1 ENS Live Breaking News

మహిళల రక్షణకోసం దిశయాప్ వాడాలి..

ఆపదలో వున్న మహిళలకు సహాయం అందించాలనే మంచి సేవాభావం వున్న పురుషులు కూడా దిశ యాప్ వినియోగించవచ్చునని మహిళా పోలీస్ జిఎస్ఎస్ శిరీష సూచించారు. బుధవారం శంఖవరం గ్రామసచివాలయం-1లో ఉపసర్పంచ్ కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తిలు, 3 సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో  సమీక్షా సమావేశంలో దిశ యాప్ పై అవగాహన కల్పించారు. ప్రతీ మహిళ సెల్ ఫోనులో దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఎంతో రక్షణ పొందవచ్చునన్నారు. చాలా మంది యువత ఇపుడు దిశ యాప్ ఇనిస్టాల్ చేసుకొని మహిళల కోసంప్రభుత్వం రూపొందించిన ఈ దిశ యాప్ పై తమవంతుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఉపసర్పంచ్, కార్యదర్శిలు మాట్లాడుతూ, మహిళా వాలంటీర్లంతా దిశ యాప్ ని మహిళలు, కాలేజీలకు వెళ్లే విద్యార్ధినిలు, ఇళ్లల్లో వుండే మహిళల ఫోన్లలో కూడా ఇనిస్టాల్ చేయించి..యాప్ ఉపయోగాలు తెలియజేయాలన్నారు. ఏరోజు ఎంతమందితో యాప్ ఇనిస్టాల్ చేయించారో కూడా మహిళా పోలీసుకి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో మహిళా పోలీసు జీఎన్ఎస్ శిరీష, గ్రామ పెద్దలు పడాల సతీష్, పడాల భాషా,అడపా వీరబాబు, వైరాశ్రీరామ్మూర్తి, పడాల బుజ్జి, సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-07 13:19:12

గ్రామాభి వ్రుద్ధిలో భాగస్వాములు కావాలి..

గ్రామాభివ్రుద్ధిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరింత భాగస్వామ్యం కావాలని ఉపసర్పంచ్ కుమార్, కార్యదర్శి రామచంద్రమూర్తిలు సూచించారు. బుధవారం శంఖవరం గ్రామసచివాలయం-1లో 3 సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ రాజశేఖరరెడ్డి జయంతి, రైతు దినోత్సవాల కార్యక్రమాలను రేపు వివజయవతం చేయాలన్నారు. అంతేకాకుండా  ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో గ్రామ సచివాలయాల నూతన భవనాల ప్రారంభోత్సవంలోనూ అందరూ పాల్గొనాలన్నారు. రేపటి నుంచి కొత్త సచివాలయాల ద్వారా పేదలందరికీ గ్రామంలోనే పూర్తిస్థాయిలో సేవలందించాలని కోరారు. కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వం సచివాలయం ద్వారా అందించే సేవలను ప్రజలకు వాలంటీర్లు పూర్తిస్థాయిలో తెలియజేయాలన్నారు. రేపటి కార్యక్రమాల్లో వాలంటీర్లు, ప్రజలు మాస్కులు ధరించి, బౌతిక దూరం పాటిస్తూ..కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యదర్శిలు శంకరాచార్యులు, సత్యలు కోరారు. సచివాలయాల్లోని సిబ్బంది వారి సేవలకు సంబంధించిన రికార్డులను అప్డేట్ చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో మహిళా పోలీసు జీఎన్ఎస్ శిరీష, గ్రామ పెద్దలు పడాల సతీష్, పడాల భాషా,అడపా వీరబాబు, వైరాశ్రీరామ్మూర్తి, పడాల బుజ్జి, సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Sankhavaram

2021-07-07 13:11:47

ఆపదలో మహిళల‘దిశ’మారుస్తుంది..

ఆపద సమయంలో మహిళల దిశను మార్చేదే దిశ మొబైల్ యాప్ అని అన్నవరం ఎస్.ఐ  రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామసచివాలయంలో మహిళలకు దిశ యాప్ పై ప్రత్యేక అవగాహన, ఇనిస్టాలేషన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, దిశ యాప్ ప్రతి మహిళ చేతిలో ఒక పెద్ద శక్తి అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. అనంతరం దిశ యాప్ ఏ విధంగా వినియోగించాలి, దాని వలన ఉపయోగాలేంటి అనే విషయాన్ని మహిళా పోలీస్ కళాంజలి వివరించారు. అంతేకాకుండా మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.  వాలంటీర్లు, మహిళా ఉద్యోగులు కూడా ఈ యాప్ ను ఖచ్చితంగా ఇనిస్టాల్ చేసుకోవాలన్నారు. ఈ కార్యకర్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరాల శ్రీనివాసరావు, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు, పోలీసులు పాల్గొన్నారు.

