1 ENS Live Breaking News

తిరుమలలో భక్తుల కోసం వేసవి ఏర్పాట్లు..

కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరు గుతోందని, ఇందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా శ్రీ‌వారి దర్శనానికి రావచ్చని టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుంచి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్ల‌లో వేచి ఉండే భక్తులకు నిరంత‌రాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపామని, ప్రస్తుతం సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు  అందిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వారంలో నాలుగు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామన్నారు. సోమవారం నుండి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామన్నారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు.

         మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందన్నారు. రాంభగీచా బస్టాండు, సిఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. పిఎసి-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. భక్తులు సంచరించే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్వో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారని తెలిపారు. భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మెరుగైన ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.   విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు. కల్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని తెలిపారు. రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు.

         ఏప్రిల్ 11 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు అందించిన వివిధ సేవ‌ల వివ‌రాల‌ను ధ‌ర్మారెడ్డి వివ‌రించారు.

- శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య - 5,29,926

- ల‌డ్డూ ప్ర‌సాదం - 24,36,744

- వ‌డ‌లు - 25,921

- త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య - 2,39,287

- అన్న‌ప్రసాదాలు స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య - 10,55,572

- అశ్వ‌ని ఆసుప‌త్రిలో వైద్యసేవ‌లు పొందిన భ‌క్తుల సంఖ్య - 10,768

- భ‌క్తులకు కేటాయించిన గ‌దులు - 30,650

- భ‌క్తులకు కేటాయించిన లాక‌ర్లు - 20,541

- ల‌గేజి కౌంట‌ర్ల ద్వారా డిపాజిట్ చేసుకున్న సెల్‌ఫోన్లు, ల‌గేజి బ్యాగులు - 5,72,756

- తిరుప‌తి - తిరుమ‌ల మ‌ధ్య ప్ర‌యాణించిన వాహ‌నాలు - 46,419

- శ్రీ‌వారి సేవ‌కులు తిరుమలలో - 1700 , తిరుపతిలో - 300, పరకామణి సేవ - 200.

           మీడియా స‌మావేశంలో ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌,  సెల్వం, భాస్క‌ర్‌, విజివో  బాలిరెడ్డి, పేష్కార్  శ్రీ‌హ‌రి పాల్గొన్నారు.

Tirumala

2022-04-18 15:42:12

ఘనంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమ‌వారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు వ‌సంతోత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో  సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు.  అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత‌రం  రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  కాగా, ఏప్రిల్ 19వ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం  5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం,  సూపరింటెండెంట్  శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

Chandragiri

2022-04-18 15:37:00

బర్ద్ లో అధునాతన సిటీ స్కాన్..

తిరుపతిలోని బర్ద్ ఆస్పత్రిలో అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని టీటీడీ అదనపు ఈవో  ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన ధర్మ పాల్ సత్య పాల్  గ్రూప్ సంస్థ రూ 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువచేసే సిటి స్కాన్ యంత్రాన్ని ఆస్పత్రికి విరాళంగా అందించింది. ఈ సందర్భంగా  ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటానికి  పూజలు నిర్వహించి సిటీ స్కాన్ యంత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.  తిరుపతి జేఈవో   వీరబ్రహ్మం,  స్విమ్స్ డైరెక్టర్  డాక్టర్ వెంగమ్మ, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి,  ధర్మ పాల్ సత్యపాల్ గ్రూప్ డైరెక్టర్ అతుల్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు ఈవో  ధర్మారెడ్డి దాత అతుల్ జైన్ ను శాలువాతో సన్మానించి శ్రీవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు.

