1 ENS Live Breaking News

శతశాతం గ్రౌండింగ్ కావాల్సిందే..

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జిల్లాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి  ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నదని, కావున జిల్లాలో మంజురు అయిన భవనాలు, రోడ్లు నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలం వారీగా రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ సెంటర్స్, రోడ్లు పనులు జరుగుతున్న తీరును  సమీక్షించారు.  చాలా మండలాలలో  పనులు మొదలు కాక పోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.  28 వ తేది కల్లా మొత్తం పనులు గ్రౌండింగ్ పూర్తి చేయాలని తెలిపారు. లకరి మొదలు అయ్యే సమయానికి యిబ్బంది లేకుండా పనులు  వేగవంతం చేయాలన్నారు. నిర్మాణానికి అవసరం అయిన మెటీరియల్ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకోవాలని తెలిపారు. 
     28 వ తేది తరువాత క్షేత్రస్థాయి పర్యటన లో  జరుగుతున్న పనులను పరిశీలించడం జరుగుతుందని, సరియైన పనితీరు కనపరచని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.  ఈ సమీక్షా సమావేశం లో  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మండల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-04-22 06:59:47

31వరకూ ఆర్బీకేల్లో అవగాహనా సదస్సులు

పార్వతీపురం మన్యం జిల్లాలో రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ నుండి మే నెల 31వ తేదీ వరకు ఆయా ఆర్.బి.కెల పరిధిలో ఉదయం 11 గంటల నుండి సదస్సులు జరుగుతాయని అన్నారు. వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంప్రదాయక విధానాలతో రైతు పూర్తి స్థాయి ఉత్పాదకత పొందలేక పోతున్నారని ఆయన పేర్కొంటూ ఆధునిక యాంత్రిక వ్యవసాయ పరికరాల వినియోగం, శాస్త్రజ్ఞుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల రెట్టింపు ఉత్పాదకత పొంద వచ్చని ఆయన అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు కష్టపడే తత్వం గలవారని, దీనికి తోడుగా యంత్రాలను, మంచి విత్తనాలు, వ్యవసాయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా గోదావరి జిల్లాల ఉత్పాదకతతో సమానంగా దిగుబడి రాగలదని ఆయన చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను (ఆర్.బి. కె) రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన చెప్పారు. ఆర్.బి.కెల పరిధిలో విత్తనం నుండి విక్రయానికి అవసరమగు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. వ్యవసాయం పక్కా ప్రణాళికతో చేపట్టడం వలన వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవచ్చని అన్నారు. ఆర్.బి.కెలలో వై.ఎస్.ఆర్. యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్ హాయరింగ్ కేంద్రాలు)  ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయ పనిముట్లు రైతుకు అందుబాటులో పెట్టడం జరిగిందని అన్నారు. రానున్న ఖరీఫ్ దృష్ట్యా రైతులు ఇప్పటి నుంచే సిద్దంగా ఉండాలని, అపరాల వంటి అంతర పంటలు వేయటం, నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం, ఏ రకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వినియోగించాలి, ఏ పరిమాణంలో వినియోగించాలి, పొలంలో నడక దారి వదలడం, నూర్పులలో పాటించాల్సిన నియమాలు, రబీలో అనుసరించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై అవగాహన కల్పించుటకు రైతు సదస్సులు ఏర్పాటు చేశామని నిశాంత్ కుమార్ వివరించారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయ అధికారులు సదస్సుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ద వహించాలని, రైతులకు పూర్తి అవగాహన కల్పించి ఫలవంతం కావడానికి కృషి చేయాలని ఆయన సూచించారు.

Parvathipuram

2022-04-22 06:13:30

డంపింగ్ యార్డు నిర్వహణపై దృష్టి..