నెల్లిపూడి

2021-07-06 15:02:04

రక్త దాతలే నిజమైన దేవుళ్లు..

కరోనా సమయంలో రక్తాన్ని దానం చేసిన వారే నిజమైన దేవుళ్లని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు అన్నారు. మంగళవారం కామవరపుకోట మండల విద్యా వనరుల కేంద్రం లో మానవతా, రెడ్ క్రాస్ సొసైటీ, యాంటీ కరొనా హెల్పింగ్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ఒకరు రక్తం దానం చేయడం వలన 8 మంది ప్రాణాలు నిలబెట్టడానికి ఆస్కారం వుంటుందన్నారు. అంతేకాకుండా రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సైతం పెంపొందించుకోవచ్చునని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వాటి ద్వారా అత్యవసర సమయానికి రక్తం అందించాలంటే మరింత మంది రక్తం దానం చేయడానికి ముందడుగు వేయాలన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 25 మంది దాతలు రక్తం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు రాఘవ రాజు భవాని, మానవతా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం వీరమల్ల మధు మున్నంగి శ్రీనివాస్ నిజాపరపు దుర్గాప్రసాద్ సౌజన్ సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Kamavarapu Kota

2021-07-06 13:56:09

శునకాలకు యాంటీ రేబీస్ టీకాలు..

 ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 212 పెంపుడు శునకాలకు ఉచితంగా యాంటీ రేబీస్ టీకాలు వేశారు. శునకాలకు మల, మూత్ర, రక్త పరీక్షలు నిర్వహించారు. మంగళవారం స్థానిక ఏరియా పశువైద్య శాలలో నిర్వహించిన వాక్సినేషన్ కార్యక్రమంలో పాడేరు శాసన సభ్యురాలు కె.భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆధునీకరణ చేసిన ఆపరేషన్ ధియేటర్ ను ఆమె ప్రాంభించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ జూనోసిస్ వ్యాధులపై  ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  స్వచ్చంధ సంస్థల సహకారంతో పెంపుడు శునకాలతో పాటు వీధి శునకాలకు టీకాలు వేయాలని సూచించారు. అనంతరం ఇండియన్ ఇమ్యునాలజికల్స్,ఇంటాస్, విర్దాక్ తదితర ఫార్మా సంస్థలకు చెందిన షాంపూలు, డీవార్మింగ్ మందులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పాడేరు సర్పంచ్ కె.ఉషారాణి, పశుసంవర్ధక శాఖ, సహాయ సంచాలకులు డా.ఏ.రవికుమార్ ,డా.సతీష్, డా.జగదీష్ , లైవ్ స్టాక్ అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు.

Paderu

2021-07-06 12:11:16

దిశ యాప్ మహిళలకు ధృడమైన రక్షణ

దిశ యాప్ మహిళా విద్యార్ధినిలకు దృఢమైన రక్షణగా ఉంటుందని సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష అన్నారు. సోమవారం గ్రామసచివాలయం-1లో విద్యార్ధినిలతో దిశ యాప్ ఇనిస్టాల్ చేయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ మాట్లాడుతూ, దిశయాప్ మహిళల పాలిట సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుందన్నారు. ప్రతీ మహిళా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ఇనిస్టాల్ చేయించు కోవాలన్నారు. తోటి విద్యార్ధినిలకూ ఈ విషయాన్ని తెలియ జేయాలన్నారు.

Sankhavaram

2021-07-05 07:15:45

రామాలయానికి శంఖుస్థాపన..

చవ్వా వారి పల్లిలో రూ.23.5 లక్షలతో రామాలయం నిర్మాణానికి టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, కలెక్టర్  హరి కిరణ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  భానుకోట శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఏడాదిలో పూర్తి చేసేలా ప్రణాళిక తయారు చేశామని చెప్పారు. భానుకోట సోమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైందన్నారు. ఇక్కడి ప్రజలు, ఎంపి విజ్ఞప్తి మేరకు శ్రీవాణి నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులన్నీ రాతి కట్టడంతో చేస్తామని ఆయన తెలిపారు. చవ్వా వారి పల్లి ప్రజలు, సర్పంచ్ కోరిక మేరకు అ గ్రామంలో కూడా రూ 23. 50 లక్షలతో రామాలయం నిర్మించనున్నామని ఆయన వివరించారు.

