1 ENS Live Breaking News

స్పందనపై ప్రజలకు నమ్మకం పెంచాలి..

స్పందనపై ప్రజలకు నమ్మకం పెరిగేలా అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఐటిడి ఏ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ జి. ఎస్. ధనుంజయ్, ఐటిడిఏ పి. ఓ రోణంకి గోపాల క్రిష్ణ, ఎస్.పి.సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో మొట్టమొదటి సారిగా స్పందనలో గిరిజనుల నుండి శుక్రవారం 147 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ స్పందన కార్యక్రమంలో తప్పని సరిగా పాల్గొనాలని సూచించారు. స్పందనలో ఉపాధి, ఉద్యోగాఅవకాశాలు, తాగునీరు ,రహదారి సమస్యలపై ఎక్కవగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్దికేతర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని చెప్పారు.
స్పందనలో కొన్ని ఫిర్యాదులు డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి గ్రామానికి చెందిన వంతాల లక్ష్మి జగనన్న తోడుపథకాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం సంతారి పంచాయతీ పత్తిరి మెట్ట,బిల్లాయిపుట్టు గ్రామస్తులు జి.చంద్రరావు, పాడి త్రినాధరావు తదితర 15 మంది రైతులు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఆదివాసీ మహా సభ అధ్యక్షులు కొర్రా అప్పారావు పెదకోడాపల్లి పంచాయతీ మలకరిపుట్టు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసారు. ముంచింగ్ పుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ కొర్రా త్రినాధ్ కర్లాపొదార్ గెడ్డపై వంతెన నిర్మించాలని, కిముడుపల్లి, కర్లాపొదార్ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. పాడేరు మండలం దేవాపురం ఎంపిటిసి ఎం.నాగమణి దేవాపురం పంచాయతీలోనిఅంటిలోవ-దేవాపురం,డప్పాడ-జరిగరువు, గదుబూరు - కుమ్మరిపుట్టు గ్రామాల మట్టి రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేసారు. బాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని,బకాయి వేతనాలు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అప్పనర్స నేతృత్వంలో బాషా వాలంటీర్లు వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం తడిగిరి గ్రామ సర్పంచ్ పి రంజిత్ కుమార్ తడిగిరి గ్రామం పరిధిలో 1650 గ్రామాల వ్యవసాయ భూమి ఉందని సాగునీటి సదుపాయం కల్పించాలని, ఆర్ ఓ ఎఫ్ పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బి. దయానిధి, డి ఎఫ్ ఓ వినోద్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు సి ఎ మణి కుమార్, ఇ ఇ డి వి ఆర్ ఎం రాజు, పంచాయతీరాజ్ పి ఐ యు ఇ ఇ కె.శ్రీనివాసరావు, పి ఆర్ ఇ ఇ కె.లావణ్య కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ జవహార్ కుమార్, డి ఎల్ పి ఓ పి ఎస్ కుమార్ వెలుగు ఎపిడి మురళి, అదనపు జిల్లా వైద్యాధికారి డా. లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-04-08 10:50:23

ఘనంగా వలంటీర్ల సేవలకు పురస్కారాలు

శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లకు  సేవా పురస్కార కార్యక్రమం మునిసిపల్ కమీషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు  ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  వాలంటీర్ వ్యవస్థ అనేది గతంలో  దేశంలో  ఎక్కడా లేని వ్యవస్థ అని అన్నారు. వాలంటీర్  అంటే వారి వార్డు లో యాభై కుటుంబాలకు  బాధ్యత తీసుకునే కుంటుంభ పెద్ద లా  వ్యవహారిస్తున్నారు. అని అన్నారు. కరోనా సమయంలో  మీరు  మీ ప్రాణాలు పణంగా  పెట్టి చేసిన సేవలు ఎంత పొగిడిన తక్కువే అని అన్నారు.ఇపుడు మీకు ఈ అవార్డులు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. చాలా మంది వాలంటీర్లు కి అవార్డులు ఇవ్వాలి కానీ  అందరికి ఇవ్వలేరు. మిగతా వారందరికి కూడా మున్ముందు అవార్డులు వస్తాయి ఇందులో ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. గుర్తింపు అనేది రావాల్సిన సమయంలో వస్తాయి  మనం వేచి  చూడాలి అని అన్నారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, శ్రీకాకుళం మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ జే రామప్పల నాయుడు, కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్,మాజీ మునిసిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, చల్లా అలివేలు మంగ, మైల పల్లి మహాలక్ష్మి మత్య కార డైరెక్టర్, ఊడి శ్యామల, కాపు డైరెక్టర్, మొహమ్మద్ రఫీ రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్, పైడి మహేశ్వరరావు, పి. సుగుణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-08 10:44:26