పార్వతీ పురం పురపాలక సంఘం పరిధిలో డంపింగ్ యార్డ్ నిర్వహణపై దృష్టి సారించడం జరిగిందని మునిసిపల్ కమీషనర్ ఏ.సింహాచలం తెలిపారు. డంపింగ్ యార్డ్ ను శుక్రవారం కమీషనర్ పరిశీలించారు. డంపింగ్ యార్డులో నిరంతరాయంగా నీటిని జల్లుతుండటం వలన 90 శాతం మేర సాధారణ స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. మరి కొద్ది రోజులు నిరంతరాయంగా నీటిని జల్లాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అలసత్వం ఉండరాదని, చెత్తసేకరణలోనూ తగు జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు. నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీ పురం పురపాలక సంఘం పరిధిలో దేవాంగుల వీధి తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కమీషనర్ తనిఖీ చేశారు. పట్టణం పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. చెత్త ను తడిచెత్త, పొడి చెత్తగా విభజన చేసి అందించాలని ఆయన అన్నారు. విభజన ప్రక్రియను పరిశీలించారు. తడిచెత్త, పొడి చెత్త ను వేరుచేసి మినీ వాహనాలలో  డంప్ చేసి డంపింగ్ యార్డ్ కి తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కి, సంబంధిత వార్డు శానిటేషన్ సెక్రటరీకి ఆదేశించారు. తడిచెత్త, పొడి చెత్త వేరుచేయు విధానం లో ఎటువంటి అలసత్వం వహించరాదని ఆయన పేర్కొన్నారు.

Parvathipuram

2022-04-22 05:18:31

పది, ఇంటర్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఏప్రిల్ మే నెలల్లో జరిగే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు.  గురువారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 6వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని అదేవిధంగా మే 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు.  మొత్తం పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికాయుతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు.  జిల్లాలో 24 మండలాల్లో 122 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు  ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరుగుతాయని ఈ పరీక్షలకు 22904 మంది విద్యార్థులు, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 2500 మంది హాజరవుతారన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు  ఉదయం 9:00 గం.ల నుండి12:00 గం.ల వరకు మొత్తం 34 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

పరీక్షల ఏర్పాట్లను కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ పర్యవేక్షిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని,    ఆర్డబ్ల్యూఎస్, జీవీఎంసీ అధికారులను పారిశుద్ధ్యం నిర్వహించాలని పంచాయతీ అధికారిని  ఆదేశించారు.  పరీక్షలకు వచ్చి వెళ్లేందుకు అనుకూలమైన సమయాల్లో విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ వారిని   రాత్రి సమయాల్లో విద్యుత్ పవర్ కట్ లు లేకుండా చూడాలని ఏపీ పీ డి ఎసి ఎల్ అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో 144 సెక్షన్  అమలు చేయాలన్నారు. జిల్లా వృత్తి విద్యా అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి పరీక్షల నిర్వహణ అధికార్లుగా వ్యవహరిస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకట రమణ, ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఎం వినోద్ బాబు, డి వి ఈ ఓ మురళీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, పోలీస్ జీవీఎంసీ ఆర్డబ్ల్యూఎస్ పంచాయితీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-21 16:35:01

పర్యాటాకాభివ్రుద్ధికి ప్రత్యేక అప్లికేషన్..

