1 ENS Live Breaking News

సేవామూర్తులను గౌరవించడం అభినందనీయం..

ప్రపంచంలో ఆత్మీయతను పంచే అమ్మ మహిళా స్వరూపమని అలాంటి మహిళ స్థానంలో ఉండి ఆరోగ్య సేవలు అందించే ఏఎన్ఎంలను, వారి సేవలను గుర్తించి గౌరవిడంచడ శుభప్రధమని జివిఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, విజేఎఫ్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలోని జివిఎంసీలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించనున్న... సేవాస్పూర్తి అవార్డుల ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలో  ఏఎన్ఎమ్ లు చేస్తోన్న సేవలను గుర్తించి వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషదాయకమన్నారు. అసోసియేషన్ చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారం ఉంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో స్పూర్తిదాయంగానూ నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రతినిధులను అభినందించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ,  అసోసియేషన్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతున్నామన్నారు. ఇందులోభాగంగా  సేవ స్ఫూర్తి అవార్డు 2022 ను ప్రజలకు నిరంతరం సేవ చేసేవారిని గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యస్. రామకృష్ణ, కె. మదన్, గురు ప్రసాద్, జనార్దన్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-09 10:52:01

వేసవిలో త్రాగునీటికి కొరత రానివ్వం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  ఈ వేస‌విలో త్రాగునీటి కొర‌త రానివ్వ‌కుండా అన్ని ర‌కాల‌ ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, రాష్ట్ర పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. వేస‌విని ఎదుర్కొన‌డానికి ఇప్ప‌టికే క్రాష్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు తెలిపారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని 49వ డివిజ‌న్ ప‌రిధిలోని గాజుల‌రేగ గుభేలుపేట‌ నుంచి జెఎన్‌టియు జంక్ష‌న్ వ‌ర‌కు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.62.50 ల‌క్ష‌ల‌తో నిర్మించిన ర‌హ‌దారిని, మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ మంగ‌ళ‌వారం ప్రారంభించారు.  ఈ సంద‌ర్శంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఆధ్వ‌ర్యంలో,  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణాభివృద్దికి ప్ర‌ణాళికాబ‌ద్ద‌మైన కృషి జ‌రుగుతోంద‌ని ప్ర‌శంసించారు. శ‌త శంకుస్థాప‌న‌ల‌ను, ద్విశ‌త శంకుస్థాప‌న‌లు, చేప‌ట్టిన‌ ఇత‌ర అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. రాష్ట్రంలో మొట్ట‌మొద‌టిసారిగా, విజ‌య‌న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేకంగా ఒక పార్కును నిర్మించాల‌ని ఎంఎల్ఏ నిర్ణ‌యించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇదొక ఆద‌ర్శ‌నీయ‌ ప్ర‌య‌త్నంగా మంత్రి పేర్కొన్నారు. ఈ పార్కులో మ‌హిళ‌ల‌కోసం వాకింగ్ ట్రాక్‌, జిమ్‌, స్విమ్మింగ్ ఫూల్ లాంటి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ప‌ట్ట‌ణాల్లో త్రాగునీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లు మంత్రి తెలిపారు. స‌మ‌స్య ఉన్న ప్రాంతాల్లో ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ను చేస్తున్నామని, త్రాగునీటి వ‌న‌రుల‌ను అభివృద్ది చేస్తున్నామ‌ని చెప్పారు.

