1 ENS Live Breaking News

ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ సేవ‌లందించండి..

 స‌చివాల‌య సిబ్బంది గ్రామాల్లో ప్ర‌జానీకానికి ఉత్త‌మ సేవ‌లందిస్తూ ఈ వ్య‌వ‌స్థ‌కు మంచిపేరు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు సూచించారు. గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు పాల‌న‌ను వారి ఇంటి ముంగిట‌కే తెచ్చేందుకు ఎంతో మంచి ఆశ‌యంతో ముఖ్య‌మంత్రి ఈ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, దీనిని విజ‌య‌వంతం చేసే బాధ్య‌త స‌చివాల‌య ఉద్యోగుల‌పైనే వుంటుంద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను సకాలంలో స‌త్వ‌రం ప‌రిష్క‌రిస్తూ మంచి సేవ‌లు అందించిన‌పుడు ఆయా గ్రామాల ప్ర‌జ‌లు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఏర్ప‌ర‌చుకుంటార‌ని చెప్పారు. స‌చివాల‌య ఉద్యోగిగా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించే అవ‌కాశం క‌లిగినందుకు గ‌ర్వ‌ప‌డాల‌ని పేర్కొన్నారు. బొండ‌ప‌ల్లి మండ‌లం అంబ‌టివ‌ల‌స‌లో గ్రామ స‌చివాల‌యాన్ని జె.సి.(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు గురువారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా సిబ్బందితో, వ‌లంటీర్ల‌తో మాట్లాడి స‌చివాల‌యం ద్వారా ప‌థ‌కాల అమ‌లు, ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌డంపై ఆరా తీశారు. ఉద్యోగుల హాజ‌రుప‌ట్టిక‌ను త‌నిఖీచేశారు.  

Bondapalli

2021-07-29 17:06:07

స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన‌ జెసి..

చీపురుప‌ల్లి, గ‌రివిడి మండ‌లాల్లో జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) మ‌యూర్ అశోక్ గురువారం ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లేఅవుట్లు, స‌చివాల‌యాల‌ను త‌నిఖీ చేశారు. చీపురుప‌ల్లి మండ‌లం జిటి అగ్ర‌హారం లేఅవుట్‌ను జెసి ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.  అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని, ప‌నులు వేగంగా అయ్యేలా చూడాల‌ని సూచించారు. ఇళ్ల నిర్మాణ సామ‌గ్రి కొర‌త రాకుండా చూడాల‌న్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మండ‌ల  డిప్యుటీ తాశీల్దార్‌, గృహ‌నిర్మాణ‌శాఖ డిఇ, ఏఇ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. గ‌రివిడి మండ‌లం కొండ‌పాలెం-1 స‌చివాల‌యాన్ని జెసి మ‌యూర్ అశోక్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించారు. సిబ్బంది హాజ‌రును త‌నిఖీ చేశారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పై ఆరా తీశారు. స‌కాలంలో విధుల‌కు హాజ‌ర‌వ్వాల‌ని, ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించాల‌ని ఆదేశించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో మండ‌ల తాశీల్దార్ శివ‌న్నారాయ‌ణ‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Cheepurupalli

2021-07-29 13:37:28

సచివాలయ సేవలపై అవగాహన కల్పించండి..

గ్రామ సచివాలయ సేవలపై విస్త్రుతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు సచివాలయ-1మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు సచివాలయాల్లో అందించే సేవలపై వాలంటీర్లకు సచివాలయంలో పెట్టిన ప్రత్యేక బోర్డు ద్వారా అవగాహ కల్పించారు. పాఠశాలలు తెరుస్తున్నందున విద్యార్ధులకు కావాల్సిన వివిధరకాల దృవీకరణ పత్రాలు ఇక్కడ అందిస్తున్న విషయం వాలంటీర్లు వారి 50కుటుంబాలకు తెలియజేయాలన్నారు. తద్వారా సచివాలయాలకు  ఆదాయం పెరుగడంతో పాటు ఇక్కడ అందించే సేవలన్నీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.

Sankhavaram

2021-07-29 07:03:09

గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి..

