1 ENS Live Breaking News

ఆ18 కులాలకు జగనన్న చేయూత అందించాలి..

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేయూత ద్వారా రజక, నాయిబ్రాహ్మణ, దర్జీలకు సుమారు రూ.285 కోట్లు అందించడం అభినందనీయమని విశాఖ జిల్లా బిసీ సమైఖ్య సంఘం అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్ అన్నారు. గురువారం ఇక్కడ సీతమ్మధార సంఘం కార్యాలయంలో రవికుమార్ అధ్యక్షతన బీసీ కులాల సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు, బీసీ నాయకులు తుమ్మిడి రామకుమార్ తో కలిసి రవికుమార్ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. అయితే వివిధ రకాల కులవృత్తులు చేసుకుంటున్న 18 బిసి కులాలను కూడా జగనన్న చేయూత ద్వారా లబ్ధి చేకూర్చాలని తాము ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. దీంతో పాటు 56 బీసీ కార్పొరేషన్లు ద్వారా అందజేస్తున్న రూ.2 లక్షల రూపాయలు రుణంలోనూ ఒకలక్ష సబ్సిడీ ఇచ్చే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం ద్వారా నివేదించడం జరుగుతుందన్నారు. బీసీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, త్వరలో బీసీలకు మేలు చేసే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీసీల ప్రధాన సమస్యలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన పరిష్కారం కోరుతామన్నారు.   

Visakhapatnam

2022-02-10 14:47:54

గంట్లకు బీసీ సంఘం నేతల ఘన సత్కారం..

జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా రెండోసారి నియమితులైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును బీసీ సంఘం నేతలంతా ఘనంగా సన్మానించి సత్కరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని శ్రీనుబాబును వీరంతా కోరారు. బీసీ వర్గానికి చెందిన తాను ఎప్పుడూ సంఘం సభ్యులకు అందుబాటులో ఉంటానని శ్రీనుబాబు చెప్పారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సభ్యులందరికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో వైద్యులు సలహా మేరకు సంఘం సభ్యుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దేవగుప్త రమేష్, అధికార ప్రతినిధి ఎమ్మెస్సార్ ప్రసాద్,ఇతర నేతలు పొన్నాడ మోహనరావు, చిత్రాడ అప్పారావు, ఎన్.రవికుమార్, కనకమహాలక్ష్మి, అనసూయ, ప్రమీల, భారతి, సుశీల తదితర సభ్యులంతా పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-10 14:46:34

సొంత నిధులతో సచివాలయాలకు స్టేషనరీ పంపిణీ చేసిన కార్పోరేటర్ పీతల మూర్తి..

మహా విశాఖ నగర పరిధిలోని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తన సొంత నిధులతో స్టేషనరీ కొనుగోలు చేసి గురువారం వార్డు లోని 7 సచివాలయాలకు  పంపిణీ చేశారు. 7 సచివాలయాలకు అవసరమైన పేపర్ బండిల్స్, ప్రింటర్ సిరా బాటిల్స్, పెన్నులు, స్టేపలర్స్, మార్కార్స్, కత్తెరలు కొనుగోలు చేసి పిఠాపురం కాలనీ కళాభారతి పక్కన వార్డు కార్యాలయంలో సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు సచివాలయాలు అందిస్తున్న సేవలకు అంతరాయం కలగకుండా స్టేషనరీ అందించామన్నారు. వార్డు కార్పొరేటర్ గా  విజయం సాధించిన అనంతరం ప్రజలకు సచవాలయాల్లో సేవలు ఆగకుండా ఉండేందుకు అవసరమైన స్టేషనరీ అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఈ స్టేషనరీ అందిస్తున్నామని చెప్పారు. అలాగే పదవిలో కొనసాగినంత కాలం కూడా సచవాలయాలకి తన సొంత నిధులులతో స్టేషనరీ అందిస్తానన్నారు.  ఈ కార్యక్రమంలో సచివాలయాల కార్యదర్శిలు శ్రీలక్ష్మి, హరిత, చిరంజీవి, సంపత్, వెంకటేష్, రాఘవేంద్ర, ఝాన్సీ, సాయి చరణ్  పాల్గొన్నారు.

