1 ENS Live Breaking News

అట్టహాసంగా గంట్ల పదవీ బాధ్యతలు..

సింహాచలం శ్రీ శ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈవో ఎంవి సూర్యకళ ఆధ్వర్యంలో సభ్యులు తమ పదవీ ప్రమాణ స్వీకారం  చేపట్టారు. ప్రస్తుతం అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తన పదవికి  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ అప్పన్న దేవస్థానం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు  చేపట్టడం జరిగిందని ,త్వరలోనే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు.. త్వరలోనే ప్రహ్లాదకల్యాణ మండపం స్వాధీనము కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఉత్సవాలు విజయవంతానికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని శ్రీను బాబు కోరారు. సింహాచలం గ్రామస్తుడుగా ధర్మకర్తల మండలి సభ్యుడిగా  పదవి స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.. దేవుడికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి ,ఇతర ప్రజాప్రతినిధులకు శ్రీను బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును ఆలయ అధికారులు, సింహాచలం,అడవివరం గ్రామస్తులు  ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డ్ సభ్యులంతా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Simhachalam

2022-04-07 10:15:14

అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యునిగా గంట్ల

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 235ను రాష్ర్ట దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్.హరిజవహర్ లాల్ విడుదల చేశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సింహాచలం ప్రాంతానికి చెందిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును నియమించారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న గంట్ల శ్రీనుబాబు గతంలో చందనోత్సవం కమిటీ సభ్యునిగా , పలు అనుబంధ ఆలయాల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేవస్థానం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గంట్ల శ్రీనుబాబును పాలకమండలి సభ్యునిగా నియమించడం పట్ల పలువురు భక్తులు, సహచర జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పాలకమండలి రెండేళ్ల పాటు సేవలందించనుంది.

Simhachalam

2022-04-07 03:48:52

ముగిసిన‌ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం

తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గ‌త మూడు రోజులుగా నిర్వ‌హిస్తున్న‌ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం బుధ‌వారం ఉద‌యం మ‌హా పూర్ణాహూతితో శాస్త్రోక్తంగా ముగిసింది.  ఈ సంద‌ర్భంగా టిటిడి వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ‌వారి అనుగ్ర‌హంతో శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రం ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని మూడు రోజుల పాటు టిటిడి యాగం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. రుత్వికులు వైఖాన‌స ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం ఏడు హోమగుండాల‌లో హోమాలు, మంత్ర పారాయ‌ణం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. చివ‌రిగా మంత్ర శ‌క్తితో నిండిన  క‌ల‌శాల్లోని జ‌లంతో శ్రీ ధ‌న్వంత‌రీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల‌కు అభిషేకం చేయ‌డం వ‌ల‌న లోకం అంత సుభిక్షంగా ఉంటుంద‌ని వివ‌రించారు. యాగ‌శాల‌లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, శ్రీ ధ‌న్వంత‌రీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చారు. ఇందులో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, అగ్నిస్థాప‌న‌, కుంభ‌రాధ‌న‌, కుంభ‌ నివేద‌న‌, విశేష హోమాలు, మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ ధ‌న్వంత‌రీ, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానులకు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నం, క‌ల‌శాల్లోని మంత్ర జ‌లంతో విశేషంగా అభిషేకం చేశారు.  టిటిడి వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో 12 మంది ప్ర‌ముఖ రుత్వికులు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్ర‌ట‌రీ  స‌త్య‌నారాయ‌ణ‌, పాల్గొన్నారు.   ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌  కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని,  శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు  వేణుగోపాల దీక్షితులు, తిరుమ‌ల విజివో ‌బాలిరెడ్డి, ఎవిఎస్వో  గిరిధ‌ర్‌, వేద పాఠ‌శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2022-04-06 12:14:23

రాష్ట్రంలోనే తొలి భూగర్భ విద్యుత్ సరఫరా ఒంగోలులోనే..

ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఒంగోలు నగరంలో రూ.56.74 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ సర్క్యూట్ భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇదే సందర్భంగా మరో రూ.23.79 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ కేబుల్ విద్యుత్ లైన్ల నిర్మాణానికి కూడా వీరు శంకుస్థాపన చేశారు.  అనంతరం మంగమూరు రోడ్డులో ప్రత్యేక పైలాన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒంగోలు ప్రజల కల నేడు నెరవేరిందని అన్నారు. హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా గతంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం ఇళ్ల పైనుంచి వెళ్తున్న ఈ హైటెన్షన్ వైర్లను  త్వరలోనే తొలగించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని  మంత్రి ఆదేశించారు. ఈ చర్య ద్వారా 33, 34, 35, 36 డివిజన్లలోని ప్రజలకు ఇబ్బందులు తొలగాయని అన్నారు.  నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, ఈనెల 15వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ తిరుగుతామని మంత్రి చెప్పారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఒంగోలు నగర ప్రజల ఇబ్బందులను తొలగించేలా పోతురాజు కాలువను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ పనుల్లో ఇప్పటికే 25 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఒంగోలు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.409 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, వీటికి సంబంధించిన టెండర్లను త్వరలోనే ఇస్తామని చెప్పారు.

 ప్రతిరోజు పగటివేళ తాగునీరు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన రోడ్లలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ.180 కోట్లతో రిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొస్తున్నట్లు చెప్పారు. కొత్తపట్నంలో రూ.400 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబోతున్నామని, వీటికి సంబంధించిన టెండర్ల  ప్రక్రియను పూర్తి చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, గ్రోత్ సెంటరులో సుమారు 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా సాఫ్ట్ వేర్ కంపెనీ త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. సంక్షేమం తో పాటు అభివృద్ధికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో 24వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోగా, కోర్టు కేసుల వల్ల జాప్యం జరిగిందని, వీటిని పరిష్కరించి పేదలకు త్వరలోనే పట్టాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ముప్పు తొలగిన స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

 కర్నూలు రోడ్డులో ఉన్న ట్రాన్స్ కో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె.వి.మురళి, ట్రాన్స్ కో  జె.ఎం.డి. మల్లారెడ్డి, ఎస్.ఈ. రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.  నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, మాధవ రావు, ట్రాన్స్ కో ఎస్.ఈ. రామచంద్రారెడ్డి, ఓడీఈ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.   దీనికి ముందుగా కొప్పోలు ఫ్లై ఓవర్ నుంచి కర్నూల్ రోడ్డు వరకూ ద్విచక్రవాహనాలతో స్థానికులు ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. కేసవరాజు కుంట, బాలినేని భరత్ కాలనీ, గోపాల నగర్, గోపాల్ నగర్ మినీ బైపాస్ రోడ్డు లో రూ.2.04 కోట్ల విలువైన రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నెహ్రూ నగర్ పార్కును ప్రారంభించారు. 

Ongole

2022-04-06 12:10:22

ఆ వాలంటీరును విధుల నుంచి తొలగించండి..

విధి నిర్వ‌హ‌ణ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించిన వార్డు వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్  ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ప‌ట్ట‌ణంలోని రాజీవ్‌న‌గ‌ర్ కాల‌నీలోని 34 వ స‌చివాల‌యాన్ని, కానుకుర్తివారి వీధికి చెందిన 10 వ నెంబ‌రు స‌చివాల‌యాన్నిజిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా సిబ్బంది, వ‌లంటీర్ల హాజ‌రు ప‌ట్టిక‌ను ప‌రిశీలించారు. 34 వ స‌చివాల‌యం ప‌రిధిలోని 16వ క్ల‌ష్ట‌ర్ వ‌లంటీర్ కు కేవ‌లం 33 శాతం హాజ‌రు మాత్ర‌మే ఉండ‌టంపై మండిప‌డ్డారు. వెంట‌నే ఆ వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని ఆదేశించారు.  విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తే, ఎవ‌రినైనా ఉపేక్షించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. జ‌గ‌నన్న ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ నెలాఖ‌రునాటికి మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని, ముందుకురాని ల‌బ్దిదారుల ఇళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. ఓటిఎస్ ప‌థ‌కంపై సిబ్బందిని ప్ర‌శ్నించారు. రిజిష్ట్రేష‌న్లు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సూచించారు. పిల్ల‌ల‌కు, గ‌ర్భిణిల‌కు ర‌క్త ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆరా తీశారు. హెమోగ్లోబిన్ శాతం చాలా త‌క్కువ‌గా ఉన్న‌వారిపై ప్ర‌త్యేక దృష్టిపెట్టి, పోష‌కాహారాన్ని అందించాల‌ని సూచించారు. ముఖ్యంగా నెల‌నెలా పంపిణీ చేస్తున్న‌రేష‌న్ బియ్యాన్ని వినియోగించ‌డం ద్వారా, ర‌క్త‌హీన‌త‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని అన్నారు. పాఠ‌శాల‌ల్లో అమ‌లు చేస్తున్న‌ మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం మెనూను త‌ర‌చూ త‌నిఖీ చేయాల‌ని సిబ్బందికి క‌లెక్ట‌ర్‌ సూచించారు.