                    రాజ‌ధాని విష‌యంలో త‌న వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా అర్థం చేసుకోకుండా, ప్ర‌తిప‌క్ష నాయకులు ఎగ‌తాళి చేస్తూ మాట్లాడుతున్నారంటూ, వారి ప్ర‌క‌ట‌న‌ల‌ను మంత్రి బొత్స‌ ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బాధ్య‌తాయుతంగా మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌న‌కు అమ‌రావ‌తే రాజ‌ధాని అని చెప్పి, చంద్ర‌బాబునాయుడు త‌న కుటంబంతో హైద‌రాబాద్‌లో నివాసం ఉన్నారంటూ ఆక్షేపించారు. రాష్ట్రంలో చంద్ర‌బాబుకు చిరునామా ఉందా ?... ఆయ‌న అమ‌రావ‌తికి ఎందుకు రాలేదు? అని ప్ర‌శ్నించారు. అడ్ర‌స్‌లేని వ్య‌క్తి మ‌న రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. శివ‌రామ‌కృష్ణ క‌మిష‌న్ సిఫార్సుల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా, అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించార‌ని అన్నారు. కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గం కోసం, ఈ వంక‌తో నిధులు దోచుకుతిన‌డానికే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేశార‌ని విమ‌ర్శించారు.  అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం నుంచి ఆమోదం కూడా తీసుకోలేద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ తాము  అమ‌రావ‌తి ప్రాంతాన్ని రాష్ట్ర శాస‌న రాజ‌ధానిగా అభివృద్ది చేస్తామ‌ని, సిఆర్‌డిఏ చ‌ట్టానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

                     ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం పార్లమెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, శాస‌న స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, మున్సిప‌ల్ ఇంజ‌నీర్ కె.దిలీప్‌, కార్పొరేట‌ర్లు క‌ర్రోతు రాధామ‌ణి, న‌డిపిల్లి ఆంజ‌నేయులు, వైకాపా న‌గ‌రాధ్య‌క్షులు ఆశ‌పు వేణు, ఇత‌ర కార్పొరేట‌ర్లు, పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-03-08 07:45:58

కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు

విశాఖ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో  వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కొత్త కార్యాలయాలు ఏర్పాటుకు  అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాల పునర్విభజన, కార్యాలయాల ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు అన్ని ఏర్పాటై పని చేయాల్సి ఉంటుందన్నారు.  కొత్త జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటే అందులో పని చేయాల్సి ఉంటుందన్నారు. స్వంత భవనాలు లేకపోతే ప్రైవేటు భవనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసుకోవాలని తెలిపారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, తదితర వాటి గూర్చి వివరాలను కలెక్టరేట్ కు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి,  అనకాపల్లి ఆర్డీవో జె. సీతారామారావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-05 14:17:32

భళా తూ.గో.జి. పోలీస్.. భళా.. గ్రీన్ ఛానల్ లో క్షేమంగా విశాఖకి..

ఖాకీలంటే కాఠిన్యమేకాదు..అంతకు మించిన కారుణ్యం కూడా ఉంటుందని.. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆధ్వర్యంలో ఓ రెండు ప్రాణాలు నిలబెట్టే విషయంలో జిల్లా పోలీసులు నిజం చేసిచూపి తమ మానవత్వాన్ని ప్రదర్శించారు.  సేవలందించడంలో ఎల్లప్పుడూ ముందుండే జిల్లా ఎస్పీ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విశాఖపట్నం మరియు చెన్నై తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీన్ ఛానల్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి  యొక్క కిడ్ని విశాఖలోని ఆరిలోవ అపోలో  ఆసుపత్రికి చేరింది.  లివర్ విశాఖపట్నం నుంచి చైన్నె విమానంలో చేరుకుంది. కాకినాడలోని ట్రస్టు ఆసుపత్రి నుంచి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ సౌజన్యంతో ట్రస్టు ఆసుపత్రి డాక్టర్ రామక్రిష్ణ  కోఆర్డినేట్ చేస్తూ ఒక ప్రత్యేక అంబులెన్సు ద్వారా తరలించడంలో జిల్లా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిఐ రామచంద్రరావు, పెద్దాపురం క్రైమ్ సిఐ సురేష్ అంబులెన్స్ గ్రీన్ ఛానల్ ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు. కాకినాడ నుంచి అంబులెన్స్ కాన్వయ్ స్టేషన్ నుంచి స్టేషన్ మారే సమయంలో అంబులెన్సుకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన తీరు నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్వహించారు పోలీసులు.  బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసే క్రమంలో వాటిని సురక్షితంగా విశాఖలోని ఆసుపత్రికి చేర్చడానికి తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చేసిన క్రుషి, సేవల పట్ల జిల్లా వాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఎంతో ఓర్పుతో పోలీస్ పైలట్ ఏర్పాటు చేసి మరీ అంబులెన్సుకి ఎక్కడా ఆటంకం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుతో ఇద్దరు వ్యక్తులకు అవయవాలను మార్పిడి చేసి ప్రాణాలు నిలబెట్టడానికి వీలుపడింది.  ఈ సేవ తూర్పుగోదావరి జిల్లా పోలీసుశాఖలో ఒక మంచి కార్యక్రమంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు..ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులున్న మిన్న అని మరోసారి రుజువుచేసి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే..