గిరిజన గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం పార్వతీపురం మండలం గిరిజన గ్రామాలు అయిన లిడికివలస, డోకుశీల గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అటవీ భూముల్లో పండ్ల మొక్కలు పెంపకం పథకంలో భాగంగా గౌరవ అలజంగి జోగారావు, ఐటీడీఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ ల చేతులు మీదుగా పండ్ల మొక్కలను గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ గిరిజనులకు అండగా నిలిచి వారి ఆర్థిక స్థితి మెరుగు పరిచే ఉద్దేశంతో మన ఐటీడిఎ ప్రోజెక్ట్ అధికారి సహకారంతో అటవీ భూములలో పండ్ల మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం ఏకరానికి 70 జీడి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా వాటి పెంపకానికి 3 సంవత్సరాలకు గాను 1.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది అని తెలిపారు. మొత్తం ఈ రెండు పంచాయతీల పరిధిలో దాదాపుగా 90 ఏకరాలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు. కావున గిరిజన ప్రజలు అందరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థిక వనరుగా మార్చుకోవాలని హితవుపలికారు.

         అనంతరం లిడికి వలస గ్రామం  గిరిజనులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ పిల్లలు అందరిని బాగా చదివించాలని అదేవిధంగా తమ భర్తలను మద్యపానానికి దూరంగా ఉంచాలని మహిళలకు పిలుపునిచ్చారు.  తన దృష్టికి వచ్చిన రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరించి బిటి రోడ్డు వేయడం జరుగుతుందని అలానే చర్చి నిర్మాణానికి మరియు రామాలయం నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రయత్నిస్తానని, గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడతాను అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో కృష్ణారావు, ఎపిఓ భాను, ఉపాధిహామీ సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, వైసిపి సీనియర్ నాయకులు బలగ నాగేశ్వరరావు, వై తిరుపతిరావు, పల్లె భాను ప్రకాష్, రెడ్డి రవి, ఆర్ వి ఎస్ కుమార్, వైసిపి కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-07-28 14:06:46

కలెక్టర్ హరిజవహర్ లాల్ కి ఘన వీడ్కోలు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  మూడేళ్ల రెండు నెల‌ల‌పాటు జిల్లా క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించి, ప‌దోన్న‌తిపై ఆర్ అండ్ ఆర్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్తున్న డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ కు, అపూర్వ వీడ్కోలు ల‌భించింది. వివిధ శాఖ‌ల‌ అధికారులు, పుర ప్ర‌జ‌లు బుధ‌వారం జిల్లా స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ వెళ్లి క‌లెక్ట‌ర్ కుటుంబాన్ని ఘ‌నంగా సాగ‌నంపారు. జిల్లా ప్ర‌జ‌లు చూపిన‌ ఆత్మీయ ఆద‌ర‌ణ ప‌ట్ల క‌లెక్ట‌ర్ దంప‌తులు సైతం క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మ‌య్యారు.

              జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కుటుంబం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో బంగ్లా నుంచి బ‌య‌లుదేరింది. ముందుగా బంగ్లాలో ప‌నిచేసే ప్ర‌తీఒక్క‌రినీ క‌లెక్ట‌ర్ దంప‌తులు శాలువ‌ల‌తో స‌త్క‌రించి, జ్ఞాపిక‌లు బ‌హూక‌రించి, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ స‌తీస‌మేతంగా హాజ‌రై క‌లెక్ట‌ర్ కుటుంబానికి వీడ్కోలు ప‌లికారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు కూడా క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను స‌న్మానించి, వీడ్కోలు ప‌లికారు. అనంత‌రం డిఎఫ్ఓ ఎస్‌.జాన‌కిరావు, హ‌రిత విజ‌య‌న‌గ‌రం బృందం ఎం.రామ్మోహ‌న‌రావు, కేస‌లి అప్పారావు, ఈశ్వ‌ర్రావు, ర‌మేష్‌, గోపి త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో, బంగ్లా నుంచి క‌లెక్ట‌ర్ ఆఫీసు వ‌ర‌కూ, క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను ఊరేగింపుగా తీసుకు వ‌చ్చారు. అక్క‌డి గాంధీ విగ్రహానికి క‌లెక్ట‌ర్‌, జెసిలు, పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు.

జిల్లా ప్ర‌జ‌ల స‌హ‌కారం మ‌రువ‌లేనిది
డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌
              త‌న మూడేళ్ల ప‌ద‌వీకాలంలో జిల్లా ప్ర‌జ‌లు అందించిన స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని, క‌మిష‌న‌ర్‌గా ప‌దోన్న‌తి పొంది జిల్లానుంచి బ‌దిలీపై వెళ్తున్న క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఆయ‌న్ను స్థానిక పోలీసు శిక్ష‌ణా కేంద్రంలో ఘ‌నంగా స‌న్మానించారు. ముందుగా అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళుల‌ర్పించిన అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాతో త‌న అనుబంధాన్ని వివ‌రించారు. జిల్లా ను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చ‌డంలో జిల్లా ప్ర‌జ‌లిచ్చిన స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని అన్నారు. జిల్లాలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంచాల‌న్న ఆలోచ‌న‌, తొలుత పిటిసిని సంద‌ర్శించిన త‌రువాతే త‌న‌లో మొద‌ల‌య్యింద‌ని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి, నీటిని అందించాల‌న్న‌దే త‌న కార్య‌క్ర‌మాల వెనుక‌నున్న ఉద్దేశ్య‌మ‌ని తెలిపారు. తాను మొద‌లు పెట్టిన ప్లాంటేష‌న్‌, శానిటేష‌న్‌, చెరువుల శుద్ది కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులో కూడా కొన‌సాగించాల‌ని కోరారు.