శ్రీకాకుళంజిల్లాకి వసతి దీవెన రూ.51.94 కోట్లు

శ్రీకాకుళం జిల్లాకు జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాకు 51.94 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి లైవ్ ద్వారా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.  శుక్రవారం నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన వసతి దీవెన సభలో ఆయన వర్చువల్ విధానం ద్వారా 2021-22 విద్యా సంవత్సరంనకు సంబంధించి విద్యా దీవెన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.  శ్రీకాకుళం జిల్లాలో 54,432 మంది విద్యార్థులకు సంబంధించి 49,060 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 51.94 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు.  ఇందులో 4079 మంది ఎస్.సి విద్యార్థులు 3722 మంది తల్లుల  ఖాతాల్లో 3.89 కోట్ల రూపాయలు, 850 మంది ఎస్.టి విద్యార్థుల తల్లులు 807  మంది ఖాతాల్లో 78.02 లక్షలు, 46,888 మంది బి.సి విద్యార్థుల తల్లులు 42,188 మంది ఖాతాల్లో రూ.44.73 కోట్లు, 1,717 మంది ఇబిసి విద్యార్థుల తల్లులు 1,594 మంది ఖాతాల్లో రూ.1.67 కోట్లు, 165 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థుల తల్లులు 142 మంది ఖాతాల్లో రూ.15.72 లక్షలు, 713 మంది కాపు విద్యార్థుల 675 మంది తల్లుల ఖాతాల్లో 67.80 లక్షల రూపాయలు, 20 మంది క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు 16 మంది తల్లులు ఖాతాల్లో రూ.1.95 లక్షలు జమ చేసినట్లు ఆయన చెప్పారు.  

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన పథకం క్రింద జిల్లాలో ఐటిఐ పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెసనల్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ లు లభించనున్నాయని తెలిపారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థానం అధిరోహించాలని కోరారు. జగనన్న వసతి దీవెన  లైవ్ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని వీక్షించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ, రాష్ట్ర మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బి. హేమామాలిని రెడ్డి,  మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె. వెంకట రత్నం, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల, బిసి సంక్షేమ అధికారి ఇ. అనూరాధ, ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు చేసారు.

కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ జిల్లాలో విభిన్న ప్రతిభా వంతులైన ఐ.టి.ఐ నుండి పి.జి వరకు చదువుకున్న, చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు 06 గురికి  ముఖ్య అతిథులు లేప్టాప్ లు అందజేశారు.

Srikakulam

2022-04-08 09:45:51

మనందరి భవిష్యత్తుకి పునాది విద్య..

మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు.  జగనన్న వసతి దీవెన పధకం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గ పరిధిలోని  34,261 మంది విద్యార్థులకు చెందిన 30559 మంది తల్లుల ఖాతాలో రూ.32.61 కోట్లు జమ చేసామని జిల్లా కలెక్టర్ డా.మాధవీలత పేర్కొన్నారు. నంద్యాల నుంచి ముఖ్యమంత్రి  పాల్గొన్న సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా   శుక్రవారం ఉదయం  స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో శాసన సభ్యులు జక్కంపూడి రాజా,  తలారి వెంకట్రావు తో కలిసి  కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  జిల్లా కలెక్టర్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొనడం ఒక మరుపురాని సంఘటన గా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ఆలోచించి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ప్రవేశ పెట్టి అమలు చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి తాను చదువుకో గలను అనే స్టైర్యాన్ని ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కల్పించగలిగారు.  మన భవిష్యత్తు కి పునాది విద్య , అటువంటి విద్యను పేద, నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత తెలిపారు.


ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకుంటూ ఫీజ్ రీయింబర్సు కింద అన్ని వర్గాలకు సమన్యాయం చేసారని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల పరిధిలో ని 3,666 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.3.48 కోట్లు జమ చెయ్యడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చెయ్యడం లో బ్రాండ్ అంబాసిడర్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని చెప్పి ఆచరణలో చూపిన వ్యక్తి జగనన్న అన్నారు. 

