1 ENS Live Breaking News

2.35 లక్షల మందికి కోవిడ్ టీకావేసి సేవలందించారామె.. కలెక్టర్ అభినందన..

విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలో మధురవాడ పీహెచ్సీలో ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా పనిచేస్తున్న చిల్లా ఉమామహేశ్వరి కోవిడ్ టీకాలు వేయడంలో అరుదైన రికార్డు నమోదు చేశారు. ఏకంగా 2.35 లక్షల మందికి ఆమె కోవిడ్ టీకా వేసి విశాఖజిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో రెపరెపలాండించారు. ఆమె చేసిన సేవకు గుర్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుక్ ఎల్.మాండవీయ ఘనంగా సత్కరించి మెమెంటోను అందజేశారు. దానిని ఈరోజు జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ద్రుష్టికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి కె.విజయలక్ష్మి తీసుకు వెళ్లగా ఆమెను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని ప్రోత్సహించారు. సిబ్బందితో మంచి సేవ జాతీయ స్థాయిలో నమోదు చేసే విధంగా క్రుషి చేసినందుకు డిఎంహెచ్ఓను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా డిఐఓ డా.ఎస్.జీవన్ రాణి, జిల్లా కార్యాలయ సిబ్బంది ఏంపీహెచ్ఏ ఉమామహేశ్వరికి అభినందనలు తెలియజేశారు.

Madhurawada

2022-03-10 13:41:10

స్వచ్ఛ సంకల్పం లక్ష్యాలను చేరుకుంటాం..

విశాఖ‌జిల్లాలో పారిశ‌ద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం ల‌క్ష్యాల‌ను చేరుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లిఖార్జున పేర్కొన్నారు. వైఎస్సార్ జ‌ల‌క‌ళ‌, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కాల‌ను స‌క్ర‌మంగా అమ‌లు చేసి ఫ‌లితాల‌ను అంద‌రికీ చేర‌వేస్తామ‌ని తెలిపారు. పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రీ గోపాల కృష్ణ ద్వివేదీ, డిప్యూటీ క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వివిధ అంశాలపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టిన‌ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇంటింటి చెత్త సేక‌ర‌ణ‌, చెత్త సేక‌ర‌ణ కేంద్రాల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ఆశాజ‌న‌క ఫ‌లితాలు రావాల‌ని, ఆ దిశ‌గా కలెక్ట‌ర్లు, సంబంధిత విభాగాల అధికారుల‌ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌లో లోపాలు త‌లెత్త‌కుండా, త‌ప్పుడు నివేదిక‌లు పంపించి ప‌ని నుంచి త‌ప్పించుకోకుండా క్షేత్ర‌స్థాయి సిబ్బందిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని సూచించారు. ఇంటి ప‌న్నుల వసూళ్ల‌లో వేగం పెంచాల‌ని, నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. చాలా జిల్లాల్లో షెడ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయ‌ని, పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, నీటి సౌకర్యం తదితర మౌలిక వసతులను క‌ల్పించాల‌ని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ‌ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల‌లో మరుగుదొడ్లు నిర్మాణాల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్త‌య్యేలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలని కలెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లిఖార్జున మాట్లాడుతూ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన చ‌ర్య‌ల గురించి వివ‌రించారు. ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా సాధ్య‌మైనంత ఎక్కువ మందికి ప‌నులు క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే డిమాండ్ మేర‌కు ప‌నులు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. మెటీరియ‌ల్ కాంపోనెంట్ నిధుల‌ను వినియోగించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. శానిటరీ కాంప్లెక్సుల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో 12 ఎక‌రాల భూమిని గుర్తించామ‌ని చెప్పారు. రైతుల‌కు బోర్‌వెల్స్ ఏర్పాటు చేస్తామ‌ని సాగునీటి అవ‌స‌రాలు తీరుస్తామ‌ని చెప్పారు. చెత్త‌సేక‌ర‌ణ కేంద్రాల నిర్వ‌హ‌ణలో లోపాలు లేకుండా, ఇంటింటి చెత్త సేక‌ర‌ణలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ప‌న్నుల వ‌సూలులో కింది స్థాయి సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయ‌టం ద్వారా మ‌రిన్ని ఫ‌లితాలు సాధిస్తామ‌ని చెప్పారు. 
వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్ట‌ర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, క‌ల్ప‌నా కుమారి, ఆర్‌.డ‌బ్ల్యూ.ఎస్‌., డ్వామా, ఫారెస్టు విభాగాల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-10 11:24:20

రీ-స‌ర్వేలో నిర్దేశిత‌ ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం..