              పిటిసి ప్రిన్సిపాల్ డి.రామ‌చంద్ర‌రాజు మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డిపి, సుమారు 20 జాతీయ అవార్డుల‌ను సాధించిన ఘ‌న‌త క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌కే ద‌క్కింద‌న్నారు. ఆయ‌న ఈ మూడేళ్ల‌లో జిల్లాను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చార‌ని కొనియాడారు. జిల్లా ప్ర‌జ‌ల‌కు మంచి ఆక్సీజ‌న్‌ను అందించాల‌న్న త‌ప‌న క‌లెక్ట‌ర్‌లో క‌నిపించింద‌ని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌ల మ‌న‌సులో ఆయ‌న చిర‌కాలం గుర్తుండిపోతార‌ని అన్నారు.

             జిల్లా సాంఘిక సంక్షేమ‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ కె.సునీల్ రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో, ద‌ళిత సంఘాలు  క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రించాయి. ద‌ళిత సంఘాల నాయ‌కులు పి.చిట్టిబాబు, బ‌స‌వ సూర్య‌నారాయ‌ణ‌, భానుమూర్తి మాట్లాడుతూ, క‌లెక్ట‌ర్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఓపెన్‌టాప్ వాహ‌నంలో క‌లెక్ట‌ర్‌ను పిటిసిలో ఊరేగించారు. దారిపోడ‌వునా క‌ళాశాల విద్యార్థినులు పూలు జ‌ల్లారు. కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, జెడిఏ ఎం.ఆశాదేవి, డిపిఆర్ఓ డి.ర‌మేష్‌, పిటిసి వైస్ ప్రిన్సిపాల్ పి.వెంక‌ట‌ప్పారావు, డిఎస్‌పిలు వి.వెంక‌ట‌ప్పారావు, రామారావు, ఆస్మా ఫ‌ర్‌హీనా, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-28 14:04:47

సచివాలయ సిబ్బంది స్థానికంగానే ఉండాలి..

స‌చివాల‌య సిబ్బంది గ్రామంలోనే నివాసం వుంటూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న‌పుడే ఉత్త‌మ సేవ‌లు అందించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు అన్నారు. గ్రామ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ప‌నిచేస్తూ ప్ర‌భుత్వ ప‌రంగా గ్రామీణుల‌కు అవ‌స‌ర‌మైన సేవ‌లందించాల‌ని చెప్పారు. మండ‌లంలోని కొండ‌క‌ర‌కాం గ్రామ స‌చివాల‌యాన్ని జె.సి. వెంక‌ట‌రావు మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు. స‌చివాల‌య సిబ్బంది హాజ‌రును ప‌రిశీలించారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అర్హులైన వారంద‌రికీ అందుతున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మాచారం, వాటిని పొందేందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తులు చేసే విధానం త‌దిత‌ర వివ‌రాల‌న్నీ స‌చివాల‌యంలో ప్ర‌ద‌ర్శించినదీ లేనిదీ ప‌ర‌శీలించారు. ఇళ్ల‌స్థ‌లాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి 90 రోజుల్లో  వాటిని మంజూరు చేస్తున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. రేష‌న్‌కార్డుల జారీ ఎన్ని రోజుల్లో జ‌రుగుతున్న‌దీ అడిగి తెలుసుకున్నారు. కార్యాల‌య వేళ‌ల్లో సిబ్బంది అంతా స‌చివాల‌యంలో వుంటూ సేవ‌లందించాల‌ని, క్షేత్ర‌స్థాయిలో వెళ్లాల్సి వ‌స్తే మూవ్ మెంట్ రిజిష్ట‌రులో సంత‌కం చేయాల‌న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై గ్రామీణ ప్ర‌జ‌ల్లో పూర్తిగా అవ‌గాహ‌న క‌లిగించేలా వ‌లంటీర్ల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌న్నారు.