విద్యార్థిని ఏ. స్వాతి మాట్లాడుతూ, మా ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్ననని, జగనన్న విద్యా దీవెన సొమ్ము తో కంప్యూటర్ కొనుగోలు చేసాను, ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, నా వంటి ఎందరో విద్యార్థులకు ఆర్ధిక భరోసా కల్పించి ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఏర్పడిందని తెలిపారు.  సి.సాయి మాట్లాడుతూ, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన  పధకం నా వంటి ఎందరో పేద, నిరుపేద వర్గాల కు ఎంతో తోడ్పాటు అందించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ విశ్వేశ్వర రావు, జిల్లా షెడ్యూల్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పిఎన్వీ . సత్యనారాయణ, సూపరింటెండెంట్ పి.దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Rajahmundry

2022-04-08 09:31:59

బొమ్మూరు న్యాక్ భవనంలో స్పందన..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్పందన ఫిర్యాదులను నూతనంగా బొమ్మూరు గ్రామంలో న్యాక్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయం లో ఇకపై ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదులు  స్వీకరించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో సంబంధించిన శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారికి అందచేసే స్పందన ఫిర్యాదులను ఏప్రిల్ 11వ నుంచి జిల్లా కలెక్టరేట్ లో  స్వీకరించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం ధవళేశ్వరం లో ఉన్న న్యాక్ (ఎన్. ఏ. సి) భవనంలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.  స్పందన కి ప్రజలు  రావడానికి వీలుగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఉదయం 9 నుంచి మ. 2 వరకు తాత్కాలికంగా ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  అదే విధంగా స్థానిక సబ్ కలెక్టర్ నుంచి స్పందన లో ఫిర్యాదులు ఇచ్చే ప్రజల కోసం   కూడా ఉచిత బస్సు ను ఏప్రిల్ 11 వ తేదీన నడుపుతున్నట్లు మాధవీలత తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పందన ఫిర్యాదులను గ్రామ/వార్డు  సచివాలయాల్లో , రెవెన్యూ, మండల స్థాయిల్లో కూడా స్వీకరిస్తారని కలెక్టర్ వివరించారు.  మోరంపూడి నుంచి వేమగిరి వైపు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో  ఉన్న  హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న న్యాక్ భవన సముదాయంలో కలెక్టరేట్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని కలెక్టర్ డా.మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం కి పలు రూట్లలో నడిపే ఆర్టీసీ బస్సులు సోమవారం రోజున ఉదయం కొన్ని బస్సులు కలెక్టరేట్ మీదుగా నడిపేలా రూట్ మ్యాప్ రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఆర్టీసీ, రవాణా, రెవెన్యూ శాఖ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-08 08:44:04

రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు..

ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రామ‌తీర్ధంలో శ్రీ‌రామ‌న‌వమి సంద‌ర్భంగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఈ ఏడాది అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించేందుకు విస్తృత‌ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డించారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లుగా సీతారాముల క‌ళ్యాణాన్ని భ‌క్తులు తిల‌కించేందుకు అవ‌కాశం లేకుండా పోయింద‌ని, అందువ‌ల్ల ఈ ఏడాది జ‌రుగుతున్న క‌ళ్యాణోత్స‌వానికి భ‌క్తులంద‌రినీ ఆహ్వానిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీతారాముల వారి క‌ళ్యాణానికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ మేర‌కు దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు పేర్కొన్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి రామ‌తీర్ధం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్ధం ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు. భ‌క్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌నం చేసుకొనేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా తాగునీరు, అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయం వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్  సూర్య‌కుమారి శుక్ర‌వారం రామ‌తీర్ధంలో ప‌ర్య‌టించి సీతారాముల క‌ళ్యాణానికి చేస్తున్న ఏర్పాట్ల‌పై రెవిన్యూ అధికారులు, ఆల‌య అధికారుల‌తో స‌మీక్షించారు. తొలుత క‌ళ్యాణం జ‌రిగే మండ‌పంలో ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. రెండేళ్ల త‌ర్వాత ప్ర‌జ‌లు తిల‌కించేందుకు వీలుగా సీతారాముల క‌ళ్యాణాన్ని ఆల‌యం వెలుప‌ల నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నందున భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తార‌ని అందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ఇ.ఓ. డి.వి.వి. ప్ర‌సాద‌రావును ఆదేశించారు. భ‌క్తుల కోసం తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అత్య‌వ‌స‌ర వైద్యం అందించేందుకు 108, 104 అంబులెన్సులు సిద్ధంగా వుంచాల‌ని,  వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఓ.ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు త‌గిన‌న్ని అందుబాటులో వుంచాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌కు త‌లంబ్రాలు, పాన‌కం అందించేదుకు రెండు కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తులు చెప్పులు విడిచిన చోటు నుంచి క‌ళ్యాణం జ‌రిగే ప్ర‌దేశానికి వ‌చ్చేట‌పుడు ఎండ తీవ్ర‌త‌కు ఇబ్బంది ప‌డ‌కుండా ఆ ప్రాంతాన్ని కార్పెట్ వేసి నీటితో త‌డ‌పి వుంచాల‌న్నారు. స్వామి వారి క‌ళ్యాణానికి హాజ‌ర‌య్యే ప‌ది వేల మంది భ‌క్తుల‌కు అన్న‌దానం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

