘాల సభ్యుల ఖాతాలకు నిధులు జమ చేయనుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో 20,055 స్వయం సహాయక సంఘాలలోని 2,30,675 మంది సభ్యులకు రూ.13.68 కోట్లు నిధులు జమ కానుంది. జిల్లాలో మొదటి విడతలో 2019 - 20 సంవత్సరానికి16,695 సంఘాల్లోని 1,92,694 మంది సభ్యులకు రూ.11.05 కోట్లు,  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 18,868 సంఘాలలోని 2,15,165 మంది సభ్యులకు రూ.10.66 కోట్లు చెల్లించడం జరిగింది. మూడు సంవత్సరాల్లో 20,055 మహిళా సంఘాలలోని 2,30,675 సభ్యులకు మొత్తం రూ.35.39 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్ క్రాంతి పథం ఏపీడి సత్యం నాయుడు గురు వారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.

మన్యం జిల్లా

2022-04-21 08:52:09

భూ పునః సర్వే పై దృష్టి సారించాలి

భూ పునః సర్వే వలన భూ సమస్యలు నివారించ వచ్చని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ అన్నారు. భూ పునః సర్వే కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో గురువారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్థాయి రెవిన్యూ అధికారులను మ్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. సర్వే, రెవిన్యూ అంశాలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యదర్శి ఎం.బాబు మాట్లాడుతూ గ్రామ సచివాలయం పరిధిలో నీటి తీరువా వసూలు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, సర్వే సహాయ సంచాలకులు  పాల్గొన్నారు.

మన్యం

2022-04-21 08:45:07

నిర్దేశిత పనులు సకాలంలో పూర్తిచేయాలి

పనులు సకాలంలో పూర్తి చేయండి అని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ లో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తో మున్సిపల్ కమిషనర్ బుధ వారం మున్సిపల్ కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నేటికీ నిర్వహించిన పనులపై ఆరా తీసారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, టెండర్ల నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశానికి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-20 16:26:00

అల్లూరిజిల్లా డీపీఆర్వోగా గోవిందరాజులు

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో)గా పి.గోవిందరా జులు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన విశాఖ జివిఎంసీ, విజయనగరం జిల్లాలో డివిజనల్ పీఆర్వోగా పనిచేశారు. అయన విశాఖపట్నం, విజయనగరం, పాడేరు ప్రాంతాలపై మంచి పట్టువుంది. కొత్తజిల్లాలలకు డీపీఆర్వోలుగా ప్రభుత్వం అనుభవం వున్న అధికారులనే నియమించడంతో కొత్తజిల్లాల్లోని పరిపాలనకు సంబంధించిన సమాచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాద్యమాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సత్వరమే తెలియడానికి  అవకాశం ఏర్పడింది. ఆయన డీపీఆర్వోగా విధుల్లోకి చేరిన అనంతరం పాడేరు ఐటీడీఏ పబ్లిసిటీ ఏపీఓ రాములు, డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన జిల్లా కలెక్టర్, జెసి, డీఆర్వోలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా సమాచారం,  ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలు, అధికారిక కార్యక్రమాలు సత్వరమే మీడియాకి చేరవేడయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.

Paderu

2022-04-20 16:01:12

గిరిజనులకు చేరువగా కార్యక్రమాలు..

గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ గిరిజనులకు అత్యంత చేరువగా కార్యక్రమాలు నిర్వహిచాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు  గంధం చంద్రుడు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం విశాఖలోని రుషికొండ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన భాషలు, గిరిజన నృత్యాలు, కళలు, పరిశోధన శిక్షణలు మీద సమీక్షించారు. గిరిజన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, గిరిజన ప్రాంతములో పనిచేసే ఉద్యోగులకు,  గిరిజన యువతి యువకులకు గిరిజన చట్టాలు, హక్కులు మరియు ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు అందిస్తున్న పథకాలు పైన అవగహన తరగతులు నిర్వహించాలన్నారు. వారిని చైత్యనవంతులను చేసి క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంత అభివృధికి దోహదపడే విధంగా అవగహన తరగతులు ఉండాలని చూసించారు.ఇంతే కాకుండ గిరిజన సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ అవసరాలను గుర్తించి సంబందిత ప్రతి పదనలు తయారి చేసి సంవత్సరిక కార్యాచరణ రూపోందించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఈ కార్యాలయం భవవ సముదాయాన్ని కూడా పూర్తి స్థాయి లో వినియోగించు కోవాలని సూచించారు. గిరిజన ప్రాతములో ఉపాధ్యాయులకు ఆంగ్లం, మాతృ బాషా ఆధారంగా బహు బాషా విధానం బోదించేటట్టు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ శిక్షణ తరగతులు విద్య శాఖ వారితో సమన్వయం చేసుకొని నిర్వహించాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన మేలుకవులు పైన శిక్షణా తరగతులు నిర్వహించాలని తద్వారా గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు త్వరితగతిన అర్ధమయ్యే విధముగా ప్రతిపాదనలు రుపాదించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యలయం నిర్మాణం 2వ దశ పనులకు సంబందించి అన్ని ఏర్పాటులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రములో గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, డిప్యూటీ ఇంజనీర్ సిమ్మన్న.  గిరిజన సంస్కృతి పరిశోధన,శిక్షణ సంస్థ ఆచార్యులు డా. ఎన్. శ్రీనివాస్, వి. సునీల్,  ఎన్. సీతారామయ్య, కే యస్. వెంకటేశ్వర రావు, కే.జైరాం తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-20 10:28:32

ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య సేవలే లక్ష్యం..

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతీ జిల్లాలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్టు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  తెలిపారు. బుధవారం ఆమె నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో ఏర్పాటుచేసిన ఆరోగ్య మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే. రాంబాబు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ సంస్థల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా సకాలంలో మెరుగైన వైద్యం అందించాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే ఈ మేళాను నిర్వహిస్తున్నారని తెలిపారు. అర్హులై ఉండి ఆరోగ్యశ్రీ కార్డులు అందని వారికి సకాలంలో కార్డులు అందజేసే విధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు  అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు పై ప్రజలకు గ్రామస్థాయి నుండి విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలో నిర్వహించిన ఆరోగ్య మేళాకు ఉదయం 9 గంటల నుండే అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం తో పాటు ఉచితంగా మందులు పొందుతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఒ డాక్టర్ విజయలక్ష్మి, జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కెఎన్ఎల్జి శాస్త్రి , డి ఎల్ వో డాక్టర్  శారద బాయ్, ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్  నెట్ క్యాప్ చెర్మన్ కే కే రాజు ,ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-20 09:28:11

సీపీఎస్ రద్దు చేసేవరకూ ఉద్యమిస్తాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని టీచర్స్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సిపిఎస్‌ను రద్దుచేస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోకపోవడటాన్ని ఆయన తప్పుపట్టారు. నేను విన్నాను, నేను ఉన్నాను. నేను మడమతిప్పను, మాట మార్చను అని పెద్దపెద్ద ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి సిపిఎస్‌ రద్దు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. బుధవారం ఎపి యుటిఎఫ్‌ బైక్‌యాత్ర మద్దిలపాలెంకు ఉదయం 10 గంటలకు చేరుకుంది. ఈ బైక్‌యాత్రకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, ఎన్‌.సి.ఇ యూనియన్‌ నాయకులు జి.అరుణ్‌కుమార్‌, సిఐటియు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభ జరిగింది. ఈ సందర్భంగా ఎ.అజశర్మ, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జి.అరుణ్‌కుమార్‌ లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జనవరి 1న 2004లో పాత పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి నూతన పెన్షన్‌ స్కీంను తీసుకువచ్చిందన్నారు. ఈ ఎన్‌పిఎస్‌ వలన ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆనాడే ఉద్యమించినా ప్రభుత్వాలు వెనక్కుతగ్గలేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కీంలో చేరడం సరైంది కాదని ఆనాడే యుటిఎఫ్‌ వ్యతిరేకించందన్నారు. నేడు ఎన్నికల్లో సిపిఎస్‌ రద్దుచేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ వాటిని రద్దుచేయలేదన్నారు. పైగా ముఖ్యమంత్రికి తెలియక వాగ్ధానం ఇచ్చారని సర్ధిచెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సిపిఎస్‌ రద్దుకోసం పోరు గర్జన పేరుతో ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 4 బైక్‌యాత్రలు జరగటం మంచిపరిణామమన్నారు. ఈ బైక్‌యాత్ర 25కు విజయవాడకు చేరుకుంటాయన్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా యుటిఎఫ్‌కు సహకరించి ఉద్యమంలోకి వస్తే ప్రభుత్వం దిగరాక తప్పదన్నారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియు నాయకులు కె.ఎం.కుమార్‌ మంగళం, పి.వెంకటరావు, అప్పారావు, త్రినాధ్‌, ఐద్వా నాయకులు  కె.కుమారి, లలిత, లక్ష్మి, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ బైక్‌యాత్ర ఎన్‌ఏడి, గాజువాక మీదుగా మధ్యాహ్నంకి అనకాపల్లికి చేరుకుంటుందన్నారు. తెలుగుతల్లి విగ్రహానికి ఐవి పూలమాల వేసారు. బైక్‌యాత్రలో పాల్గొన్న టీచర్స్‌కు మజ్జిగ, బిస్కట్స్‌ పంపిణీచేసారు. ఈ బైక్‌యాత్రలో యుటిఎఫ్‌ నాయకులు సిహెచ్‌ రవీంద్ర, బి.గోపీమూర్తి, నాగమణి, అప్పారావు, చిన్నబ్బాయి, రామకృష్ణ, అంబేద్కర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-04-20 07:22:44