విశాఖ‌ జిల్లాలో చేప‌ట్టిన రీ-స‌ర్వే ప్ర‌క్రియ‌లో ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరు కుంటామ‌ని, ఆ దిశ‌గా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున పేర్కొన్నారు. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 16 గ్రామాల్లో రీ స‌ర్వే ప్ర‌క్రియ పూర్తి చేశామ‌ని, ఈ వారం లోపు మ‌రొక 10 గ్రామాల్లో ప్ర‌క్రియ పూర్తి కానుంద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జ‌గ‌న‌న్న భూ ర‌క్ష ప‌థ‌కంలో భాగంగా చేప‌ట్టిన భూముల రీ-స‌ర్వే విధానం అమ‌లు, ఫ‌లితాల‌పై సీసీఎల్ఎ క‌మిష‌న‌ర్ జి. సాయి ప్ర‌సాద్ గురువారం వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌క్రియ‌ను వేగంగా, స‌జావుగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఫ‌లితాలు అంద‌రికీ అందాల‌ని, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. స‌ర్వే విధానం, మ్యుటేష‌న్ ప్ర‌క్రియ‌, రెవెన్యూ సంబంధిత ప‌లు అంశాలపై ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున జిల్లాలో తీసుకున్న చ‌ర్య‌ల గురించి సీసీఎల్ఏకు వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వే పూర్త‌యిన గ్రామాల్లో నోటిఫికేష‌న్లు, సంబంధిత ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. మ్యుటేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. కార‌ణం తెల‌ప‌కుండా తిర‌స్క‌రించిన మ్యుటేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 26 గ్రామాల్లో రీ స‌ర్వే ప్ర‌క్రియ పూర్తి చేసి సంబంధిత ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని వివ‌రించారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, క‌ల్ప‌నాకుమారి, డీఆర్వో శ్రీ‌నివాస‌మూర్తి, స‌ర్వే విభాగ‌పు అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-10 11:21:28

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రుహుల్లా నామినేషన్ ..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా గురువారం నాడు ఏపీ శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నిసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి శాసన సభ్యుల కోటాలో ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్నది. అభ్యర్థి ఎండీ రుహుల్లా అల్లా సాక్షిగా ప్రమాణం చేసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పి.వి. సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి. గౌతంరెడ్డి  పాల్గొన్నారు. 

Sachivalayam

2022-03-10 10:50:22

తూ.గో.జి.ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకి హెచ్సార్సీ నోటీసులు..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకి హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీచేసింది..  జిల్లాలోని మండపేటకి  కాళీక్రిష్ణభవగావన్ ఆత్మహత్య కేసు విషయంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించింది.  జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి తో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నోటీసులను రామచంద్రాపురం డిఎస్పీ, మండపేట సిఐ, ఎస్ఐలకు కూడా  జారీచేసింది. విచారణ నివేదిను ఏప్రిల్ 11వ తేదీలోపు సమర్పించాలని సూచించింది. ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట సిఐ కాళీ క్రిష్ణ భగవాన్ ను మర్మాంగంపై బలమైన  గాయం అయ్యేలా కొట్టారని,  ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ధర్నాచేయడంతో మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ ఘటన విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మండపేట సిఐను వీఆర్ లో కి పంపడంతోపాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల పోలీసులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక వ్యవస్థలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తప్పుచేసి దానికి జిల్లా అధికారులే ప్రభుత్వంలో సంజాయిషి ఇచ్చుకోవాలి. అలా మండపేటలో జరిగిన ఘటనపై ఇపుడు జిల్లా ఎస్పీ విచారణతోపాటు సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పకు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు ఇపుడు జిల్లా పోలీసు అధికారులు హెచ్చార్సీకి నోటీసుల రూపంలో సమాధానం చెప్పాల్సి వస్తోంది. హెచ్సార్సీ చైర్మన్ మందాత సీతారామ్మూర్తి,  జ్యూడిషల్ సభ్యుడు సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీచేశారని సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహ కుమార్ తెలియజేశారు. 

