1 ENS Live Breaking News

మొదటి విడతలో 500 గ్రామాల్లో రీ సర్వే..

విజయనగరం జిల్లాలో మొత్తం 1550 గ్రామాల్లో  3 విడతల్లో రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని జిల్లా కల్లెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు. ఇందులో మొదటి విడత లో  500  గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. ప్రతి విడత 6 నెలల గడువు లో పూర్తి చేయాలనీ ఆదేశించారు.  గురువారం సిసిఎల్ఏ అమరావతి నుండి  జిల్లా కల్లెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే  పురోగతి పై సమీక్షించారు.  ఈ సందర్భంగా పలు సూచనలు జారి చేసారు.   సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ   జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ 1 క్రింద  2 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పూర్తి చేయడం జరిగిందని వాటికి ఫైనల్ పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.  పైలట్ ప్రాజెక్ట్ 2 క్రింద 11 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని,  ఈ సర్వే త్వరగా పూర్తి చేయాలనీ, ఖచ్చితంగా కొలతలు, సరి హద్దులు ఉండేలా చూడాలని అన్నారు.  రీ సర్వే అయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్లన్ని ఇక పై గ్రామ సచివాలయాల్లోనే జరపాలని సూచించారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ రెవిన్యూ డా.జి.సి.కిషోర్ కుమార్,  సర్వే ల్యాండ్ రికార్డు ల శాఖ ఏ.డి.  త్రివిక్రమ రావు   పాల్గొన్నారు. 

Vizianagaram

2022-03-03 12:42:45

5న విజయనగరం జెడ్పీ సర్వసభ్య సమావేశం..

విజయనగరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మార్చి 5వ తేదీ ఉదయం 10-30 గంటలకు విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందనీ జెడ్పీ సీఈఓ టి వేంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభ్యులు, అధికారులంతా హాజరు కావాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Vizianagaram

2022-03-03 12:40:39

గ్రంధాలయాలు బలోపేతానికి క్రుషి..

శ్రీకాకుళం జిల్లాలో గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ సువ్వారి సువర్ణ తెలిపారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయ బడ్జెట్ పై జరిగిన సమావేశంలో చైర్పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంధాలయాల వలన ప్రజలకు ముఖ్యంగా యువతకు మంచి ప్రయోజనం కలగాలని అన్నారు. గ్రంథాలయాలు యువతకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తూ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో బుక్ డిపో కేంద్రాలను కూడా ఆసక్తి ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేయుటకు నిర్ణయించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఐదు ప్రతిపాదనలు అందాయని ఆ గ్రామాల్లో బుక్ డిపో కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. బుక్ డిపో నిర్వాహకులకు మూడు వేల రూపాయలు గౌరవ పారితోషకం ఇచ్చుటకు నిర్ణయించామని ఆమె పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పుస్తకాల ఎంపిక కార్యక్రమం జరగడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు లేటెస్ట్ పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రంధాలయాలకు చెల్లించాల్సిన సెస్ ను సంబంధిత అధికారులు వెంటనే చెల్లించాలని ఆమె కోరారు. తద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి బాటలు పడతాయని, విజ్ఞాన భాండాగారాలుగా వెలసిల్ల గలవని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. కుమార్ కుమార్ రాజా, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్, వయోజన విద్య ఉప సంచాలకులు సోమేశ్వరరావు., సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2022-03-03 11:21:02

రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందిస్తాం..

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా మంచి నీటిని అందించడం జరుగుతుందని  శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు పొందూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురు వారం స్పీకర్ శంకుస్థాపనలు చేసారు.  సింగూరు గ్రామంలో సుమారు రూ.40 లక్షల నిధులతో సిసి రోడ్డుకు, బొడ్డేపల్లి గ్రామంలో జల జీవన్ మిషన్ ద్వారా రూ.17.10 లక్షల నిధులతో ఇంటింటికి మంచి నీటి కొళాయి, మొదలవలస గ్రామంలో రూ.46 లక్షలతో ఇంటింటికి మంచినీటి కుళాయిలు కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. అనంతరం మొదలవలస, బొడ్డేపల్లి గ్రామాలకు సంబంధించిన సమస్యలపై,సంక్షేమ పథకాల పై ప్రజల సమక్షంలో సచివాలయ సిబ్బంది, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు ప్రధానంగా ఆయన దృష్టికి తీసుకు వచ్చిన సమస్య మంచినీటి సమస్య అని ఆ సమస్యలను ప్రధానంగా తీసుకొని పూర్తి చేయబోతున్నామని అన్నారు. 

ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఇచ్చిన హామీలను దశలవారీగా పూర్తి చేస్తున్నారని ఆయన వివరించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో రూ. 234 కోట్లతో ఇంటింటికి మంచినీటి కొళాయి పథకాన్ని పూర్తి చేస్తున్నామని అన్నారు. పొందూరు మండలానికి సంబంధించి గండ్రేడు నుండి రాపాక కొండపై ట్యాంకు నిర్మించి మంచినీటి పంపింగ్ చేసి పొందూరు మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆయన అన్నారు. బొడ్డేపల్లి గ్రామంలో ప్రజలు సాగునీరు కోసం రెల్లిగెడ్డ పనులు పూర్తి చేయాలని విన్నవించగ వచ్చే ఖరీఫ్ కల్లా పనులు పూర్తిచేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో జడ్పిటిసి లొలుగు కాంతారావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బడాన సునీల్, వైస్ ఎంపీపీ వండాన వెంకట్రావు, తమ్మినేని చిరంజీవి నాగ్, కిల్లి నాగేశ్వరరావు, కొంచాడ రమణమూర్తి, గాడు నాగరాజు, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2022-03-03 10:59:03

ప్రమాదాల నియంత్రణకు కలిసి పనిచేసుకోవాలి..

తూర్పుగోదావరి, యానాం సరిహద్దు ప్రాంతంలోని బాలయోగి వంతెనకు ఇరువైపులా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు రెండు ప్రభుత్వాల ద్వారా పరస్పర సహకారాలు అంది పుచ్చుకోవాలని యానాం ఎస్పీ పి.బాలచంద్రన్..తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కోరారు. ఈ మేరకు కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబుని యానాం ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పలు పోలీసుశాఖ పరమై అంశాలను చర్చించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబుని..యానా ఎస్పీ బాలచంద్రన్  ఘనంగా సత్కరించారు. రెండు ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయడానికి సహాయక సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా యానాం ఎస్పీకి  తూ.గో.జి ఎస్పీ  హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ఎస్పీలు కలిసి శాఖాపరమైన అంశాలను చర్చించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Kakinada

2022-03-03 10:46:14

శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి పేర్కొన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారి తన చాంబర్లో 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు అంతరాయం కలగకుండా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షలు జరుగుతున్న కళాశాలలో జనరేటర్ అందుబాటులో ఉండాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. పరీక్షల నిర్వహణ తేదీలలో రవాణా నిమిత్తం బస్సు సౌకర్యం కల్పిస్తూ బస్సుకు శాఖాపరమైన పరీక్షలు స్పెషల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.  పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. ఉదయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గం. 9:15, మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గం.2.15 నిమిషాలలోపు హాజరు కావాలని తరువాత అనుమతించబోమని వెల్లడించారు. జిల్లాల్లో 3052 మంది ఆన్లైన్, 648 పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 5, 6 తేదీలలో టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో, 4వ తేదీ నుండి 9వ తేదివరకు ఎచ్చేర్ల శివాని, వెంకటేశ్వర  కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

7,8 తేదీలలో నిర్వహించే పరీక్షలకు ఎటువంటి పుస్తకాలు తీసుకురాకూడదని, 4,5,6,9 తేదీలలో నిర్వహించే పరీక్షలకు బుక్స్ తెచ్చుకోవచ్చని గైడ్స్, జిరాక్సు, ప్రింటెడ్ మెటీరియల్స్ ,వాచీలు, మొబైల్స్,ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు.

7 8 తేదీలలో నిర్వహించే గ్రామ సర్వేయర్ 161,162,163,164 పేపర్లకు సంబంధించిన పరీక్షలకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనుమతించబడునని తెలియజేశారు. పరీక్షలలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఎం. వెంకట్రావు, రవాణా, విద్యుత్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Srikakulam

2022-03-03 10:21:58

సీఎం పర్యటన విజయవంతం చేయాలి..

తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ దేవీప‌ట్నం మండ‌లం, ఇందుకూరు-1 పున‌రావాస కాల‌నీని సంద‌ర్శించనున్న నేప‌థ్యంలో ప‌ర్య‌ట‌న‌కు స‌మ‌గ్ర ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ వివిధ శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు.. జేసీ (ఆర్‌) సుమిత్ కుమార్‌; ఇన్‌ఛార్జ్ జేసీ (ఏ అండ్ డ‌బ్ల్యూ), జేసీ (హెచ్‌) ఎ.భార్గ‌వ్‌తేజ‌తో క‌లిసి అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. 4వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందుకూరులో జ‌ర‌ప‌నున్న పర్యటన కోసం చేప‌ట్టాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రాథ‌మిక వివ‌రాల ప్ర‌కారం ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన ఉద‌యం 10 గం. నుంచి 11 గం. వ‌ర‌కు ఇందుకూరు-1 ఆర్అండ్ఆర్ కాల‌నీని సంద‌ర్శించి, నిర్వాసితుల‌తో మాట్లాడ‌తార‌ని తెలిపారు. హెలిప్యాడ్‌, కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన ఏర్పాట్ల‌కు జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఐటీడీఏ పీవో, స‌బ్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, వివిధ శాఖ‌ల అధికారుల‌ను ప్ర‌త్యేక అధికారులుగా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే ప్ర‌ముఖులు; ముఖ్య‌మంత్రి కార్యాల‌యం, జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రిత్వ శాఖ సిబ్బందికి అవ‌స‌ర‌మైన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. వాహ‌నాలు, బారికేడింగ్‌, పారిశుద్ధ్యం, మెడిక‌ల్ క్యాంప్ ఏర్పాటు, విద్యుత్ స‌ర‌ఫ‌రా, మీడియా స‌మ‌న్వ‌యం తదితర అంశాలపై ఆయా శాఖల ఆధికారులకు క‌లెక్ట‌ర్ సూచనలు ఇచ్చారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ ప‌టిష్ట భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశాల‌తో పాటు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌, బందోబ‌స్తుపై అధికారుల‌కు సూచ‌న‌లిచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, అడిష‌న‌ల్ ఎస్‌పీ క‌ర‌ణం కుమార్‌, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్యనారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-03-02 14:06:52

18న సింహాద్రి అప్పన్నకు పెళ్లి చూపులు..

విశాఖజిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం త్వరలో నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఈ నెల 18న అప్పన్న డోలోత్సవం(పెళ్లి చూపులు) ఘనంగా నిర్వహించడానికి అర్చకవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు.  బుధవారం సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, ఆరోజున సింహాద్రి నాధుడు ను సర్వాభరనాలుతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొండ దిగువన కొలువున్న తన సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి స్వామి రావటం జరుగుతుందన్నారు.  అక్కడ డోలోత్సవం కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్వామి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరుతారు.. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి  తొలుత నిరాకరించిన అమ్మవారు ఆ తర్వాత అంగీకరించిన నేపథ్యంలో అర్చక వర్గాలు  అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందము గా గడుపుతారు, తదుపరి పుష్కరణి, సత్రంలో స్వామి వారిని ఆశీనులను చేసి వేద మంత్రాలునడుమ ,మృదు మధుర మంగళ వాయీద్యాలుతో స్వామివారికి ఉయ్యాల సేవ నిర్వహిస్తారన్నారు. స్వామి తిరువీధి కార్యక్రమం పూర్తికాగానే తిరిగి కొండపైకి చేరుకుంటారని శ్రీనుబాబు వివరించారు. ఇక ఉగాది పర్వదినం రోజున
శాస్త్రోక్తంగా పెళ్లిరాట లు వేయడంతోపాటు ఆరోజు నుంచి పెళ్లి పనులు ప్రారంభిస్తారన్నారు.. అదే రోజున స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకుతా యన్నారు.. ఆ రోజు నుంచి  స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.. అంగరంగ వైభవంగా జరిగే ఆయా కార్యక్రమాలకు ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో   అధికారవర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్టు శ్రీనబాబు మీడియాకి వివరించారు.