చీపురుపల్లి ప్రత్యేక అధికారిగా నిర్మలకుమారి

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలానికి ప్రత్యేక అధికారిణిగా మత్స్యశాఖ ఉప సం చాలకులు ఎన్.నిర్మల కుమారిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో భౌగోళికంగా జిల్లా ప‌లు మార్పుల‌కు లోనుకావ‌డంతో జిల్లాలోని మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల‌ను తాజాగా నియ‌మిస్తూ జిల్లా క‌లెక్టర్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. పున‌ర్విభ‌జ‌న‌లో జిల్లా నుంచి కొన్ని మండ‌లాలు పార్వతీపురం మ‌న్యం జిల్లాకు వ‌దులుకోవ‌డం, శ్రీ‌కాకుళం నుంచి కొన్ని మండ‌లాలు జిల్లాలో చేర్చడంతో తాజాగా మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల‌ను నియ‌మిస్తున్నట్టు జిల్లా క‌లెక్టర్ త‌న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 27 మండ‌లాలు, విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర పాల‌క‌సంస్థ‌, రాజాం, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీల‌కు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియ‌మించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమ‌లును ఆయా మండ‌లాల్లో ప‌ర్యవేక్షించడం, మండ‌ల స్థాయి అధికారుల‌ను స‌మ‌న్వయ‌ప‌ర‌చి ప్రభుత్వ కార్యక్రమాలు, ప‌థ‌కాల‌ను స‌మ‌ర్ధంగా అమ‌లు చేయ‌డం వంటి కార్యక‌లాపాల‌ను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తార‌ని జిల్లా క‌లెక్టర్ పేర్కొన్నారు. మండ‌లంలో అన్ని శాఖ‌ల అధికారుల‌తో సంయుక్త స‌మావేశాలు నిర్వహించి ఆయా కార్యక్రమాల అమ‌లుపై ప్రతి వారం స‌మీక్షించి జిల్లా ఉన్నతాధికారుల‌కు నివేదించాల్సి వుంటుంద‌ని ఆ ఉత్తర్వుల్లో క‌లెక్టర్ పేర్కొన్నారు.