Kakinada

2022-03-10 07:01:41

సివిల్ పంచాయతీలు చేస్తే ఇంటికి పంపిస్తా.. ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు మళ్లీ దూకుడు పెంచారు. జిల్లాలో చాలా పోలీస్ స్టేషన్ లలో సివిల్ పంచాయతీల్లో పోలీసు సిబ్బంది తలదూర్చడం, దానిపై అధికంగా ఫిర్యాదులు రావడంతో తన దూకుడు వేగం పెంచారు. ఇటీవలే మండపేట పోలీస్ స్టేషన్  ఘటనను ఉదహరిస్తూ నేరుగా వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం జిల్లాలో సంచలనం అవుతోంది. సాధారణంగా సివిల్ కేసుల విషయంలో జిల్లా పోలీసు అధికారులు నేరుగా ఇలాంటి వ్యవహారాలు చేసే వారికి వార్నింగ్ లు ఇస్తుంటారు. ఆపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఎం.రవీంధ్రనాధ్ బాబు వచ్చినప్పటి నుంచి  పోలీస్ స్టేషన్లలో అవినీతిపాల్పడే వారిని గుర్తించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు జిల్లాలో డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్సు పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడంతో అవినీతి పోలీసు అధికారుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే కొంత మంది స్టేషన్ ఎస్ఐలను వీఆర్లోకి పంపిన ఎస్పీ మండపేట ఘటనను తెలియజేస్తూ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. అదే సమయంలో సిబ్బంది , స్టేషన్ కి వచ్చే వారిపైనా అమర్యాదగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో జిల్లా పోలీస్ శాఖలోనే టెర్రర్ మొదలైంది. జిల్లా ఎస్పీ దూకుడు చూస్తుంటే మరో రెండు మూడు నెలల్లో మరికొందరు పోలీసులపై వేటు పడేటట్టు ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

Kakinada

2022-03-09 15:02:16

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు..

గర్భస్థ పిండ లింగ నిర్ధారిత పరీక్షలు చేసి పుట్టబోయే శిశువు ఆడో, మగో తెలియజేయడం నేరమని   జాయింట్ కలెక్టరు పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం విశాఖలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గర్భస్థ పిండ లింగ నిర్థారిత పరీక్షల నియంత్రణ చట్టంపై శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్కానింగు సెంటర్లో ఉన్న స్కానింగు పరికరం  కేవలం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసమేనని,  లింగ నిర్థారణ కోసం కాదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ తెలిపే వారిపై కఠిన శిక్షలు అమలవుతాయన్నారు. అర్హత కలిగిన వైద్యుని  ప్రిస్ క్రిప్షన్ వుంటేనే స్కానింగు చేయాలన్నారు.  పేదలకు 5 శాతం స్కానింగ్  ఉచితంగా చేయాలని, ప్రతీ నెలా రిపోర్టు ఇవ్వాలని స్కానింగ్ కేంద్రాల వారిని ఆదేశించారు.  చట్టాన్ని అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు.  సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అని ఈ విషయంపై సమాజంలో మార్పు రావాలన్నారు. జిల్లా స్కానింగు కేంద్రాలలో చట్టం పూర్తిగా అమలవుతున్న్లట్లు  తెలిపారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి జడ్జి  కె.వి.వి. బుల్లి కృష్ణ మాట్లాడుతూ చట్టం యొక్క ప్రాధాన్యత, ఎటువంటి పరిస్థితుల్లో గర్భిణులకు స్కానింగు నిర్వహించాలనే విషయంపైన గర్భ నిర్ధారణకు స్కానింగ్ చేసినట్లయితే చట్ట ప్రకారం విధించే జరిమానాలు, శిక్షలు గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.విజయలక్మి మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం, జిల్లాలో చట్టం ఉపయోగం గూర్చి చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎడిషనల్ డి.ఎం.హెచ్.ఒ, డా.వసుంధర, ఎ.సి.పి. ప్రేమ్ కాజల్, డా.రమణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడ్వైజరీ కమిటీ సభ్యులు,  వైద్యాధికారులు, స్కానింగు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-09 11:03:53

సేవామూర్తులను గౌరవించడం అభినందనీయం..

