1 ENS Live Breaking News

అప్పన్నకు టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోఆర్డినేటర్ పూజలు

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చీఫ్ కోఆర్డినేట్ఇంగ్ ఆఫీసర్ బుద్ధా చంద్రశేఖర్  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి ముందుగా కపస్తం ఆలింగణం, తదుపరి స్వామి వారి దర్శనం అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. వారికి ఆలయ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమందో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2023-02-03 11:25:13

రేవుపోలవరం తీరాన్ని పరిశీలించిన ఏఎస్పీ

మాఘపౌర్ణమి తీర్ధమహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏఎస్పీ కె.ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. యస్.రాయవరం మండలం రేవుపోలవరంలో ఆదివారం జరిగే మాఘాపౌర్ణమి సందర్భంగా ఏఎస్పి సీఐ నారాయణరావు రేవుపోలవరం 
తీరాన్ని స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, భక్తులకు ప్రమాదవసాత్తు సముద్రంలోకి వెళ్లినా ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్ళు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కొత్త రేవుపోలవరం సర్పంచ్ మల్లె లోవరాజు, సోషల్ మీడియా కన్వీనర్ చేపల రాజు, పంచాయతీ సెక్రటరీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

Revupolavaram

2023-02-03 09:52:49

క్యాన్సర్ ను ప్రాధమిక దశలోనే గుర్తిస్తే మంచిది

ప్రస్తుత అనారోగ్య వాతావరణం, కాలుష్యం తదితర కారణాలతో విస్తరిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ఒకటని దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే జీవిత కాలాన్ని పెంచడంతోపాటు పూర్తిగా నయం చేయవచ్చని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో ఐడిఏ కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ వెదురుపాక సతీష్ అధ్యక్షతన జరిగిన కేన్సర్ అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. క్యాన్సర్ అంటే మన ఒంట్లో ఏదో ఒక అవయవంలో జీవకణాలు విజృంభించి అదుపు ఆజ్ఞ లేకుండా పుంకాను పుంకాలుగా పుట్టుకు వస్తూ గడ్డల్లా పెరగడం అన్నారు. స్త్రీలలో  గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనబడుతున్నాయని అన్నారు  స్త్రీ పురుషులలో గొంతు, నోరు దవడలు, స్వర పేటిక క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఆహార నియమాలతో పాటు శారీరక వ్యాయామం అవసరమని అన్నారు. ఇది అంటువ్యాధి కాదని  కొన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ రాజు, అడబాల రత్న ప్రసాద్ ,రేలంగి బాపిరాజు, చింతపల్లి సుబ్బారావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Ramanayapeta

2023-02-03 09:23:11

ఆపరేషన్ పరివర్తన 2.0 జీవితాలను మారుస్తోంది

గతంలో నాటుసారా వ్యాపారాలు చేసి మానేసిన వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన జీవనోపాది పథకం ద్వారా బాధితుల జీవితాలు మెరుగు పడుతున్నాయని ప్రత్తిపాడు ఎస్ఈబీ సిఐ పి.అశోక్ అన్నారు. ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమంలో భాగంగా శంఖవరం మండలం నెల్లిపూడి పంచాయతీలో గురువారం పిల్లా జనార్ధనరావు అనే పాత సారావ్యాపారస్తుడు కొత్తగా ప్రారంభించిన ఉపాది యొక్క స్థితిగతులను మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నరాల శ్రీనివాసరావు, సచివాలయ మహిళా పోలీస్ పిఎస్ఎస్.కళాంజలితో కలిసి నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, శంఖవరం మండలంలో ఇద్దరు సారావ్యాపారులకు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రుణాలు మంజూరు చేసిందన్నారు. వాటితో వారంతా పాత వ్యాపారాలకు స్వస్థి చెప్పి కొత్త జీవితాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. నెల్లిపూడిలోని నేరస్తుడు కూడా కొబ్బరి నూనె వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడని తెలియజేశారు. అదేవిధంగా నాటుసారా వ్యాపారాలు చేసేవారు కూడా ఈయనలా మార్పుతెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ఓ.దుర్గాదేవి, గ్రామ పెద్దలు నరాల తాతబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. 