రాష్ట్రంలో పర్యాటక భవన్ ఏర్పాటు, టూరిజం డెవలప్మెంట్ కొరకు సింగిల్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా అన్ని వివరాలు అందుబాటులో ఉండే విధంగా టూరిజం సాఫ్ట్ వేర్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అన్నిరకాల చర్యలు చేపట్టనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు ఆర్.కే రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కే రోజా మాట్లాడుతూ పర్యాటక, ఆథిత్య రంగంలో పురోబివృద్ది దిశగా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఏ.పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఆతిథ్య రంగంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి గారికి వినతి పత్రం సమర్పిస్తూ హోటల్స్ టైమింగ్ రాత్రి 12 గంటల వరకు జి.ఓ మేరకు హోటల్స్ తెరచి ఉంచుటకు అమలు అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆథిత్య రంగాన్ని, హోటళ్ళను పరిశ్రమలుగా గుర్తిస్తే రాయితీలకు అవకాశం కలుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ హోటల్ టైమింగ్ జి.ఓ మేరకు అమలు అయ్యే విధంగా, హోటల్ లైసెన్స్ పర్మిషన్ కొరకు సమర్పించు డాక్యుమెంట్స్  మహారాష్ట్ర తరహాలో తక్కువ ఉండెలా, రాష్ట్రంలో పర్యాటక భవన్ ఏర్పాటు, టూరిజం డెవలప్మెంట్ కొరకు సాఫ్ట్ వేర్ అప్లికేషను డెవలప్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. చంద్రగిరిలో సౌండ్ అండ్ లైట్స్ షో పునరుద్ధరణ, టి.టి.డి దర్శన్ టికెట్స్ హోటల్ అసోసియేషన్ వారికి కేటాయింపు విషయంలో టిటిడిని సంప్రదిస్తామని తెలిపారు. తిరుపతి ఎస్.వి జూ పార్క్ నందు సందర్శనార్థం వచ్చిన పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రికల్ వాహనాలను అనుమతి ఇవ్వమని హోటల్ యజమానులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెలాఖరు లోగా టూరిజంకు సంబంధించి సమగ్ర ప్రణాళిక తయారు చేస్తామనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఏ.పి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ రెడ్డి, తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణా బట్, తదితర హోటల్ యజమానులు పాల్గొన్నారు.

Tirupati

2022-04-21 15:36:35

విస్తరణ పనులు వేగవంతం చేయాలి..

కాకినాడ జిల్లాలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ అధికారుల‌ను ఆదేశించారు. జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్టుల‌కు సంబంధించి గురువారం క‌లెక్ట‌రేట్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ‌.. ట్రెయినీ క‌లెక్ట‌ర్ గీతాంజ‌లి శ‌ర్మ‌తో క‌లిసి జాతీయ ర‌హ‌దారులు, రెవెన్యూ, అట‌వీ, వ్య‌వ‌సాయ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. భార‌త్‌మాల విస్త‌ర‌ణ ప్రాజెక్టులకు సంబంధించిన ప‌నుల్లో పురోగ‌తిపై అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ వాక‌ల‌పూడి-అన్న‌వ‌రం, అచ్చంపేట‌-సామ‌ర్ల‌కోట‌, క‌త్తిపూడి-తాళ్ల‌రేవు (216) ప్రాజెక్టుల భూసేక‌ర‌ణకు సంబంధించి మిగిలియున్న ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని సూచించారు. అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌మావేశంలో కాకినాడ‌, పెద్దాపురం ఆర్‌డీవోలు బీవీ ర‌మ‌ణ‌, జె.సీతారామారావు, జాతీయ ర‌హ‌దారుల పీడీ ర‌వీంద్ర‌బాబు, వివిధ మండ‌లాల త‌హ‌సీల్దార్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-21 15:17:45

నటనాభ్యాసంలో యోగా కూడా కీలకమే..