విజయనగరం టౌన్

2022-04-06 12:04:04

ఎస్సీ కార్పోరేషన్ ఈడీగా కామేశ్వర్రావు..

విజయనగరం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా జి. కామేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీకార్పోషన్ ద్వారా అందే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ఎస్సీలకు అందించడంలో శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని చెప్పారు.  ఈయన ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కార్పరేషన్ ఈ.వో. పని చేసి పదోన్నతిపై జిల్లాకు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

Vizianagaram

2022-04-06 12:00:41

181 కేంద్రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..

ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వ‌రకు జ‌రిగే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను 181 కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు తెలిపారు. ఈ మేర‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి జిల్లాల‌కు సంబంధించిన‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ప్రక్రియ‌ ఇక్క‌డి నుంచే జరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌ల‌ను ప్రశాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జ‌ర‌గ‌బోయే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఏర్పాట్ల‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో ఆయ‌న క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో బుధ‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అనుస‌రించాల్సిన విధి విధానాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. రెగ్యుల‌ర్‌, సార్వ‌త్రిక విద్యాపీఠం నుంచి మొత్తం 29,567 మంది విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని ఈ మేర‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. మారుమూల కేంద్రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని ఆర్టీసీ అధికారుల‌కు సూచించారు. వేస‌విని దృష్టిలో పెట్టుకొని తాగునీటి స‌దుపాయం, వైద్య స‌దుపాయాలు క‌ల్పించాల‌ని చెప్పారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని స‌బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్త‌కుండా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు. ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా,  ఇబ్బందులు త‌లెత్త‌కుండా విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని చెప్పారు. పోలీసు, రెవెన్యూ శాఖ‌ల వారు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి 144 సెక్ష‌న్ ను ప‌టిష్టింగా అమ‌లు చేయ‌టం ద్వారా శాంతియుత‌మైన వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అలాగే ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థులు త‌ప్ప‌కుండా బ‌స్ పాస్‌లు తీసుకురావాల‌ని డీఆర్వో స్ప‌ష్టం చేశారు.

విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం డీఈవోలు జ‌య శ్రీ‌, ర‌మ‌ణ మాట్లాడుతూ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప‌లు అంశాల‌పై సూచ‌న‌లు చేశారు. జిల్లాలో మొత్తం 181 కేంద్రాల్లో ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వ‌రకు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయన్నారు. రెగ్యులర్ వారు 29,561 మంది ప్ర‌యివేటు వారు ఆరుగురు మొత్తం 29,567 మంది ప‌రీక్ష‌లకు హాజ‌ర‌వుతున్నార‌ని వివ‌రించారు. రెగ్యుల‌ర్ వారికి ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల వ‌ర‌కు ప్ర‌యివేటు వారికి మ‌ధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో ఓపెన్ ఇంట‌ర్మీడియ‌ట్ వారికి మే 7 నుంచి 21వ తేదీ వ‌రకు ఉద‌యం 9.00 నుంచి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు థియ‌రీ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు. మే 24 నుంచి 28వ తేదీ వ‌ర‌కు ఓపెన్ ఇంట‌ర్ విద్యార్థులు ప్రాక్టిక‌ల్స్ ఉంటాయ‌ని వివ‌రించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి సాంకేతిక ప‌రిక‌రాలు తీసుకురాకూడాదని స్ప‌ష్టం చేశారు.