Kakinada

2022-03-04 09:11:05

ఆర్గాన్స్ ట్రాన్స్ పోర్టు కోసం తూ.గో.జి ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ప్రత్యేక గ్రీన్ ఛానల్..

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు మరోసారి మానవీయతతో మార్గదర్శిగా మారి అవయవ దానం చేయడానికి గ్రీన్ ఛానల్ కోసం ముందస్తు దారి ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయాలై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను ఒకదాన్ని విశాఖపట్నం, మరో దానిని హైదరాబాద్ తరలించడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా అర్దరాత్రి దాటిన తరువాత అవయవాలను ఆసుపత్రికి తరలించడానికి ప్రత్యేక ట్రాన్స్ పోర్టుకి పోలీస్ స్టేషనల్ల వారీగా ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు ముందుచూపుతో బ్రెడ్ డెడ్ అయిన వ్యక్తి మరో ఇద్దరికి ప్రాణం పోస్తున్న తరుణంతో ఆ మంచి కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేని రోడ్డు ప్రయాణానికి మార్గం సుగమం చేయడానికి డిఎస్పీ, సిఐ, స్టేషన్ ఎస్ఐలు ఇలా ఒక పెద్ద నెట్వర్క్ నే ఏర్పాటు చేసి ఈ అర్ధరాత్రి అవయవాలాను గమ్యం చేర్చనున్నారు. ఆ రూట్ మ్యాప్ మీడియాకి, టీవీ ఛానళ్లకు, మొబైల్ న్యూస్ యాప్స్ కి విడుదల చేసి ముందుగానే కాకినాడ నుంచి విశాఖపట్నం వరకూ అదేవిధంగా.. కాకినాడ నుంచి హైదరాబాద్ వరకూ ప్రత్యేక వ్యవస్థద్వారా అవయవాలను తరలించడంలో కీలక భూమిక పోషించారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదరుకు కాకుండా ట్రాన్స్ పోర్టు నెట్వర్క్ ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకున్నారు.

Kakinada

2022-03-03 18:05:39

Simhachalam

2022-03-03 13:02:35

5 వరకూ బదిలీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు..

ఆరోగ్యశాఖలో ప్రభుత్వం నిర్ధేశించిన బదిలీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకు నేందుకు ప్రభుత్వం మరో రెండు రోజులు గడుపు పొడిగించినట్టు  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.మీనాక్షి తెలియజేశారు. ఈ మేరకు కాకినాడలో జిల్లా మీడియాకి ప్రకటన విడుదల చేశారు. హెల్త్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ పొడిగించిన సమయాన్ని ఉద్యోగులు, అధికారులు సద్వినియోగం చేసుకొని బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే జిల్లా కార్యాలయంలోని సంబంధిత విభాగాల సీనియర్ అసిస్టెంట్లను సంప్రదించాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. మీనాక్షి సూచించారు.