నటనాభ్యాసంలో యోగభ్యాసం కూడా ఎంతో కీలకమని ప్రముఖ రంగస్థల  రచయిత, నటులు., దర్శకులూ వేల వీధి నాటికల ప్రదర్శకులూ ప్రయోక్త భళ్లమూడి రామమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖలో నట శిక్షణ లో పేరొందిన నవరస ధియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్, రంగసాయి నాటక సంఘం సంయుక్తంగా జరుపుతున్న 45 రోజుల నట శిక్షణ వర్కు షాప్ లో భాగంగా భళ్లమూడి రామమూర్తి ప్రత్యేక తరగతిని నిర్వహించారు. టీఎస్సార్ కాంప్లెక్స్ లోని రంగసాయి నాటక గ్రంధాలయంలో నవరస మూర్తి, బాదంగీర్ సాయి నేతృత్వంలో ప్రత్యేకంగ నటనలో యోగ ప్రాధాన్యత అంశంపై ప్రత్యేక తరగతి  నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో భళ్లమూడి రామమూర్తి నట సాధనలొ యోగ అనువర్తింపుతో కూడిన విషయాలను ప్రస్తావించారు. ఏ ఆసన ప్రక్రియ ఏ హావ భావాలను  వ్యక్తం చేస్తుందీ., ఎలాంటి ఆసన సందర్భంలోని ఏ కదలికలు నటనలో ఎలా ఉపయోగపడుతుంది వంటి అంశాలను ఆయన ప్రస్థావించారు.  స్టోరీ టెల్లింగ్ లో దిగ్గజంగ పేరొందిన సీతా శ్రీనివాస్ నటనలో కధావగాహన- వ్యక్తీకరణ అంశంపై నట శిక్షణ లో వివరించారు. ముఖ్యంగ  కథ అంటే ఏమిటీ కథ ప్రస్థావన., పాత్రల స్వభావం, అవగాహన చేసుకుని , ఆవాహన చేసుకుని ఆవిష్కరించడం వంటి అంశాలను ప్రస్థావించారు. వీటితో పాటూ భావావిష్కరణలో పాత్ర ఔచిత్యం ను మీరకుండ పాటించడం వంటి అంశాలను విశదీకరించారు. నట శిక్షణ శిబిరం ప్రధాన నిర్వాహకులూ., ముఖ్య శిక్షకులూ నవరస మూర్తి మాట్లాడుతూ జీవితంలో ఈ నటశిక్షణ వర్కు షాప్ చేకూర్చే ప్రయోజనాలను ప్రస్థావించారు. రంగ స్థలంలో పరిణితి జీవితంలో అన్నీ ఇస్తుందన్నారు. అనంతరం శిక్షణార్ధులు అభ్యాంతో నట పరిపక్వతకు నిమఘ్నమయ్యారు.

Visakhapatnam

2022-04-21 15:14:57

భూముల రీసర్వే వేగవంతం కావాలి..

భూముల రీసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ సూచించారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు తో గురువారం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం పరిష్కారం చేయాలన్నారు. అదే విధంగా భూ రికార్డులు కూడా వెంటవెంటనే తాజా పరచాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని, త్వరిత గతిన పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిషేక్, సిపిఓ శ్రీనివాస రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-21 15:04:02

అల్లూరిజిల్లా హ్యాండ్ బుక్ ఆవిష్కరణ..

స్టాటస్టిక్స్, ప్రణాళిక శాఖ ద్వారా రూపొందించిన అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యాండ్ బుక్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆవిష్కరించారు.  కలెక్టర్ చాంబర్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర సమాచారం తో పాటు జిల్లాలోని రెండు డివిజన్లకు సంబంధించిన 22 మండలాల 2011 జనాభా, గ్రామాలు, నివాసాలు, జిల్లా ఆర్థిక భౌగోళిక స్థితిగతులు, జిల్లాలోని అన్ని శాఖల డేటా, పర్యాటకం తదితర అంశాలతో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రూపొందించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, బి దయానిధి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-21 14:59:22

ఏ ఒక్క గిరిజనుడూ నష్టపోకూడదు..

అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలోని గిరిజన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ ఉద్యాన శాఖలతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభం చేకూరే విధంగా సంబంధిత అధికారులు తగు సూచనలు అందజేయాలని ఆదేశించారు. వెబ్సైట్లో రైతుల పూర్తి వివరాలు ఉండాలని, ఆధార్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, ఎన్ పి సి ఐ తదితర ఫెయిల్యూర్స్ లేకుండా కెవైసి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు బ్యాంకర్లను సంప్రదించి తప్పులను సవరించాలి అన్నారు. రానున్న పది రోజులలో కేవైసీ పూర్తి చేసి రైతులకు సబ్సిడీ, రుణాలు మంజూరుకు సహకరించాలని ఆదేశించారు.  ప్రతి మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో కనీసం 100 ఎకరాలు అభివృద్ధి చేసి ప్రాంతాన్ని బట్టి కాఫీ, పసుపు, చిరుధాన్యాలు, జీడి, రాజ్మా లాంటి వంటలను అభివృద్ధి చేసి ఫలసాయం పొందే విధంగా రైతులకు మార్గదర్శకం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  వ్యవసాయ యంత్రాలు పనిముట్లు సబ్సిడీ రుణాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  రైతు భరోసా అందజేసేందుకు వీలుగా అటవీ హక్కుల లబ్ధిదారులను గుర్తించాలని, అటవీ హక్కు దారులు డాటా సవరించాలని సూచించారు. గిరి రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి ఉద్యాన శాఖ కమిషనర్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ బి ఎస్ నందు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ రమేష్ కుమార్ రావు, ఉద్యాన శాఖ అధికారి అశోక్, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-21 14:57:21

వైద్యులే నిజమైన ప్రాణదాతలు..

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించేది కేవలం వైద్యులేనని అందుకే వైద్యులు ప్రాణదాతలని ప్రజలు నమ్ముతారని శ్రీకాకుళం లోక సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఎం.పి.ల్యాడ్ నిధులు రూ.28 లక్షలతో  కొనుగోలు చేసిన వాహనానికి (బస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి, జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అంకితం చేశారు. మీకు వైద్యం... మాకు వరం.. అన్న నినాదంతో వాహనాన్ని వైద్యులకు అందచేశారు. సకాలంలో వైద్యులు స్పందిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని, ఇందుకు ఈ వాహనం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ. స్వామినాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.రవి వెంకటాచలం, హనుమంతు సాయిరాం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 14:49:50

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

రాష్ట్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలు విధిగా పాటిస్తూ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లు, యస్.పిలతో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్, ఏఐజి ఆర్.ఎన్.అమ్మిరెడ్డిలతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు 6 లక్షల మంది, ఇంటర్మీడియట్ పరీక్షలు 10 లక్షలు మంది హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో వరుసగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గతేడాది రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు తావులేకుండా పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించారనే రాష్ట్రానికి మంచి పేరు ఉందని, దాన్ని అలాగే కొనసాగేలా అధికారులు చొరవచూపాలని కోరారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున విద్యార్ధులు ఎటువంటి అసౌకర్యం లోనుకాకుండా ఉండేందుకు ప్రతీ తరగతి గదిలో విద్యుత్ దీపాలు మరియు ఫ్యాన్లు ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 27 నుండి మే నెల 9 వరకు జరగనున్న పరీక్షలకు నిర్ణీత సమయానికి ముందే విద్యార్ధులు హాజరుకావలసి ఉందని, అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున అటువంటి వారికి సమయపాలనలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్లు చూపి ఆర్.టి.సి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కును ధరించాలని, కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖలు తమ పాత్రలను సక్రమంగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికే ప్రతీ కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయని, వాటిని సరిచూసుకోవాలని సూచించారు. జవాబు పత్రాలను ఈసారి బుక్ లెట్ రూపంలో పొందుపరచడం జరిగిందని, దీనివలన విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షలయినప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, అదనపు పథక సమన్వయకర్త ఆర్.సూర్యప్రకాశ్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 14:28:06

