1 ENS Live Breaking News

పైడిభీమవరంలో డీశాలినేషన్ ప్లాంట్

శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో డీశాలినేషన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఇందుకు అవసరమైన అనుమతులు కావాలని జిల్లా కలెక్టరు శ్రీకేశ్ లాఠకర్ ను ఎల్ అండ్ టి అధికారులు కోరారు. డీశాలినేషన్ ప్లాంటు నిర్మాణంపై సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరును ఎల్ అండ్ టి అధికారులు కలిసారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) విధానంలో ప్లాంటును స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ ప్లాంటు నిర్మాణానికి సుమారు 40 ఎకరాల స్థలం అవసరముంటుందని, ఇందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం మంజూరుచేయాలని కోరారు. అలాగే అటవీశాఖ, మత్స్య శాఖ, సంబంధిత తహశీల్దార్లు సహకారం కావాలని అధికారులు కలెక్టరును కోరగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారు.  ఈ సమావేశంలో ఎల్ అండ్ టి బిజినెస్ హెడ్ శ్రీధర్, ఏపిఐఐసి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు, డాక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-18 16:52:09

ప్రభుత్వ లక్ష్యాలను అదిగమించాలి..

గుంటూరు జిల్లాలో రెవెన్యూ, హౌసింగ్, అభివృద్ది సంక్షేమ పధకాల అమలుకు  అధికారు లు  సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని  జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి  పేర్కొన్నారు.  సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్లు, ఆయా శాఖల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఆర్డిఓ లు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, యంపీడీఓ లు, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి అభివృద్ది సంక్షేమ పధకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుండి ప్రతి సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అభివృద్ది సంక్షేమ పధకాల లక్ష్యాలకు దూరంగా వున్న అధికారులతో చర్చించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న తరువాత అధికారులంతా సమన్వయంతో పనులను పూర్తి చేయించాలన్నారు.   వైయస్.ఆర్. జగనన్న పేదలందరికీ ఇళ్ళు, గృహ నిర్మాణాలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు, జనగన్న తోడు, ఓటియస్ రిజిస్ట్రేషన్, గ్రామ సచివాలయాల పనితీరు మెరుగుపరచడం, రెవెన్యూ అంశాలకు సంబంధించి 22 ఎ లిస్ట్ లో వున్న సమస్యల పరిష్కారం, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, అంగన్ వాడీ కార్యక్రమాలు, వైయస్.ఆర్. సంపూర్ణ పోషకాహార పధకం, వైయస్.ఆర్. సంపూర్ణ పోషకాహారం ప్లస్ పధకం,  టిడ్కో గృహాలు, రిజిస్ట్రేషన్లు అంశాలు, ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వైయస్.ఆర్. జలకళ, క్లాప్, మరుగుదొడ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన పధకాలలో ఏ ఒక్కదానిని కూడా విస్మరించకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయి నివేదికలతో సమావేశంలో పాల్గొనాలని ఆదేశించారు.  ఇక నుంచి జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వారికి నిర్దేశించిన  ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను అవగాహన చేసుకొని సంక్షేమ పధకాలను సమస్యలు లేకుండా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి ఒక్క పధకం అమలులో తహశీల్దార్, యంపీడీఓ లతో పాటు సంబంధిత శాఖల మండల అధికారులు భాగస్వామ్యులై లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  సమీక్షా సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, డిప్యూటీ కలెక్టర్ లలితా, హౌసింగ్ పీడీ సాయి నాథ్, జెడ్పీ సిఈఓ డా. శ్రీనివాస రెడ్డి, డి యం అండ్ హెచ్ ఓ డా. జే. యాస్మిన్,  మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరంజని, పంచాయితీ రాజ్ ఎస్ ఈ బ్రహ్మయ్య, మెప్మా పీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంబాబు, సీపీఓ శేషశ్రీ, ఈడియం రత్నం,  రాష్ట్రీయ బాల స్వస్థ జిల్లా  కో ఆర్డినేటర్ డా. జి. మాధవి, కలక్టరేట్ ఏఓ తాతా మోహన్ రావు, జి సెక్షన్ సూపరింటెండెంట్ లీలా సజీవ కుమారి తదితరులు పాల్గొన్నారు. 