Kakinada

2022-03-03 12:56:28

ప‌ప్పు ధాన్యాల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అప‌రాలు సాగు చేసే రైతులు న‌ష్ట‌పోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప‌ప్పు ధాన్యాల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కిశోర్ కుమార్ మార్క్‌ఫెడ్ అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌లే.. ప‌ప్పు ధాన్యాలు కొనుగోలు చేసేందుకు ప్ర‌త్యేక కేంద్రాలు పెట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌తో ప్ర‌తిపాద‌న‌లు పంపాలని చెప్పారు. మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్ శాఖ అధికారుల‌తో గురువారం ఆయ‌న త‌న ఛాంబ‌ర్లో సమావేశ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం మార్కెట్లో కొంత‌మంది త‌క్కువ ధ‌ర‌కే రైతుల నుంచి ప‌ప్పు ధాన్యాలు కొనుగోలు చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కావున అప‌రాలు సాగు చేసే రైతుల‌కు న్యాయం జ‌రిగేలా ఈ ర‌బీలో పండించే ప‌ప్పు ధాన్యాల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర లభించేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మార్క్‌ఫెడ్ డీఎం షేక్ యాసిన్ ను జేసీ ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని ప‌ప్పు ధాన్యాలు ధ‌ర‌లు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. మినుములు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ.6,300 ఉండ‌గా బ‌య‌ట మార్కెట్లో రూ.5,600 ఉంద‌ని, పెస‌లు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ.7,275 ఉండ‌గా బ‌య‌ట మార్కెట్లో రూ.6,300 ఉంద‌ని, మొక్క‌జొన్న రూ.1,870 ఉండగా బ‌య‌ట మార్కెట్లో రూ.1,800 ఇస్తున్నార‌ని, జొన్న‌లు రూ.2,758 ఉండ‌గా మార్కెట్లో రూ.2,300గా నిర్ణ‌యించార‌ని, రాగి రూ.3,377 కి గాను బ‌య‌ట రూ.2,200 ఇస్తున్నార‌ని వివ‌రించారు. ఈ తార‌త‌మ్యాలు లేకుండా రైతుల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌లు అంద‌రికీ తెలిసేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, ప్ర‌చారం క‌ల్పించాల‌ని మార్క్‌ఫెడ్ అధికారుల‌ను జేసీ ఆదేశించారు. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ప్లెక్సీలు, పోస్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే కొనుగోలు ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేలా అనుకూల‌మైన కేంద్రాల‌ను గుర్తించాల‌ని, సామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవాల‌ని, సిబ్బందికి శిక్ష‌ణ‌లు ఇప్పించాల‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో మార్క్‌ఫెడ్ డీఎం షేక్ యాసిన్‌, మార్కెటింగ్ ఏడీ శ్యామ్ కుమార్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-03-03 12:45:28

మొదటి విడతలో 500 గ్రామాల్లో రీ సర్వే..

విజయనగరం జిల్లాలో మొత్తం 1550 గ్రామాల్లో  3 విడతల్లో రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని జిల్లా కల్లెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. ఇందులో మొదటి విడత లో  500  గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. ప్రతి విడత 6 నెలల గడువు లో పూర్తి చేయాలనీ ఆదేశించారు.  గురువారం సిసిఎల్ఏ అమరావతి నుండి  జిల్లా కల్లెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే  పురోగతి పై సమీక్షించారు.  ఈ సందర్భంగా పలు సూచనలు జారి చేసారు.   సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ   జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ 1 క్రింద  2 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పూర్తి చేయడం జరిగిందని వాటికి ఫైనల్ పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.  పైలట్ ప్రాజెక్ట్ 2 క్రింద 11 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని,  ఈ సర్వే త్వరగా పూర్తి చేయాలనీ, ఖచ్చితంగా కొలతలు, సరి హద్దులు ఉండేలా చూడాలని అన్నారు.  రీ సర్వే అయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లన్ని ఇక పై గ్రామ సచివాలయాల్లోనే జరపాలని సూచించారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా.జి.సి.కిషోర్ కుమార్,  సర్వే ల్యాండ్ రికార్డు ల శాఖ ఏ.డి.  త్రివిక్రమ రావు   పాల్గొన్నారు. 

Vizianagaram

2022-03-03 12:42:45

5న విజయనగరం జెడ్పీ సర్వసభ్య సమావేశం..

విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మార్చి 5వ తేదీ ఉదయం 10-30 గంటలకు విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందనీ జెడ్పీ సీఈఓ టి వేంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభ్యులు, అధికారులంతా హాజరు కావాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Vizianagaram

2022-03-03 12:40:39

గ్రంధాలయాలు బలోపేతానికి క్రుషి..