వంశీక్రిష్ణ శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు

విశాఖలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  పునాది  నుంచి  నేటివరకు దాదాపు గా 7 సంవత్సారాలు వైసీపీ  నగర అధ్యక్షులుగా అనేక పార్టీ కార్యక్రమాలలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన వైసీపీ నాయకులకు, వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు, విశాఖ ప్రజలకు, మీడియా మిత్రులకు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  ఈమేరకు గురువారం విశాఖలోని నగర పార్టీ కార్యాలయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్ అధ్యక్షతన వంశీ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, పార్టీలో అందరికీ పదవులు ఇవ్వాలనే సీఎం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తపించి తనకు మంచి స్థానాన్ని కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తనను ఎంతగానో ఆదరించారని..ఇకపై నగర అధ్యక్షునిగా వచ్చే వారినిక కూడా అదే రీతితో ఆదరించాలని కోరారు. అనంతరం వంశీని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  గోలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి  దాడి విర భద్ర రావు , ఎమ్మెల్సీ వరుద కల్యాణి మాజీ మంత్రి  పి బాల రాజు ,  రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు, జాన్ వెస్లీ ,  సుజాత సత్యనారయణ, మాజీ శాసన సభ్యులు   తైనాల విజయకుమార్,  ఎస్.ఎ రెహ్మాన్ , చెంగల వెంకట రావు , పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి  రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు  జాన్ వెస్లీ ,  సుజాత సత్యనారాయణ, సుజాత నూక రాజు,  డిప్యూటీ మేయర్లు  కట్టమురి సతీష్ ,  జియాన్ని శ్రీధర్ ,  అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధి , జి.వి.ఎం.సి కార్పొరేటర్లు  అప్పరావు , బిపిన్ కుమార్,  రెయ్యి వెంకట రమణ , స్వాతి దాస్ ,  అల్లా లీలావతి ,  కామేశ్వరి ,  విల్లూరి భాస్కర్ రావు ,  కందుల నాగరాజు , రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు  మొల్లి అప్పారావు ,  పేర్ల విజయ చంద్ర ,నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు అభ్యర్దులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-21 14:08:47

రేపు వై.యస్.ఆర్.సున్నావడ్డీ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో నేడు వై.యస్.ఆర్.సున్నావడ్డీ 3వ సంవత్సరం ప్రారంభోత్సవ కార్య క్రమం జరగనున్నట్లు   జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఏప్రిల్ 22న ఉదయం 11.00గం.లకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి తొలుత    ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లాలో స్థానిక బాపూజీ కళామందిర్ నందు ఉదయం 11.00గం.లకు ప్రారంభం కానుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు , ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు  హాజరుకానున్నట్లు ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2022-04-21 13:47:19

ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం

రాష్ట్రంలోని ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని యువ నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ధర్మాన రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యాధులకు పేద, ధనిక వర్గాలు ఉండబోవని అందరూ సమానమేనని, అయితే కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల ఖర్చుతో కూడిన వైద్యాన్నిపొందేందుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత వై.యస్.ఆర్  అయితే మరో పది అడుగులు ముందుకు వేసి మరిన్ని సేవలతో డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పేరుతో అన్నిరకాల వైద్య సదుపాయాలను కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలు పొందేలా  చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి నాంధి పలికిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ పేదలకు అవసరమైన అన్నిరకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ శిబిరం ద్వారా సుమారు రూ.30వేల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, ప్రతీ ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ  కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, చిన్న పిల్లల వ్యాధుల చికిత్స్, గర్భిణీ మరియు స్త్రీల వ్యాధుల చికిత్స, క్షయవ్యాధి నిర్ధారణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్ధారణ, చికిత్స్, చర్మవ్యాధులు, కుష్టువ్యాధుల తనిఖీ చికిత్స, కేన్సర్, బి.పి, ఘగర్ మొదలగు వ్యాధుల చికిత్స, ఎముకుల వ్యాధుల చికిత్స, కంటి మరియు ఇఎన్.టి వ్యాధుల చికిత్స. సాదారణ వ్యాధుల చికిత్స, రక్త పరీక్షలు మరియు దంత వైద్య చికిత్స వంటి పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారని, వారంతా మీకు సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ, డి.టి.టి డా. జంపా కృష్ణమోహన్, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 13:45:14