Visakhapatnam

2022-02-10 08:20:57

శ్రీకాకుళం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లపై కదలిక..

శ్రీకాకుళం నగరంలోని దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్తో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జగనన్న చేదోడు కార్యక్రమం నిర్వహణ సందర్భంగా వీరుద్ధరూ పలు అంశాలపై చర్చించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం వేగవంతం కావాల్సి ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటు చేస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందని గతంలోనే ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం నిధుల విడుదలకు సానుకూలంగా ఉందని అన్నారు. తగిన నిధులను సమీకరించి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇదే విధంగా కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణానికి తగిన నిధులు పూర్తిస్థాయిలో కేటాయించాలని ఇటీవలే తాను సీఎం వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డిని కలిసి వివరించానని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ స్టేడియం నిర్మాణం విషయంలో తమకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయని అన్నారు. ముఖ్యంగా స్టేడియంను క్రీడాకారులకు అనుకూలంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సీఎంవో నుంచి పేర్కొన్నారన్నారు. ఇందు కోసం స్టేడియం స్థలం చుట్టూ కంచెను ఏర్పాటు చేశామన్నారు. ఆటలకు అనుగుణంగా క్రీడామైదానాన్ని చదును చేయిస్తున్నామన్నారు. రన్నింగ్, జాగింగ్ ట్రాక్ ల నిర్మాణం చేశామన్నారు. ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. దీనికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ పర్యాటక శాఖ, మున్సిపల్ శాఖల నుంచి కూడా స్టేడియం అభివృద్ధికి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని త్వరలోనే స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Srikakulam

2022-02-08 11:04:18

భజన బృందం సేవలు ప్రశంసనీయం.. గంట్ల

దేవాలయానికి వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తి భావం నింపేందుకు భజన మండలిలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్ధానం  ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. మంగళవారం విశాఖ కంచరపాలెం సమీపంలో ఉన్న మధుసూదన్ నగర్ దుర్గాదేవి ఆలయంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా 2వసారి నియమితులైన గంట్ల శ్రీనుబాబు ను స్థానిక వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ఇక్కడ దేవస్థానంతో పాటు అన్ని దేవాలయాల్లోనూ ఈ భజన మండలి  తమ ప్రదర్శనలతో భక్తులను విశేషంగా అలరిస్తోంది అన్నారు..మరోవైపు  స్వామి, అమ్మవారులుని కూడా ఘనంగా కీర్తించడం అభినందనీయమన్నారు. ఆన్ని. భజన మండలలుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత   ఆయా  దేవాలయాల పైనే ఉందన్నారు. వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలి అనేక ప్రదర్శనలు ఇచ్చి నగర ప్రజలను విశేషంగా అలరిస్తుందన్నారు.  ఈ భజన మండలి కి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీనుబాబు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీనుబాబు ను వీరంతా ఘనంగా సన్మానించి సత్కరించారు..శ్రీ వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలిఅధ్యక్షురాలు చిక్కాల గీతా కుమారి, కార్యదర్శి ఇరోతి శశి, కోశాధికారి మళ్ల జ్యోతి, సభ్యులు సేనాపతి మంగ, రేవతి, వెంకటలక్ష్మి,సరళ,లోవ, సత్య, సుబద్ర, తదితరులు పాల్గొన్నారు.

Kancharapalem

2022-02-08 09:48:08

16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలం భూమిపూజ..