శ్రీకాకుళం జిల్లాలో గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ సువ్వారి సువర్ణ తెలిపారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయ బడ్జెట్ పై జరిగిన సమావేశంలో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంధాలయాల వలన ప్రజలకు ముఖ్యంగా యువతకు మంచి ప్రయోజనం కలగాలని అన్నారు. గ్రంథాలయాలు యువతకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తూ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో బుక్ డిపో కేంద్రాలను కూడా ఆసక్తి ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయుటకు నిర్ణయించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఐదు ప్రతిపాదనలు అందాయని ఆ గ్రామాల్లో బుక్ డిపో కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. బుక్ డిపో నిర్వాహకులకు మూడు వేల రూపాయలు గౌరవ పారితోషకం ఇచ్చుటకు నిర్ణయించామని ఆమె పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పుస్తకాల ఎంపిక కార్యక్రమం జరగడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు లేటెస్ట్ పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రంధాలయాలకు చెల్లించాల్సిన సెస్ ను సంబంధిత అధికారులు వెంటనే చెల్లించాలని ఆమె కోరారు. తద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి బాటలు పడతాయని, విజ్ఞాన భాండాగారాలుగా వెలసిల్ల గలవని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. కుమార్ కుమార్ రాజా, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్, వయోజన విద్య ఉప సంచాలకులు సోమేశ్వరరావు., సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2022-03-03 11:21:02

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందిస్తాం..

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని అందించడం జరుగుతుందని  శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు పొందూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురు వారం స్పీకర్ శంకుస్థాపనలు చేసారు.  సింగూరు గ్రామంలో సుమారు రూ.40 లక్షల నిధులతో సిసి రోడ్డుకు, బొడ్డేపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా రూ.17.10 లక్షల నిధులతో ఇంటింటికి మంచి నీటి కొళాయి, మొదలవలస గ్రామంలో రూ.46 లక్షలతో ఇంటింటికి మంచినీటి కుళాయిలు కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. అనంతరం మొదలవలస, బొడ్డేపల్లి గ్రామాలకు సంబంధించిన సమస్యలపై,సంక్షేమ పథకాల పై ప్రజల సమక్షంలో సచివాలయ సిబ్బంది, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకు వచ్చిన సమస్య మంచినీటి సమస్య అని ఆ సమస్యలను ప్రధానంగా తీసుకొని పూర్తి చేయబోతున్నామని అన్నారు. 

ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఇచ్చిన హామీలను దశలవారీగా పూర్తి చేస్తున్నారని ఆయన వివరించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో రూ. 234 కోట్లతో ఇంటింటికి మంచినీటి కొళాయి పథకాన్ని పూర్తి చేస్తున్నామని అన్నారు. పొందూరు మండలానికి సంబంధించి గండ్రేడు నుండి రాపాక కొండపై ట్యాంకు నిర్మించి మంచినీటి పంపింగ్ చేసి పొందూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆయన అన్నారు. బొడ్డేపల్లి గ్రామంలో ప్రజలు సాగునీరు కోసం రెల్లిగెడ్డ పనులు పూర్తి చేయాలని విన్నవించగ వచ్చే ఖరీఫ్ కల్లా పనులు పూర్తిచేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో జడ్పిటిసి లొలుగు కాంతారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బడాన సునీల్, వైస్ ఎంపీపీ వండాన వెంకట్రావు, తమ్మినేని చిరంజీవి నాగ్, కిల్లి నాగేశ్వరరావు, కొంచాడ రమణమూర్తి, గాడు నాగరాజు, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2022-03-03 10:59:03

ప్రమాదాల నియంత్రణకు కలిసి పనిచేసుకోవాలి..