భ‌క్తులు వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహ‌నాల్లో వ‌చ్చే అవ‌కాశం వున్నందున ఆయా వాహ‌నాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ పోలీసుల‌ను ఆదేశించారు. పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నందున ట్రాఫిక్ ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌న్నారు. క‌ళ్యాణం జ‌రిగే ప్ర‌దేశంలో, ఆల‌యం వ‌ద్ద రెండు ఫైర్ ఇంజ‌న్ల‌ను సిద్దంగా వుంచాల‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. స్వామి వారి క‌ళ్యాణానికి వ‌చ్చే ప్ర‌ముఖుల ద‌ర్శ‌నానికి ప్రోటోకాల్ ప్ర‌కారం ఏర్పాట్లు చేయాల‌ని విజ‌య‌న‌గ‌రం, చీపురుప‌ల్లి ఆర్‌.డి.ఓ.లు భ‌వానీ శంక‌ర్‌, ఎం.అప్పారావు, నెల్లిమ‌ర్ల‌ త‌హ‌శీల్దార్ సీతారామ‌రాజుల‌ను ఆదేశించారు. ఉత్స‌వ ఏర్పాట్ల‌న్నింటినీ ప‌ర్య‌వేక్షించాల‌ని ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్‌కు సూచించారు. పారిశుద్ద్య నిర్వ‌హ‌ణ‌ను పంచాయ‌తీరాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టేలా ఏర్పాట్లు చేయాల‌ని ఎంపిడిఓ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు.  సీనియ‌ర్ శాస‌న‌స‌భ్యులు  బొత్స స‌త్య‌నారాయ‌ణ స్వామి వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున‌ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నార‌ని, శ్రీ‌వ‌రాహ ల‌క్ష్మీ నృసింహ‌స్వామి వారి దేవ‌స్థానం, సింహాచ‌లం తరపున ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌కూరుస్తార‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు. అనంత‌రం రామ‌స్వామి వారి ఆల‌యంలో స్వామి వారిని క‌లెక్ట‌ర్ ద‌ర్శించుకొన్నారు. ఆల‌య అధికారులు, అర్చ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు సంప్ర‌దాయ బ‌ద్దంగా స్వాగ‌తం ప‌లికి స్వామి వారి ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Ramatheertham

2022-04-08 08:12:09

సత్వరమే నష్టపరిహారం అందించాలి..

ఓఎన్జీసీ పైపు లైన్ల పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు త్వరితగతిన పరిహారం అందించేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మత్స్య శాఖ, ఓఎన్జీసీ, తాళ్లరేవు మండల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా‌తో కలిసి మత్స్యకారులకు పరిహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలోని తాళ్లరేవు మండలానికి సంబంధించి ఓఎన్జీసీ పైపు లైన్లు పనుల వలన జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం ఇచ్చే విధంగా అధికారులు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు ఓఎన్జీసీ, మత్స్య, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాళ్ళరేవు మండలం పరిధిలో మత్స్యకారులు, ఒంటరి మహిళలు మొత్తం 7,050 మంది లబ్ధిదారులు ఉన్నారని, మత్స్యకారుల జాబితా సిద్దంగా ఉన్నందున సొమ్ము జమ అయ్యేవిధంగా చూడాలని కలెక్టర్ కృతికా శుక్లా ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు. పైపులైన్ల పనులు ఇతర వివరాలు ఓఎన్జీసీ అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో  జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ, ఓఎన్జీసీ జీఎం (హెచ్.ఆర్) డి.మల్లిక్, ఓఎన్జీసీ ప్రతినిధి రవి, తాళ్ళరేవు తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో పీవీ.థామస్, మత్స్య శాఖ ఏడీ కె.కరుణాకర్, ఎఫ్.డీ.వో జీ.గోపి తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-08 06:44:55

య‌బ్బోజుకి క్రిష్టియ‌న్ మేరేజ్ లైసెన్స్..

విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణానికి చెందిన పి. య‌బ్బోజు చౌద‌రికి, ప్ర‌భుత్వం క్రిష్టియ‌న్ మేరేజ్ లైసెన్స్‌ను జారీ చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. స్థానిక స్టేడియం కాల‌నీలోని గ్రేస్ అండ్ ట్రూత్ చ‌ర్ఛికి చెందిన య‌బ్బోజు చౌద‌రికి, ఇండియ‌న్ క్రిష్టియ‌న్ మేరేజ్ యాక్ట్ 1872 ప్ర‌కారం, మూడేళ్ల‌పాటు చెల్లేవిధంగా ఈ లైసెన్సును జారీ చేసిన‌ట్లు వివ‌రించారు. ఇక‌నుంచీ జిల్లా ప‌రిధిలో భార‌తీయ‌ క్రిష్టియ‌న్ల మ‌ధ్య జ‌రిగే వివాహాల‌కు, ఆయ‌న ధృవ‌ప‌త్రాల‌ను జారీ చేస్తార‌ని క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-04-08 06:43:52

విజయసాయిరెడ్డిని కలసిన ఎస్సిఆర్డబ్యుఏ..

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గురువారం సర్క్యూట్ హౌస్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయనను దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందజేసారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలకు సహాయసహకారాలు అందించినందుకు  విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ పలు జర్నలిస్టుల సమస్యలను విజయసాయిరెడ్డి  దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎమ్.వి.ఎస్.అప్పారావు, కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్, ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పద్మజ, ఎస్.ఎన్.నాయుడు, కోశాధికారి అశోక్ రెడ్డి, సహాయ కార్యదర్శి అబ్బిరెడ్డి చంద్రశేఖర్, సహ సహాయ కార్యదర్శి కె.వినోద్, కార్యవర్గ సభ్యులు వి.సూరిబాబు, విశ్వేశ్వరరెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-08 03:14:13

నవరత్నాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి..

ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నవరత్నాల పధకాలు, సంక్షేమ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడంలో అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ ఆదేశాలిచ్చారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, కమీషనర్లు, ఆయా శాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ పధకాల అమలు తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి, శిక్షణా కలెక్టర్ శుభం బన్సాల్, డి.ఆర్.ఒ కొండయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. సమీర్ శర్మ మాట్లాడుతూ నవరత్నాలు, జగనన్న పేదలందరికీ ఇల్లు, ఓ.టి.ఎస్. విద్యా దీవెన, వసతి దీవెన, గృహనిర్మాణం, జగనన్న ఆసరా, చేయూత, పాల వెల్లువ, వై.యస్.ఆర్ నేస్తం, గ్రామ/ వార్డు సచివాలయాలు, మీసేవా కేంద్రాల నిర్వహణ, సర్వీసులు, ఆధార్ సెంటర్ల నిర్వహణ, వాలటీర్లు, గ్రామ సచివాలయాల సెక్రటరీల ప్రొబీషన్ డిక్లరేషన్ విధానం తదితర పథకాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. కొత్తగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లుగా బాధ్యతలు వారు తమ కర్తవ్య బాధ్యతలను సమన్వంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పటి కప్పుడు రోజువారి పరిశీలనలు చేయాడంతో పాటు నివేదికలు ఆధారంగా పథకాలను సమర్ధవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ/ వార్డు, గృహనిర్మాణశాఖ ముఖ్య అజయ్ జైన్ ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరును అధికారులకు వివరించి, పురోగతికి సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పి.డి. వసంతబాబు, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ప్రేమకుమారి, ఇ.డి.ఎం. రత్నం, డిజాస్టర్ మేనేజ్ మెంట్ పి.డి లలిత, సి.పి.ఒ శేషశ్రీ, డి.పి.ఒ కేశవరెడ్డి, కలెక్టరేట్ ఎ.ఒ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2022-04-07 15:40:44

అట్టహాసంగా గంట్ల పదవీ బాధ్యతలు..