తిరుమలలోని అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి భూమి పూజను ఫిబ్రవరి 16న మాఘ పౌర్ణమి నాడు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భూమి పూజ ఏర్పాట్ల‌ను ఈవో, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు.   అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆకాశ గంగ సమీపంలోని అంజనాద్రి శ్రీ ఆంజనేయ‌స్వామివారి జన్మస్థల‌మ‌ని భౌగోళిక, పౌరాణిక‌, శాస్త్రోక్తమైన ఆధారాలతో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రకటించింద‌న్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, సుందరీకరణ చేపట్టేందుకు టిటిడి ఫిబ్రవరి 16న భూమిపూజ నిర్వహించనున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తంతంపై పుస్త‌కం విడుద‌ల చేస్తామ‌న్నారు.  అంజ‌నాదేవి, బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం ఎదురుగా ముఖ మండ‌పం, గోపురాలు, గోగ‌ర్భం డ్యాం వ‌ద్ద రోట‌రీ దాత‌ల స‌హ‌కారంతో ఏర్పాటు చేస్తామ‌న్నారు. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు  నాగేశ్వ‌ర‌రావు,  ముర‌ళీ కృష్ణ ఆర్ధిక స‌హ‌యంతో ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్  ఆనంద సాయి ఆధ్వార్యంలో నిర్మాణాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు.  విశాఖ శారద పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామ‌జ‌న్మ భూమి ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌, చిత్రకూట్ పీఠాధిపతి  రామభద్రాచార్యులు,  కోటేశ్వ‌ర‌ శ‌ర్మ‌ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులను ఈ ఉత్సవానికి ఆహ్వానించామ‌న్నారు. 

           అదేవిధంగా తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంలో ఉన్న 1.5 ఎక‌రాల స్థ‌లం అభివృద్ధి చేయాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింద‌న్నారు. ఇక్క‌డ ధ్యాన‌మందిరం, ఉద్యాన‌వ‌నం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లో ఇందుకు సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి, బృందావ‌నం అభివృద్ధి ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు ఈవో చెప్పారు.   అంత‌కుముందు ఈవో ఆకాశ‌గంగ ప‌రిస‌రాల్లో భూమి పూజ నిర్వ‌హించే ప్రాంతాన్ని ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం గోగ‌ర్భం డ్యాం, రింగ్ రోడ్డు ప‌రిస‌రాల‌లో నూత‌నంగా అభివృద్ధి చేసిన కూడ‌ళ్ళ‌ను, త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నంను ఆయ‌న అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

          టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఇంచార్జ్ డిఎఫ్‌వో  ప్ర‌శాంతి, ఎస్ఇ -2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఇఇ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, విజివో బాలిరెడ్డి, మాజీ టిటిడి బోర్డు స‌భ్యులు నాగేశ్వ‌ర‌రావు, ఆర్ట్ డైరెక్ట‌ర్ ఆనంద సాయి, ఇత‌ర అధికారులు ఈవో వెంట ఉన్నారు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల కొర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 9.30 గంట‌ల నుండి ఎస్వీబిసిలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

Tirumala

2022-02-08 09:43:55

విశాఖలో ఆందోళన బాటలో ఓలా, ఊబర్ డ్రైవర్లు..

మహా విశాఖ నగరంలో ఆన్ లైన్ ప్రైవేటు ట్రావెల్స్.. ఓలా, ఉబర్ కారు డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఆందోళనకు దిగారు. నగరంలోని గురుద్వారా, మర్రిపాలెంలలో గల ఓలా, ఊబర్  కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్లి స్థానిక ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. డ్రైవర్ నుంచి యాజమాన్యం తీసుకుంటున్న కమిషన్ తగ్గించాలని,  ట్రిప్  రేట్లు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. సిఐటియు కార్మిక సంఘానికి అనుబంధంగా ఉన్న ఓలా, ఊబర్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పతివాడ రాములు  ఆధ్వర్యంలో సుమారు వందమంది డ్రైవర్లు ఆందోళనలో పాల్గొన్నారు. యూనియన్ ప్రతినిధులు  నాయుడు, నాని, మాధుసూధన్, గోపి కృష్ణ, సుధీర్ తదితరులు హాజరయ్యారు.