Nellipudi

2023-02-02 14:24:25

గ్రామసచివాలయాల్లో కంపోస్టు ఎరువుల విక్రయాలు

చెత్త నుంచి నుంచి తయారు చేసిన కంపోస్టు ఎరువును సంపదగా మార్చే కార్యక్రమానికి శంఖశరం గ్రామసచివాలయం శ్రీకారం చుట్టింది. మండల కేంద్రంలోని చెత్త నుంచి సంపద కేంద్రాల ద్వారా తయారు చేసిన కంపోస్టు ఎరువును కిలో రూ.1‌0 చొప్పున అమ్మాలు చేస్తున్నట్టు సచివాలయ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, రైతులు, గృహాల్లో పెరటి తోటలు పెంచేవారికి ఈ ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వానపాముల ద్వారా తయారుచేసిన ఈ ఎరువుల ద్వారా భూమికూడా సారవంతం అవుతుందని, సేంద్రియ వ్యవసాయానికి చక్కగా పనిచేస్తుందని అన్నారు. ఎవరికి ఎంతమేరకు ఎరువు కావాలన్నా సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నామని మూడు సచివాలయాల్లో వీటని అందుబాటులో ఉంచామన్నారు. సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జెఏబీసి రమణమూర్తి, సచివాలయ వాలంటీర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2023-02-02 13:33:30

ప్రజలకు చేరువయ్యేందుకే గడపగడపకూ ప్రభుత్వం

కాకినాడ 7వ డివిజన్‌లో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గురువారం  గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. రేచర్లపేట లో ఈ కార్యక్రమాన్ని  ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు గడపగడపకు ప్రభుత్వం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారన్నారు.  ప్రజలు చెప్పిన సమస్యలను ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా ప్రతి సచివాలయానికి  20 లక్షల రూపాయలు చొప్పున నిధులు కూడా ముఖ్యమంత్రి కేటాయించారన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన ఇటువంటి ముఖ్యమంత్రి అధికారంలో కొనసాగితేపేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు, మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్నసాగర్, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, పలువురు అధికారులు,  నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిఈ మాధవి, ఎంహెచ్‌వో డాక్టర్‌ ఫృద్వీచరణ్, టి పి ఆర్ ఓ మానే కృష్ణమోహన్, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి తొంపల తాతారావు, మాజీ కార్పొరేటర్‌లు నల్లబిల్లి సుజాత, కర్రిశైలజ, సిగల మధు, స్థానిక నాయకులు బత్తినరాజు, నందకుమార్,  దౌర్ల సుశీల తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2023-02-02 13:17:02

పారదర్శకంగా రీ-సర్వే .. కమిషనర్ రమేష్

జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం క్రింద చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కే. రమేష్ కోరారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో గురువారం అడ్మిన్ సెక్రటరీలు, ప్లానింగ్ కార్యదర్శులు, రెవెన్యూ సెక్రటరీలతో ఈ అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి డి ఎం ఏ నుంచి 16ఎ ఫార్మేట్ లో వచ్చిన ఆదేశాల అమలుపై సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా అసెస్మెంట్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని సర్వే నెంబర్ కు అనుసంధానం చేయాల్సి ఉంటుందన్నారు.  ఈ ప్రక్రియను 15 రోజుల వ్యవధిలో పూర్తిచేసేలా  సిబ్బంది, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ సర్వే వల్ల ఎన్నో భూ వివాదాలకు, సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని  అర్బన్ రీసర్వే ప్రక్రియను అత్యంత ప్రణాళిక బద్దంగా, పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, ఏసీపి నాగశాస్త్రులు, టౌన్ సర్వేయర్ ఆచారి, ఆయా సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Kakinada