Guntur

2022-04-18 16:50:16

జిల్లా న్యాయమూర్తిగా పి.వెంకటజ్యోతిర్మయి

కక్షిదారులకు సమన్యాయం చేసే విధంగా క్రుషి చేస్తానని, ప్రభుత్వ సేవలు అందించడా నికి పూర్తిస్థాయిలో క్రుషిచేస్తానని  రాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ లో జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  పి.వెంకట జ్యోతిర్మ యి పేర్కొన్నారు.  సోమవారం జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.  ప్రకాశం జిల్లా ఒంగోలు లో జిల్లా ప్రధాన న్యా య మూర్తి గా విధులు నిర్వర్తిం చి, బదిలీ పైరాజమహేంద్రవరం జిల్లా కోర్ట్ కి వచ్చినట్టు పేర్కొన్నారు. పాత తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 3 జిల్లాల కోర్టులు తన పరిధిలో కి వస్తాయన్నారు. అనంతరం కోర్ట్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది జడ్జిని మర్యాద పూర్వకంగా కలిసి విభాగాల వారీగా పరిచయాలు సచేకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు కార్యాలయ సిబ్బంది, పలువురు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Rajahmundry

2022-04-18 16:45:46

గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు కృషి..

అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని గిరిజనుల ఆరోగ్య పరి రక్షణకు కృషి చేస్తామని  కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అదేశాలు మేరకు ఆజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని బ్లాక్ స్థాయిలో మెగా హెల్త్ మేళాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన హెల్త్ మేళాను ఐటిడిఎ పి.ఓ. రోణంకి గోపాల క్రిష్ణ, పాడేరు శాసనసభ్యురాలు కె.భాగలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. స్త్రీల వైద్య విభాగం, చిన్న పిల్లలు, సాధారణ వైద్య సేవలు, రెడ్ క్రాస్ రక్త దానం శిబిరం, క్షయ విభాగం,ఉచిత మందులు పంపిణీ విభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు డివిజన్లలో మెగా హెల్త్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు.ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ప్రతి15 రోజులకు ఒక మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని అన్నారు. రెడ్ క్రాస్ చేసిన ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నారని చెప్పారు. ఐదు వందల నుండి వెయ్యి మంది వైద్య శిబిరానికి వస్తారని అంచనా వేశామని అన్నారు. వైద్యశిబిరానికి వచ్చే రోగులకు హెల్త్ ఐ డి జనరేట్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియ జేశారు.  ఈ కార్యక్రమంలో   ఎస్ పి సతీష్ కుమార్ ,ఎ పి మెడికల్ కౌన్సిల్ సభ్యులు టి.నర్సింగరావు,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలాప్రసాద్, పి.ఓ.డీడీ టి డా. టి. విశ్వేశ్వర నాయుడు, డిసిహెచ్ ఎస్ డా.హరి, డిఎల్పీఓ పీఎస్ కుమార్౩,ఎంపిడిఓ నరసింహారావు, తహసీల్దార్ వి.ప్రకాశరావు, రెడ్ కార్యదర్శి,పలువురు వైద్య నిపుణులు,ఎస్ టి కమిషన్ సభ్యులు జె.లిల్లీ సురేష్, కె.ఆర్.కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

2022-04-18 15:54:27

అప్రమత్తంగా సేవలు అందించాలి..

తిరుమలతో పాటు స్థానిక ఆలయాలకు కూడా భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో  నిత్యం అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని  టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  టీటీడీ ఆలయాల్లో భక్తుల రద్దీ నిర్వహణ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై సోమవారం రాత్రి ఈవో అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి ముగిసే వరకు ఆలయాలకు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.  తిరుమలలో టోకెన్ లేకుండా సర్వదర్శనం అమలు చేస్తున్నందువల్ల క్యూ లైన్లు, షెడ్లు, క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు తాగునీరు, ఆహారం, పాలు నిత్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సిఆర్వో, పిఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విభాగాది పతులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని అన్నారు. స్థానిక ఆలయాల్లో సైతం భక్తులు ఎక్కువ సమయం దర్శనం కోసం వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ఆలయాల్లో తాగునీరు, నీడ ఉండాలని ఈవో చెప్పారు. కోవిడ్ కు ముందు ఎక్కడ ఎంత మంది ఉద్యోగులు పని చేసేవారో తెలుసుకుని, అవసరమైన చోట వెంటనే ఉద్యోగుల ను రప్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతా విభాగం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో  వీర బ్రహ్మం, సివి ఎస్వో  నరసింహ కిషోర్, ఎఫ్ ఏసిఏ ఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, విజిఓ మనోహర్ తో పాటు ఆయా విభాగాల డిప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.