Visakhapatnam

2022-02-08 08:43:35

స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

ప్రత్యక్ష దైవంఅరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు సోమవారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి ప్రక్క రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు. సూర్య జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.  ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికిప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ప్రసాదాలనుచిత్రపటాన్ని అందజేసారు.విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామిసంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీతతూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణనంద స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యక్ష దైవంఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యదేవుని ఆశీస్సులతో

ప్రజలంతా సుఖసంతోషాలు,  ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.  రథసప్తమి వేడుకల నిర్వహణపై మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వివిధ శాఖల సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారనితద్వారా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా దర్శనానికి హాజరైన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

 

Srikakulam

2022-02-08 08:38:08

అర్జీలు పరిష్కారంలో నాణ్యత ఉండాలి..

స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో   జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబులతో ఆయన స్పందన కార్యక్రమం, సచివాలయ సిబ్బంది సర్వీసు రెగ్యులరైజ్ లపై ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనకు వచ్చే దరఖాస్తులు ఏ శాఖ వద్ద పెండింగ్ లో ఉంచరాదన్నారు.  స్పందన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పెండింగ్ లో లేకుండా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీలు పై సమీక్షించి  పెండింగ్ కు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుకొని, అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అర్జీలు పరిష్కారంలో నాణ్యత ఉండాలని, పరిష్కరించే అర్జీలు నాణ్యత లోపిస్తే అలాంటి అర్జీలు పునరావృత్తం అవుతాయన్నారు. గ్రామ /వార్డు సచివాలయ సిబ్బింది సర్వస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఆదేశించారు.