2023-02-02 13:13:00

సైబర్ నేరాలపై విద్యార్ధులకు అవగాహన అవసరం

సైబర్ నేరాలపై పాఠశాల విద్యార్ధులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని గ్రామసచివాలయ మహిళాపోలీస్ జిఎన్ఎస్.శిరీష సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ హైస్కూలులోని విద్యార్ధులకు సైబర్ నేరాలు, వాటి రకాలు, తీసుకోవాల్సిన జగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్ధులు ముఖ్యంగా ఆన్లైన్ లో డబ్బులుపెట్టి ఆడేఆటలకు దూరంగా ఉండాలన్నారు. ఆసమయంలో వచ్చే ఫోన్ చేసి మాట్లాడేవారికి ఓటీపీలు, బ్యాంకు ఖాతాల నెంబర్లు, ఆధార్ నెంబర్లు చెప్పకూడదన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి లక్కీడిప్ లో ప్రైజులు వచ్చాయని చెప్పే కల్లబొల్లి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా గుచ్చి గుచ్చి అడిగినా ఎందుకు సమాధానం చెప్పాలని గట్టిగా గద్దించాలని, లేదంటే ఈనెంబరుతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని దైర్యంగా  చెప్పాలన్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా విద్యార్ధులే తెలిసేలా చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.

2023-02-02 12:30:55

ప్రభుత్వ పథకాల్లోని సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి

గ్రామ సచివాలయాల్లోని సంక్షేమ, విద్యా సహాయకులు ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తుని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి పిఎన్వి.సత్యన్నారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన శంఖవరం మండల కేంద్రంలోని గ్రామసచివాలయం-1ను ఆకస్మికంగా తనిఖీచేశారు. నవరత్నాల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వపథకాల లబ్దిదారుల జాబితా, వెల్ఫేర్ అసిస్టెంట్ దివాకర్ నోటీసు బోర్డుల నిర్వహణను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పర్యవేక్షణ చేస్తున్నట్టు చెప్పారు. అర్జీదారుల నుంచి వస్తున్న సమస్యల దరఖాస్తులను తక్షణమే పరిస్కారంకోసం జిల్లాకేంద్రానికి పంపిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రికార్డులన్నీ సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఆయనతోపాటు  సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2023-02-02 12:16:58

గ్రామకంఠం ఆక్రమణలపై సమగ్ర సర్వేచేయిస్తాం

నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామం పెద్దవీధిలో మురుగునీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చేస్తామని తహసిల్దార్ నీరజ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలోని మురుగునీటి పరిష్కారం కోసం తక్షణమే సర్వే చేయమని సర్వేయర్ ను ఆదేశించినట్టు తెలిపారు. పెద్ద వీధిలో ఆక్రమణలకు గురైన గ్రామకంఠం భూమిని గుర్తించేందుకు సర్వే చేయమని డిపివో ఆదేశించినట్టు వివరించారు. సర్వే జరిపి నివేదికను కలెక్టర్, డీపీవోకు అందజేస్తామని తహసిల్దార్ నీరజ చెప్పారు. సర్వే అనంతరం ఎంత మేర ఆక్రమణలున్నాయో నివేదికలో తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