Tirumala

2022-04-18 15:49:44

తిరుమలలో భక్తుల కోసం వేసవి ఏర్పాట్లు..

కోవిడ్ వ్యాప్తి తగ్గడం, వేసవి సెలవులు మొదలుకావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరు గుతోందని, ఇందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా శ్రీ‌వారి దర్శనానికి రావచ్చని టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుంచి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు, షెడ్ల‌లో వేచి ఉండే భక్తులకు నిరంత‌రాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ సమయంలో వివిధ విభాగాల్లో సిబ్బందిని కుదించి ఇతర విభాగాలకు పంపామని, ప్రస్తుతం సిబ్బందిని తిరిగి ఆయా విభాగాలకు రప్పించి భక్తులకు సేవలు  అందిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత వారంలో నాలుగు రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశామన్నారు. సోమవారం నుండి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించామన్నారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్ క్రమబద్ధీకరిస్తూ తోపులాట లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు.

         మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోందన్నారు. రాంభగీచా బస్టాండు, సిఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. పిఎసి-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. భక్తులు సంచరించే అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్వో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచామన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లు ఖాళీ అయిన వెంటనే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నారని తెలిపారు. భక్తులు తిరిగే అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మెరుగైన ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.   విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ప్రధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు. కల్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని తెలిపారు. రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు.

         ఏప్రిల్ 11 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు అందించిన వివిధ సేవ‌ల వివ‌రాల‌ను ధ‌ర్మారెడ్డి వివ‌రించారు.

- శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భ‌క్తుల సంఖ్య - 5,29,926

- ల‌డ్డూ ప్ర‌సాదం - 24,36,744

- వ‌డ‌లు - 25,921

- త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన భ‌క్తుల సంఖ్య - 2,39,287

- అన్న‌ప్రసాదాలు స్వీక‌రించిన భ‌క్తుల సంఖ్య - 10,55,572

- అశ్వ‌ని ఆసుప‌త్రిలో వైద్యసేవ‌లు పొందిన భ‌క్తుల సంఖ్య - 10,768

- భ‌క్తులకు కేటాయించిన గ‌దులు - 30,650

- భ‌క్తులకు కేటాయించిన లాక‌ర్లు - 20,541

- ల‌గేజి కౌంట‌ర్ల ద్వారా డిపాజిట్ చేసుకున్న సెల్‌ఫోన్లు, ల‌గేజి బ్యాగులు - 5,72,756

- తిరుప‌తి - తిరుమ‌ల మ‌ధ్య ప్ర‌యాణించిన వాహ‌నాలు - 46,419

- శ్రీ‌వారి సేవ‌కులు తిరుమలలో - 1700 , తిరుపతిలో - 300, పరకామణి సేవ - 200.

           మీడియా స‌మావేశంలో ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు  హ‌రీంద్ర‌నాథ్‌,  సెల్వం, భాస్క‌ర్‌, విజివో  బాలిరెడ్డి, పేష్కార్  శ్రీ‌హ‌రి పాల్గొన్నారు.

Tirumala

2022-04-18 15:42:12

ఘనంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

చంద్ర‌గిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమ‌వారం ఉదయం ఆల‌య ప్రాంగ‌ణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు వ‌సంతోత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో  సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్ల‌కు స్నపనతిరుమంజనం వేడుకగా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు.  అనంత‌రం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత‌రం  రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  కాగా, ఏప్రిల్ 19వ తేదీ మంగ‌ళ‌వారం సాయంత్రం  5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం,  సూపరింటెండెంట్  శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ చైత‌న్య‌, ఇతర అధికారులు, విశేష‌ భక్తులు పాల్గొన్నారు.

Chandragiri

2022-04-18 15:37:00

బర్ద్ లో అధునాతన సిటీ స్కాన్..