ప్రపంచంలో ఆత్మీయతను పంచే అమ్మ మహిళా స్వరూపమని అలాంటి మహిళ స్థానంలో ఉండి ఆరోగ్య సేవలు అందించే ఏఎన్ఎంలను, వారి సేవలను గుర్తించి గౌరవిడంచడ శుభప్రధమని జివిఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, విజేఎఫ్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలోని జివిఎంసీలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించనున్న... సేవాస్పూర్తి అవార్డుల ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలో  ఏఎన్ఎమ్ లు చేస్తోన్న సేవలను గుర్తించి వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషదాయకమన్నారు. అసోసియేషన్ చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారం ఉంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో స్పూర్తిదాయంగానూ నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రతినిధులను అభినందించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ,  అసోసియేషన్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతున్నామన్నారు. ఇందులోభాగంగా  సేవ స్ఫూర్తి అవార్డు 2022 ను ప్రజలకు నిరంతరం సేవ చేసేవారిని గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యస్. రామకృష్ణ, కె. మదన్, గురు ప్రసాద్, జనార్దన్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-09 10:52:01

వేసవిలో త్రాగునీటికి కొరత రానివ్వం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఈ వేస‌విలో త్రాగునీటి కొర‌త రానివ్వ‌కుండా అన్ని ర‌కాల‌ ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. వేస‌విని ఎదుర్కొన‌డానికి ఇప్ప‌టికే క్రాష్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు తెలిపారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 49వ డివిజ‌న్ ప‌రిధిలోని గాజుల‌రేగ గుభేలుపేట‌ నుంచి జెఎన్‌టియు జంక్ష‌న్ వ‌ర‌కు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.62.50 ల‌క్ష‌ల‌తో నిర్మించిన ర‌హ‌దారిని, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ మంగ‌ళ‌వారం ప్రారంభించారు.  ఈ సంద‌ర్శంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఆధ్వ‌ర్యంలో,  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణాభివృద్దికి ప్ర‌ణాళికాబ‌ద్ద‌మైన కృషి జ‌రుగుతోంద‌ని ప్ర‌శంసించారు. శ‌త శంకుస్థాప‌న‌ల‌ను, ద్విశ‌త శంకుస్థాప‌న‌లు, చేప‌ట్టిన‌ ఇత‌ర అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. రాష్ట్రంలో మొట్ట‌మొద‌టిసారిగా, విజ‌య‌న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేకంగా ఒక పార్కును నిర్మించాల‌ని ఎంఎల్ఏ నిర్ణ‌యించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇదొక ఆద‌ర్శ‌నీయ‌ ప్ర‌య‌త్నంగా మంత్రి పేర్కొన్నారు. ఈ పార్కులో మ‌హిళ‌ల‌కోసం వాకింగ్ ట్రాక్‌, జిమ్‌, స్విమ్మింగ్ ఫూల్ లాంటి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ప‌ట్ట‌ణాల్లో త్రాగునీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు. స‌మ‌స్య ఉన్న ప్రాంతాల్లో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను చేస్తున్నామని, త్రాగునీటి వ‌న‌రుల‌ను అభివృద్ది చేస్తున్నామ‌ని చెప్పారు.

                    రాజ‌ధాని విష‌యంలో త‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండా, ప్ర‌తిప‌క్ష నాయకులు ఎగ‌తాళి చేస్తూ మాట్లాడుతున్నారంటూ, వారి ప్ర‌క‌ట‌న‌ల‌ను మంత్రి బొత్స‌ ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బాధ్య‌తాయుతంగా మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌న‌కు అమ‌రావ‌తే రాజ‌ధాని అని చెప్పి, చంద్ర‌బాబునాయుడు త‌న కుటంబంతో హైద‌రాబాద్‌లో నివాసం ఉన్నారంటూ ఆక్షేపించారు. రాష్ట్రంలో చంద్ర‌బాబుకు చిరునామా ఉందా ?... ఆయ‌న అమ‌రావ‌తికి ఎందుకు రాలేదు? అని ప్ర‌శ్నించారు. అడ్ర‌స్‌లేని వ్య‌క్తి మ‌న రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. శివ‌రామ‌కృష్ణ క‌మిష‌న్ సిఫార్సుల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా, అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించార‌ని అన్నారు. కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గం కోసం, ఈ వంక‌తో నిధులు దోచుకుతిన‌డానికే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేశార‌ని విమ‌ర్శించారు.  అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం నుంచి ఆమోదం కూడా తీసుకోలేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాము  అమ‌రావ‌తి ప్రాంతాన్ని రాష్ట్ర శాస‌న రాజ‌ధానిగా అభివృద్ది చేస్తామ‌ని, సిఆర్‌డిఏ చ‌ట్టానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