Visakhapatnam

2022-02-07 11:41:20

విశాఖ నగర పాలన జీవిదా జీవీఎంసీదా..జనసేన

మహా విశాఖ నగరాన్ని పాలిస్తున్నది నగరపాలక సంస్థా లేక విశాఖ స్మార్ట్ సిటీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి తెచ్చుకున్న జి. వెంకటేశ్వరరావో అన్నది కౌన్సిల్ సభ్యులతో పాటు నగర ప్రజలకు అర్ధం కావడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవి కౌన్సిల్ ప్రమేయం లేకుండా  కొత్త ప్రాజెక్టులను ప్రకటించడం, నిర్ణయాలు తీసుకోవడం పై స్పష్టత ఇవ్వాలని కోరుతూ సోమవారం స్పందనలో జీవీఎంసీ మేయర్, కమిసనర్లకు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవీఎంసీ కౌన్సిల్ తో  సంబంధం లేకుండా ఇటీవల వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించిందన్నారు. 98 మంది కార్పొరేటర్ల తో ఎన్నికైన కౌన్సిల్, మేయర్, డిప్యూటీ మేయర్ లను పక్కనపెట్టి వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఈ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వర్ రావు ప్రాజెక్టులను ఏకపక్షంగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. మాధవధార నుంచి ముడసర్లోవ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేర సింహాచలం కొండ కు సొరంగ మార్గం, 20 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంలో స్నో పార్క్, జగదాంబ వద్ద  నిర్మించిన మల్టీ లెవల్ పార్కింగ్  ఫీజులు ఖరారు  వంటివన్నీ కౌన్సిల్  ప్రమేయం లేకుండా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించడం పై విస్మయం వ్యక్తం చేశారు. అలా ప్రకటించే హక్కు అధికారం ఆయనకు ఎలా వచ్చాయో  తెలియడం లేదన్నారు.  2015 ఏర్పాటయిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ గడువు  కరోనా కారణంగా రెండేళ్ల పొడిగించారని, 2022 మార్చి తో స్మార్ట్ సిటీ ముగుస్తుందన్నారు. నెల రోజుల్లో ఇంటికి వెళ్లిపోయే వ్యక్తి  జీవీఎంసీ మేయర్, కమిషనర్ లా ప్రాజెక్టులపై సమీక్షలు చేయడం వాటికి అధికారులు హాజరవడం చూస్తుంటే షాడో పాలనలా కనిపిస్తుందని ఆక్షేపించారు. నగరంలో  గుర్తించిన, ప్రజలు అంగీకరించిన 1700 ఎకరాల లోనే ఈ కార్పొరేషన్ కు కార్యకలాపాలు చేసేందుకే అధికారం ఉందన్నారు. సుమారు మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.  మరో రెండు నెలల్లో గడువు ముగిసే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వందల కోట్ల రూపాయల రక రకాల కొత్త ప్రాజెక్టులను  ఏకపక్షంగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. విశాఖ నగర ప్రజల అవసరాలు తెలుసుకుని కార్పోరేషన్  దృష్టికి తీసుకువెళ్లి కౌన్సిల్ తీర్మానం ద్వారా చేపట్టాల్సిన పనులను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఒకే వ్యక్తి ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.  ఈ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 162  కోట్ల రూపాయలు సీఎఫ్ఎంఎస్ వద్ద   పెండింగ్లో ఉండటంతో ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదన్నారు. వాటిపై దృష్టి సారించి నిధులు రాబట్టే పనులు పూర్తి చేయాల్సిన స్మార్ట్  సిటీ కార్పొరేషన్ చైర్మన్ అందుకు విరుద్ధంగా కౌన్సిల్ తో సంబంధం లేకుండా ఊహాజనితమైన ప్రాజెక్టుల ప్రకటించుకుంటూ పోవటం కార్పొరేటర్లను,కౌన్సిల్ ను అవమానించడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారాలపై మేయర్ కూడా స్పందించకపోవడం  ఆందోళన కలిగిస్తుందన్నారు. జివిఎంసి కమిషనర్ హోదాలో స్మార్ట్ సిటీ సీఈవో గా  కూడా కమిషనర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు సమీక్షలకు హాజరైనట్లు పత్రికల్లో వార్తలు రావడం విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. కాలపరిమితి ముగిసిన , నిధులు లేని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా నిజంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సాధ్యం  అవుతుందా లేదా అన్నది స్పష్టం చేయాల్సిందిగా కోరారు. స్మార్ట్ సిటీ పేరిట చేపట్టిన ప్రాజెక్టుల్లో  వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న  ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటీవల  పిలిచిన కేబుల్  టెండర్లలో అక్రమాలు జరిగినట్టు స్వయంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసి దాన్ని ఆపాల్సిందిగా కోరారని చెప్పారు. మిగిలిన ప్రాజెక్టులపై సమీక్ష జరిపి స్మార్ట్ సిటీ వ్యవహారాలపై పూర్తి వివరాలతో కూడిన  నివేదిక ను కార్పొరేటర్ లకు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ వ్యవహారాలపై చర్చించేందుకు వచ్చే కౌన్సిల్ ఎజెండాలో ఈ ప్రాజెక్టుల వారీగా అన్ని  అంశాలను చేర్చాల్చిందిగా కోరారు.. 960 కోట్ల రూపాయలతో నరవలో  జరుగుతున్న  సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పై సమగ్ర వివరాలను అందజేయాలని కోరారు. ఇందులో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులు 100 కోట్లు కాగా నగర పాలక  సంస్థ ఎనిమిది వందల కోట్లకు పైగా నిధులు సమకూర్చుతుందన్నారు. నగరపాలక సంస్థ ఆస్తులను తాకట్టు  పెట్టి మరి  ఇందుకోసం అప్పులు  చేస్తున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ వందల కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహణను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పగించడం హాస్యాస్పదంగా ఉందన్నారు . ఈ అంశాన్ని జీవీఎంసీ మేయర్, కమిషనర్లు    సమీక్షించడమే కాకుండా కౌన్సిల్ సమావేశం లో చర్చించాలని డిమాండ్  చేశారు.