Vizianagaram

2022-04-20 05:34:41

అప్పన్నకు తొలివిడత చందనం.. గంట్ల

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మే మూడున అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవము జరగనుంది.ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవం ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు తెలిపారు. బుధవారం సింహాద్రినాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి ఈ నెల 26న తొలివిడత చందనం అరగతీత కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుందన్నారు.. ఏకాదశి పర్వదినం  రోజున నిర్వహించే ఈఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. ఆ రోజు తెల్లవారుజామున సింహాద్రి నాథుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లును సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావిస్తారన్నారు... అనంతరం గంగ ధార నుంచి  తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి, విశ్వక్షేన , పుణ్యహవచనం ఆరాధన అనంతరం తొలివిడత చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.... చందనోత్సవం రోజు రాత్రికి తొలివిడత చందనం సమర్పణ  గావించి, ఆ తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మూడేసి మణుగుల చొప్పున మొత్తం  ఏడాదిలో నాలుగు  విడతల  కింద 12 మణుగుల చందనాన్ని (500కేజీలు) స్వామికి సమర్పించడం సంప్రదాయబద్ధంగా వస్తుందన్నారు.. ఆలయ అధికారులు ,ధర్మకర్తల మండలి సభ్యులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీను బాబు మీడియాకి వివరించారు.

Simhachalam

2022-04-20 05:16:33

నీటి ట్యాంకుల పరిశుభ్రతకు స్పెషల్ డ్రైవ్..

కాకినాడ జిల్లాలోని 385 గ్రామ పంచాయ‌తీల్లో ఏప్రిల్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికతో 702 ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌ను శుభ్రం చేస్తున్న‌ట్లు జిల్లా పంచాయ‌తీ అధికారి ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్ తెలిపారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వార‌మిక్క‌డ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం 202 గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని 306 మంచినీటి ట్యాంకుల‌ను శుభ్ర‌ప‌రిచామ‌ని.. మిగిలిన వాటిని శుభ్రం చేసే ప్ర‌క్రియ‌ను బుధ‌వారం పూర్తిచేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ఆదేశాల మేర‌కు జిల్లాలోని ప్ర‌తి 15 రోజుల‌కు ఓసారి త‌ప్ప‌నిస‌రిగా శుభ్రంచేసి, ఆయా తేదీల‌ను ట్యాంకుల‌పై న‌మోదుచేసేలా క్షేత్ర‌స్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిపారు. ప్ర‌తిరోజూ మంచినీటిని క్లోరినేట్ చేసి స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌చివాల‌యాల ప‌రిధిలోని ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులు ప్ర‌త్యేక ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల‌తో నీటి నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను స‌రిచూసి, నివేదిక‌లు అందిస్తార‌ని వెల్ల‌డించారు. వేస‌వి తీవ్ర‌త నేప‌థ్యంలో మంచినీటి స‌ర‌ఫ‌రా పూర్తి సుర‌క్షితంగా జ‌రిగేలా జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాలు ఇచ్చిన‌ట్లు డీపీవో నాగేశ్వర్ నాయక్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Kakinada

2022-04-19 16:05:53

వైభవంగా రాములోరి పుష్ఫయాగం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన  పుష్పయాగం రాత్రి 9 గంటల వరకు వేడుకగా జరగనుంది.  తులసీదళాలు, మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు.  ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ, భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ  తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రామరాజు, ఏఈవో  సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్  పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్  ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

Ontimitta

2022-04-19 15:41:47

సర్వదర్శనం టోకెన్ కౌంటర్లు పరిశీలన

తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ జారీ  కౌంటర్లను మంగళవారం సాయంత్రం టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని అధికారుల బృందం పరిశీలించింది. సర్వద ర్శనం టైంస్లాట్ టోకెన్లు విధానం పునరుద్ధరించాలని  చేయాలని టిటిడి యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, భక్తులు మరుగుదొడ్లకు  వెళ్లేందుకు వీలుగా క్యూలైన్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ముందుగా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను అధికారులు పరిశీలించారు.  సిఈ వెంట ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, ఐటి విభాగాధిపతి  శేషారెడ్డి, విజిఓ  మనోహర్ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