Simhachalam

2022-03-02 09:14:45

5 నుంచి విశాఖలో మహిళా చలన చిత్రోత్సవం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మహిళ చలనచిత్రోత్సవం నగరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అభినందనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక  ఆహ్వనితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు.  వైజాగ్ ఫిలిం సొసైటీ, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను బుధవారం  విజేఫ్ ప్రెస్ క్లబ్ లో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన  సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ వైజాగ్ లో మొట్టమొదటిసారిగా మూడు అపురూప చిత్రాలను ప్రతి రోజు సాయంత్రం 5:30 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నరవ ప్రకాష్ రావు కు అభినందనలు తెలియజేశారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.. వైజాగ్ ఫిలిం సొసైటీ గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశరావు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన 1981లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపు దిద్దుకున్న న్యాయం కావాలి తెలుగు చిత్రం, ఆరో తేదీ ఆదివారం 2016లో నితీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన దంగల్ హిందీ చిత్రం, 7వ తేదీ సోమవారం నీగల్ కొలం దర్శకత్వంలో వచ్చిన డేగన్ హోమ్ వంటి అద్భుతమైన చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు. ఉచిత ఎంట్రీలు కలిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనీ వీక్షించాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు పి.వి.రమణ, బి.  చిన్నారావు, గణేశ్వర బాబ్జి, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్  అద్యకులు  జ్యోతిర్మయీ,విశాఖ కపుల్స్ కార్యదర్శి డాక్టర్ బి. రజనీ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-02 07:37:31

నిండు జీవితానికి - రెండు పోలియో చుక్కలు..

 0-5 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ఓరల్ పోలియో వాక్సిన్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు.  శనివారం ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ పై డిఎంహెచ్ ఓ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదివారం ఈ నెల 27వ తేదీన జరుగుతుదని చెప్పారు.  జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్ లు, అన్ని పంచాయతీ కేంద్రాలు, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలోని అన్ని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు లోను వేయడం  జరుగుతుందని వివరించారు. అర్హులైన చిన్నారులు అందరకీ ఈ వాక్సిన్ వేయించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోసుకోవలసినదిగా తల్లిదండ్రులను కోరారు. పల్స్ పొలియో కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం వేయుచున్న ఈ చుక్కలు అదనపు డోసు మాత్రమేనని, ఇదివరకే వాక్సిన్ తీసుకొన్నప్పటకి మరల పల్స్ పోలియో రోజున తిరిగి ఈ వాక్సిన్ వేయించవలసినదిగా తల్లిదండ్రులను కోరారు. మన దేశంలో ఆఖరి పోలియో కేసు జనవరి 2011లోను, మన రాష్ట్రంలో జులై 2008లోను, మన జిల్లాలో జనవరి 2007లోను నమోదైనట్లు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మన భారత దేశాన్ని మార్చి 13, 2014 న పోలియో రహిత దేశం గా ప్రకటించడం జరిగిందన్నారు.  జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గలిగిన 4,86,173 మంది చిన్నారులు కు ఓరల్ పోలియో వాక్సిన్ వేయుటకు లక్ష్యం గా నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 3836 పోలియో కేంద్రాలను, 123 ట్రాన్సిట్ కేంద్రాలను, 86 మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం జరిగింది. 15,144  మంది వ్యాక్సినేటర్లును, 379 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 481 High Risk ప్రాంతాలు (Slums, Nomads, Brick klins, Construction Areas, Fisherman Community, Hard to Reach Areas) ను గుర్తించి వాటిని  సూక్ష్మ ప్రణాళికలో చేర్చి ఆ ప్రాంతాల్లోని అర్హులైన 14,513 చిన్నారులకు పోలియో వాక్సిన్ వేయుటకు అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన పోలియో చుక్కులు వేయని వారికి పోలియో కేంద్రాలు 28వ తేదీ నుండి 2వ తేదీలలో గృహ సందర్శన లో భాగం గా పోలియో బూత్ లలో వాక్సిన్  వేయని చిన్నారులు ను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, 123 ట్రాన్సిట్ (రైల్వే స్టేషన్, బస్టాండ్, తదితరమైనవి) కేంద్రాలలో 3 రోజుల పాటు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు.    ఈ కార్యక్రమం మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, రెవెన్యూ, పంచాయితీ రాజ్, తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వివరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాక్సినేషన్ అధికారి ఎస్.జీవన్ రాణి, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-26 10:47:21