తిరుపతిలోని బర్ద్ ఆస్పత్రిలో అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని టీటీడీ అదనపు ఈవో  ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన ధర్మ పాల్ సత్య పాల్  గ్రూప్ సంస్థ రూ 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువచేసే సిటి స్కాన్ యంత్రాన్ని ఆస్పత్రికి విరాళంగా అందించింది. ఈ సందర్భంగా  ధర్మారెడ్డి శ్రీవారి చిత్రపటానికి  పూజలు నిర్వహించి సిటీ స్కాన్ యంత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.  తిరుపతి జేఈవో   వీరబ్రహ్మం,  స్విమ్స్ డైరెక్టర్  డాక్టర్ వెంగమ్మ, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి,  ధర్మ పాల్ సత్యపాల్ గ్రూప్ డైరెక్టర్ అతుల్ జైన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు ఈవో  ధర్మారెడ్డి దాత అతుల్ జైన్ ను శాలువాతో సన్మానించి శ్రీవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు.

Tirupati

2022-04-18 15:32:41

ఏజెన్సీకి 6పెట్రోల్ బంకులు మంజూరు

ఏజెన్సీకి కొత్తగా ఆరు పెట్రోలు బంకులు మంజూరు చేసామని ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ స్పష్టం చేసారు. ఐటిడిఏ వీడియో కాన్ఫరెన్స్ హాలులో పెట్రోలు బంకులు ఏర్పాటుపై రెవెన్యూ ,పోలీస్, గిరిజన సంక్షేమ,రహదారులు భవనాల శాఖల ఇంజనీరింగ్ అధికారులు, వైద్యా ఆరోగ్యశాఖ, అగ్నిమాపకశాఖ, హెచ్‌పిసిఎల్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంకులు నిర్మాణాలకు అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అనంతగిరి మండల కేంద్రంలోను,అరకువ్యాలీ మండలం పానిరంగిని, కొయ్యూరు మండలం నడింపాలెం, పాడేరు మండలం తలారిసింగి, ముంచంగిపుట్టు మండలం లుంగాపుట్టు, చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో పెట్రోలు బంకులు నిర్మిస్తామన్నారు. ఈనెల 23 వతేదీలోగా నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని రెవెన్యూ,ఫైర్,పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ,రహదారులు భవనాలశాఖ అధికారులకు సూచించారు. పెట్రోల్ బంకుల నిర్మాణానికి అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జూన్ మొదటి వారంలో నిర్మాణపు పనులు ప్రారంభించాలని చెప్పారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, ఎ ఎస్‌పి జగదీష్, ఎపి ఓ జనరల్ వి. ఎస్.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ లు డివి ఆర్ ఎం రాజు, కె. వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఇ ఇ బాల సుందరరావు, హెచ్‌పిసిల్ అధికారులు,తాహశీల్దారులు,అగ్నిమాపకశాఖ తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

2022-04-18 15:25:33

గొప్పఅవకాశం ఇచ్చిన సీఎం వైఎస్.జగన్

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గ ప్రజానీకానికి మరింత సేవ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌న‌గ్‌మోహ‌న్‌రెడ్డి తన పట్ల అభిమానం చూపార‌ని, ముఖ్య‌ మంత్రి ఆకాంక్ష‌కు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాకు విచ్చేసిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతాభినందన తెలిపేందుకు చేపట్టిన ర్యాలీ కాకినాడ జిల్లా పెనుగుదురు, గొల్లపాలెం నుంచి ప్రారంభమై కొనసీమ జిల్లా ద్రాక్షారామం మీదుగా వివిధ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తల నడుమ  భారీ ఎత్తున ర్యాలీతో సాయంత్రం రామచంద్ర‌పురం చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం స్థానిక ప్రజానికాన్ని ఉద్దేశించి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అంకిత భావంతో ప‌నిచేస్తూ అందరు మెచ్చుకునే సేవ‌కునిగా  ముందుకు వెళ్తానని ఇంతటి గొప్ప భాగ్యాన్ని కల్పించిన రామచంద్ర‌పురం నియోజకవర్గ  ప్రజానీకానికి రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు. తనపై మరింత బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఆశలను వ‌మ్ము చేయకుండా అందరికి అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని మంత్రి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మ‌న్‌గా తొలి అవకాశం ఇస్తే ఆయన తనయుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  రెండుసార్లు మంత్రిగా పనిచేసే గొప్ప భాగ్యం త‌న‌కు కల్పించారన్నారు. కులం, మతం, వర్గం, లింగం, పార్టీల భేదాలు లేకుండా తన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజ‌లకు వేణు గోపాలకృష్ణ  కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా రెండోసారి మంత్రి పదవి  చేపట్టిన తర్వాత మొదటిసారిగా రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు ప్ర‌జ‌లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పెద్ద ఎత్తున పూల మాలలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Kakinada