Tirupati

2022-04-19 14:46:17

3రోజులకు ఒకసారి క్షేత్రపర్యటన చేయాలి

గుంటూరు జిల్లాలో గ్రామ, మండల స్థాయిలోని కార్యాలయాల పనితీరు, ప్రభుత్వ
పధకాల అమలును ప్రతి వారంలో కనీసం మూడు రోజులు క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులు పరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రత్తిపాడు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజన పధకం, రీజనల్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను, గ్రామ సచివాలయం, కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేసారు. జిల్లా పరిషత్ స్కూల్ లో విద్యార్డులకు వడ్డించడానికి సిద్దం చేసిన భోజనాన్ని పరిశీలించి విద్యార్డులతో కలసి భోజనం చేసారు. పదవ తరగతి చదువుతున్న గాయత్రి, జ్యోతి రెడ్డి తో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ మెనూ ప్రకారం అందిస్తున్న భోజనం,
పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని, తరగతి గదులు, మంచినీటి సౌకర్యం చక్కగా వున్నాయని, టాయిలెట్స్ బాలికలకు, బాలురలకు పరిశుభ్రంగా వుంచుతున్నారని విద్యార్దులు సంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాలలో తరగతి గదులను, టాయిలెట్స్ , ల్యాబ్ లను జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన తరగతి గదులు, అందులోని ఫర్నిచర్ వాటి నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో పదవ తరగతి చదువున్న విద్యార్దులపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని
చదివించాలని, స్టడీ అవర్స్ క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి కి సూచించారు. పిల్లల సమర్ద్యాన్ని బట్టి యావరేజ్, బిలో యావరేజ్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఖాళీగా వున్న బోధన సిబ్బంది వివరాలు, గతంలో నిర్మించిన తరగతి గదులలో అవసరమైన ఫ్యాన్లు, విద్యార్డులకు అవసరమైన ఇతర వసతులపై ప్రతి పాదనలు అందించాలని తెలిపారు. అనంతరం యంపీడీఓ కార్యాలయ ఆవరణలో వున్న రీజనల్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేసారు. టెస్టింగ్ ల్యాబ్ లో విత్తనాలు, పురుగు
మందులు పరీక్షలు చేసే పరికరాలు, జంతువుల రోగ నిర్ధారణకు సంబంధించి పరీక్షలు నిర్వహించే పరికరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, పురుగు మందుల పరీక్షలలో నాణ్యత తక్కువని గుర్తిస్తే వాటిపై చర్య తీసుకునేందుకు సంబంధిత అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జంతువుల రోగ నిర్ధారణకు సంబంధించి క్రొత్తగా వచ్చే రోగాలను కనుగొంటే వాటి నివారణకు అవసరమైన మందులు తయారీకి ఉన్నతాధికారులకు నివేదికలు
అందించాలన్నారు. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు, ఏ ఎన్ యం, వి ఆర్ ఓ ల జాబ్ చార్ట్ గురించి జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పోస్టర్లు, నోటిస్ బోర్డు, సిటిజెన్ చార్ట్, సామాజిక సర్వే జాబితాల ప్రదర్శన క్రమపద్దతిలో  వుండాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలన్నారు. రెవెన్యూ సర్వీసులకు సంబంధించి నోటిసులను తప్పనిసరిగా సచివాలయం నోటిస్
బోర్డులలో ప్రదర్శించాలన్నారు. యండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సక్రమంగా పంపిణీ జరిపించే బాధ్యత విలేజ్ రెవెన్యూ అధికారులదే అన్నారు. వైయస్.ఆర్. సంపూర్ణ పోషణ క్రింద పంపిణీ చేసే కిట్ల లో నాణ్యత లేని ఆహార పదార్ధాలను గుర్తించి, వెంటనే కాంట్రాక్టర్ కు త్రిప్పి పంపించి నాణ్యతగలవి తెప్పించాలన్నారు. సచివాలయాల పనితీరు పూర్తిస్థాయిలో ,మెరుగుపరచేందుకు ఏప్రిల్ 30 వ తేది వరకు సమయం ఇవ్వడం జరుగుతుందని, మే 1 వ తేది నుండి సచివాలయ తనిఖీలలో నిర్ధేశించిన ప్రకారం క్రమపద్దతిలో పోస్టర్లు, జాబితాలు, ఉద్యోగుల జాబ్ చార్ట్ అమలు జరుగకపోతే మండల
