1 ENS Live Breaking News

స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం..

స్పందన లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలని నర్సీప ట్నం ఇంఛార్జి ఆర్ డీ వో అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్య క్రమాన్ని నిర్వహించారు.డివిజన్ స్థాయిలో గల పలు మండలాల నుండి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆర్ డీ వో కు విన్నవించుకొన్నారు. ఈ సందర్భంగా ఆర్ డీ వోమాట్లాడుతూ ఫిర్యాదు దారుల సమస్యలనుపరిష్కరించడానికే స్పందన కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని, పిటిషన్లు ను సంబంధిత శాఖల అధికారులకు  పరిశీలనా నిమిత్తం పంపి సత్వర పరిష్కారం చేయడానికి ఆదేశించడం జరుగుతుందన్నారు. నేడు స్పందన లో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలపై రాగా, రేషన్ కార్డులు,హౌసింగ్ కు సంబంధించి దరఖాస్తులు వచ్చాయన్నారు. 23  ఫిర్యాదులను అందుకోవడం జరిగిందన్నారు.  రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన పల్లెల సత్యనారాయణ తన ఫిర్యాదులో పాస్ పుస్తకం ఖాతా నెంబరు మార్చాలిసిందిగా కోరారు.  రావికమతం మండలం గర్ణికం గ్రామానికి చెందిన వెలంకాయల కాసులమ్మ  సర్వే నెం.124/15 లో 35 సెంట్ల భూమిని తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, సర్వే నం.ను మార్చాల్సిిందిగా కోరారు.  గొలుగొండ మండలం పాకాలపాడు గ్రామం రాజాన సూర్యనారాయణ వ్యవసాయ కూలీ పని చేసుకుంటున్నామని 60 సంవత్సరాల క్రితం గ్రామ కంఠం భూమిలో తాటాకుల ఇల్లు కట్టుకొని నివశిస్తున్నామని, ప్రస్తుతం అది పాడుపడిపోయిందని,దాని స్థానంలో మిద్దె ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.  స్పందన కార్యక్రమంలో మండల తహశీల్దార్ జయ, ఆర్ డీ వో కార్యాలయ అధికారులు హాజరయ్యారు.

Narsipatnam

2021-08-02 14:42:18

విభిన్న ప్రతిభావంతులకు క్రుత్రిమ అవయవాలు..

విభిన్న ప్ర‌తిభావంతుల‌కు కృత్రిమ అవ‌య‌వాల‌ను పంపిణీ చేసేందుకు నియోజ‌వ‌ర్గాల వారీగా శిబిరాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాలు మ‌రియు వ‌యోవృద్దుల సంక్షేమ‌శాఖ అధికారులు, కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రం, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో త‌న ఛాంబ‌ర్‌లో క‌లెక్ట‌ర్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వారు అందించే కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ, పంపిణీ గురించి వివ‌రించారు. కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిప‌ర్ల‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. విభిన్న ప్ర‌తిభావంతులు,  మ‌రియు వ‌యోవృద్దుల సంక్షేమ‌శాఖ స‌హాయ సంచాల‌కులు నీల‌కంఠ ప్ర‌ధానో మాట్లాడుతూ, ప్ర‌మాద‌వ‌శాత్తూ కాళ్లు, చేతులు పూర్తిగా తొల‌గించిన వారికి, ఒక కాలు లేదా చేయి తొల‌గించిన వారికి కృత్రిమ అవ‌య‌వాల‌ను అమ‌ర్చ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. పోలీయో సోకిన పిల్ల‌ల‌కు, వారి వ‌య‌సును బ‌ట్టి కాలిప‌ర్స్‌ను అంద‌జేస్తామ‌ని తెలిపారు.

            క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, కృత్రిమ అవ‌య‌వాల‌ను త‌యారు చేసి, ఉచితంగా అంద‌జేస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను అభినందించారు. త్వ‌ర‌లోనే శిబిరాల‌ను ఏర్పాటు చేసి, కృత్రిమ అవ‌యవాల‌ను పంపిణీ చేసేందుకు ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని చెప్పారు. ఈ శిబిరాల్లో దివ్యాంగులు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. విభిన్న ప్ర‌తిభావంతులు స్వ‌యంఉపాధి పొందేందుకు అనుగుణంగా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌న్నారు. నిత్యం ఎంతో డిమాండ్ ఉండే ప్లంబింగ్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, సెల్‌ఫోన్ రిపేరింగ్ త‌దిత‌ర అంశాల్లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు.

