1 ENS Live Breaking News

భూముల రీసర్వే వేగవంతం కావాలి..

భూముల రీసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ సూచించారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు తో గురువారం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం పరిష్కారం చేయాలన్నారు. అదే విధంగా భూ రికార్డులు కూడా వెంటవెంటనే తాజా పరచాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని, త్వరిత గతిన పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిషేక్, సిపిఓ శ్రీనివాస రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-21 15:04:02

అల్లూరిజిల్లా హ్యాండ్ బుక్ ఆవిష్కరణ..

స్టాటస్టిక్స్, ప్రణాళిక శాఖ ద్వారా రూపొందించిన అల్లూరి సీతారామరాజు జిల్లా హ్యాండ్ బుక్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆవిష్కరించారు.  కలెక్టర్ చాంబర్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆవిష్కరించిన కలెక్టర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర సమాచారం తో పాటు జిల్లాలోని రెండు డివిజన్లకు సంబంధించిన 22 మండలాల 2011 జనాభా, గ్రామాలు, నివాసాలు, జిల్లా ఆర్థిక భౌగోళిక స్థితిగతులు, జిల్లాలోని అన్ని శాఖల డేటా, పర్యాటకం తదితర అంశాలతో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రూపొందించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, బి దయానిధి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-21 14:59:22

ఏ ఒక్క గిరిజనుడూ నష్టపోకూడదు..

అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లాలోని గిరిజన రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ ఉద్యాన శాఖలతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు లాభం చేకూరే విధంగా సంబంధిత అధికారులు తగు సూచనలు అందజేయాలని ఆదేశించారు. వెబ్సైట్లో రైతుల పూర్తి వివరాలు ఉండాలని, ఆధార్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, ఎన్ పి సి ఐ తదితర ఫెయిల్యూర్స్ లేకుండా కెవైసి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు బ్యాంకర్లను సంప్రదించి తప్పులను సవరించాలి అన్నారు. రానున్న పది రోజులలో కేవైసీ పూర్తి చేసి రైతులకు సబ్సిడీ, రుణాలు మంజూరుకు సహకరించాలని ఆదేశించారు.  ప్రతి మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో కనీసం 100 ఎకరాలు అభివృద్ధి చేసి ప్రాంతాన్ని బట్టి కాఫీ, పసుపు, చిరుధాన్యాలు, జీడి, రాజ్మా లాంటి వంటలను అభివృద్ధి చేసి ఫలసాయం పొందే విధంగా రైతులకు మార్గదర్శకం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  వ్యవసాయ యంత్రాలు పనిముట్లు సబ్సిడీ రుణాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  రైతు భరోసా అందజేసేందుకు వీలుగా అటవీ హక్కుల లబ్ధిదారులను గుర్తించాలని, అటవీ హక్కు దారులు డాటా సవరించాలని సూచించారు. గిరి రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి ఉద్యాన శాఖ కమిషనర్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ బి ఎస్ నందు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ రమేష్ కుమార్ రావు, ఉద్యాన శాఖ అధికారి అశోక్, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-21 14:57:21

వైద్యులే నిజమైన ప్రాణదాతలు..

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించేది కేవలం వైద్యులేనని అందుకే వైద్యులు ప్రాణదాతలని ప్రజలు నమ్ముతారని శ్రీకాకుళం లోక సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ఎం.పి.ల్యాడ్ నిధులు రూ.28 లక్షలతో  కొనుగోలు చేసిన వాహనానికి (బస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి, జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అంకితం చేశారు. మీకు వైద్యం... మాకు వరం.. అన్న నినాదంతో వాహనాన్ని వైద్యులకు అందచేశారు. సకాలంలో వైద్యులు స్పందిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని, ఇందుకు ఈ వాహనం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. ఎ. స్వామినాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.రవి వెంకటాచలం, హనుమంతు సాయిరాం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 14:49:50