Visakhapatnam

2022-02-07 07:43:55

జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు గంట్ల సేవలు వెలకట్టలేనివి.. జియ్యాని శ్రీధర్

కృషి పట్టుదల ఉంటేనే జీవితంలో సమాజంలో ప్రతి ఒక్కరూ  ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి అవకాశం కలుగుతుందని జివిఎంసి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ అన్నారు. ఆదివారం విశాఖలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఆవరణలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా 2వ సారినియమితులైన గంట్ల శ్రీనుబాబు సన్మాన సభ జరిగింది. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. గ్రామీణ ప్రాంత జర్నలిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీనుబాబు కీలకమైన వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరం అధ్యక్షుడు గా, వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర కార్యదర్శి గా, రెండో సారి జాతీయస్థాయి జర్నలిస్టుల సంఘం నేతగా ఎదగడం, అదే స్థాయిలో తన సేవలు అందించడం తనకు ఎంతో  గర్వకారణంగా ఉందన్నారు. అందుకు తమ బాల్య మిత్రులు అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నామన్నారు.  సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని వారితోనే దేశ ప్రగతి  సాధ్యమన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తమ సొంత గ్రామాన్ని మర్చిపోకుండా శ్రీనుబాబు అందిస్తున్న  సేవలు ప్రశంసనీయమన్నారు. సన్మాన గ్రహీత జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతగానో సహకారం అందించారన్నారు. 1997 నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా జర్నలిస్టుగా సమాజానికి అవసరమయ్యే అనేక కథనాలు రాయడంతో పాటు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనను ఆదరించిన, అభిమానించిన గ్రామ ప్రజలందరికీ, యువజన సంఘాల కు శ్రీనుబాబు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస, గణేష్, నవయుగ యువజన సేవా సంఘాల తో పాటు గ్రామానికి చెందిన చాకి రేవు కొండ, విజినిగిరిపాలెం, లండ గరువు, మార్కెట్ ప్రాంతాలకు చెందిన  పలువురు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీనుబాబు ను ఘనంగా సన్మానించి సత్కరించారు. దొంతల సంతోష్, గంట్ల కిరణ్ బాబు ఏర్పాట్లు చేశారు..

Visakhapatnam

2022-02-06 09:32:14

వన్ టైం సెటిల్ మెంట్ లబ్ధిదారులకు వరం

వన్ టైం సెటిల్ మెంట్  పథకం లబ్ధిదారులకు వరమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వన్ టైం సెటిల్ మెంట్  లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పించే రిజిస్టర్ పత్రాలు పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ వసీం,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,  కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు  పథకం ద్వారా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.గతంలో ఇళ్లు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉండటమే కాకుండా కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి గతంలో మనం చూశామన్నారు.వన్ టైం సెటిల్ మెంట్ వల్ల ఆ ఇబ్బందులు అన్ని తొలగి పోతాయని ప్రజలకు మేలు చేయాలన్నది సి ఎం జగనన్న సంకల్పంమని పేర్కొన్నారు.వన్ టైం సెటిల్ మెంట్ పై ప్రతిపక్ష పార్టీలు అనేక కుట్రలకు పాల్పడినా వారి మాటలను నమ్మకుండా సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులందరికీ మేయర్ కృతజ్ఞతలు తెలియచేశారు.వన్ టైం సెటిల్ మెంట్ పూర్తి స్వచ్చందం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించారని మేయర్ గుర్తు చేశారు.నేడు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో  నగరం అన్ని విధాలా వేగవంతం గా అభిరుద్ది చెందుతోందని,నగర రూపురేఖలు మారేలా రోడ్ల అభిరుద్ది జరుగుతున్న తీరును మీరంతా చూస్తున్నారన్నారు.ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేస్తున్న అభిరుద్దిని ఓర్వలేక టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు.నగర ప్రజలందరి సహకారంతో నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ స్పష్టం చేశారు.కార్యక్రమంలో అదనపు కమీషనర్ రమణ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ సావిత్రి,కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి, సైఫుల్లా బెగ్ , చంద్ర లేఖ, సుజాతమ్మ, లాలు, కమల్ బూషన్, శ్రీనివాసులు, సంపంగి రామాంజనేయులు, టీపీఓ జ్యోతి ,నాయకులు రామచంద్ర, కుళ్ళాయి స్వామి, రవి,రాధ కృష్ణ, దాదు  , మెప్మా సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2022-02-04 08:22:44