              కృత్రిమ అవ‌యవాల ప‌నితీరును, వాటిని ధ‌రించే విధానాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ద‌ర్శించారు. ఈ స‌మావేశంలో కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ కేంద్రం (ఏఎల్ఎంయు),  గురుదేవ ఛారిట‌బుల్ ట్ర‌స్టు, అసోసియేష‌న్ సాయి కొరియ‌న్ త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-02 14:34:01

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు..

గ్రామ సచివాలయం సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి హెచ్చరించారు. పాడేరు మండలం చింతల వీధి గ్రామ సచివాలయాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయం రికార్డులను పరిశీలించారు. సిబ్బది హాజరు పట్టీ తనిఖీ చేసారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పి. అనిల్ కుమార్ , డిజిటల్ అసిస్టెంటు బి.మహేశ్వరమ్మ విధులకు హాజరు కాలేదని హెచ్ ఆర్ ఎం ఎస్ లో సెలవు నమోదు చేయలేదని గుర్తించి మెమో జారీ చేయాలని ఎంపిడిఓ ను ఆదేశించారు. మహిళా పోలీస్ కె.నూకరత్నం మూవ్‌మెంట్ రిజిష్టర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సిబ్బంది క్షేత్ర పర్యటనకు వెళ్లినపుడు విధిగా మూవ్‌మెంట్ రిజిష్టరులో నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామస్తులకు అందుబాటులో ఉంటు ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్ధ్య మెరుగు పరచాలని ఎంపిడిఓను ఆదేశించారు. పారిశుధ్ద్యపు పనులు నిర్వహంచి సంబంధిత ఫోటోలు,తీసుకున్న చర్యలపై నివేధించాలన్నారు. నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయం భవనాన్ని ఈనెల 16 వతేదీనాటికి పూర్తి చేయాలని గిరిజన సంక్షేమశాఖ కార్యానిర్వహాక ఇంజనీర్ కెవి ఎస్ ఎన్ కుమార్ ను ఆదేశించారు.

Paderu

2021-08-02 13:17:39

విధినిర్వహణే జీవితంలో పేరుతెచ్చేది..

ప్రభుత్వ ఉద్యోగం చేయడం అంటే కత్తి మీద కర్ర సాము చేయడమంత సాహసమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం రౌతులపూడి తాహసిల్దార్ ఏఏ.అబ్బాస్ ఉద్యోగ విరమణ, ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకుల ఒత్తిడులు, ఒడిదుడుకులను తట్టుకుంటూ, ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ, వివిధ గ్రామాల ప్రజలను సమన్వయం చేసుకుంటూ ఎంతో సహనంతో ప్రభుత్వ ఉద్యోగులు విధులను నిర్వర్తించాల్సి ఉంటున్నదని ఎమ్మెల్యే వివరించారు. 
వీఆర్వో స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ, వివిధ ప్రభుత్వ శాఖల్లోని వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సర్పంచులు, రాజకీయ నాయకులు మొదలుకొని ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ నిత్యం ఒత్తిడులు, వడిదుడుకులను, కొంత మంది బ్లాక్ మెయిలింగులను ఎదుర్కొంటూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఉద్యోగ విధులను నిర్వర్తించడమంటే నిజంగానే కత్తి మీద కర్ర సామేనని ఎమెల్యే వివరించారు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం నకు బదిలీపై వచ్చినా ఆ ప్రాంత అభివృద్ధికి ప్రేమాభిమానాలతో అంకిత భావంతో అన్ని గ్రామాల సమానాభివృద్ధికీ ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేస్తారే తప్ప ఈ ప్రాంతాభివృద్ధికి నేనెందుకు పని చేయాలని భావించరని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  ఈ ఉద్యోగ విరమణ ఆత్మీయ వీడ్కోలు పౌర సన్మాన సభలో శంఖవరం మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, కాకినాడ డిసిసిబి డైరెక్టర్ పులి మధు, రౌతులపూడి తాహసిల్దార్ కార్యాలయ ఉప తాహసిల్దార్ పివివి.సత్యనారాయణ, రెవెన్యూ ఇనస్పెక్టర్ కరీముల్లా, కంప్యూటర్ ఆపరేటర్ కట్టు రాజ్ కుమార్, మండలంలోని 26 పంచాయితీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, స్థానిక, స్థానికేతర జిల్లాల నుంచి పలువురు అతిధులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