స‌మావేశంలో డీఆర్వో ఎం. గ‌ణ‌ప‌తిరావుతో పాటు విజ‌య‌న‌గ‌రం డీఈవో ఎం. జ‌య శ్రీ‌, పార్వ‌తీపురం డీఈవో ఎస్.డి.వి. ర‌మ‌ణ‌, ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ల‌క్ష్మి, ఆర్టీసీ, పోస్ట‌ల్‌, విద్యుత్‌, రెవెన్యూ, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, వైద్యారోగ్య త‌దిత‌ర శాఖ‌ల నుంచి జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-04-06 11:37:57

టిటిడి సివిఎస్వోగా డి.నరసింహ కిషోర్..

తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా, భద్రతాధికారిగా  డి.నరసింహ కిషోర్ బుధ‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త‌ సివిఎస్వో  డి.నరసింహ కిషోర్‌ను ప‌దోన్న‌తిపై వెళ్ళుతున్న  గోపినాథ్ జెట్టి అభినందించారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. త‌రువాత‌ వేదపండితులు సివిఎస్వోకు వేద ఆశీర్వచనం అందించారు. ఆల‌య అధికారులు సివిఎస్వోకు శ్రీవారి చిత్ర‌ప‌ట్టంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు.

Tirumala

2022-04-06 10:59:48

ఈనెల 12న అప్పన కళ్యాణమహోత్సవం

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 12 న ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్టు  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వనితులు, జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈమేరకు బుదవారం సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న శ్రీను బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పారు. 12వ తేది రాత్రి 8.30 గంటలకు రదోత్సవం, అనంతరం కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు దేవస్థానం చేపట్టిందన్నారు. స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని ఈ సందర్భంగా శ్రీనుబాబు కోరారు.

Simhachalam

2022-04-06 10:50:32

గుర్తుకొస్తున్నాయంటూ 25ఏళ్ల తరువాత కలిసారు..