                     ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం పార్లమెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, శాస‌న స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, మున్సిప‌ల్ ఇంజ‌నీర్ కె.దిలీప్‌, కార్పొరేట‌ర్లు క‌ర్రోతు రాధామ‌ణి, న‌డిపిల్లి ఆంజ‌నేయులు, వైకాపా న‌గ‌రాధ్య‌క్షులు ఆశ‌పు వేణు, ఇత‌ర కార్పొరేట‌ర్లు, పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-03-08 07:45:58

కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు

విశాఖ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో  వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కొత్త కార్యాలయాలు ఏర్పాటుకు  అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాల పునర్విభజన, కార్యాలయాల ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు అన్ని ఏర్పాటై పని చేయాల్సి ఉంటుందన్నారు.  కొత్త జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటే అందులో పని చేయాల్సి ఉంటుందన్నారు. స్వంత భవనాలు లేకపోతే ప్రైవేటు భవనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసుకోవాలని తెలిపారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, తదితర వాటి గూర్చి వివరాలను కలెక్టరేట్ కు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి,  అనకాపల్లి ఆర్డీవో జె. సీతారామారావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-05 14:17:32

భళా తూ.గో.జి. పోలీస్.. భళా.. గ్రీన్ ఛానల్ లో క్షేమంగా విశాఖకి..

ఖాకీలంటే కాఠిన్యమేకాదు..అంతకు మించిన కారుణ్యం కూడా ఉంటుందని.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆధ్వర్యంలో ఓ రెండు ప్రాణాలు నిలబెట్టే విషయంలో జిల్లా పోలీసులు నిజం చేసిచూపి తమ మానవత్వాన్ని ప్రదర్శించారు.  సేవలందించడంలో ఎల్లప్పుడూ ముందుండే జిల్లా ఎస్పీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విశాఖపట్నం మరియు చెన్నై తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి  యొక్క కిడ్ని విశాఖలోని ఆరిలోవ అపోలో  ఆసుపత్రికి చేరింది.  లివర్ విశాఖపట్నం నుంచి చైన్నె విమానంలో చేరుకుంది. కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రి నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ సౌజన్యంతో ట్రస్టు ఆసుపత్రి డాక్టర్ రామక్రిష్ణ  కోఆర్డినేట్ చేస్తూ ఒక ప్రత్యేక అంబులెన్సు ద్వారా తరలించడంలో జిల్లా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిఐ రామచంద్రరావు, పెద్దాపురం క్రైమ్ సిఐ సురేష్ అంబులెన్స్ గ్రీన్ ఛానల్ ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు. కాకినాడ నుంచి అంబులెన్స్ కాన్వయ్ స్టేషన్ నుంచి స్టేషన్ మారే సమయంలో అంబులెన్సుకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన తీరు నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించారు పోలీసులు.  బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసే క్రమంలో వాటిని సురక్షితంగా విశాఖలోని ఆసుపత్రికి చేర్చడానికి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చేసిన క్రుషి, సేవల పట్ల జిల్లా వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఎంతో ఓర్పుతో పోలీస్ పైలట్ ఏర్పాటు చేసి మరీ అంబులెన్సుకి ఎక్కడా ఆటంకం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుతో ఇద్దరు వ్యక్తులకు అవయవాలను మార్పిడి చేసి ప్రాణాలు నిలబెట్టడానికి వీలుపడింది.  ఈ సేవ తూర్పుగోదావరి జిల్లా పోలీసుశాఖలో ఒక మంచి కార్యక్రమంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు..ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులున్న మిన్న అని మరోసారి రుజువుచేసి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే..

Kakinada

2022-03-04 09:11:05

ఆర్గాన్స్ ట్రాన్స్ పోర్టు కోసం తూ.గో.జి ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ప్రత్యేక గ్రీన్ ఛానల్..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు మరోసారి మానవీయతతో మార్గదర్శిగా మారి అవయవ దానం చేయడానికి గ్రీన్ ఛానల్ కోసం ముందస్తు దారి ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయాలై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను ఒకదాన్ని విశాఖపట్నం, మరో దానిని హైదరాబాద్ తరలించడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా అర్దరాత్రి దాటిన తరువాత అవయవాలను ఆసుపత్రికి తరలించడానికి ప్రత్యేక ట్రాన్స్ పోర్టుకి పోలీస్ స్టేషనల్ల వారీగా ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు ముందుచూపుతో బ్రెడ్ డెడ్ అయిన వ్యక్తి మరో ఇద్దరికి ప్రాణం పోస్తున్న తరుణంతో ఆ మంచి కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేని రోడ్డు ప్రయాణానికి మార్గం సుగమం చేయడానికి డిఎస్పీ, సిఐ, స్టేషన్ ఎస్ఐలు ఇలా ఒక పెద్ద నెట్వర్క్ నే ఏర్పాటు చేసి ఈ అర్ధరాత్రి అవయవాలాను గమ్యం చేర్చనున్నారు. ఆ రూట్ మ్యాప్ మీడియాకి, టీవీ ఛానళ్లకు, మొబైల్ న్యూస్ యాప్స్ కి విడుదల చేసి ముందుగానే కాకినాడ నుంచి విశాఖపట్నం వరకూ అదేవిధంగా.. కాకినాడ నుంచి హైదరాబాద్ వరకూ ప్రత్యేక వ్యవస్థద్వారా అవయవాలను తరలించడంలో కీలక భూమిక పోషించారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదరుకు కాకుండా ట్రాన్స్ పోర్టు నెట్వర్క్ ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకున్నారు.