రైతులపూడి

2021-08-01 14:52:44

మోదకొండమ్మకు జిల్లా కలెక్టర్ పూజలు..

విశాఖ జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున ఏజెన్సీ పర్యటనలో భాగంగా శనివారం మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షరాలు పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ టి నర్సింగరావు, ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి కె. సింహచలం నాయుడు కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఆలయ లాంఛనాలతో జిల్లా కలెక్టర్‌కు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ, సబ్ కలెక్టర్ వి. అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-07-31 17:07:51

ఆ ముగ్గురు వైద్యులు తనను కలవాలి..

పాడేరులోని జిల్లా ఆసుపత్రిని కలెక్టర్  డాక్టర్ ఎ. మల్లిఖార్జున సందర్శించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. డ్రగ్ స్టోర్, సిటి స్కాన్, ఎక్సరే గది, రక్తపరీక్ష ల్యాబరేటరీ,కంటి పరీక్షల విభాగం, వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు, భోజన సదుపాయాలపై ఆరాతీసారు. మెనూ చార్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో మంజూరైన పోస్టులు,ఖాళీలను అడిగి తెలుసుకున్నారు. అటెండెన్సు రిజిష్టరు పరిశీలించి ముగ్గురు వైద్యులు విధుల్లో లేరని,వారిని రేపు తనను కలవాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ కింద ఎన్న కేసులు నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి, సబ్ కలెక్టర్ వి. అభిషేక్ , గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పాడేరు తాహశీల్దార్ ప్రకాశరావు, ఎంపిడి ఓ నరసింహరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ రామస్వామి, డివిజన్ అభివృధ్ది అధికారి జి.చిట్టిరాజు , వ్యవసాయాధికారి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-07-31 17:00:33

అంకిత బావంతో సేవలందించాలి..

 అంకితభావంతో విధుల నిర్వహించి గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అన్నారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాలుగవ రోజున శనివారం ఏజెన్సీలోని పాడేరు ,హుకుంపేట మండలాల్లో విస్త్రుతంగా పర్యటించారు. పాడేరు మండలంలోని వంట్ల మామిడి, వంతాడపల్లి గ్రామ సచివాలయాలు పరిశీలించారు. గ్రామ సచివాలయంలో సత్వరమే పౌర సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. రైస్ కార్డుల మంజూరు, కులదృవీ కరణపత్రాలు జారీపై ఆరా తీసారు. వంట్ల మామిడి మండలంలో గిరిజనులతో ముచ్చటించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిరాయితీ భూముల సరిహద్దులపై గ్రామస్తులు ఫిర్యాదు చేసారు. గ్రామ సభలు నిర్వహించి జిరాయితీ భూములకు సరిహద్దులు నిర్దారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వంట్లమామిడి పంచాయతీ మోదాపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళలు వై ఎస్ ఆర్ బీమా బయోమెట్రిక్ వేయడానికి వచ్చిన గిరిజన మహిళతో ముచ్చటించి ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. బయో మెట్రిక్ సక్రమంగా పనిచేయకపోతే ఐరిష్ ఏర్పాటు చేయాలని ఎంపిడి ఓ ను ఆదేశించారు.వంతాడపల్లి గ్రామంలో జరుగుతున్న మొబైల్ ఆధార్ కేంద్రం సందర్శించి ఆధార్ కారుల్డలో సవరణలను పరిశీలించారు. సకాలంలో ఆధార్ కార్డులు సంబంధిత వ్యక్తులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గుర్రగరువు గ్రామంలో అటవీ హక్కులు కల్పించిన భూములను పరిశీలించి ఏ విధమైన పంటలు పండిస్తున్నారని గిరిజన రైతులను అడిగి తెలుసుకున్నారు.గుర్రగరువు గ్రామస్తులు కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. హుకుంపేట మండలం కొట్నాపల్లి రైతు భరోసా కేంద్రం, మండల కేంద్రంలో గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమపాఠశాల -1,లో మనబడి నాడు నేడు పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. మరుగుదొడ్లు, బాత్‌రూంలను పరిశీలించారు. అనంతరం చింతలవీధి హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించారు. లబ్దిదారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి గృహనిర్మాణాలు ప్రారంభించాలని గృహ నిర్మాణశాఖ ఇంజనీర్లను ఆదేశించారు.