అరేయ్ పొట్టి, ఒరేయ్ చిట్టీ.. ఏంటే సత్య.. చెప్పవే లక్ష్మి.. అరేయ్ మామ.. ఒరేయ్ బావ.. అంటూ ఆ ప్రాంతమంతా ఒక్కటే కోలాహలం.. అంతలో దూరం నుంచి మైకులో పావురమా.. నీ ప్రేమ ఎంత మధురమూ అంటూ ఓ తీయని పాట.. ఏంటి ఇదంతా మీకు ఏదో సినిమా రిహార్సల్ ని తలిపిస్తుంది కదూ.. అలా అనుకుంటే మీరు కూడా 25ఏళ్లు వెనక్కి వెళ్లి మరీ అలోచించాలి..అవునండీ ఈ మాటలన్నీ 25 ఏళ్ల తరువాత ఒకేచోట కలిసిన విశాఖజిల్లా, గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం జెడ్పీ హైస్కూలు 1997వ బ్యాచ్ కి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలియక కార్యక్రమంలోనివి.. గుర్తుకొస్తున్నాయి పేరిట క్రిష్ణదేవీపేటలోని అల్లూరి సీతారామరాజు థీమ్ పార్కులో నాటి విద్యార్ధులంతా నేడు కలిసి చేసుకున్న ఆనంద సంబురం. చాలా సంవత్సరాల తరువాత పూర్వవిద్యార్ధులంతా కలిశారేమో వారంత ఒక్కసారిగా పదోతరగతి విద్యార్ధుల్లా మారిపోయి.. ఒరేయ్ ఎన్నేళ్లైందిరా నిన్నుచూసి..చాలా బాగా మారిపోయావ్.. నిన్ను చూసి గుర్తు పట్టలేకపోయాను కానీ..నీ పేరు మాత్రం గుర్తుంది.. ఏంటే నువ్వు అసలు నువ్వు నువ్వేనా..ఇంతలా మారిపోతావా..నేను గుర్తున్నానా నీకు మరిచిపోయావా.. అంటూ ఎంతో ఆనందంగా పలకరించుకొని, నాటి గురుతులను ఒక్కసారి నెమరు వేసుకుని ఎంతో ఆనందంగా గడిపారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5విద్యార్ధులు(పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), చిటికెల శ్రీనివాసరావు, ఎస్కే అసూన్, ఎర్రానాగేశ్వర్రావు, దుంగల నానాజీ), పడమట మురళి, శివంగి నూకరాజు,  యక్కల గ్రుహలక్ష్మి,  లగుడు చందన ఒక బ్రుందంగా ఏర్పడి,  ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు క్రియేట్ చేసి  85 మంది పూర్వ విద్యార్ధుల పేర్లు, ఫోన్ నెంబర్లు సేకరించారు. ఇదంతా చేయడానకి ఐదు నెలలు సమయం పట్టిందంటే అతిశయోక్తి కాదు. తమ మిత్రుల కోసం శ్రమించి కష్టపడీ మరీ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఎన్నో ఫోన్లు, మరెన్నో రాయబాలు, ఇంకెన్నో కబుర్లు పంపుకొని  వారంతా మొత్తానికి కలుసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత కలిసిన వారి కలియికకు ఎంతో తీపి గుర్తుగా ఉండిపోయేలా అల్లూరి సీతారామరాజు పార్కునే తమ ఆత్మీయ కలియకకు వేదిక గా ఎంచుకొని ఉదయం 10 గంటల సాయంత్రం 5 గంటల వరకూ ఎంతో సరదాగా, ఆనందంగా గడిపారు. కొంత మంది పూర్వ విద్యార్ధులు 25ఏళ్ల తరువాత కలవడంతో బావి భావోద్వేగానికి హద్దులు లేకుండా పోయాయి. తమ స్నేహితులందరికీ ఒకే చోట కలుసుకున్నారేమో..ఒక్కసారిగా ఆనందం తట్టుకోలేక  కంటతడి సైతం  పెట్టుకోవడం అందరినీ ఆలోచింపజేసింది. ఈ అపూర్వ కలయిక కోసం జడ్డంగి రమణ అనే తమ స్నేహితుడు చెన్నై నుంచి.. దుంగల నానాజీ పూనే నుంచి.. ఇలా ఒక్కొక్కరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ఇదే బ్యాచ్ కి చెందిన ఓ పూర్వవిద్యార్ధి ఇతర దేశంలోనూ, మరో విద్యార్ధి ఆర్మీలోనూ ఉండటంతో వారంతా ఈ కలయికను వీడియో కాల్ ద్వారా ఆశ్వాదించి ఆనందం పొందారు. చాలా కాలం తరువాత మిత్రులు కలవడంతో సరదగా కలిసి   ఫోటోలు, వీడియోలు, సెల్పీలు తీసుకొని తన ఆత్మీయ కలియికకు గుర్తులను మిగిల్చుకొని, మళ్లీ ఎప్పుడు కలుస్తామో అంటూ కొద్ది పాటి బాధను దిగమింగుకొని మరీ సాయంత్రం తిరుగు పయనమయ్యారు.   25ఏళ్ల తరువాత అందరూ ఒకే చోట కలిశారేమో వాళ్ల కలియిక మరపురోజుగా గుర్తుండిపోవడానికి గ్రామం మొత్తం స్వాగత, సుస్వాగతాల బోర్డులు, ఫ్లెక్సీలతో నింపేశారు. దీనితో క్రిష్ణదేవిపేటలో ఏదో జరిగిపోతుందనే హడావిడి 2 రోజుల నుంచే కనిపించేలా చేసి వారి ఆత్మీయ కలయికను అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవడంలో సఫలీక్రుతులు కావడంతోపాటు వాళ్ల తరువాత, ముందు చదువుకున్నవారందరికీ మంచి సందేశానివ్వడంతో పాటు మిగిలిన వారిలోనూ పూర్వివిద్యార్ధులంతా కలవాలనే ఆశను రేపారు. కార్యక్రమంలో 1997 బ్యాచ్ కి చెందిన 10వ తరగతి పూర్వవిద్యార్ధులు 138 విద్యార్ధులకు గాను 85 మంది విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Krishnadevipeta

2022-04-04 06:49:38

చిత్తూరు సమాచారశాఖ డిడిగా బి.పద్మజ..