బడ్జెట్ పై కార్పొరేటర్లకు అవగాహన కల్పించాలి..

పదేళ్ల తర్వాత మహావిశాఖ నగరపాలక సంస్థలో పాలకమండలి ఏర్పడింది.. 70% కార్పొరేటర్లు కొత్తవారే..రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ ఆమోదించాలంటే పాలకమండలి సభ్యులు అందరికి బడ్జెట్ పై  పూర్తిగా అవగాహన ఉండాల్సిందే.. స్థాయి సంఘం ప్రతిపాదించిన బడ్జెట్ ను గుడ్డిగా ఆమోదిస్తే ఓటేసిన నగర ప్రజలకు మోసం చేయడమేనని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చెప్పారు.  బడ్జెట్ పై అవగాహన కల్పించడానికి కార్పొరేటర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరుతూ శుక్రవారం జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు అయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ మహా విశాఖ నగర పాలక సంస్థ  నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ తో ఈనెల 11న  బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు  పత్రికల్లో చూసి తెలుసుకునే దౌర్భాగ్యంలో కార్పొరేటర్లు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   కార్పొరేటర్ లతో కూడిన   కౌన్సిల్  బడ్జెట్ ను ఆమోదించడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిశారని గుర్తు చేశారు. ఇప్పుడున్న కౌన్సిల్ సభ్యులు లో 70 శాతం మంది కొత్త వారే కాబట్టి నాలుగు వేల కోట్ల రూపాయల భారీ  బడ్జెట్ ను ఆమోదించేందుకు అందులో చేర్చిన  అంశాలు, నిబంధనలపై కార్పొరేటర్ లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థాయీ సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలను గుడ్డిగా ,యధావిధిగా ఆమోదించకుండా సమగ్ర చర్చ జరిపి నగర ప్రజలు అవసరాలకు అనుగుణంగా  కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ పైన ఇతర అంశాలపైన   సమగ్రమైన, విస్తృతమైన చర్చ జరగాలంటే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు బడ్జెట్ వ్యవహారాలపై కనీస అవగాహన ఉండాలన్నారు. ఇందుకోసం బడ్జెట్ సమావేశానికి ముందు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించాల్సిందిగా జీవీఎంసీ మేయర్, కమిషనర్ల కు విజ్ఞప్తి చేశామని చెప్పారు.  స్థాయీ సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలు అన్నింటినీ ఆ అవగాహన సదస్సు లో కార్పొరేటర్ల ముందు ఉంచవలసిందిగా కోరుమన్నారు. బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధం అయ్యేందుకు కార్పొరేటర్లకు కనీసం  రెండు వారాల ముందు బడ్జెట్ ఎజెండా ప్రతులను అందజేయాలన్నారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ అధికారుల నుంచి బడ్జెట్ సమావేశం పైన  ఎజెండా పైన ఎటువంటి సమాచారం లేకపోవడం దారుణమన్నారు . నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ ను ఆమోదించే ముందు సరైన కసరత్తు  లేకుండా, విషయం  తెలుసుకోకుండా, సభ్యులకు సమాచారం ఇవ్వకుండా హడావిడిగా చేయటం సమంజసం కాదని హితవు పలికారు. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ సమావేశాల తేదీ వివరాలను  కార్పోరేటర్ లకు తెలియజేసి, పూర్తి వివరాలతో కూడిన ఎజెండాను సభ్యులకు అంద చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు కార్పొరేటర్లకు అవగాహన కోసం ముందస్తుగా సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.