Kakinada

2022-03-03 18:05:39

Simhachalam

2022-03-03 13:02:35

5 వరకూ బదిలీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు..

ఆరోగ్యశాఖలో ప్రభుత్వం నిర్ధేశించిన బదిలీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకు నేందుకు ప్రభుత్వం మరో రెండు రోజులు గడుపు పొడిగించినట్టు  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.మీనాక్షి తెలియజేశారు. ఈ మేరకు కాకినాడలో జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. హెల్త్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ పొడిగించిన సమయాన్ని ఉద్యోగులు, అధికారులు సద్వినియోగం చేసుకొని బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే జిల్లా కార్యాలయంలోని సంబంధిత విభాగాల సీనియర్ అసిస్టెంట్లను సంప్రదించాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. మీనాక్షి సూచించారు.

Kakinada

2022-03-03 12:56:28

ప‌ప్పు ధాన్యాల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అప‌రాలు సాగు చేసే రైతులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప‌ప్పు ధాన్యాల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ మార్క్‌ఫెడ్ అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌లే.. ప‌ప్పు ధాన్యాలు కొనుగోలు చేసేందుకు ప్ర‌త్యేక కేంద్రాలు పెట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌తో ప్ర‌తిపాద‌న‌లు పంపాలని చెప్పారు. మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్ శాఖ అధికారుల‌తో గురువారం ఆయ‌న త‌న ఛాంబ‌ర్లో సమావేశ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం మార్కెట్లో కొంత‌మంది త‌క్కువ ధ‌ర‌కే రైతుల నుంచి ప‌ప్పు ధాన్యాలు కొనుగోలు చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కావున అప‌రాలు సాగు చేసే రైతుల‌కు న్యాయం జ‌రిగేలా ఈ ర‌బీలో పండించే ప‌ప్పు ధాన్యాల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర లభించేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మార్క్‌ఫెడ్ డీఎం షేక్ యాసిన్ ను జేసీ ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని ప‌ప్పు ధాన్యాలు ధ‌ర‌లు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. మినుములు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ.6,300 ఉండ‌గా బ‌య‌ట మార్కెట్లో రూ.5,600 ఉంద‌ని, పెస‌లు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ.7,275 ఉండ‌గా బ‌య‌ట మార్కెట్లో రూ.6,300 ఉంద‌ని, మొక్క‌జొన్న రూ.1,870 ఉండగా బ‌య‌ట మార్కెట్లో రూ.1,800 ఇస్తున్నార‌ని, జొన్న‌లు రూ.2,758 ఉండ‌గా మార్కెట్లో రూ.2,300గా నిర్ణ‌యించార‌ని, రాగి రూ.3,377 కి గాను బ‌య‌ట రూ.2,200 ఇస్తున్నార‌ని వివ‌రించారు. ఈ తార‌త‌మ్యాలు లేకుండా రైతుల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌లు అంద‌రికీ తెలిసేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ప్ర‌చారం క‌ల్పించాల‌ని మార్క్‌ఫెడ్ అధికారుల‌ను జేసీ ఆదేశించారు. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ప్లెక్సీలు, పోస్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే కొనుగోలు ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా అనుకూల‌మైన కేంద్రాల‌ను గుర్తించాల‌ని, సామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవాల‌ని, సిబ్బందికి శిక్ష‌ణ‌లు ఇప్పించాల‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో మార్క్‌ఫెడ్ డీఎం షేక్ యాసిన్‌, మార్కెటింగ్ ఏడీ శ్యామ్ కుమార్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-03-03 12:45:28