స్థాయి పర్యవేక్షణ అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. అనంతరం ప్రత్తిపాడు కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తనిఖీ
చేసారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, ల్యాబ్ లు, కంటి పరీక్షలు, ఫార్మసీ విభాగాలను పరిశీలించారు. వైద్యులు, ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు, హాజరుపట్టిని పరిశీలించి సెలవులో వున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటి హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలు వైద్య సేవలపై సంతృప్తి చెందేలా కమ్యూనిటి  హెల్త్ సెంటర్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్యులకు సూచించారు. నైట్ డ్యూటి డాక్టర్ ఖచ్చితంగా ఆసుపత్రిలోనే అందుబాటులో వుండాలని, వైద్య సహాయం కోసం వచ్చిన ప్రతి
ఒక్కరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఇతర సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ ను జిల్లా కలెక్టర్ ఫోన్ లో ఆదేశించారు. సిహెచ్ఎస్ పరిధిలోని ఆసుపత్రులను తనిఖీ చేసి క్రమపద్దతిలో వైద్యులు ప్రజలకు సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానికంగా వున్న చిన్న చెఱువు వర్షాకాలంలో నిండిపోయి సమీపంలోని కాలనీ లను నీరు
ముంచేత్తుతున్నదని స్థానికులు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి కి వినతి పత్రం అందించగా, జిల్లా కలెక్టర్ చిన్న చెఱువు  ప్రాంతాన్ని, అక్కడ వున్న కల్వర్ట్ ను పరిశీలించారు. వర్షాకాలంలో చెఱువు ముంపుకు గురైన సందర్భంగా నీరు ఇళ్లలోకి రాకుండా డ్రైనేజీ కాలువల ద్వారా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్థానికులకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ తో పాటు, అన్ని శాఖల జిల్లా అధికారులు కనీసం వారంలో 3 రోజులు  ప్రభుత్వ కార్యాలయాల పనితీరు పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. దీనిలో భాగంగా
మంగళవారం కొర్నెపాడు లో పేదలందరికి ఇళ్ల పధకం లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాల పురోగతిని, ప్రత్తిపాడు లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మధ్యాహ్న భోజనం నాణ్యతను, రీజనల్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లో రైతులకు అందిస్తున్న సేవలను, గ్రామ సచివాలయం, 30 పడకల కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు జిల్లా
అధికారులు, మండల స్థాయి అధికారులు క్షేత్ర కార్యాలయాలను ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. సోమవారం జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం అనంతరం రెవెన్యూ డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పధకాల అమలు తీరు, పనితీరు పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, నిర్దేశిత సమయంలో స్పందన అర్జీ లు గుణాత్మకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిష్కరించిన అర్జీ లను, జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను ర్యాండమ్ గా తనిఖీ చేయడం
జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డిఓ, సబ్ కలెక్టర్
కార్యాలయాలలోనూ, మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ప్రభాకర రెడ్డి, ప్రత్తిపాడు తహశీల్దారు పూర్ణ చంద్ర రావు, యంపీడీఓ విజయ లక్ష్మీ, వ్యవసాయ శాఖ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ నున్నా వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ ఏ.డి శ్రీనివాస రెడ్డి, యంఈఓ రమాదేవి, సి హెచ్ వైద్యులు డా. శ్రీకాంత్, జెడ్పీటీసీ ఉప్పల కృష్ణ రెడ్డి, యంపీపీ అన్నమ్మ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Prathipadu