చిత్తూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా బి .పద్మజ  అదనపు బాధ్యతలు గురువారం సాయంత్రం స్వీకరించారు. ఇప్పటివరకు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన ఐ.ఆర్. లీలావతి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం తిరుపతి,తిరుమల సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న బి .పద్మజ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆమె ఐ ఆర్ లీలావతి నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది డిడిని మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Chittoor

2022-03-31 13:31:18

ఘనంగా శిష్టకరణం యువత ఉగాది వేడుకలు..

విశాఖ పౌర గ్రంథాలయంలో ఉగాది వేడుకలు అనే పేరుతో బాలబాలికల చే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం వారికి బహుమతులు అందజేసే కార్యక్రమాన్ని  శిష్టకరణం యువత వెల్ఫేర్ సొసైటీ ఎంతో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి కూచిపూడి నాట్యం శ్రీ సాయినాథ్ కళాసమితి నిర్వాహకులు పక్కి అరుణ్ కుమార్ సాయి నేతృత్వంలో విభిన్నమైన కూచిపూడి నృత్యాలు చిన్నారులు వేసి ఆహుతులను మైమరిపించారు. థియేట్రికల్ ఆర్ట్స్ అధినేత నాగరాజు పట్నాయక్ నేతృత్వంలో చిన్నారుల బృందం వివిధ జానపద నృత్యాలను ప్రదర్శించి ప్రపంచంలోని వివిధ దేశాల జానపద నృత్య రీతులను కళ్లకు కట్టినట్లు చూపించారు. వచ్చిన ఆహుతులు సభా వేదిక మీద ఉన్న ప్రత్యేక అతిథులు శిష్టకరణం చిన్నారులు చూపిన ప్రతిభ ను అద్భుతంగా ఉందని అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన శిష్టకరణం యువత బృందాన్ని ప్రత్యేకంగా అభినందించాలని ఎందుకు అంటే చిన్నారుల్లో ఉండే కళలను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఆ కళల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి చేరుతారని ఈ విధంగా కృషి చేస్తున్నాను మానాపురం సురేష్ కుమార్ ని తప్పక అభినందించాలని వక్తలు ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసి కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ శిష్టకరణం యువత ప్రారంభించి రెండు సంవత్సరాల నప్పటికీ ప్రతి నెలా ఏదో సేవా కార్యక్రమం   చేస్తూ ఎందరో కళాకారులను ప్రోత్సహిస్తున్నారని అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఆదుకున్నారని ఈ విధంగా నిరంతరం కార్యక్రమాలు చేసే మానాపురం సురేష్ కుమార్ ని తప్పక అభినందించాలని కులం పట్ల సంఘం పట్ల ఎంతో నిబద్ధతతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు యువత బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో  సంఘానికి సేవ చేస్తున్న ఉమామహేశ్వర రావుని డబ్బీరు శ్రీకాంత్ ని పక్కి అరుణ్ సాయి కుమార్ ని నాగరాజు పట్నాయక్ , జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని శిష్టకరణం యువత అధ్యక్షులు సదాశివుని రమ శంకర్రావు సురేష్ కుమార్ ల సారథ్యంలో లో ఘనంగా నిర్వహించేందుకు సభ్యులందరూ వీరిని అభినందించారు వీటి ద్వారానే మరిన్ని కార్యక్రమాలు సమాజంలో జరపాలని చిన్నారులను ప్రోత్సహించాలని రమా శంకర్రావు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

Visakhapatnam

2022-03-29 15:06:24

ఘనంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉగాది వేడుకలు..