Paderu

2021-07-31 16:59:11

ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచాలి..

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగండి, ఆర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్  పేర్కొన్నారు.  సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రాపురం మండలాలకు సంబంధించి నూతనంగా ఎన్నికైన 101మంది గ్రామ సర్పంచులకు  ఈ నెల 29 వ తేది నుండి 3 రోజుల శిక్షణ మూడవ బ్యాచ్ ముగింపు కార్యక్రమం సమావేశానికి ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గ్రామ సర్పంచులకు  శిక్షణ అందించు నిమిత్తం  ప్రత్యేక శిక్షణ పొందిన మాస్టర్ ఆఫ్ ట్రైనర్ మీకు గ్రామ పరిపాలనకు సంబందించిన వివిధ రకాల అంశాల పై శిక్షణ అందించారని, ఈ శిక్షణ  మీకు మీ గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలనకు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ అభివృధి సంక్షేమ కార్యక్రమాల పై అవగహన కల్పించాలన్నారు, అలాగే సచివాలయం లో అందిస్తున్న సేవలు తదితర అంశాలపై ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు. అలాగే ఈ మూడు రోజులు శిక్షణ పొందిన సర్పంచులకు ప్రోజెక్ట్ అధికారి ద్రువపత్రాలు అందజేశారు.

           ఈ సర్పంచుల శిక్షణ ముగింపు సమావేశాని జిల్లా పంచాయతీ అధికారి కె.సుభాషిణి, డి.ఎల్.డి.ఓ రాజ్ కుమార్, సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రాపురం మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓలు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Salur

2021-07-31 16:39:46

సిబ్బంది స్థానిక నివాసం తప్పనిసరి..

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి అని సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు. శనివారం  తన పర్యటనలో భాగంగా సాలూరు మున్సిపల్ పరిధిలో దేవర వీధి, కోట విధులలో గల వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం సబ్ కలెక్టర్  మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్వం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. 

Salur

2021-07-31 16:37:41

వరదలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి..