Tirupati

2022-04-18 15:32:41

ఏజెన్సీకి 6పెట్రోల్ బంకులు మంజూరు

ఏజెన్సీకి కొత్తగా ఆరు పెట్రోలు బంకులు మంజూరు చేసామని ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ స్పష్టం చేసారు. ఐటిడిఏ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పెట్రోలు బంకులు ఏర్పాటుపై రెవెన్యూ ,పోలీస్, గిరిజన సంక్షేమ,రహదారులు భవనాల శాఖల ఇంజనీరింగ్ అధికారులు, వైద్యా ఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ, హెచ్‌పిసిఎల్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంకులు నిర్మాణాలకు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనంతగిరి మండల కేంద్రంలోను,అరకువ్యాలీ మండలం పానిరంగిని, కొయ్యూరు మండలం నడింపాలెం, పాడేరు మండలం తలారిసింగి, ముంచంగిపుట్టు మండలం లుంగాపుట్టు, చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో పెట్రోలు బంకులు నిర్మిస్తామన్నారు. ఈనెల 23 వతేదీలోగా నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని రెవెన్యూ,ఫైర్,పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ,రహదారులు భవనాలశాఖ అధికారులకు సూచించారు. పెట్రోల్ బంకుల నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జూన్ మొదటి వారంలో నిర్మాణపు పనులు ప్రారంభించాలని చెప్పారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, ఎ ఎస్‌పి జగదీష్, ఎపి ఓ జనరల్ వి. ఎస్.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ లు డివి ఆర్ ఎం రాజు, కె. వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఇ ఇ బాల సుందరరావు, హెచ్‌పిసిల్ అధికారులు,తాహశీల్దారులు,అగ్నిమాపకశాఖ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

2022-04-18 15:25:33

గొప్పఅవకాశం ఇచ్చిన సీఎం వైఎస్.జగన్

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గ ప్రజానీకానికి మరింత సేవ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌న‌గ్‌మోహ‌న్‌రెడ్డి తన పట్ల అభిమానం చూపార‌ని, ముఖ్య‌ మంత్రి ఆకాంక్ష‌కు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాకు విచ్చేసిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతాభినందన తెలిపేందుకు చేపట్టిన ర్యాలీ కాకినాడ జిల్లా పెనుగుదురు, గొల్లపాలెం నుంచి ప్రారంభమై కొనసీమ జిల్లా ద్రాక్షారామం మీదుగా వివిధ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తల నడుమ  భారీ ఎత్తున ర్యాలీతో సాయంత్రం రామచంద్ర‌పురం చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం స్థానిక ప్రజానికాన్ని ఉద్దేశించి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అంకిత భావంతో ప‌నిచేస్తూ అందరు మెచ్చుకునే సేవ‌కునిగా  ముందుకు వెళ్తానని ఇంతటి గొప్ప భాగ్యాన్ని కల్పించిన రామచంద్ర‌పురం నియోజకవర్గ  ప్రజానీకానికి రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు. తనపై మరింత బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఆశలను వ‌మ్ము చేయకుండా అందరికి అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని మంత్రి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మ‌న్‌గా తొలి అవకాశం ఇస్తే ఆయన తనయుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  రెండుసార్లు మంత్రిగా పనిచేసే గొప్ప భాగ్యం త‌న‌కు కల్పించారన్నారు. కులం, మతం, వర్గం, లింగం, పార్టీల భేదాలు లేకుండా తన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజ‌లకు వేణు గోపాలకృష్ణ  కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా రెండోసారి మంత్రి పదవి  చేపట్టిన తర్వాత మొదటిసారిగా రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు ప్ర‌జ‌లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద ఎత్తున పూల మాలలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Kakinada

