1 ENS Live Breaking News

సమాచారశాఖలో ఉత్తమ ఏపీఆర్వో గా కిషోర్ కి అవార్డు..

విశాఖజిల్లా సమాచారశాఖలో ఏపీఆర్వోగా పనిచేస్తున్న కిషోర్ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు వచ్చింది. విధినిర్వహణలో చురుకుదనం, జర్నలిస్టులకు సకాలంలో సేవలు అందించడం వెరస ఆయను జిల్లా అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ బేరక్స్ లో జరిగిన ఉత్సవాల్లో కిషోర్ కి ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టర్, జివిఎంసీ కమిషర్ డా.లక్ష్మీషాలు సంయుక్తంగా అందజేశారు. కిషోర్ కి ఉత్తమ అవార్డు రావడం పట్లు పలువురు జర్నలిస్టులు, సమాచారశాఖలోని సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు తీసుకోవాలని ఆకాంక్షించారు.

Visakhapatnam

2022-01-26 13:00:21

కేంద్రం జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాల్సిందే.. గంట్ల శ్రీనుబాబు

భారత దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం(ఎన్ ఎ జె)  తరఫున మరింతగా కృషి చేస్తామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. 2వసారి జాతీయ కార్యదర్శిగా నియమింపబడ్డ తరుణంలో శ్రీనుబాబును మంగళవారం'సింహాచలంకు చెందిన  పలు అసోసియేషన్ లు కు చెందిన యువత ఘనంగా సత్కరించింది. డాబాగార్డ్ న్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు మాట్లాడుతూ, తాను ఏ పదవిలో ఉన్నా ఎటువంటి లాభాపేక్ష లేకుండా యూనియన్లు కి అతీతముగా  జర్నలిస్టులందరికీ మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలను గుర్తించామని దశలవారీగా వాటిని పరిష్కరించేందుకు పార్లమెంట్ సబ్ కమిటీ కి కూడా నివేదిక ఇవ్వ ఇవ్వనున్నట్టు చెప్పారు. జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో సింహాచలం కి చెందిన అంబేద్కర్ కాలనీ అద్యక్షులు అప్పలరాజు,కార్యదర్శి.. చంటి, బంగారు బాబు, వంగలపూడి రమణ, శంకర్, చిట్టి,శివ.. తో పాటు లండ శ్రీను, దొంతల సంతోష్, గంట్ల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-25 09:51:35

22వ వార్డులో రోడ్లకు మరమ్మత్తులు.. కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్..

విశాఖలోని జివిఎంసీ 22వ వార్డులో గుంతలు పడిన రోడ్లకు మోక్షం కలిగింది. రూ.1.20 లక్షలతో శనివారం మరమ్మత్తు పనులు చేపట్టారు. 8నెలలు కిందట వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు 22వ వార్డులో రోడ్డులు మరమ్మత్తులకు రూ.లక్ష 20 వేలు మంజూరు చేయగా ఆ నిధులతో పిఠాపురం కాలనీ, పీతలవాని పాలెం, సిద్దార్థ నగర్, రేసపువానిపాలెం, మంగాపురం కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్డుల మరమ్మత్తులు చేశారు.  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దగ్గరుండి రోడ్డు పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయని జీవీఎంసీ కమిషనర్ దృష్టిలో పెట్టామన్నారు. ప్రస్తుతం రోడ్ల మరమ్మత్తులకు కేటాయించిన నిధులతో పనులు చేస్తున్నామన్నారు. వార్డు సమస్యలు పరిష్కారం చేయడానికి నిరంతరం పాటు పెడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ సత్యశ్రీ .సాయి వర్క్ ఇన్స్పెక్టర్, సచివాలయ ఎమినెట్స్ కార్యదర్సులు ప్రసాద్, హేమంత్, కార్తీక్, రవితేజ, తరుణ్, సత్యకళ, సుజాత, నాయకులు సత్యం, పెసల శ్రీను, వియ్యాపు రామకృష్ణ, రవి, దేవా పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-22 07:48:10

6613 మందికి కోవిడ్ బూస్టర్ డోసు టీకా పంపిణి..

తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఒక్కరోజే 6613మందికి కోవిడ్ బూస్టర్ డోసు కోవిడ్ టీకా అందించినట్టు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.భరతలక్ష్మి తెలియజేశారు. గురువారం కాకినాడలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ కోవిడ్ రెండవ డోసు టీకా 40447 మందికి అందిచామని పేర్కొన్నారు. జిల్లాలోని 64 మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, గ్రామ సచివాలయాల్లో ఆరోగ్య మిత్రాల ద్వారా కోవిడ్ టీకా వేస్తున్నట్టు ఆమె తెలియజేశారు. అదేవిధంగా 15-17 ఏళ్ల వయస్సు వన్నవారికి 390 మందికి కోవిడ్ టీకా వేసినట్టు చెప్పారు. జిల్లాలో కోవిడ్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నందున కోవిడ్ టీకా తీసుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకి రావాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.భరతలక్ష్మి మీడియా ద్వారా జిల్లా వాసులకు సూచించారు.

Kakinada

2022-01-20 17:04:13

అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి..

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి  జర్నలిస్టు వాటాగా రూ. 1250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250 లను చెల్లిస్తుందని కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి తెలియజేశారని విశాఖజిల్లా సమాచారశాఖ డిడి మణిరామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.  జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code: 8342 – 00 – 120 -01-03-001-001 VN, DDO Code : 2703 – 0802 – 003 నందు తమ వాటాను చెల్లించాల సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను విశాఖజిల్లా కేంద్రంలోని సమాచార, పౌరసంబంధాల శాఖ  కార్యాలయంలోనూ అందజేయవలసిందిగా ఆ ప్రకటనలో తెలియజేశారు. కొత్తగా అక్రిడిటేషన్ పొందినవారు  వారి కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తుల ఆధార్ కార్డు కాపీ, ఫొటోలు కూడా జతచేయాలని సూచించారు.

Visakhapatnam

2022-01-20 10:35:46

విశాఖలో 104 కాల్ సెంటర్లు నెంబర్లు ఇవే..

విశాఖజిల్లాలో కరోనా నేపథ్యంలో జిల్లా అధికారులు 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కోవిడ్ చికత్స, పరీక్షలు, సలహాలు, సంప్రదింపుల కోసం జిల్లావాసులు 104 కాల్ సెంటర్ లో 0891-2501271, 2501272  నెంబర్లలో సంప్రదించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఇక్కడ నోడల్ ఆఫీసర్ గా 9849112471 లో సంప్రదించవచ్చు. అదేవిధంగా  కోవిడ్ పరీక్షలు ఇంటి దగ్గరే చేయించుకోవాలనుకుంటే.. 8309150237, 8309875283లోనూ సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు.

Visakhapatnam

2022-01-20 08:44:52

హోం గార్డు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం..