గోదావరి వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను కోరారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలెక్టరేట్  కోర్టు హాలులో జాయింట్ కలెక్టర్లు, ఐటిడిఏ పిఓలు, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై గోదావరి వరద నియంత్రణ, సహాయక చర్యలపై  సమీక్షించారు.  సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) డా.లక్ష్మీశ స్క్రీన్ ప్రెజెంటేషన్ ద్వారా వరద సంసిద్ధతా ప్రణాళిక క్రింద చేపట్టిన ముందస్తు చర్యలను, గత అనుభవాల నేపద్యంలో అవసరమైన ప్రత్యేక చర్యలను ఆయనకు వివరించారు.  ఈ సందర్భంగా జిల్లాలో  గోదావరి నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న 27 మండలాలు వరదలకు, సముద్ర తీరానికి అనుకుని ఉన్న 13 మండలాలు తుఫానులకు గురౌతుండగా, వీటిలో 7 మండలాలు రెండిటి ప్రభావానికి లోనౌతున్నాయని జెసి తెలిపారు. జిల్లాలో గోదావరి తీరం పొడవు 530 కిమీలు వెంబడి 27 మండలాల్లోని 357 గ్రామాలు తరచుగా వరద ప్రభావాన్ని చవిచూస్తున్నాయన్నారు.    గోదావరి వరద స్థాయి భద్రాచలంలో 43 అడుగులు, ధవిళేశ్వరం వద్ద 11.75 అడుగులకు చేరిన వెంటనే  మొదటి వరద హెచ్చరిక జారీ చేసి తీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.  భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులకు  చేరినపుడు రెండవ హెచ్చరిక, 53 ఆడుగుల స్థాయికి చేరినపుడు మూడవ హెచ్చరిక జారీ చేసి  వరద రక్షణ, సహాయక ప్రణాళికలను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నామన్నారు.  గతంలో 1986వ సంవత్సరంలో సంభవించిన వరదలలో గరిష్ట స్థాయిలో 75.6 అడుగుల మట్టం భద్రాచలం వద్ద నమోదైందని, గత సంవత్సరం వరద స్థాయి 61.6 అడుగులు ఉందన్నారు.  జూలై, ఆగష్టు నెలలో ఎదురైయ్యే వరద పరిస్థితులను నియంత్రించేందుకు జిల్లా కేంద్రంతో పాటు 7 డివిజన్ కేంద్రాలలో కూడా రేయింబవళ్లు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, 6 డివిజన్ల పరిధిలో సుమారు 84 వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 137 రిలీఫ్ కేంప్ లను ప్రతిపాధించామని, ఇందుకు 101 పాఠశాలలను గుర్తించామన్నారు.  వరద ప్రభావానికి లోనైయ్యే గ్రామాల్లో ప్రజలలో అవహగాహన కల్పించి ఆప్రమత్తం చేసామని,  ముంపు ప్రాంతాలలోని మండల స్టాక్ పాయింట్ లలో 2 రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల నిల్వలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  
     సమావేశంలో జిల్లా కలెక్టర్  హరికిరణ్ మాట్లాడుతూ భద్రాచలంతో పాటు గోదావరి నదికి మరింత ఎగువ తెలంగాణ లోని పేరూరు, దుమ్మగూడెం నమోదౌతున్న వరద సమాచారన్ని ఎప్పటి కప్పుడు పరిశీలించాలని, తద్వారా వరద సహాయక చర్యలను మరింత ముందుగా  చేపట్టేందుకు సమయం ఉంటుందని సూచించారు.   వరద సహాయక చర్యలకు వాడే జేసిబిలు, బోట్లు తదితర, యంత్రాలు, ఇన్వెంటరీ సామాగ్రి నిల్వలను ప్రతి 3 నెలల సమీక్షించి కొకసారి ఎప్పటికప్పుడు పరిపుష్టం చేయాలన్నారు.  ప్రామాణిక వరద నియంత్రణ ప్రణాళికలపై రక్షణ, సహాయక అధికారులు, సిబ్బందికి తాజా సమాచారం అందించాలని తెలిపారు.  వరద మండలాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లలో  రెండు నెలల నిత్యావసర సరుకుల నిల్వను ఏర్పాటు చేయాలని సూచించారు.  గోదావరి వరద గట్లును నిశింతంగా తనిఖీ చేసి బలహీనత గుర్తించిన ప్రదేశాలలో గట్లను పటిష్ట పరచాలని ఆదేశించారు. 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (హెచ్) ఎ.భార్గవ్ తేజ, రంపచోడవరం ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, చింతూరు ఐటిడిఏ పిఓ ఎ.వెంకటరమణ, పోలవరం ఫ్రోజక్ట్ ప్రత్యేక అధికారి ఓ ఆనంద్, రంపచోడవరం సబ్ కలక్టర్ కట్టా సింహాచలం,  డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఇరిగేషన్ ఎస్ఈలు రాంబాబు, నర్శింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

2021-07-31 16:28:23

సేవలన్నీ సచివాలయం నుంచే అందాలి..

ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు సత్వరమే పారదర్శకంగా అందించే ఒన్ స్టాప్ సెంటరు గా గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఫిరంగిపురం మండలం లోని రేపూడి గ్రామ సచివాలయంను, రైతు భరోసా కేంద్రంను, మేడికొండూరు మండలంలోని పేరేచర్ల  4వ గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తనిఖీ చేశారు. సచివాలయాల్లో ప్రదర్శించిన సంక్షేమ పథకాల క్యాలండర్లు, సోషల్ అడిట్ నిమిత్తం ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితాలు, సంక్షేమ పథకాల ప్రచార పోస్టర్లు పరిశీలించారు. సచివాలయం ఉద్యోగులకు శాఖలవారీగా ప్రజల నుంచి అందుతున్న ధరఖాస్తులు, పరిష్కరిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రేపూడి రైతుభరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న సేవలు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాల అమ్మకాల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలు చేయటానికి సచివాలయ వ్యవస్థను, ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీరును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.  లబ్ధిదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి సచివాలయంలో ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

 సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు  లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కోసం సంక్షేమ క్యాలెండరు, పథకాల ప్రచార పోస్టర్లును ప్రదర్శిస్తున్నామన్నారు. సచివాలయాల పనితీరు పై జిల్లాలోని ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన సూచనలు అందిస్తున్నారన్నారు.   సచివాలయ ఉద్యోగులు సైతం ప్రతి రోజు  ఖచ్చితంగా సమయాపాలన పాటిస్తూ బయోమెట్రీక్ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కర రెడ్డి, ఫిరంగిపురం తహశీల్దారు సాంబశివరావు, ఎంపీడీవో శివప్రసాదు,  మేడికొండూరు తహశీల్దారు కరుణకుమార్, ఎంపీడీవో శోభారాణి, సచివాలయ ఉధ్యోగులు పాల్గోన్నారు.

Phirangipuram

2021-07-31 15:22:59

శంఖవరంలో వైఎస్సార్ భీమా తొలి క్లైమ్ అందజేత..

వైఎస్సార్ భీమా నిరుపేద‌ల‌కు ఎంతో భ‌రోసాను ఇస్తుంద‌ని ఉప స‌ర్పంచ్ చింత‌నీడి కుమార్ అన్నారు. శ‌నివ‌రం శంఖ‌వ‌రం మండ‌ల కేంద్రంలోని ఇటీవ‌ల గుండె పోటుతో మ‌ర‌ణించిన కుటుంబానికి ప్ర‌భుత్వం ద్వారా మంజూరైన తొలి వైఎస్సార్ బీమా క్లైమ్‌ రూ.ల‌క్ష లో త‌క్ష‌ణ స‌హాయంగా రూ.ప‌దివేల‌ను  నామినీ బోమిడి రాజామ‌ణి(త‌ల్లి)కి అంద‌జేశారు. ఇటీవ‌లే మ్రుతుడు బోమిడి శ్రీను గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టికే వీరు వైఎస్సార్ భీమా తీసుకోవ‌డంతో వారికి న‌ష్ట‌ప‌రిహారం అందింద‌ని ఉప స‌ర్పంచ్  చెప్పారు. అనంత‌రం ఉప స‌ర్పంచ్ మాట్లాడుతూ, ప్ర‌తీ ఒక్క‌రూ వైఎస్సార్ భీమా చేయించుకోవాల‌న్నారు. త‌ద్వారా ప్ర‌భుత్వం ద్వారా వ‌చ్చే న‌ష్ట‌ప‌రిహా సౌక‌ర్యాన్ని, మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీ ప్ర‌భుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న వైఎస్సార్ భీమా సౌక‌ర్యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా వున్న‌వారు హ‌ఠాత్తుగా కోల్పోతే ప్ర‌భుత్వం ద్వారా వ‌చ్చేస‌హాయంతో ఆ కుటుంబానికి చిన్న ఆశ‌రా దొరుకుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శంఖ‌వ‌రం స‌చివాల‌య‌ కార్య‌ద‌ర్శిలు రాంబాబు, శంక‌రాచార్యులు, వీఆర్వో సీతారాం, స‌చివాల‌య‌ సంక్షేమ, విద్యా స‌హాయ‌కులు దివాక‌ర్, డిజిట‌ల్ అసిస్టెంట్ జ‌నార్ధ‌న్‌, వైఎస్సార్సీపీ నాయ‌కులు ప‌డాల బాష‌, ప‌డాల స‌తీష్‌,త‌దిత‌రులు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-31 07:40:53

గిరిజనులు దళారుల భారిన పడొద్దు..