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

రాష్ట్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలు విధిగా పాటిస్తూ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లు, యస్.పిలతో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్, ఏఐజి ఆర్.ఎన్.అమ్మిరెడ్డిలతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు 6 లక్షల మంది, ఇంటర్మీడియట్ పరీక్షలు 10 లక్షలు మంది హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో వరుసగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గతేడాది రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు తావులేకుండా పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించారనే రాష్ట్రానికి మంచి పేరు ఉందని, దాన్ని అలాగే కొనసాగేలా అధికారులు చొరవచూపాలని కోరారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున విద్యార్ధులు ఎటువంటి అసౌకర్యం లోనుకాకుండా ఉండేందుకు ప్రతీ తరగతి గదిలో విద్యుత్ దీపాలు మరియు ఫ్యాన్లు ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 27 నుండి మే నెల 9 వరకు జరగనున్న పరీక్షలకు నిర్ణీత సమయానికి ముందే విద్యార్ధులు హాజరుకావలసి ఉందని, అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున అటువంటి వారికి సమయపాలనలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్లు చూపి ఆర్.టి.సి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కును ధరించాలని, కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖలు తమ పాత్రలను సక్రమంగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికే ప్రతీ కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయని, వాటిని సరిచూసుకోవాలని సూచించారు. జవాబు పత్రాలను ఈసారి బుక్ లెట్ రూపంలో పొందుపరచడం జరిగిందని, దీనివలన విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షలయినప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, అదనపు పథక సమన్వయకర్త ఆర్.సూర్యప్రకాశ్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 14:28:06

వంశీక్రిష్ణ శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు

విశాఖలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  పునాది  నుంచి  నేటివరకు దాదాపు గా 7 సంవత్సారాలు వైసీపీ  నగర అధ్యక్షులుగా అనేక పార్టీ కార్యక్రమాలలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన వైసీపీ నాయకులకు, వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు, విశాఖ ప్రజలకు, మీడియా మిత్రులకు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  ఈమేరకు గురువారం విశాఖలోని నగర పార్టీ కార్యాలయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్ అధ్యక్షతన వంశీ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, పార్టీలో అందరికీ పదవులు ఇవ్వాలనే సీఎం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తపించి తనకు మంచి స్థానాన్ని కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తనను ఎంతగానో ఆదరించారని..ఇకపై నగర అధ్యక్షునిగా వచ్చే వారినిక కూడా అదే రీతితో ఆదరించాలని కోరారు. అనంతరం వంశీని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  గోలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి  దాడి విర భద్ర రావు , ఎమ్మెల్సీ వరుద కల్యాణి మాజీ మంత్రి  పి బాల రాజు ,  రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు, జాన్ వెస్లీ ,  సుజాత సత్యనారయణ, మాజీ శాసన సభ్యులు   తైనాల విజయకుమార్,  ఎస్.ఎ రెహ్మాన్ , చెంగల వెంకట రావు , పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి  రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు  జాన్ వెస్లీ ,  సుజాత సత్యనారాయణ, సుజాత నూక రాజు,  డిప్యూటీ మేయర్లు  కట్టమురి సతీష్ ,  జియాన్ని శ్రీధర్ ,  అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధి , జి.వి.ఎం.సి కార్పొరేటర్లు  అప్పరావు , బిపిన్ కుమార్,  రెయ్యి వెంకట రమణ , స్వాతి దాస్ ,  అల్లా లీలావతి ,  కామేశ్వరి ,  విల్లూరి భాస్కర్ రావు ,  కందుల నాగరాజు , రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు  మొల్లి అప్పారావు ,  పేర్ల విజయ చంద్ర ,నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు అభ్యర్దులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-21 14:08:47

రేపు వై.యస్.ఆర్.సున్నావడ్డీ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో నేడు వై.యస్.ఆర్.సున్నావడ్డీ 3వ సంవత్సరం ప్రారంభోత్సవ కార్య క్రమం జరగనున్నట్లు   జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఏప్రిల్ 22న ఉదయం 11.00గం.లకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి తొలుత    ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లాలో స్థానిక బాపూజీ కళామందిర్ నందు ఉదయం 11.00గం.లకు ప్రారంభం కానుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు , ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు  హాజరుకానున్నట్లు ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2022-04-21 13:47:19

ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం

రాష్ట్రంలోని ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని యువ నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ధర్మాన రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యాధులకు పేద, ధనిక వర్గాలు ఉండబోవని అందరూ సమానమేనని, అయితే కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల ఖర్చుతో కూడిన వైద్యాన్నిపొందేందుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత వై.యస్.ఆర్  అయితే మరో పది అడుగులు ముందుకు వేసి మరిన్ని సేవలతో డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పేరుతో అన్నిరకాల వైద్య సదుపాయాలను కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలు పొందేలా  చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి నాంధి పలికిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ పేదలకు అవసరమైన అన్నిరకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ శిబిరం ద్వారా సుమారు రూ.30వేల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, ప్రతీ ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ  కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, చిన్న పిల్లల వ్యాధుల చికిత్స్, గర్భిణీ మరియు స్త్రీల వ్యాధుల చికిత్స, క్షయవ్యాధి నిర్ధారణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్ధారణ, చికిత్స్, చర్మవ్యాధులు, కుష్టువ్యాధుల తనిఖీ చికిత్స, కేన్సర్, బి.పి, ఘగర్ మొదలగు వ్యాధుల చికిత్స, ఎముకుల వ్యాధుల చికిత్స, కంటి మరియు ఇఎన్.టి వ్యాధుల చికిత్స. సాదారణ వ్యాధుల చికిత్స, రక్త పరీక్షలు మరియు దంత వైద్య చికిత్స వంటి పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారని, వారంతా మీకు సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ, డి.టి.టి డా. జంపా కృష్ణమోహన్, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 13:45:14

భూ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..

భూ రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లు తో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని 29 పూర్తి అయ్యాయని మిగిలినవి త్వరిత గతిన పూర్తిచేయడం జరుగుతుందన్నారు. గతంలో డ్రోన్ల ద్వారా 10 నుండి 12 కి.మీ వరకు సర్వే జరిగేదని, అయితే సాంకేతిక లోపాలు కారణంగా ప్రస్తుతం 6 కి.మీ వరకే సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనివలన సర్వేలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, డిఆర్ఓ ఎం.రాజేశ్వరి , సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ ఎడి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 08:54:30

మన్యానికి సున్నావడ్డీ రూ.13.68 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద శుక్రవారం సంఘాల సభ్యుల ఖాతాలకు నిధులు జమ చేయనుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో 20,055 స్వయం సహాయక సంఘాలలోని 2,30,675 మంది సభ్యులకు రూ.13.68 కోట్లు నిధులు జమ కానుంది. జిల్లాలో మొదటి విడతలో 2019 - 20 సంవత్సరానికి16,695 సంఘాల్లోని 1,92,694 మంది సభ్యులకు రూ.11.05 కోట్లు,  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 18,868 సంఘాలలోని 2,15,165 మంది సభ్యులకు రూ.10.66 కోట్లు చెల్లించడం జరిగింది. మూడు సంవత్సరాల్లో 20,055 మహిళా సంఘాలలోని 2,30,675 సభ్యులకు మొత్తం రూ.35.39 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్ క్రాంతి పథం ఏపీడి సత్యం నాయుడు గురు వారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.

మన్యం జిల్లా

2022-04-21 08:52:09

భూ పునః సర్వే పై దృష్టి సారించాలి

భూ పునః సర్వే వలన భూ సమస్యలు నివారించ వచ్చని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ అన్నారు. భూ పునః సర్వే కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో గురువారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్థాయి రెవిన్యూ అధికారులను మ్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. సర్వే, రెవిన్యూ అంశాలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యదర్శి ఎం.బాబు మాట్లాడుతూ గ్రామ సచివాలయం పరిధిలో నీటి తీరువా వసూలు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, సర్వే సహాయ సంచాలకులు  పాల్గొన్నారు.

మన్యం

2022-04-21 08:45:07

నిర్దేశిత పనులు సకాలంలో పూర్తిచేయాలి

పనులు సకాలంలో పూర్తి చేయండి అని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ లో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తో మున్సిపల్ కమిషనర్ బుధ వారం మున్సిపల్ కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నేటికీ నిర్వహించిన పనులపై ఆరా తీసారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, టెండర్ల నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశానికి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-20 16:26:00