సమాజానికి నిలువెత్తు అద్దం పాత్రికేయులేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళ వారం ఉదయం నుండి సాయంత్రం వరకు సింధూర ఫంక్షన్ హాల్ లో స్మార్ట్ సిటి రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి.  మిలీనియం సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సి.ఈవో  జి.శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. ముందుగా పిళ్లా శర్మ పంచాంగ పఠణంతో ఉగాది సంబరాల కార్యక్రమం
ప్రారంభమైంది. ముఖ్య అతిధులకూ సభ్యులకూ ఆయన పండిత ఆశీర్వాదం అందజేశారు. కార్యక్రమానికి ఈటీవీ ఫేమ్ ఎమ్మెస్సార్ నాయుడు, సీనియర్ జర్నలిస్ట్ పద్మజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధురవాడ జాతర  ప్రాంతంలోని ప్రముఖ నాట్యాచార్యులు మురళి గోవింద్ నిర్దేశకత్వంలో చిన్నారులు శాస్త్రీయ జానపద నృత్య రీతులను ప్రదర్శించారు. జర్నలిస్ట్ లీలా ప్రసాద్ మిమిక్రీ తో, దేవీ ప్రసాద్ జానపద గీతాలతో అలరించారు.  కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు శ్రీమతులు పద్మజ, ప్రసన్న, శిరీష, మాణిక్యాంబ, రోజ, సంధ్య, వెంకటలక్ష్మి, జ్యోతి లతో పాటు శ్రీయుతులు ఎమ్.వి.ఎస్ అప్పారావు, ఆదినారాయణ, సూరిబాబు, రంగధామ్, ఈశ్వరరావు, అబ్బిరెడ్డి చంద్రశేఖర్, బాలు పాత్రో, ఎస్.ఎస్.నాయుడు, ఎం.పి.ఎ.రాజు, ఎం.లక్ష్మణ్ యాదవ్, జోగ శ్రీనివాసరావు, రిషికేష్, ఎల్లాజీరావు, ఎన్. 
అశోక్ రెడ్డి, లీలా ప్రసాద్, మోహనరావు లకు ఉగాది పురస్కారాలను ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా వేదికపై ముఖ్యఅతిథిగా పాల్గొన్న మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సి.ఈ.వో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మెరుగైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని అభినందించారు.  జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో అశోక్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం విశేషంగా కృషి చేస్తుందని అభినందించారు. హుదూద్ కాలం లోనూ, కరోనా కష్ట పరిస్థితుల్లోనూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అండగా నిలిచిన తీరు ఆదర్శంగా ఉందని శ్రీధర్ రెడ్డి భావించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తరపున తాను ఈకార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ఆయన వెళ్లడించారు. సమాజ సేవలో అహర్నిశలు కృషి చేస్తుండే జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఉండాలనే ఎమ్.పి విజయసాయి రెడ్డి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. అన్ని వేళల జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఈసందర్భంగా మిలీనియం సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సి.ఈవో శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. జి.వి.ఎమ్.సి మాజీ డిప్యూటీ మేయర్ రంగస్థలం సంస్థల కళాకారుల ప్రోత్సాహకులు దాడి సత్యనారాయణ గౌరవ అతిథిగా ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారంతోనే సమాజంలో పలువురు గుర్తింపును గౌరవాన్ని జనాదరణనూ పొందుతున్నారని పేర్కొన్నారు.  అందులో తాను ఉన్నానని చెబుతూ జర్నలిస్టులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని వేళలా జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులకు కళాకారులకు ఎటువంటి సేవలైన అందించేందుకు అయినా తాను సిద్ధంగా ఉంటానని ఆయన వెల్లడించారు. ఇదే వేదిక పై సీనియర్ జర్నలిస్టులు నాగన బోయిన నాగేశ్వరరావు, అప్పారావుపాత్రుడు.,  కె.చంద్రమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టులు పూర్తిస్థాయిలో తమ సమయాన్ని సమాజానికి ఉపయోగపడే సేవలులో నిమగ్నమై ఉంటామని వెల్లడించారు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు హుధుద్ సమయంలోనూ, కరోనా సమయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో కొందరు జర్నలిస్టులు ప్రాణాలను సైతం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ అసోసియేషన్ తరపున అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ సభ్యులైన ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సేవలను అందించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు ఇలా  పలు విధాలుగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు అశోక్ కుమార్ అండగా నిలిచారని గుర్తు చేశారు. సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ తరపున అందించే ప్రతి సేవా కార్యక్రమంలో ఎందరో అందిస్తున్న సహాయ సహకారాలు ఉన్నాయన్నారు.  అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులకు సహాయపడడంలో  దొరికే ఆనందం మాటలతో చెప్పలేనిది అన్నారు.  తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న దాతలు పోలీసులు సామాజిక సంఘ సేవ ఆసక్తి పరులు, రాజకీయ పక్షాలు ఇతరులు అందరికీ అసోసియేషన్ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. నిబద్ధత క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవసరమైన నిధులను సమకూర్చుకొని అవసరమైన అన్ని సేవలను అందించగలిగితే తమ లక్ష్యం నెరవేరినట్లేనని ఈసందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్యంగారు అశోక్ కుమార్ వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో సభ్యులైన వారికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి స్వీట్స్ నిత్యావసర సరుకులు వంటివి అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. హాజరైన సభ్యులకు ఉగాది పచ్చడి  విందు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఏ సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-03-29 12:49:09

డా.బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం..