హోంగార్డుల సంక్షేమం కోసం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారులో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎం.ఎన్. రెడ్డి కుటుంబానికి యాక్సిస్ బ్యాంకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు క్రింద వచ్చిన రూ.30 లక్షల చెక్కును గురువారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అందజేశారు. అంతేకాకుండా  జిల్లా హోంగార్డ్ ల ఒక్క రోజు జీతం మొత్తం Rs.2,10,160/- ల చెక్కును వారి భార్య  ఎం. సత్యవేణితోపాటు  జిల్లా హోంగార్డ్ యూనిట్ నందు విధులు నిర్వహిస్తూ మరణించిన హోంగార్డ్  పి. శ్రీనివాస్ నకు జిల్లా హోంగార్డ్ ల ఒక్క రోజు జీతం మొత్తం Rs.2,12,290/- ల చెక్కును అతని భార్య  పి. శ్రీదేవికి అందజేశారు. ఈ దర్బారు సందర్భంగా 2021 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మరియు SSC లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 19 మంది జిల్లా హోంగార్డ్ ల పిల్లలకు Rs. 35,500/- ల మెరిట్ స్కాలర్షిప్ లను అందించి, విద్యార్ధినీ విద్యార్ధులకు వారి భవిషత్తు ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలి అనే దానిపై దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,  హోంగార్డులు వారి విధి నిర్వహణలో ఎదుర్కొనే సమస్యలు విని పోలీసు శాఖ ద్వారా వారికి రావలసిన రాయితీలను వెనువెంటనే అందేలా సంబంధిత విభాగ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఎం.ఎన్. రెడ్డి , హోంగార్డ్ పి. శ్రీనివాస్ కుటుంబాలకు డిపార్టుమెంట్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వపరంగా కుటుంబ సభ్యులకు రావలసిన అన్ని రాయితీలు సత్వరం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఎస్బీ డిఎస్పీ అంబికా ప్రసాద్,  ఐటీ కోర్ ఇన్స్పెక్టర్  పి.రామచంద్రరావు,  పిసిఆర్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రామకోటేశ్వర రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్  జెవిరమణ, హోంగార్డ్  ఆర్ఐ .శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు..

కాకికానాడ రూరల్

2022-01-20 07:29:07

జివిఎంసీ 22వ వార్డులో ఆధార్ సేవలు ప్రారంభం..

మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియం వార్డు కార్యాలయం మేడ పైన ఉన్న 149 సచివాలయంలో  గురువారం ఆధార్ సేవలను  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఆధార్ సేవలు అందించడానికి 149వ నెంబరు సచివాలయంలో ఆధార్ కేంద్రం మంజూరయిందని చెప్పారు. ఈ కేంద్రంలో ఆధార్ కార్డు లోని పేర్లు, చిరునామా, తప్పు ఒప్పులు సరిచేయడంతోపాటు, కొత్త ఆధార్ కార్డులు, కార్డుల్లో ఫోన్ నంబర్ నమోదు వంటి సేవలు ఉంటాయన్నారు. వార్డు ప్రజలు ఆధార్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ శ్రీలక్ష్మీ, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ కార్యదర్శి హరిత, భారతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-20 07:03:20

అనకాపల్లి వేల్పుల వీధి సంబరానికి రండి.. గంట్లకు ఉత్సవ కమిటీ ఆహ్వానం.

విశాఖజిల్లాలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన అనకాపల్లి వేల్పుల వీధి లో ఈ నెల 22న గౌరీ పరమేశ్వరుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.ఈఉత్సవంలో  పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును కోరారు. సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు  అందరూ విశాఖలో  శ్రీనుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ వేల్పుల వీధి ఉత్సవానికి తనను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.. కొవిడ్ నేపథ్యంలో గౌరీ అమ్మవారు కృప ప్రజలందరికీ ఉండాలని శ్రీను బాబు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Anakapalle

2022-01-17 11:38:39

జర్నలిస్టులూ కోవిడ్ కేసుల పట్ల భద్రంగా ఉండండి..

విశాఖ జిల్లాతోపాటు, మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కోవిడ్ వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మళ్లీ ఆశన్నమైందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో మళ్లీ కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున జర్నలిస్టులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ భారిన పడకుండా ఉండేందుకు అవకాశం వుంటుందని తెలియజేశారు. జర్నలిస్టులపైనే వారి ఇంట్లో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే భాహ్య ప్రపంచంలో జరిగే విషయాలను ప్రజలకు మీడియా ద్వారా చేరువ చేయగలమన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గేంత వరకూ నిబంధనలు పాటిస్తూ, అవసరం అయితే తప్పా భయటకు రావొద్దని గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టులకు ఈ సందర్భంగా సూచించారు.