2022-04-18 15:13:07

శ్రీచందనానికి శ్రీనుబాబు రూ.లక్ష విరాళం

 శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి శ్రీచందన సమర్పణకి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు, తన సన్నిహితుడు బీవీ కృష్ణా రెడ్డితో కలిసి లక్ష రూపాయలు విరాళంటీ సమర్పించారు. తన పుట్టినరోజు సందర్బంగా సింహాద్రినాధుని దర్శనం చేసుకున్న శ్రీనుబాబు విరాళాన్ని దేవాలయ అధికారి తిరుమలేశ్వరరావు, వైదిక పెద్దలు ఆస్థానాచార్యులు డాక్టర్ టీపీ.రాజగోపాల్, హవల్దార్ ఎస్.టీపీ.రాజగోపాల్ కి అందజేశారు. ఇందులో ప్రతీయేటా స్వామివారికి సమర్పించేందుకు 120 కిలోల చందనం చెక్కలు అవసరముంటుంది. ఈనేపథ్యంలో 5 కిలోల గంధం చెక్కల ధరను శ్రీనుబాబు సమర్పించారు. దేవస్థానం అధికారులు అరగదీసిన చందనం ముక్కలను ప్రసాదంగా దాతలకు అందజేశారు.  భక్తుడిగా అనేక రూపాల్లో సింహాచలేశుని సేవల్లో భాగస్వామిగా ఉండడం ఆనందంగా ఉందని శ్రీనుబాబు చెప్పారు. ప్రతీయేటా చందనంతో పాటు స్వర్ణతులసీ దళాలు, స్వర్ణపుష్పాలు, నిత్యాన్నదాన పథకానికి లక్షలాది రూపాయలు విరాళంగా సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. కాగా కొండ దిగువ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు శ్రీనుబాబు ని సత్కరించారు. పుట్టినరోజు వేడుకలు చేసి కేకు కత్తిరించి ఆనందాన్ని పంచుకున్నారు. భగవంతుడికి చేసిన సేవలకు గుర్తింపుగా ధర్మకర్తల మండలిలో సభ్యత్వం దక్కిందన్నారు. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో అడివివరం కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, డైరెక్టర్ బి.మహేశ్వరరావు, బోర ప్రసాద్ రెడ్డి, దొంతల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2022-04-15 14:32:21

రామునికి తిరుమల శ్రీవారి కానుకలు..

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని చైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్ళి అర్చకులకు అందజేశారు. కోదండరామాలయం లోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి.  ఆలయ ప్రాంగణంలో ని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెఈవో  వీర బ్రహ్మం, డిప్యూటీ ఈవో  రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

Ontimitta

2022-04-15 12:37:55

టీటీడీ కి రూ.30 లక్షలు విరాళం..

గుంటూరు కు చెందిన వంగా హేమలత అనే భక్తురాలు శుక్రవారం టీటీడీ కి రూ.30 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తన కుమారుడు శ్రీ  శ్రీకాంత్ తో కలసి టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడిని అందించారు. ఈ మొత్తం టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు ఉపయోగించుకోవాలని దాత కోరారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, శ్రీవారి సర్వదర్శనం అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, స్వామివారి సేవలు ప్రపంచ వ్యాప్తం కావాలని కోరారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా ఎందరికో సేవలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అంతముందు దాత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

Tirumala

2022-04-15 12:34:13

ఇంటింటికీ దోమల మందు పిచికారి..

మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికి దోమల మందు పిచికారీ చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. తొలి విడత దోమల మందు పిచికారీ పనులను శుక్రవారం స్థానిక గొందూరు కాలనీలో కలెక్టర్  ప్రారంభించారు. అల్లంగి మత్స్యమ్మ ఇంట్లో చేస్తున్న దోమల నివారణ మందు పిచికారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలు అప్రమత్తంగా ఉంటూ మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా కేసులు నమోదైతే సంబంధిత అధికారులను ప్రశ్నిస్తానని చెప్పారు. స్ప్రేయింగ్ చేస్తున్న గ్రామంలో ఒక్క ఇల్లుకూడా వదలకుండా దోమల మందు పిచికారీ చేయాలని సూచించారు. దోమల మందు పిచికారీ పనులు పూర్తి స్థాయిలో నిర్వహించే బాధ్యత పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లుపైనే ఉందన్నారు.పిచికారీ పనులును రిజిష్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. దోమల మందు స్ప్రే చేసిన ఇంటి యజమానితో సంతకం లేదా వేలిముద్ర వేయించాలని సూచించారు. స్ప్రేయింగ్ నమోదులుపక్కాగా జరగాలని చెట్టు కింద కూర్చుని వేలిముద్రలు వేస్తే క్రాస్ చెక్ చేసి పిచికారీ జరిగిందాలేదాని విచారిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులతో సంతకాలు స్వీకరించాలన్నారు. ఏజెన్సీకి దోమల మందు ఎంత దోమల మందు వచ్చింది, పిహెచ్‌సిలకు ఏవిధంగా పంపిణీ చేసారు. పిచికారీ సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలపై ఆరా తీసారు. పిచికారీ పంపులను అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసారు. వైద్య సిబ్బంది మలేరియా పిచికారీ పనుల్లో భాగస్వామ్యం కావాలన్నారు. ఏజెన్సీలో మొదటి విడతలో 1288 గ్రామాల్లో స్ప్రేయింగ్ చేస్తున్నామని మలేరియా అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. 4400 వందల కిలోలు దోమల మందు ఏజెన్సీకి సరఫరా చేసారన్నారు. ఐటిడిఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడతూ గత రెండేళ్లగా మలేరియా తగ్గు ముఖం పట్టిందన్నారు. వైద్య సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దోమల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వార్డు వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు పిచికారీని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, అదనపు జిల్లా వైద్యాధికారిడా. లీలా ప్రసాద్, జిల్లా మలేరియా అధికారులు డి .సాంబమూర్తి, వై.మణి , ఎంపిడి ఓ కె. వి. నరసింహరావు, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్.రజని , సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, వైద్య సిబ్బంది,మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాడేరు

2022-04-15 12:01:37

డా.YSR మత్స్యకార భరోసా వినియోగించుకోవాలి.. ఫిషరీష్ డిడి

డా.వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని మత్స్యకారులంతా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని  విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి సూచించారు.  ఈ మేరకు శుక్రవారం జిల్లాలోని పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించే డా.వైఎస్సార్ మత్స్యకార భరోసాపై అధికారులు, సిబ్బందితో కలిసి మత్స్యకారులకు పూర్తిస్థాయిలో  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఒకేరోజు(ఏప్రిల్ 16న) ఈ మత్స్యకారుల గుర్తింపు జరగనుందని చెప్పారు. దాని కోసం మత్స్యకారులు బోటు, బోటు రిజిస్ట్రేషన్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఫిషింగ్ లైసెన్స్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఫోన్ నెంబర్లతో సర్వే జరిగే రోజు మత్స్యకారులు అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకార లబ్దిదారుడు అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, కాపునేస్తం, నేతన్న నేస్తం, పాస్టర్,  వైఎస్సార్ చేయూత మరే ఇతర ప్రభుత్వ పథకాలు కూడా పొందకుండా ఉండేవారు మాత్రమే ఈ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హులని తెలియజేశారు. లబ్దిదారుడు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండి, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.20లక్షలు ఆదాయం, పట్టణ ప్రాంతంలో అయితే రూ.1.44లక్షల ఆదాయం మించకుండా ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో ఎవరికీ నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉండకూడదని, విద్యుత్ కనెక్షన్ 300 యూనిట్లు దాటకుండా ఉండాలని అదీ కూడా దీనిని ఆరు నెలల విద్యుత్ చార్జీలు పరిగణలోకీ తీసుకుంటారని, మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లోపు ఇంటిలో నివాసం ఉండాలని, ఈ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ పించను తీసుకుని ఉండకూడదని, మరీ ముఖ్యంగా మత్స్యాకార కుటుంబాల్లో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదని తెలియజేయశారు. ప్రభుత్వం పొందు పరిచిన నిబంధనలను సర్వే చేపట్టే మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన లబ్దిదారులు సర్వే సమయంలో అన్ని రకాల పత్రాలు, వాటి జెరాక్సులతో సిద్దంగా ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మత్స్యకారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, గ్రామీణ మత్స్య సహాయకులు, అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Bhogapuram