తూర్పుగోదావరి, యానాం సరిహద్దు ప్రాంతంలోని బాలయోగి వంతెనకు ఇరువైపులా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు రెండు ప్రభుత్వాల ద్వారా పరస్పర సహకారాలు అంది పుచ్చుకోవాలని యానాం ఎస్పీ పి.బాలచంద్రన్..తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కోరారు. ఈ మేరకు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబుని యానాం ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పలు పోలీసుశాఖ పరమై అంశాలను చర్చించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబుని..యానా ఎస్పీ బాలచంద్రన్  ఘనంగా సత్కరించారు. రెండు ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయడానికి సహాయక సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా యానాం ఎస్పీకి  తూ.గో.జి ఎస్పీ  హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ఎస్పీలు కలిసి శాఖాపరమైన అంశాలను చర్చించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Kakinada

2022-03-03 10:46:14

శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి పేర్కొన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారి తన చాంబర్లో 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అంతరాయం కలగకుండా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షలు జరుగుతున్న కళాశాలలో జనరేటర్ అందుబాటులో ఉండాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. పరీక్షల నిర్వహణ తేదీలలో రవాణా నిమిత్తం బస్సు సౌకర్యం కల్పిస్తూ బస్సుకు శాఖాపరమైన పరీక్షలు స్పెషల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.  పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. ఉదయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గం. 9:15, మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గం.2.15 నిమిషాలలోపు హాజరు కావాలని తరువాత అనుమతించబోమని వెల్లడించారు. జిల్లాల్లో 3052 మంది ఆన్లైన్, 648 పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 5, 6 తేదీలలో టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో, 4వ తేదీ నుండి 9వ తేదివరకు ఎచ్చేర్ల శివాని, వెంకటేశ్వర  కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

7,8 తేదీలలో నిర్వహించే పరీక్షలకు ఎటువంటి పుస్తకాలు తీసుకురాకూడదని, 4,5,6,9 తేదీలలో నిర్వహించే పరీక్షలకు బుక్స్ తెచ్చుకోవచ్చని గైడ్స్, జిరాక్సు, ప్రింటెడ్ మెటీరియల్స్ ,వాచీలు, మొబైల్స్,ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు.

7 8 తేదీలలో నిర్వహించే గ్రామ సర్వేయర్ 161,162,163,164 పేపర్లకు సంబంధించిన పరీక్షలకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనుమతించబడునని తెలియజేశారు. పరీక్షలలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఎం. వెంకట్రావు, రవాణా, విద్యుత్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2022-03-03 10:21:58

సీఎం పర్యటన విజయవంతం చేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ దేవీప‌ట్నం మండ‌లం, ఇందుకూరు-1 పున‌రావాస కాల‌నీని సంద‌ర్శించనున్న నేప‌థ్యంలో ప‌ర్య‌ట‌న‌కు స‌మ‌గ్ర ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు.. జేసీ (ఆర్‌) సుమిత్ కుమార్‌; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌తో క‌లిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందుకూరులో జ‌ర‌ప‌నున్న పర్యటన కోసం చేప‌ట్టాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రాథ‌మిక వివ‌రాల ప్ర‌కారం ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన ఉద‌యం 10 గం. నుంచి 11 గం. వ‌ర‌కు ఇందుకూరు-1 ఆర్అండ్ఆర్ కాల‌నీని సంద‌ర్శించి, నిర్వాసితుల‌తో మాట్లాడ‌తార‌ని తెలిపారు. హెలిప్యాడ్‌, కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన ఏర్పాట్ల‌కు జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఐటీడీఏ పీవో, స‌బ్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, వివిధ శాఖ‌ల అధికారుల‌ను ప్ర‌త్యేక అధికారులుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే ప్ర‌ముఖులు; ముఖ్య‌మంత్రి కార్యాల‌యం, జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రిత్వ శాఖ సిబ్బందికి అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. వాహ‌నాలు, బారికేడింగ్‌, పారిశుద్ధ్యం, మెడిక‌ల్ క్యాంప్ ఏర్పాటు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, మీడియా స‌మ‌న్వ‌యం తదితర అంశాలపై ఆయా శాఖల ఆధికారులకు క‌లెక్ట‌ర్ సూచనలు ఇచ్చారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ ప‌టిష్ట భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌తో పాటు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌, బందోబ‌స్తుపై అధికారుల‌కు సూచ‌న‌లిచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, అడిష‌న‌ల్ ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్యనారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-03-02 14:06:52