అప్పన్న ప్రహ్లాద మండపం కాళీ చేయిస్తాం..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండ పం త్వరలోనే దేవస్థానం కు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపి వి.విజయ సాయిరెడ్డి  తెలిపారు. ఈ కళ్యాణ మండపం తక్షణము  అప్పగించాలని కోరుతూ అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మంగళ వారం కోరారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి  వి.విజయసాయి రెడ్డిని  సీతమ్మదార క్యాంపు కార్యాలయంలో కలుసుకొని ఇందుకు సంబంధించిన వివరాలతో శ్రీనుబాబు వినతిపత్రం సమర్పించారు. 2013లో అప్పటి దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో కేవలం ఆరు నెలల కాలానికి సిఆర్పిఎఫ్ కి అద్దె ప్రాతి పదికిన  కేటాయించారన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు సుమారు తొమ్మిదేళ్లపాటు సిఆర్పిఎఫ్  జగదాంబ జంక్షన్ లో ఉన్న ఈప్రహ్లాద మండపాన్ని తన ఆధీనంలో ఉంచుకుని కనీసం అద్దె బకాయిలు  కూడా చెల్లించలేదని ఎంపీకి శ్రీనుబాబు వివరించారు. సుమారు ఆరున్నర కోట్లు అద్దె బకాయిలు సిఆర్పిఎఫ్ నించి  సింహాచలం దేవస్థానం కు చెల్లించాల్సి ఉందన్నారు. కరోనా లో సైతం సింహాచలం దేవస్థానం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని  అయినప్పటికీ ఎన్నిసార్లు లేఖలు రాసిన సిఆర్పిఎఫ్ నుంచి స్పందన కానరావడం లేదని ఎంపి కి తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తోపాటు విజయసాయిరెడ్డికి  కూడా తెలియజేసినట్లు శ్రీనుబాబు  తెలిపారు. నగరంలో సింహాచలం దేవస్థానం కు ఉన్న ఏకైక ఆస్తి ఈ భవనం మాత్రమేనని ఇది కూడా చాలా ఏళ్లుగా సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉండిపోవడము వల్ల  భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎంపి కి వివరించారు.అయితే తాము సిఆర్పిఎఫ్ కు వ్యతిరేకం కాదని కానీ వారికి ప్రత్యామ్నాయం కేటాయించి ఈ భవనం దేవస్థానం కు అప్పగిస్తే  బాగుంటుందని శ్రీను బాబు పేర్కొన్నారు.

మండపం కాళీ  చేయిస్తాం..విజయసాయిరెడ్డి చర్యలు...
అప్పన్న ప్రహ్లోధ మండపం త్వరలోనే  కాళీ చేయిస్తాం అని ఎంపీ విజయ్ సాయిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్ పి కృష్ణారావు తో చర్చించామని త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తన వినతి పై సానుకూలం గా స్పందించిన  ఎంపీ విజయ్ సాయిరెడ్డి కి శ్రీను బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Visakhapatnam

2022-02-22 08:31:29

భోగి గణపతికి సంకష్టహరచతుర్ధి నీరాజనాలు..

ద్విజప్రియ సంకష్ఠహరచతుర్ధి సందర్భంగా కాకినాసూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభు శ్రీభోగిగణపతిపీఠం లో ఆదివారం ఉదయంగణేశ సహస్ర నామ పారాయణ ఘనంగా నిర్వహించారు. గణపతి ఆరాధకులు స్వయంసేవగా తెల్లజిల్లేడు పుష్పాలు ఉండ్రాళ్ళు నారికేళాల సమర్పణతో ధూప దీప  నీరాజన మంత్రపుష్ప పూజాధికాలు నిర్వహించుకుని తీర్థ నైవేద్య ప్రసాదాలు పంపిణీ చేశారు. సంప్రోక్షణ అనంతరం పీఠంలో స్వయంభువుకి స్వయంసేవలు జరుగుతున్నాయని పీఠం ఉపాసకులు రమణరాజు తెలిపారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిచారు. పీఠం ఆధ్వర్యంలో భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

Kakinada

2022-02-20 08:35:47

ఘనంగా కొసనా వార్షికోత్సవ వేడుకలు..