2022-04-19 14:44:32

సాటివారికి సేవ చేయడం మహద్భాగ్యం

సాటి వారికి సేవచేసే అవకాశం రావడం జీవితంలో మహద్భాగ్యమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకుంటూ, తమ రోజు వారీ కార్యక్రమాల్లో కొంత భాగాన్ని సేవా మార్గంలో గడపాలని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సేవ చేయడం అందరికీ దొరికే అవకాశం కాదన్న ఆయన, అందులో అంతులేని ఆనందం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ప్రేమసమాజం 90 వసంతాల వేడుకలకు గౌరవ ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం 1930లో ఓ భజన సమాజంగా ఆధ్యాత్మిక పునాదుల మీద ఏర్పాటైన సంస్థ, తమ సేవలను విస్తృతం చేస్తూ 90 వసంతాలను పూర్తి చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. శ్రీ మారేడ్ల సత్యనారాయణ గారు ప్రారంభించిన ఈ సంస్థ, వారి సతీమణి సహకారంతో ఆపన్నులకు మరింత చేరువై ఓ మహావృక్షంగా ఎదిగిన తీరు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ దంపతుల స్మృతికి నివాళులు అర్పించారు. కుల, మత, వర్గ బేధభావాలు లేకుండా అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించి వారి బాధ్యతను కుటుంబంలా తీసుకోవడం, కుటుంబం కోసం తమ జీవితాన్ని ధారపోసి జీవిత చరమాంకంలో ఉన్న పెద్దలకు ఆలంబనను అందిస్తున్న పెద్దల ఆశ్రమం, కుష్టు వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక సేవా కేంద్రం, నారాయణ సేవ పేరిట నిత్యం అన్నదానాలు, అనాథ పార్థివ దేహాలకు అంతిమ సంస్కారాల నిర్వహణ, గోవుల సంరక్షణ, పెద్దల కోసం సకల సౌకర్యాలతో, నామ మాత్రపు రుసుములతో ప్రత్యేక ఆశ్రమాలు, పేదల కోసం ఉచిత వైద్య సేవలు, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలబడడం, ఉచితంగా విద్యను అందించడం, ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం, గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, అనాథ అమ్మాయిలకు వివాహం జరిపించడం వంటి కార్యక్రమాలతో కాలానికి అనుగుణంగా సేవాకార్యక్రమాల్లో ప్రేమసమాజం ముందుకు సాగడం అభినందనీయమని తెలిపారు.

వసుధైవ కుటుంబ భావనను బలంగా నమ్మిన ప్రేమ సమాజం పిల్లలను తమ సొంత బిడ్డలుగా భావించి యుక్త వయసు రాగానే వారికి వివాహాలు జరిపించడం, యువకులకు ఉపాధి కల్పించి సమాజంలో ఉన్నతంగా జీవించే అవకాశం కల్పించడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వసుధైవ కుటుంబకం అనే భావన భారతీయుల రక్తంలోనే ఉందన్న ఆయన, సాయం అనేది మనసు మీద ఆధారపడి ఉంటుందే తప్ప, స్థాయి మీద ఆధారపడి ఉండదనేది వివేకానందుల వారి సందేశాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రేమ సమాజం సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు జీవితంలో ఎన్నో విలువైన అంశాలను నేర్పాయని తెలిపారు. తమ కుటుంబం కూడా తన బాటలో నడుస్తూ స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల సాధికారతకు కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతమేర సమాజ సేవలో ముందుకు సాగాలని సూచించారు. సేవ అంటే సమాజానికి మేలు చేయడం మాత్రమే కాదన్న ఉపరాష్ట్రపతి, అదో గొప్ప విజయసూత్రమని తెలిపారు. ఓపికగా సేవ చేయడంలో ఉన్న ఆనందం మనకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసం చేసే పనుల్లో విజయాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మనకు ఎన్నో పాఠాలను నేర్పించిందన్న ఉపరాష్ట్రపతి, ఆ సమయంలో సాటి వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చారని, ఇది తాను సమాజంలో ఆశించిన పరిణామమని, అలాంటి గొప్ప మనసున్న వారికి అభినందనలు తెలియజేశారు. సేవా సంస్థలు ఆకలి తీర్చడంతో ఆగిపోకూడదన్న ఉపరాష్ట్రపతి, వారికి శాశ్వతంగా ఆకలి తీర్చే నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సేవా సంస్థలు తమ మార్గాన్ని మరింత విస్తృతం చేయాలన్న ఆయన, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. ఇలాంటి వారికి వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ రంగ సంస్థలు వారికి చేయూతనందించాలని సూచించారు. “సాధన చేయండి... సంపాదించండి... సమాజం కోసం పునరంకితం కండి” అని యువతకు దిశానిర్దేశం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రేమ సమాజం ప్రారంభ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళుతున్న సంస్థ అధ్యక్షులు పైడా కృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులు   బుద్ధ శివాజీ, కె. నరసింహ మూర్తి, కార్యదర్శి  జగదీశ్వర రావు, ఇతర సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పి.వి.ఎన్ మాధవ్, విశాఖ దక్షిణం శాసనసభ్యులు  వాసుపల్లి గణేష్ కుమార్ సహా ప్రేమ సమాజం నిర్వాహకులు, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-19 14:37:58