Nakkapalli

2023-02-01 05:21:56

అరకువేలికి ఆర్టీసీబస్సు సౌకర్యాలను మెరుగుపరచాలి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకువేలి పేరుకే పార్లమెంటు నియోజకర్గంగా మాత్రమే ఉందని..ఈ ప్రాంతాల్లోని గ్రామాలకు పూర్తిస్థాయిలో బస్సుసౌకర్యం కూడా లేదని జనసేన అరకువేలి పార్లమెంటు ఇన్చార్జి వంపూరు గంగులయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం అరకులోయలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో అరకువేలి ప్రాంతం పర్యాటప్రాంతంగా మరింతగా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యాన్ని మెరుగు పరచాల్సిన అవసరం వుందన్నారు. తద్వారా పర్యాటకులు ఈ ప్రాంతానికి విరివిగా రావడానికి ఆస్కారం వుంటుందని, స్థానిక నిరుద్యోగ గిరిజనులకు కూడా ఉపాది దొరుకుతుందన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి నిత్యం గిరిజన రైతులు కూరగాయలు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలకు సరఫరా చేయడానికి కూడా ఆస్కారం వుంటుందన్నారు. ఈ విషయమై త్వరలోనే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ని కలిసి రవాణా పరిస్థితిని తెలియజేస్తానని వివరించారు. ప్రభుత్వం ఈ ప్రాంత గిరిజనుల సౌకర్యార్ధం రవాణా విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గంగులయ్య డిమాండ్ చేశారు.

Araku Valley

2023-02-01 04:44:06

ఏకగ్రీవంగా చింతపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గం

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మంగళవారం జరిగిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు సిహెచ్బిఎల్ స్వామి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రకటించారు. చింతపల్లి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు దయానంద్, చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీష్, ఎలక్ట్రానిక్ మీడియా  అసోసియేష న్ అధ్యక్షుడుగా వనరాజులు ఉన్నారు. అంతకు ముందు ఏపీయూడబ్ల్యూజే చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ చింతపల్లి ఏరియా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, మాజీ జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు చందర్రావు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ చింతల కిషోర్, జిల్లా అధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Chintapalle

2023-01-31 15:46:25

అల్లూరిసీతారామరాజు జిల్లా డిఆర్ఓగా పి.అంబేద్కర్

అల్లూరి సీతారామరాజుజిల్లా డిఆర్ఓగా పి.అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డిఆర్ఓ బి. దయానిది సెలవుపై వెళ్లడంతో అంబేద్కర్ కుపూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన గతంలో చింతపల్లి తహాసిల్దారుగా కూడా పనిచేశారు. కలెక్టరేట్ లోని అధికారులు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Paderu

2023-01-31 15:14:11

శంఖవరం మండలంలో ఐదు గ్రామాల్లో రీసర్వే

శంఖవరం మండలంలో ఐదు గ్రామాల్లో భూముల రీసర్వే పనులు వేగంగా జరుగుతున్నాయని పెద్దాపురం ఆర్డీఓ సీతారామ్ తెలియజేవారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలో ఆయన తహశీల్దార్ సుబ్రహ్మణ్యంతో కలిసి  సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. అన్నవరం, ఆరెంపూడి, కత్తిపూడి, వెంకటాపురం, జగ్గంపేట ప్రాంతలో ఈ సర్వే జరుగుతుందన్నారు. మండల సర్వేయర్లతోపాటు తుని నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సర్వే చేస్తున్నట్టు పేర్కొన్నారు. నాలుగు గ్రామాల్లో గ్రౌండ్ స్క్రూట్నీ దశలో ఉన్నాయని అన్నవరంలో మాత్రం గ్రౌండ్ వేలిడేషన్ దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. 

Sankhavaram

2023-01-31 14:32:24

పొలంబడిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్రప్రభుత్వం దిగుబడులను పెంచే లక్ష్యంతో రైతులకు యాజమాన్య పద్దతులపై నిర్వహించే డా.వైఎస్సార్ పొలంబడి కార్యక్రమాన్ని రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్ ఆఫీసర్ మధు పేర్కొన్నారు. మంగళవారం కె.కోటపాడు మండలం వారడ గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. వ్యవసాయంలో పాటిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం పొలం బడి జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.  జిల్లా పొలంబడి కోఆర్డినేటర్ చిరంజీవి, అనకాపల్లి డాట్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రదీప్, అనకాపల్లి డిఆర్సి ఏవో తులసీమణి, అగ్రీ అసిస్టెంట్ పూజిత కళ్యాణి పాల్గొన్నారు.

కె.కోటపాడు

2023-01-31 14:26:56