విజయనగరం జిల్లాలోని డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ గురుకుల విద్యాల‌యాల్లో 5వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌లో ప్ర‌వేశాల‌కు అర్హులైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. ఈ ప్ర‌వేశాల‌కు సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను సోమ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, 2022-23 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి జిల్లాలోని 10 గురుకులాల్లో ప్ర‌వేశాల కోసం ఈనెల 31లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. 4వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు ఐదో త‌ర‌గ‌తిలో, ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు ఇంట‌ర్‌లో ప్ర‌వేశానికి, ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. అంబేద్క‌ర్ గురుకుల విద్యాల‌యాలు బాలుర‌కు చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల‌, వియ్యంపేట‌, వేపాడ‌, కొమ‌రాడ‌, గ‌రుగుబిల్లి, బాలిక‌ల‌కోసం బాడంగి, కొప్పెర్ల‌, సాలూరు, పార్వ‌తీపురంలో ఉన్నాయ‌ని తెలిపారు. వీటిలో ప్ర‌వేశాల‌కు  వ‌చ్చేనెల 24న ప్ర‌వేశ‌ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని తెలిపారు. వివ‌రాల‌కోసం స‌మీపంలోని అంబేద్క‌ర్ గురుకుల పాఠ‌శాల‌, నెట్ సెంట‌ర్ లేదా ఫోన్ నెంబ‌ర్ 8333033434 కు సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు. ఈ క‌ర‌ప‌త్రాల‌ ఆవిష్క‌ర‌ణ‌ కార్య‌క్ర‌మంలో గురుకుల విద్యాల‌యాల జిల్లా స‌మ‌న్వ‌యాధికారి బ‌ల‌గ చంద్ర‌వ‌తి, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-03-28 13:25:54

భక్తుల కొంగు బంగారం శ్రీ కనకమహాలక్ష్మీ..

భక్తుల కొరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారు పేరుగాంచారని విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ రెవెన్యూ (డిసిఆర్‌) పి.నల్లనయ్య రూపొందించిన భక్తిపాటల సిడీని రామ్మోహన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవార్లు మహిమలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇటువంటి సిడీలు రూపొందించడం అభినందనీయమన్నారు. నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో పలు దేవాలయాల చరిత్రలను తెలియజేసే విధంగా నల్లనయ్య  భక్తి గీతాల సీడిలను తీసుకురావడం ప్రశంసనీయమన్నారు. ఒక వైపు విధులు నిర్వహిస్తునే మరో వైపు ఆధ్యాత్మిక భక్తి భావాల్లో ముందుకు సాగడం చాలా అభినందనీయమని నల్లనయ్య ప్రతిభను కొనియాడారు. విశిష్ట అతిథిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఇప్పటికే శ్రీకూర్మం,రామతీర్థం, సింహచలం పుణ్యక్షేత్రాలకు సంబంధించి చరిత్రలను భక్తి గీతాల రూపంలో అనువదించిన నల్లనయ్య ఇప్పుడు కనకమహాలక్ష్మీ  ఆలయ చరిత్రను తెలియజేసే విధంగా సిడీని తయారు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత పల్లి లక్ష్మీ,  శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్ధానం చైరపర్సన్‌ కొల్లి సింహాచలం, ట్రస్టీలు వంకయాల మూరుతి ప్రసాద్‌, బుద్దల అనురాధ, మాతా రికార్డింగ్‌ చైర్మన్‌ పల్లి నాగభూషన్‌, కలియుగ బిరుదుకాంతిడు బిన్నాల నరసింహమూర్తి, గాయకులు శాంతి వేణుమాధవ్‌, శ్రీలత, సంగీతం వేణుమాధవ్‌చ సిఎస్‌ఎస్‌ మురళీ పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-03-27 13:53:06