Visakhapatnam

2022-01-17 06:57:21

సింహగిరిపై వైభవంగా కనుమ పండుగ..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం కనుమ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.  తెల్లవారుజామున సింహాద్రినాధుడు, శ్రీదేవి ,భూదేవి అమ్మవార్లును  సుప్రభాతసేవతో మేల్కొలిపి, ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కనుమ పండుగ నేపథ్యంలో సింహాచలం గోశాలలో గోపూజ ఘనంగా నిర్వహించినట్టు  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. సింహాద్రి నాధుడుని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా  ఆలయంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లోపాల్గొన్నారు. ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ,  ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగాల నరసింహనాయుడు పలువురు అధికారులు సభ్యులు పాల్గొని గోశాలలో గోపూజలు  ఘనంగా  జరిపించారు. సింహగిరిపై మకరవేట ఉత్సవం అత్యంత సాంప్రదాయబద్దంగా నిర్వహించారన్నారు.  ఉత్సవంలో భాగంగా సింహాద్రినాధుడు కి  శ్రీమహావిష్ణువుఅలంకరణ గావించినట్లు తెలిపారు. మొసలి బారిన పడిన గజేంద్రుడిని శ్రీమహావిష్ణువు అలంకరణలో ఉన్న సింహాద్రినాధుడు  రక్షించడమే ఉత్సవము ప్రత్యేకత ఆని శ్రీనుబాబు వివరించారు. అందుకు తగ్గట్లుగానే ఆలయ వర్గాలు ఈ ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా కన్నులపండుగగా జరిపించారన్నారు. ప్రతియేటా నిర్వహించే ఈ ఉత్సవం కోవిడ్ కారణంగా కొండపైన ఆలయం వెనుక ఉన్న నీటి కొలనులో వైభవంగా జరిపించారన్నారు.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  ఈఓఆధ్వర్యములోఅన్ని సదుపాయాలు కల్పించారు.

Simhachalam

2022-01-16 09:10:15

ఉత్తరద్వారం లో కొలువైన శ్రీ సింహాద్రి అప్పన్నకు గంట్ల పూజలు..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురువారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు కు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. తొలుత సర్వాభరనాలతోస్వామిని  చూడముచ్చటగా వైకుంఠనాథుడు అలంకరణగా గావించి తదుపరి  స్వామిని ఉత్తర ద్వారంలో ఆశీనులను చేశారు.. వేదమంత్రోచ్ఛారణల మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ కొలువై ఉన్న స్వామిని పలువురు భక్తులు  దర్శించుకున్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు. జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని స్వామిని పూజించి సేవించారు. కొండ దిగువన శ్రీ  వెంకటేశ్వర ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం  నిర్వహించారు. అక్కడ కూడా శ్రీను బాబు దంపతులు స్వామిని సేవించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు బోర్డు సభ్యులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Simhachalam

2022-01-13 15:47:13

పరమపవిత్రం సింహాచల అప్పన్న ఉత్తర ద్వార దర్శనం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తర ద్వారం లో కొలువున్న శ్రీ మహా విష్ణువు ను ఏకాదశి రోజు దర్శించుకుంటే  సాక్షాత్తు వైకుంఠంలో కొలువైవున్న శ్రీమన్నారాయనుడుని  దర్శించు కున్నంత పుణ్య ఫలం కలుగుతుందని శ్రీనుబాబు వివరించారు. ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఆ శ్రీ మన్నారాయనుడును అదే రోజున దర్శించుకున్నారు అని  
పురాణ ఇతిహాసాలు కథనం ఉందన్నారు.. బుదవారం ఉదయము సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న గంట్ల శ్రీనుబాబు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతియేటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే   ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు.. ఉదయము 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం లభిస్తుందన్నారు.  సర్వదర్శనం తో పాటు వంద, 300, టికెట్స్ తోపాటు రూ. 500 టిక్కెట్ పై   ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా సింహగిరి  పై జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఉదయం ధర్మకర్తల మండలి సభ్యులు దినేష్ రాజ్, సూరిశెట్టి సూరిబాబు ,దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పరిశీలించారు. సింహగిరి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, అధికారులను వీరు ప్రసంసించారు. ఆలయ ఈవోఎంవి సూర్య కళ ఆధ్వర్యంలో ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు.

Simhachalam

2022-01-12 07:36:48