సింహాచలం శ్రీ శ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో సభ్యులు తమ పదవీ ప్రమాణ స్వీకారం  చేపట్టారు. ప్రస్తుతం అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తన పదవికి  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అప్పన్న దేవస్థానం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు  చేపట్టడం జరిగిందని ,త్వరలోనే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు.. త్వరలోనే ప్రహ్లాదకల్యాణ మండపం స్వాధీనము కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉత్సవాలు విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని శ్రీను బాబు కోరారు. సింహాచలం గ్రామస్తుడుగా ధర్మకర్తల మండలి సభ్యుడిగా  పదవి స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.. దేవుడికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులకు శ్రీను బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును ఆలయ అధికారులు, సింహాచలం,అడవివరం గ్రామస్తులు  ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డ్ సభ్యులంతా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2022-04-07 10:15:14

అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యునిగా గంట్ల

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 235ను రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్.హరిజవహర్ లాల్ విడుదల చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సింహాచలం ప్రాంతానికి చెందిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును నియమించారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న గంట్ల శ్రీనుబాబు గతంలో చందనోత్సవం కమిటీ సభ్యునిగా , పలు అనుబంధ ఆలయాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేవస్థానం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గంట్ల శ్రీనుబాబును పాలకమండలి సభ్యునిగా నియమించడం పట్ల పలువురు భక్తులు, సహచర జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పాలకమండలి రెండేళ్ల పాటు సేవలందించనుంది.

Simhachalam

2022-04-07 03:48:52

ముగిసిన‌ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం

తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న‌ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం బుధ‌వారం ఉద‌యం మ‌హా పూర్ణాహూతితో శాస్త్రోక్తంగా ముగిసింది.  ఈ సంద‌ర్భంగా టిటిడి వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ‌వారి అనుగ్ర‌హంతో శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని మూడు రోజుల పాటు టిటిడి యాగం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. రుత్వికులు వైఖాన‌స ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఏడు హోమగుండాల‌లో హోమాలు, మంత్ర పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. చివ‌రిగా మంత్ర శ‌క్తితో నిండిన  క‌ల‌శాల్లోని జ‌లంతో శ్రీ ధ‌న్వంత‌రీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల‌కు అభిషేకం చేయ‌డం వ‌ల‌న లోకం అంత సుభిక్షంగా ఉంటుంద‌ని వివ‌రించారు. యాగ‌శాల‌లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, శ్రీ ధ‌న్వంత‌రీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, అగ్నిస్థాప‌న‌, కుంభ‌రాధ‌న‌, కుంభ‌ నివేద‌న‌, విశేష హోమాలు, మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ ధ‌న్వంత‌రీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానులకు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నం, క‌ల‌శాల్లోని మంత్ర జ‌లంతో విశేషంగా అభిషేకం చేశారు.  టిటిడి వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో 12 మంది ప్ర‌ముఖ రుత్వికులు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్ర‌ట‌రీ  స‌త్య‌నారాయ‌ణ‌, పాల్గొన్నారు.   ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌  కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని,  శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు  వేణుగోపాల దీక్షితులు, తిరుమ‌ల విజివో ‌బాలిరెడ్డి, ఎవిఎస్వో  గిరిధ‌ర్‌, వేద పాఠ‌శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2022-04-06 12:14:23

రాష్ట్రంలోనే తొలి భూగర్భ విద్యుత్ సరఫరా ఒంగోలులోనే..

ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఒంగోలు నగరంలో రూ.56.74 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ సర్క్యూట్ భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇదే సందర్భంగా మరో రూ.23.79 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ కేబుల్ విద్యుత్ లైన్ల నిర్మాణానికి కూడా వీరు శంకుస్థాపన చేశారు.  అనంతరం మంగమూరు రోడ్డులో ప్రత్యేక పైలాన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒంగోలు ప్రజల కల నేడు నెరవేరిందని అన్నారు. హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా గతంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం ఇళ్ల పైనుంచి వెళ్తున్న ఈ హైటెన్షన్ వైర్లను  త్వరలోనే తొలగించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని  మంత్రి ఆదేశించారు. ఈ చర్య ద్వారా 33, 34, 35, 36 డివిజన్లలోని ప్రజలకు ఇబ్బందులు తొలగాయని అన్నారు.  నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, ఈనెల 15వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ తిరుగుతామని మంత్రి చెప్పారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఒంగోలు నగర ప్రజల ఇబ్బందులను తొలగించేలా పోతురాజు కాలువను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ పనుల్లో ఇప్పటికే 25 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఒంగోలు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.409 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, వీటికి సంబంధించిన టెండర్లను త్వరలోనే ఇస్తామని చెప్పారు.