Visakhapatnam

2022-02-04 08:19:19

జర్నలిస్టుల సహకారంతోనే సమాజ ప్రగతి..

జర్నలిస్టుల సహకారంతోనే సమాజ ప్రగతి సాధ్యమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. గురువారం సింహాచలం గ్రామానికి చెందిన పలువురు శ్రీనుబాబును అక్కయ్యపాలెం కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం ప్రాంతానికి చెందిన తాను అందరి సహకారంతో అంచలంచెలుగా రాష్ట్ర, జాతీయ స్థాయి జర్నలిస్టుల సంఘాల నాయకుడిగా అనేక పదవులు చేపట్టడం జరిగిందన్నారు. తాను ప్రారంభం నుంచి తన పరిధి మేరకు జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే రీతిన తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అడవివరం, సింహాచలం పరిసర గ్రామాల్లో కూడా తన వంతు సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శ్రీనుబాబును సత్కరించిన వారిలో బంటుబిల్లి శివాజీ, సంతోష్, యడ్ల శ్రీను, జి.సీతారాం, ఎస్.ప్రవీణ్, దీపక్, చరణ్, అప్పారావు, వరంబాబు తదితరులు ఉన్నారు. వీరందరూ శ్రీనుబాబును ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడిజ్ఞాపికను అందజేశారు.

Visakhapatnam

2022-02-03 05:34:03

తూర్పుగోదావరి జిల్లాలో పశు కమేలాలు, పశు రవాణాలపై పోలీసుల డేగకన్ను..

తూర్పుగోదావరి జిల్లాలో పశు కమేలాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన అధికారులు సిబ్బంది ద్వారా డేగ కన్ను వేసినట్టు తెలుస్తుంది. ఇందులోభాగంగానే పశువుల రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాలో కొందరు వ్యాపారులు పశువులను తరలించడంతోపాటు, వాటిని కమేలాలకు తరలించి మాంస విక్రయాలు కూడా అత్యధికంగా చేపడుతున్నట్టు అధికారులు సమాచారం అందుకున్నారు. మరికొంత మంది పశువల ఎముకలు, కొవ్వులతో ప్రత్యేకంగా నూనెలు తయారు చేసి కల్తీలకు పాల్పడుతున్నట్టు కూడా తెలియడంతో అలాంటి స్థావరాలు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి నిర్వహకులు ఎవరు, వారికి ఎవరు సహకారం అందిస్తున్నారు, వారి వ్యాపారాలు ఏ ప్రాంతం వేదికగా సాగుతున్నాయి తదితర వివరాలు సేకరించే పనిలో పడినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు గట్టి నిఘా పెట్టడంతో మంగళవారం పిఠాపురం టౌన్ స్టేషన్ పరిధిలోని రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ వద్ద రెండు బొలేరో వాహనాల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గోవులను పోలీసులు  గుర్తించినట్టు చెబతున్నారు. అలా గుర్తించిన వాటిపై పిఠాపురం ఎసై శంకర్ రావు కేసును నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతు వాహనంలో ఉన్న 23 ఆవులను కాకినాడ గో సంరక్షణ కేంద్రానికి తరలించి కేసులు నమోదు చేసినట్టు పిఠాపురం సిఐ శ్రీనివాస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గోవుల రవాణా అధికంగా జరుగుతోందని వాటి నియంత్రకు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.  ఆవులను అక్రమంగా రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  పిఠాపురం సర్కిల్ పరిధిలో అసాంఘిక, అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అక్రమ రవాణాలపై తమకు సమాచారాన్ని తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసేవారు, మాంస విక్రయాలు చేసేవారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.

Pithapuram

2022-02-01 16:56:45