2022-04-15 11:26:22

ఈవీఎంల భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ అధికారులతో కలిసి  పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వివ‌రించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తుల, స్పందన, అగ్నిమాపక అధికారి ఎన్ సురేంద్ర ఆనంద్, కాకినాడ ఆర్‌డీవో బీవీ.రమణ, కాకినాడ పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు జె.రమేష్, ఎం. జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-14 14:04:56

రాజ్యాంగంతోనే భారతదేశ పాలన..

డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తులేకాకుండా ఆయన రచించిన రాజ్యాంగం తోనే భారత దేశ పాలన జరుగుతున్నదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి పేర్కొన్నారు. గురువారం ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యకు గల ప్రాముఖ్యాన్ని గుర్తించి మాతృదేవత అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్వసత్తాక రాజ్యాంగం మన అందరికీ పూజనీయ మని రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని రాజ్యాంగం అమలులో భాగస్వామ్యం తప్పక ఉండాలన్నారు.  స్వాతంత్ర్య భారతదేశ నిర్మాణానికి ఆయన దార్శనికుడిగా నిలిచారన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి వి సత్యవతి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ మన దేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి పటిష్టమైన న్యాయ వ్యవస్థ పాలనా వ్యవస్థను రూపొందించారని  కొనియాడారు. పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ అంబేద్కర్ వల్లనే దేశంలో సామాజిక మార్పు సాధ్యమైందన్నారు అనకాపల్లి లో అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ విద్య లేనిదే భవిష్యత్తు లేదని అంబేద్కర్ తెలిపారని న్యాయానికి పెద్దపీట వేస్తూ భారత రాజ్యాంగాన్ని మనకు అందించారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆకళింపు చేసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి అంబేద్కర్ చిత్రపటానికి  పూలమాలవేసి అంజలి ఘటించారు.  డి ఏ వి పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన "అంబేద్కర్ జీవిత చరిత్ర" నాటక ప్రదర్శన అందరినీ అలరించింది.  అంబేద్కర్ గురించి ప్రసంగించిన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బాలబాలికలకు రాజ్యాంగాన్ని గురించి తెలియజేసే పుస్తకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్ డి ఓ చిన్ని కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, డి ఎస్ డబ్ల్యూ ఓ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Anakapalle

2022-04-14 13:51:08

నూకాలమ్మకు మంత్రి అమర్నాథ్ పూజలు..

ఆంధ్రప్రదేశ్  పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నూకా లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విజయవాడ నుండి వచ్చిన అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఏ కార్యక్రమం తలపెట్టినా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడంలో క్రమం తప్పకుండా అమర్నాద్ పూజలు చేపడుతూ వస్తున్నారు. మంత్రి అమర్నాద్ తో పాటు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త కెకెరాజు దాడి రత్నాకర్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-14 13:38:37

61రోజులు సముద్రంలో చేపలవేట నిషేధం.. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకుమారి

సముద్రంలో 61రోజులు (15-04-2022 నుంచి 14-06-2022) పాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 56, 74 జారీ చేసిందని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో జిల్లా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సముద్రజలాల్లో చేపలు, రొయ్యలకి ఇది సంతానోత్పత్తి సమయమని ఆ సమయంలో తల్లిచేపలకు ఎలాంటి ఆటకం రాకుండా, మత్స్య ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేపల వేటను నిషేదించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాలార్లు మెకనైజ్డ్, మోటారైజ్డ్ బోట్లతో ఎలాంటి చేపల వేట చేయకూడదని చెప్పారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చేపల వేట చేపడితే ఏపీఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  చేపలవేట నిషేద సమయంలో ఉపాది కోల్పోయిన ఒక్కో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా రూ.10వేలు ఆర్ధిక సహాయం కూడా అందించనున్నదని తెలియజేశారు. దానికోసం ఈనెల 16వ తేదిన జిల్లాలోని అన్ని పంచాయతీల్లో మత్స్యకారులను గుర్తించే నిమిత్తం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సర్వే కూడా నిర్వహించనున్నామన్నారు. దాని కోసం మత్స్యకారులు బోటు, బోటు రిజిస్ట్రేషన్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఫిషింగ్ లైసెన్స్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఫోన్ నెంబర్లతో సర్వే జరిగే రోజు మత్స్యకారులు అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకార లబ్దిదారుడు అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, కాపునేస్తం, నేతన్న నేస్తం, పాస్టర్,  వైఎస్సార్ చేయూత మరే ఇతర ప్రభుత్వ పథకాలు కూడా పొందకుండా ఉండేవారు మాత్రమే ఈ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హులని తెలియజేశారు. లబ్దిదారుడు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండి, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.20లక్షలు ఆదాయం, పట్టణ ప్రాంతంలో అయితే రూ.1.44లక్షల ఆదాయం మించకుండా ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో ఎవరికీ నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉండకూడదని, విద్యుత్ కనెక్షన్ 300 యూనిట్లు దాటకుండా ఉండాలని అదీ కూడా దీనిని ఆరు నెలల విద్యుత్ చార్జీలు పరిగణలోకీ తీసుకుంటారని, మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లోపు ఇంటిలో నివాసం ఉండాలని, ఈ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ పించను తీసుకుని ఉండకూడదని, మరీ ముఖ్యంగా మత్స్యాకార కుటుంబాల్లో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదని తెలియజేయశారు. ప్రభుత్వం పొందు పరిచిన నిబంధనలను సర్వే చేపట్టే మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన లబ్దిదారులు సర్వే సమయంలో అన్ని రకాల పత్రాలు, వాటి జెరాక్సులతో సిద్దంగా ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు మీడియా ద్వారా మత్స్యకారులకు తెలియజేశారు.

Vizianagaram

2022-04-12 12:43:25

నవరత్నాల పథకాలు పేదలకు చేర్చాలి..

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రతీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసి జిల్లా ప్రతిష్టను  పెంచాలని అన్నిశాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూమ్ వీడియోలో జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తహాశీల్ధార్లు, ఎమ్.పి.డి.ఒ లతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా హౌసింగ్ జగనన్న పేదలందరికీ ఇల్లు,(హౌసింగ్ కనస్ట్రక్షన్) స్పందన, వార్డు/గ్రామ సచివాలయాలు, ఓ.టి.ఎస్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం   (లేబర్ బడ్జెట్, వై.యస్.ఆర్ జలకళ), రెవెన్యూ (రీసర్వే, సర్వే) కార్యక్రమాలు అమలు అవుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గాలపై దిశా నిర్ధేశం చేశారు. చిన్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, జిల్లాలో నిరంతర అభివృద్ధి జరిగేలా లక్ష్యాలను పెట్టుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి సూచించారు. ప్రభుత్వ నిర్ధేశిత ఆర్డర్ల ప్రకారం అధికారులు పని చేయాలని సూచించారు. మండలాల వారిగా తహాశీల్ధార్లు, ఎమ్.పి.డి.ఒ లు, మున్సిపల్ కమీషనర్లు, పలువురు జిల్లా అధికారులతో పనుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి, డి. ఆర్. ఒ చంద్రశేఖరరావు డి.ఆర్.డి.ఎ పి.డి ఆనంద్ నాయక్, డ్వామా పి.డి. యుగంధర్ కుమార్, హౌసింగ్ పి.డి. సాయి నాథ్, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ప్రేమ కుమారి, సి.పి.ఒ శేషశ్రీ, హౌసింగ్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2022-04-08 16:11:42