గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రతిభ అవార్డులకు శంఖవరం మండలకేంద్రంలోని గ్రామసచివాలయం-1 మహిళా పోలీస్ జిఎన్ఎస్.శీరిష ఎంపికయ్యారు. పెద్దాపురంలోని జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ఈఅవార్డును ఉన్నతాధికారుల ద్వారా స్వీకరించనున్నారు. ఈమెకు అవార్డు రావడంపట్ల సహచర మహిళా పోలీసులు పిఎస్ఎస్. కళాంజలి, నాగమణి, గౌతమి, చిన్నారి, రజియాసుల్తానా, సచివాలయ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, జేఏబీసి రమణమూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్, డిజిటల్ అసిస్టెంట్ జనార్ధన్, సర్వేయర్ సురేష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు హర్షం వ్యక్తం చేశారు.