అల్లూరిజిల్లా డీపీఆర్వోగా గోవిందరాజులు

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో)గా పి.గోవిందరా జులు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన విశాఖ జివిఎంసీ, విజయనగరం జిల్లాలో డివిజనల్ పీఆర్వోగా పనిచేశారు. అయన విశాఖపట్నం, విజయనగరం, పాడేరు ప్రాంతాలపై మంచి పట్టువుంది. కొత్తజిల్లాలలకు డీపీఆర్వోలుగా ప్రభుత్వం అనుభవం వున్న అధికారులనే నియమించడంతో కొత్తజిల్లాల్లోని పరిపాలనకు సంబంధించిన సమాచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాద్యమాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సత్వరమే తెలియడానికి  అవకాశం ఏర్పడింది. ఆయన డీపీఆర్వోగా విధుల్లోకి చేరిన అనంతరం పాడేరు ఐటీడీఏ పబ్లిసిటీ ఏపీఓ రాములు, డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన జిల్లా కలెక్టర్, జెసి, డీఆర్వోలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా సమాచారం,  ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలు, అధికారిక కార్యక్రమాలు సత్వరమే మీడియాకి చేరవేడయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.

Paderu

2022-04-20 16:01:12

గిరిజనులకు చేరువగా కార్యక్రమాలు..

గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ గిరిజనులకు అత్యంత చేరువగా కార్యక్రమాలు నిర్వహిచాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు  గంధం చంద్రుడు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం విశాఖలోని రుషికొండ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన భాషలు, గిరిజన నృత్యాలు, కళలు, పరిశోధన శిక్షణలు మీద సమీక్షించారు. గిరిజన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, గిరిజన ప్రాంతములో పనిచేసే ఉద్యోగులకు,  గిరిజన యువతి యువకులకు గిరిజన చట్టాలు, హక్కులు మరియు ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు అందిస్తున్న పథకాలు పైన అవగహన తరగతులు నిర్వహించాలన్నారు. వారిని చైత్యనవంతులను చేసి క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంత అభివృధికి దోహదపడే విధంగా అవగహన తరగతులు ఉండాలని చూసించారు.ఇంతే కాకుండ గిరిజన సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ అవసరాలను గుర్తించి సంబందిత ప్రతి పదనలు తయారి చేసి సంవత్సరిక కార్యాచరణ రూపోందించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఈ కార్యాలయం భవవ సముదాయాన్ని కూడా పూర్తి స్థాయి లో వినియోగించు కోవాలని సూచించారు. గిరిజన ప్రాతములో ఉపాధ్యాయులకు ఆంగ్లం, మాతృ బాషా ఆధారంగా బహు బాషా విధానం బోదించేటట్టు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ శిక్షణ తరగతులు విద్య శాఖ వారితో సమన్వయం చేసుకొని నిర్వహించాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన మేలుకవులు పైన శిక్షణా తరగతులు నిర్వహించాలని తద్వారా గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు త్వరితగతిన అర్ధమయ్యే విధముగా ప్రతిపాదనలు రుపాదించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యలయం నిర్మాణం 2వ దశ పనులకు సంబందించి అన్ని ఏర్పాటులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రములో గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, డిప్యూటీ ఇంజనీర్ సిమ్మన్న.  గిరిజన సంస్కృతి పరిశోధన,శిక్షణ సంస్థ ఆచార్యులు డా. ఎన్. శ్రీనివాస్, వి. సునీల్,  ఎన్. సీతారామయ్య, కే యస్. వెంకటేశ్వర రావు, కే.జైరాం తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-20 10:28:32

ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య సేవలే లక్ష్యం..

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతీ జిల్లాలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్టు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  తెలిపారు. బుధవారం ఆమె నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో ఏర్పాటుచేసిన ఆరోగ్య మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే. రాంబాబు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ సంస్థల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా సకాలంలో మెరుగైన వైద్యం అందించాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే ఈ మేళాను నిర్వహిస్తున్నారని తెలిపారు. అర్హులై ఉండి ఆరోగ్యశ్రీ కార్డులు అందని వారికి సకాలంలో కార్డులు అందజేసే విధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు  అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు పై ప్రజలకు గ్రామస్థాయి నుండి విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలో నిర్వహించిన ఆరోగ్య మేళాకు ఉదయం 9 గంటల నుండే అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం తో పాటు ఉచితంగా మందులు పొందుతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఒ డాక్టర్ విజయలక్ష్మి, జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కెఎన్ఎల్జి శాస్త్రి , డి ఎల్ వో డాక్టర్  శారద బాయ్, ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్  నెట్ క్యాప్ చెర్మన్ కే కే రాజు ,ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-20 09:28:11