 ప్రతిరోజు పగటివేళ తాగునీరు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన రోడ్లలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ.180 కోట్లతో రిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొస్తున్నట్లు చెప్పారు. కొత్తపట్నంలో రూ.400 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబోతున్నామని, వీటికి సంబంధించిన టెండర్ల  ప్రక్రియను పూర్తి చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, గ్రోత్ సెంటరులో సుమారు 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా సాఫ్ట్ వేర్ కంపెనీ త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. సంక్షేమం తో పాటు అభివృద్ధికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో 24వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోగా, కోర్టు కేసుల వల్ల జాప్యం జరిగిందని, వీటిని పరిష్కరించి పేదలకు త్వరలోనే పట్టాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ముప్పు తొలగిన స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

 కర్నూలు రోడ్డులో ఉన్న ట్రాన్స్ కో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె.వి.మురళి, ట్రాన్స్ కో  జె.ఎం.డి. మల్లారెడ్డి, ఎస్.ఈ. రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.  నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, మాధవ రావు, ట్రాన్స్ కో ఎస్.ఈ. రామచంద్రారెడ్డి, ఓడీఈ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.   దీనికి ముందుగా కొప్పోలు ఫ్లై ఓవర్ నుంచి కర్నూల్ రోడ్డు వరకూ ద్విచక్రవాహనాలతో స్థానికులు ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. కేసవరాజు కుంట, బాలినేని భరత్ కాలనీ, గోపాల నగర్, గోపాల్ నగర్ మినీ బైపాస్ రోడ్డు లో రూ.2.04 కోట్ల విలువైన రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నెహ్రూ నగర్ పార్కును ప్రారంభించారు. 

Ongole

2022-04-06 12:10:22

ఆ వాలంటీరును విధుల నుంచి తొలగించండి..

విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన వార్డు వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ప‌ట్ట‌ణంలోని రాజీవ్‌న‌గ‌ర్ కాల‌నీలోని 34 వ స‌చివాల‌యాన్ని, కానుకుర్తివారి వీధికి చెందిన 10 వ నెంబ‌రు స‌చివాల‌యాన్నిజిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది, వ‌లంటీర్ల హాజ‌రు ప‌ట్టిక‌ను ప‌రిశీలించారు. 34 వ స‌చివాల‌యం ప‌రిధిలోని 16వ క్ల‌ష్ట‌ర్ వ‌లంటీర్ కు కేవ‌లం 33 శాతం హాజ‌రు మాత్ర‌మే ఉండ‌టంపై మండిప‌డ్డారు. వెంట‌నే ఆ వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు.  విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తే, ఎవ‌రినైనా ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌గ‌నన్న ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ నెలాఖ‌రునాటికి మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని, ముందుకురాని ల‌బ్దిదారుల ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. ఓటిఎస్ ప‌థ‌కంపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. రిజిష్ట్రేష‌న్లు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. పిల్ల‌ల‌కు, గ‌ర్భిణిల‌కు ర‌క్త ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆరా తీశారు. హెమోగ్లోబిన్ శాతం చాలా త‌క్కువ‌గా ఉన్న‌వారిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టి, పోష‌కాహారాన్ని అందించాల‌ని సూచించారు. ముఖ్యంగా నెల‌నెలా పంపిణీ చేస్తున్న‌రేష‌న్ బియ్యాన్ని వినియోగించ‌డం ద్వారా, ర‌క్త‌హీన‌త‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని అన్నారు. పాఠ‌శాల‌ల్లో అమ‌లు చేస్తున్న‌ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం మెనూను త‌ర‌చూ త‌నిఖీ చేయాల‌ని సిబ్బందికి క‌లెక్ట‌ర్‌ సూచించారు.

విజయనగరం టౌన్

2022-04-06 12:04:04