2022-04-18 15:13:07

శ్రీచందనానికి శ్రీనుబాబు రూ.లక్ష విరాళం

 శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి శ్రీచందన సమర్పణకి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు, తన సన్నిహితుడు బీవీ కృష్ణా రెడ్డితో కలిసి లక్ష రూపాయలు విరాళంటీ సమర్పించారు. తన పుట్టినరోజు సందర్బంగా సింహాద్రినాధుని దర్శనం చేసుకున్న శ్రీనుబాబు విరాళాన్ని దేవాలయ అధికారి తిరుమలేశ్వరరావు, వైదిక పెద్దలు ఆస్థానాచార్యులు డాక్టర్ టీపీ.రాజగోపాల్, హవల్దార్ ఎస్.టీపీ.రాజగోపాల్ కి అందజేశారు. ఇందులో ప్రతీయేటా స్వామివారికి సమర్పించేందుకు 120 కిలోల చందనం చెక్కలు అవసరముంటుంది. ఈనేపథ్యంలో 5 కిలోల గంధం చెక్కల ధరను శ్రీనుబాబు సమర్పించారు. దేవస్థానం అధికారులు అరగదీసిన చందనం ముక్కలను ప్రసాదంగా దాతలకు అందజేశారు.  భక్తుడిగా అనేక రూపాల్లో సింహాచలేశుని సేవల్లో భాగస్వామిగా ఉండడం ఆనందంగా ఉందని శ్రీనుబాబు చెప్పారు. ప్రతీయేటా చందనంతో పాటు స్వర్ణతులసీ దళాలు, స్వర్ణపుష్పాలు, నిత్యాన్నదాన పథకానికి లక్షలాది రూపాయలు విరాళంగా సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. కాగా కొండ దిగువ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు శ్రీనుబాబు ని సత్కరించారు. పుట్టినరోజు వేడుకలు చేసి కేకు కత్తిరించి ఆనందాన్ని పంచుకున్నారు. భగవంతుడికి చేసిన సేవలకు గుర్తింపుగా ధర్మకర్తల మండలిలో సభ్యత్వం దక్కిందన్నారు. అందరి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమంలో అడివివరం కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, డైరెక్టర్ బి.మహేశ్వరరావు, బోర ప్రసాద్ రెడ్డి, దొంతల సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2022-04-15 14:32:21

రామునికి తిరుమల శ్రీవారి కానుకలు..

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని చైర్మన్ దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్ళి అర్చకులకు అందజేశారు. కోదండరామాలయం లోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి.  ఆలయ ప్రాంగణంలో ని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెఈవో  వీర బ్రహ్మం, డిప్యూటీ ఈవో  రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

Ontimitta

2022-04-15 12:37:55

టీటీడీ కి రూ.30 లక్షలు విరాళం..

గుంటూరు కు చెందిన వంగా హేమలత అనే భక్తురాలు శుక్రవారం టీటీడీ కి రూ.30 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో తన కుమారుడు శ్రీ  శ్రీకాంత్ తో కలసి టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు డిడిని అందించారు. ఈ మొత్తం టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు ఉపయోగించుకోవాలని దాత కోరారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, శ్రీవారి సర్వదర్శనం అన్ని వర్గాల ప్రజలకు అందించాలని, స్వామివారి సేవలు ప్రపంచ వ్యాప్తం కావాలని కోరారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా ఎందరికో సేవలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అంతముందు దాత కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

Tirumala

2022-04-15 12:34:13

ఇంటింటికీ దోమల మందు పిచికారి..

మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికి దోమల మందు పిచికారీ చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. తొలి విడత దోమల మందు పిచికారీ పనులను శుక్రవారం స్థానిక గొందూరు కాలనీలో కలెక్టర్  ప్రారంభించారు. అల్లంగి మత్స్యమ్మ ఇంట్లో చేస్తున్న దోమల నివారణ మందు పిచికారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలు అప్రమత్తంగా ఉంటూ మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా కేసులు నమోదైతే సంబంధిత అధికారులను ప్రశ్నిస్తానని చెప్పారు. స్ప్రేయింగ్ చేస్తున్న గ్రామంలో ఒక్క ఇల్లుకూడా వదలకుండా దోమల మందు పిచికారీ చేయాలని సూచించారు. దోమల మందు పిచికారీ పనులు పూర్తి స్థాయిలో నిర్వహించే బాధ్యత పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లుపైనే ఉందన్నారు.పిచికారీ పనులును రిజిష్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. దోమల మందు స్ప్రే చేసిన ఇంటి యజమానితో సంతకం లేదా వేలిముద్ర వేయించాలని సూచించారు. స్ప్రేయింగ్ నమోదులుపక్కాగా జరగాలని చెట్టు కింద కూర్చుని వేలిముద్రలు వేస్తే క్రాస్ చెక్ చేసి పిచికారీ జరిగిందాలేదాని విచారిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులతో సంతకాలు స్వీకరించాలన్నారు. ఏజెన్సీకి దోమల మందు ఎంత దోమల మందు వచ్చింది, పిహెచ్‌సిలకు ఏవిధంగా పంపిణీ చేసారు. పిచికారీ సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలపై ఆరా తీసారు. పిచికారీ పంపులను అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసారు. వైద్య సిబ్బంది మలేరియా పిచికారీ పనుల్లో భాగస్వామ్యం కావాలన్నారు. ఏజెన్సీలో మొదటి విడతలో 1288 గ్రామాల్లో స్ప్రేయింగ్ చేస్తున్నామని మలేరియా అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. 4400 వందల కిలోలు దోమల మందు ఏజెన్సీకి సరఫరా చేసారన్నారు. ఐటిడిఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడతూ గత రెండేళ్లగా మలేరియా తగ్గు ముఖం పట్టిందన్నారు. వైద్య సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దోమల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వార్డు వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు పిచికారీని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, అదనపు జిల్లా వైద్యాధికారిడా. లీలా ప్రసాద్, జిల్లా మలేరియా అధికారులు డి .సాంబమూర్తి, వై.మణి , ఎంపిడి ఓ కె. వి. నరసింహరావు, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్.రజని , సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, వైద్య సిబ్బంది,మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాడేరు

2022-04-15 12:01:37

డా.YSR మత్స్యకార భరోసా వినియోగించుకోవాలి.. ఫిషరీష్ డిడి

డా.వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని మత్స్యకారులంతా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని  విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి సూచించారు.  ఈ మేరకు శుక్రవారం జిల్లాలోని పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు అందించే డా.వైఎస్సార్ మత్స్యకార భరోసాపై అధికారులు, సిబ్బందితో కలిసి మత్స్యకారులకు పూర్తిస్థాయిలో  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా ఒకేరోజు(ఏప్రిల్ 16న) ఈ మత్స్యకారుల గుర్తింపు జరగనుందని చెప్పారు. దాని కోసం మత్స్యకారులు బోటు, బోటు రిజిస్ట్రేషన్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఫిషింగ్ లైసెన్స్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఫోన్ నెంబర్లతో సర్వే జరిగే రోజు మత్స్యకారులు అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకార లబ్దిదారుడు అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, కాపునేస్తం, నేతన్న నేస్తం, పాస్టర్,  వైఎస్సార్ చేయూత మరే ఇతర ప్రభుత్వ పథకాలు కూడా పొందకుండా ఉండేవారు మాత్రమే ఈ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హులని తెలియజేశారు. లబ్దిదారుడు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండి, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.20లక్షలు ఆదాయం, పట్టణ ప్రాంతంలో అయితే రూ.1.44లక్షల ఆదాయం మించకుండా ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో ఎవరికీ నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉండకూడదని, విద్యుత్ కనెక్షన్ 300 యూనిట్లు దాటకుండా ఉండాలని అదీ కూడా దీనిని ఆరు నెలల విద్యుత్ చార్జీలు పరిగణలోకీ తీసుకుంటారని, మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లోపు ఇంటిలో నివాసం ఉండాలని, ఈ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ పించను తీసుకుని ఉండకూడదని, మరీ ముఖ్యంగా మత్స్యాకార కుటుంబాల్లో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదని తెలియజేయశారు. ప్రభుత్వం పొందు పరిచిన నిబంధనలను సర్వే చేపట్టే మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన లబ్దిదారులు సర్వే సమయంలో అన్ని రకాల పత్రాలు, వాటి జెరాక్సులతో సిద్దంగా ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి మత్స్యకారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, గ్రామీణ మత్స్య సహాయకులు, అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు.

Bhogapuram

2022-04-15 11:26:22