కొండకరకాం

2021-07-28 14:01:48

ITDA పీఓ సచివాలయ ఆకస్మిక పర్యటన..

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. పీఓ బుధవారం తన పర్యటనలో భాగంగా పార్వతీపురం మండలం డి.కె.పట్నం, వెంకం పేట గ్రామ సచివాలయాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్మూలనకు సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలి అని అందరిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ పర్యటనలో పార్వతీపురం మండల రెవెన్యూ అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2021-07-28 13:58:44

ఆగస్టు15 నాటికి గ్రామాలు స్వచ్ఛంగా మారాలి..

శంఖవరం మండలంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఎంపీడీఓ జె.రాంబాబు సచివాలయ కార్యదర్శిలను ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో కార్యదర్శిలతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాలన్నీ ఆగస్టు 15నాటికి చెత్త రహిత గ్రామాలుగా మారిపోవాలన్నారు. దానికోసం సచివాలయ పరిధిలోని కార్యదర్శిలు స్వచ్ఛసంకల్ఫంపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలన్నారు. అదేవిధంగా సచివాలయాల చుట్టు ప్రక్కల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇకపై జిల్లా అధికారులు పర్యటనలు నిరంతరంగా జరుగుతాయని, ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అదే విధంగా పారిశుధ్య పనుల విషయంలో రాజీలేకుండా నిరంతరం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శిలు పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-27 17:21:43

పథకాలపై అవగాహన కల్పించండి..

గ్రామ వలంటిర్లు తమ పరిధిలోగల 50 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ ఆదేశించారు.  మంగళవారం తన పర్యటనలో కురుపాం మండలం నీలఖంటాపురం, మొండేంఖల్లు, పి.లేవిడి గ్రామ సచివాలయాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రోజెక్ట్ అధికారి మాట్లాడుతూ సిబ్బంది పనిచేసే చోట నివాసం ఉండాలని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవలలో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. అందరూ సమయ పాలన పాటించి విధులు నిర్వహించాలన్నారు.  పిర్యాదులు సేకరణ పరిష్కారంలో అలసత్యం వద్దని సూచించారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టిక, ప్రగతి నివేదికల రికార్డుల పరిశీలించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్మూలనకు సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలి అని అందరిలో అవగాహన కల్పించాలన్నారు.  ఈ పర్యటనలో కురుపాం మండల రెవెన్యూ అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Kurupam

2021-07-27 13:37:41

పెరుగుతో అపర వ్యాధి నిరోధకత సొంతం..

కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి రోజుకి 250 గ్రాములు పెరుగుని ఆహారంగా తీసుకుంటే చాలు అంటున్నారు వైద్యులు. పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్‌ వేసుకున్నంతటి  ఫలితం ఉంటుందనీ చెబుతున్నారు. పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు.. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో దోహద పడతాయట. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్‌ సైంటిఫిక్‌ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక మహిళలకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అని చెప్పలేం. పెరుగులోని ల్యాక్టోబాసిల్లస్‌ అసిడోఫిల్లస్‌ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. అతి ముఖ్యంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో పెరుగు చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చూడటం మాత్రమే కాదు... కడుపులో మంటనూ తగ్గిస్తుంది. అందువల్ల తాజా పెరుగుతో చిలికిన మజ్జిగ తాగగానే కడుపు మంట తగ్గడం మనం గమనిస్తూనే ఉంటాం..ఇంకెందుకు ఆలస్యం సహజ సిద్ధంగా పెరుగుతోనే లభించే రోగనిరోధక శక్తిపెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండండి..

Visakhapatnam

2021-07-26 02:59:52

వేక్సినేషన్ కు అంగన్వాడీలు సిద్దం కావాలి..

కోవిడ్ మెగా వేక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అంగన్వాడీ కార్య కర్తలంతా సిద్దం కావాలని శంఖవరం సచివాలయ మహిళా పోలీస్ జీఎన్ఎస్ శిరీష కోరారు. ఈమేరకు శంఖవరం మండల కేంద్రంలోని మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం మెగా వేక్సినేషన్ కార్యక్రమం ద్వారా 45ఏళ్లు దాటిన మహిళలందరినీ మండల కేంద్రంలోని 8 అంగన్వాడీలు, 3 సచివాలయాల పరిధిలోని జాబితాల వారీగా సమాచారం అందించాలన్నారు. ముందుగా మొదటి డోసు వేస్తే వేసి 84 రోజులు పూర్తయిన తల్లులకు  రెండో డోసు వేయించడానికి జాబితా ప్రకారం కబుర్లు చెప్పాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అంగన్వాడీలతోపాటు, మూడు సచివాలయాల్లోని వాలంటీర్లు కూడా ఈ డ్రైవ్ లో బాగస్వామ్యం కావాలని, సుమారు 900 డోసుల వరకూ ప్రభుత్వం కేటాయించిందని, శతశాతం వినియోగానికి అంతా సహకరించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Sankhavaram

2021-07-25 12:18:52

మెగా వేక్సినేషన్ డ్రైవ్ లో 4వేల డోసులు..

తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నిర్వహించే మెగా కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమంలో శంఖవరం మండలానికి 4వేల డోసులు కేటాయించారని ఎంపీడీఓ జె.రాంబాబు తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు శంఖవరంలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో ఉదయం 6గంటల నుంచే ఈ వేక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ఒక్కో సచివాలయానికి 200 నుంచి 300 డోసులు టార్గెట్లు ఇస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని పంచాయతీ సర్పంచ్ లు, సచివాలయ సిబ్బంది, వైద్యసిబ్బంది, అంగన్వాడీలు, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. సచివాలయాల పరిధిలోని వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Sankhavaram

2021-07-25 09:58:57

శాకాంబరిగా మోదకొండమ్మ తల్లి దర్శనం..

పాడేరు లో నెలకొని ఉన్న శ్రీ శ్రీ శ్రీ   మోదకొండమ్మ అమ్మవారి వార్షిక శాకాంబరీ మహోత్సవము అత్యంత వైభవంగా ఆదివారం జరిగింది.   ఈరోజు అమ్మవారు శాకంబరి దేవీగా అలంకరించుకొని భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేక అలంకారం గా వివిధ రకాలైన కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ పర్సన్  భాగ్యలక్ష్మి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఉదయం 5 గంటల నుంచి భక్తులు పోటెత్తి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అరకు పార్లమెంట్ సభ్యురాలు  గొట్టేటి మాధవి దంపతులు, అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గుణ,ట్రైకార్ చైర్పర్సన్ శతక బుల్లిబాబు , ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ ,సబ్ కలెక్టర్ వి అభిషేక్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్బ నర్సింగరావు ,మాజీ మంత్రివర్యులు మత్స్యరాస మణికుమారి , బొర్రానాగరాజు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సింహాచలం నాయుడు  ,కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, శివరాత్రి శ్రీను ,గోపి, పలాసి బాలన్న కొట్టగుళ్ళి  రామారావు ఇతర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగింది, ఈ కార్యక్రమంలో  భక్తులు పాల్గొన్నారు, ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు గుడిలోకి కోవిడ్ నిబంధనల కనుగుణంగా దర్శనాలు చేయించారు. 

Paderu

2021-07-25 06:51:56

ఉద్యోగులకు బయో మెట్రిక్ తప్పని సరి..

బయో మెట్రిక్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగికి మినహాయింపులేదని ఎంపీడీఓ జె.రాంబాబు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బయో మెట్రిక్ ఆధారంగా మాత్రమే వచ్చేనుంచి ఉద్యోగులకు జీతాలు పడతాయన్నారు. ఇటు గ్రామ పంచాయతీ గ్రేడ్1,2,3,4 కార్యదర్శిలు, ఇతర ఇబ్బంది కూడా బయో మెట్రిక్ వేయాల్సిందేనన్నారు. ప్రభుత్వం బయోమెట్రిక్ ను తప్పని సరిచేసిన సందర్భంలో సచివాలయ ఉద్యోగులు సమయానికి ఇన్, ఔట్ వేయాలన్నారు. ఎపుడైనా బయోమెట్రిక్ మిషన్లు పనిచేయని సమయంలో దానికి గల సాంకేతిక కారణాలు, స్క్రీన్ షాట్ లను తీసి జిల్లా కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు. కొన్ని చోట్ల బయోమెట్రిక్ పనిచేయటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికారణంగా ఉద్యోగులకు సాయంత్రం సమయంలో ఆలస్యమవుతున్న విషయం కూడా తమ ద్రుష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని కూడా జిల్లా అధికారులకు తెలియజేసినట్టు ఎంపీడీఓ వివరించారు. అదే సమయంలో ఉద్యోగులు జాబ్ చార్టు, మూమెంట్ రిజిస్టర్లను కూడా తప్పనిసరిగా  వినియోగించాలన్నారు. సీనియర్ కార్యదర్శిలకు కూడా పలుమార్లు సమావేశాల్లో ఈ విషయాన్ని తెలియజేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Sankhavaram

2021-07-23 17:44:25