ఏజెన్సీలోని గిరిజనులు పండించే అటవీ ఉత్పత్తులు దళారులకు అమ్మకుండా అధిక లాభాలకు వారే స్వయంగా అమ్ముకోవాలని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం మినుములూరు కాఫీ బోర్డు కార్యాలయంలో మిరియాల మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలోని చాల మంది గిరిజన రైతులు పండించే పంటలను సంతలకు తీసుకుని వచ్చి అమ్ముతున్నారని ఈ విధానాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. అరకు కాఫీకి మంచి గుర్తింపు వచ్చిందని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి రైతులకు ఎన్నో సంక్షేమ పధకాలు అందజేసారని అన్నారు. రైతే రాజు అనే నినాదంతో ముఖ్యమంత్రి రైతులకు రైతు భరోసా కింద రూ.13500 అందించారన్నారు. కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ జయంతి ఘోష్ మాట్లాడుతూ కాఫీ పంట ఏజెన్సీలో అధికంగా పండుతున్నాదని దాని వలన గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారన్నారు. స్సైసెస్ బోర్డు , ఐటిడి ఏ సంయుక్తంగా మిరియాల మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారన్నారు. జి సిసి డి ఎం కురసా పార్వతమ్మ మాట్లాడుతూ గిరిజనులు పండిస్తున్న పంటలకు జిసిసి నుంచి రుణాలు అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాఫీ పంటలకు రూ.20 వేలు, వ్యవసాయ పంటలకు రూ.10 వేలు రుణాలు అందిస్తామన్నారు. రుణాలు పొందడానికి గిరిజన రైతులు సొసైటీలో సభ్యత్వ ం కలిగి ఉండాలన్నారు. రైతులకు సొసైటీలో సభ్యత్వం లేకపోతే సభ్యులుగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం 7500 మిరియాల మొక్కలను 100 మంది గిరిజన రైతులకు ఎం ఎల్ ఎ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మినుములూరు కాఫీ బోర్డు ఎస్ ఎల్ ఓ పి . విష్ణు, మోదాపల్లి సర్పంచ్ కొర్రా మంగమ్మ ,మోదాపల్లి, గుర్రగరువు గ్రామాలకు చెందిన గిరిజన రైతులు పాల్గొన్నారు.

Paderu

2021-07-30 16:31:01

ఫ్లోటింగ్ జట్టీ నిర్మాణాలకు స్థల పరిశీలన..

విజయనగరం జిల్లాలోని తిప్పలవలస, ముక్కం ప్రాంతాల్లో అనువైన ప్రాంతాల్లో ప్రభుత్వం ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ కోలాగురువులు పేర్కొన్నారు. శుక్రవారం మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ వాటర్ వేస్ అండ్ కోస్ట్స్ ప్రాజెక్టు అసోసియేట్ శ్యామ్ విలియమ్స్, కార్పోరేషన్ చైర్మన్ లు సంయుక్తంగా ఇక్కడి ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు నిర్మలకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం సముద్రతీర ప్రాంతాల్లోని ముఖ్యమైన అనువైన ప్రాంతాల్లో ఫ్లోటింగ్ జెట్టీలను నిర్మించ నుందని, ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రాంతాలను పరిశీలించామన్నారు. దానితోపాటు ఏ ప్రాంతంలో జెట్టీల నిర్మాణం చేపడితే బాగుంటుందో స్థానిక మత్స్యకారులు, చైర్మన్ సలహాలు కూడా చెన్నై ప్రతినిధి నమోదు చేసుకున్నారన్నారు. ఈ పర్యటన, వివరాలు, ప్రాంతాల నివేదిక ఆధారంగా ప్రభుత్వం జెట్టీలను మంజూరు చేయనుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tippalavalasa Beach

2021-07-30 15:49:28