కొసనా కల్చరల్ అకాడమీ 17వ వార్షికోత్సవ వేడుకలు శనివారం  విశాఖలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో పలువురు కళాభిమానులు, కవులు, రచయితలు, గాయనీ, గాయకులు పాల్గొని కొసనా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధిగా హాజరు కాగా వ్యవస్థాపక అధ్యక్షురాలు సుసర్ల శేషుమణి, తులసీనగర్ ప్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ డైరెక్టర్ కె.వి.ఎన్.వి. బ్రహ్మాజీ, అకాడమీ ఉపాధ్యక్షులు పి. రాజేంద్రప్రసాద్లు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరంతా మాట్లాడుతూ కొసనా సాంస్కృతిక రంగంలో సంగీత, నృత్య, నాటక చిత్రలేఖనం, సాహిత్య రంగాల్లో 50 ఏళ్లుపాటు సుదీర్ఘ సేవలందించడం ఎంతో చిరస్మరణీయమన్నారు. వచ్చే ఏడాది నుంచి కొసనా పేరిట కళాపురస్కారాలు అందజేయనున్నట్లు కొసనా తనయుడు బ్ర హ్మాజీ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లలిత సంగీత విభావరి ఆహుతుల్ని అలరించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు హోల్డర్ కోరుకొండ రంగారావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ప్రముఖ గాయనీ గాయకులు శివల రఘురామ్. బి.ఎస్.మాధవి, ఎమ్.వి.ఆర్. నాగేశ్వరరావు, కోరుకొండ రంగారావు, కనదుర్గ, ఎమ్. రూపవాణి. ఎన్. లక్ష్మి, కామేశ్వరి, లీలాకుమారి, కణ్యాకుమారి, కొసనా పాటలతో వీనుల విందు చేశారు. అనంతరం గాయనీ గాయకులకు. నిర్వహాకులకు సన్మానం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు సుసర్ల శేషుమణి మాట్లాడుతూ, ఎంతో మందిని ప్రోత్సహించిన ఘనత కొసనాకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో త్రినాధ్. జగత్లావుతో పాటు అనేక మంది కళాభిమానులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2022-02-19 15:20:58

ఆధ్యాత్మిక నిలయాలు మన దేవాలయాలు..

విశాఖ శివారులోని వేపగుంట సింహపురి కాలనీలో వేంచేసియున్న శ్రీ సీతా రామాలయం 19వ వార్షికోత్సవాలు మంగళధ్వని వేద మంత్రోచ్ఛారణల మధ్య  సాంప్రదాయ రీతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మట్టపల్లి హనుమంతరావు ప్రసంగిస్తూ ఈ సృష్టిలో ఆధ్యాత్మిక సిరికి ఆగమ సంపదకి చిహ్నంగా దేవాలయాలు  నిలిచాయని పేర్కొన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులు ఎం వి రాజశేఖర్ మాట్లాడుతూ, ఆలయాలలో ఆగమ సంప్రదాయంలో నిర్వహించే ఉత్సవాలవల్ల లోకకళ్యాణం కలుగుతుందన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అర్చకులను సహకరిస్తున్న దాతలను భక్తులను ప్రశంసించారు. అంతకు ముందు శ్రీ  సీతా రామాలయ వార్షికోత్సవాలను ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టపల్లి హనుమంతరావు  ఆలయ చైర్మన్ పి రామ్మోహన్రావు, గౌరవ అధ్యక్షులు  ఎం వి రాజశేఖర్, స్థానిక కార్పొరేటర్ పి నర సింహం  జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఆలయ అధ్యక్షులు సివిఆర్ మూర్తి ఉపాధ్యక్షులు టీ చిరంజీవి కార్యదర్శి ఏవి చలపతిరావు  కోశాధికారి వి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

Vepagunta

2022-02-19 13:04:54

వాస్తవాలు అదించడంలో ‘సాక్ష్యం టీవి’ దిట్ట..

వాస్తవాలను మంచి వార్తలుగా అందించడంలో సాక్ష్యం టీవి ప్రజలమన్ననలు పొందిందని విశాఖ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ అన్నారు. విశాఖలోని బుధవారం సాక్ష్యం టెలివిజన్ 2022 డైరీ ఎంపీ  ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, 2018లో మొదలైన సాక్ష్యం ఛానల్ మంచి వార్తలను, వాస్తవాలను,ప్రసారం చేస్తూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం అబినందనీయమన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరువ చేయాలన్నారు.   ఏ.పి నాగవంశం కార్పొరేషన్ చైర్ పర్సన్ బొడ్డు అప్పల కొండమ్మ, మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వడమే కాకుండా, నాణ్యమైన ప్రసారాలను అందించడంలో సాక్ష్యం టెలివిజన్ ముందుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం టీవీ ఎండీ మెకర శ్రీనివాస్ ను అభినందించారు. సీఈఓ డాక్టర్ కంటుభుక్త శ్రీనివాస్, డైరెక్టర్ యం.కనకరాజు, సీనియర్ జర్నలిస్టు డిజె మోహన్ కుమార్, ఏ.పి నాగ వంశం కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు అప్పల కొండమ్మ కలిసి యం.పి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-16 14:40:17