చవ్వా వారిపల్లె

2021-07-04 13:30:37

సచివాలయాలతో సమస్యలకు పరిష్కారం..

రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టి గ్రామ సచివాలయాల ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం గ్రామాల్లోనే లభిస్తుందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. ఆదివారం పాండ్రంగి గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామస్థాయిలోనే సుమారు 14శాఖలకు చెందిన సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి క్రుషిచేస్తున్నారు. సచివాలయాల వలన రాబోయే రోజుల్లో గ్రామాల్లో ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే అవసరం వుండదన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, కల్పనా కుమారి, ఆర్.గోవిందరావు, ఆర్.డి.ఒ.పెంచల కిషోర్, టూరిజం శాఖా ప్రాంతీయ సంచాలకులు,  స్థానిక నాయకులు , అధికారులు  పాల్గొన్నారు.

Pandrangi

2021-07-04 11:50:46

విప్లవజ్యోతి అల్లూరి యువతకు స్పూర్తి..

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు. ఆదివారం అల్లూరి జన్మించిన పాండ్రంగి గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన జన్మదినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.  సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు పట్టుదల అమాయక గిరిజనులను బాధల నుండి విముక్తి చేసేందుకు చైతన్య పరచడం మొదలైనవన్నీ యువత నేర్చుకోవాలన్నారు. పేదరికంలో జీవించినప్పటికీ దీక్షతో విద్యాభ్యాసమే కాకుండా జ్యోతిష్యం, ఆరోగ్య శాస్త్రాలలో పట్టు  సాధించారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనుల కష్టాలను తెలుసుకుని వారిలో స్ఫూర్తిని నింపి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారి హక్కుల కోసం పోరాటం జరిపినట్లు తీర్చిదిద్దారన్నారు.  గిరిజన ప్రాంతంలో అనేకమంది ఇంకా పలు రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారని, అల్లూరి ఆశయాలు సాకారం కావాలంటే  యువత గిరిజనుల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు.  27 సంవత్సరాలు జీవించి నప్పటికీ గిరిజనులను విప్లవం వైపు నడిపించి గిరిజన హక్కుల కోసం పోరాడిన యోధుడిగా రాష్ట్రంలోనే కాక దేశంలోనే గుర్తింపు పొందారన్నారు. మాజీ మంత్రి ఎస్.ఆర్.డి.పి.అప్పల నరసింహరాజు మాట్లాడుతూ అల్లూరి తల్లిదండ్రులు గురించి, అల్లూరి సీతారామారాజు గురించి వివరించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ముత్తంశెట్టి మహేష్ మాట్లాడుతూ పాండ్రంగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆశయమని పేర్కొన్నారు.  ప్రభుత్వపరంగా ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ గ్రామస్తులు దానికి అనుగుణంగా స్పందించి గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలని పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, కల్పనా కుమారి, ఆర్.గోవిందరావు, ఆర్.డి.ఒ.పెంచల కిషోర్, టూరిజం శాఖా ప్రాంతీయ సంచాలకులు,  స్థానిక నాయకులు , అధికారులు  పాల్గొన్నారు.

Pandrangi

2021-07-04 11:45:41

గిరిజన సంక్షేమానికి రూ.14,658 కోట్లు..

విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఆశయాలే ఆదర్శంగా తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. రాష్ట్రంలో గడచిన రెండేళ్ల కాలంలో గిరిజన సంక్షేమానికి రూ.14,658 కోట్ల రుపాయలను వెచ్చించడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకంలోనూ గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. నిలువనీడ లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని సమకూర్చే జగనన్న కాలనీల నిర్మాణం దేశానికే ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగానే ఐటీడీఏ ఆద్వర్యంలో రైతులకు పవర్ వీడర్స్ ను పంపిణీ చేయడంతో పాటుగా మెగా హౌసింగ్ గ్రౌండింగ్ లో భాగంగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలోనే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు గిరిజనుల మేలు కోసం పాటుపడ్డారని, తన ఆశయ సాధనలో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసి తన ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేసారు. మైదాన ప్రాంతాల వారితో సమానంగా మన్యంలోని గిరిజనులు అభివృద్ధి చెందాలని, వారి హక్కులు వారికి దక్కాలని అల్లూరి సీతారామరాజు కోరుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అల్లూరి తరహాలోనే గిరిజన సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. గడచిన రెండేళ్లకాలంలో గిరిజన సంక్షేమం కోసం రూ.14,658 కోట్ల రుపాయలను వెచ్చించడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ నుంచి 2021 మే మాసాంతం వరకూ వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్షంగా 29.71 లక్షల మంది గిరిజనుల ఖాతాల్లోకి రూ.4915 కోట్లను నేరుగా జమ చేసారని, పరోక్షంగా 17.11 లక్షల మంది గిరిజనులకు రూ.1731 కోట్ల లబ్దిని చేకూర్చారని తెలిపారు. ఇదికాకుండా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ట్రైబల్ సబ్ ప్లాన్ కింద రూ.8012 కోట్ల తో అభివృద్ధి పనులను చేపట్టారని పుష్ప శ్రీవాణి వివరించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు అటవీ హక్కుల చట్టం ఆర్ఎఫ్ఆర్ లో భాగంగా పట్టాలను ఇవ్వడంలోనూ ముఖ్యమంత్రి కొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ 1.24 లక్షల మంది గిరిజనులకు 2.28 లక్షల ఎకరాల భూములను పట్టాలుగా ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అనుమతులన్నింటినీ అధికారికంగా రద్దు చేసారని ప్రస్తావించారు. అలాగే గిరిజనులు ఎంతోకాలంగా కోరుకుంటున్న ఎస్టీ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, పనుల కేటాయింపుల్లోనూ ఇతర వర్గాల వారితో పాటుగా గిరిజనులకు కూడా రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. తాను తీసుకొనే ప్రతి నిర్ణయంలోనూ గిరిజనుల మేలును గురించి ఆలోచిస్తున్నందుకే ఈ రోజున అల్లూరి సీతారామరాజు తరహాలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా గిరిజనులు తమ గుండె గుడిలో దేవుడిలా ఆరాధిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పిఓ కుర్మనాధ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు,గృహ నిర్మాణ శాఖ ఇఇ శ్రీనివాస్ రావు, డిఇఇ చెన్న రాయడు, మండలం ప్రత్యేక అధికారి శాంతిశ్వర్ రావు ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్ధన నాయుడు, వైస్సార్సీపీ సీపీ నాయకులు నంగిరెడ్డి శరత్ బాబు, సర్పంచ్ అంబటి వెంకటిలక్ష్మి,మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చింతల సంఘం నాయుడు, శివిని సింగిల్ విండో అధ్యక్షులు దాసరి శ్రీధర్, అంబటి తిరుపతి నాయుడు, నాలి గుంపస్వామి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Komarada

2021-07-04 10:15:39

అప్పన్నకు మేరీటైమ్ సీఈఓ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ  శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని(సింహాద్రి అప్పన్న) ఏపీ మేరీటైం బోర్డు సీఈఓ మురళీ ధరన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి చేరుకున్నవారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ప్రసాదం అందజేయగా, వేద పండితులు ఆశీర్వాదం అందించారు. ఆయనతో పాటు ట్రస్టుబోర్డు సభ్యురాలు గరుడ మాధవి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సిబ్బంది ఆయనకు వివరించారు.

Simhachalam

2021-07-04 06:50:55

అల్లూరి భావి యువతకు ఎంతో స్పూర్తి..

అల్లూరి సీతారామరాజు నాడు గిరిజనులకు చేసి సేవలు, చైతన్య కార్యక్రమాలు బావిత రాలకు స్పూర్తిదాయకమని అన్నవరం శ్రీవీరవేంకట సత్యన్నారాయణ స్వామి వారి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు వాసిరెడ్డి జగన్నాధం అన్నారు. ఆదివారం అల్లూరి 124వ జయంతి సందర్భంగా రౌతులపూడిలోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడ లాడించి భారత దేశం నుంచి తరిమికొట్టిన అల్లూరి వీరోచి చరిత్ర, ఉద్యమం పోరాటం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆ మహాబావుని చరిత్ర మరింత పదిలంగా ఉండేందు పాఠ్యాంశాలల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో గుమ్మరేగల సర్పంచ్ ఆర్.రామక్రిష్ణ, ఉప్పంపాలెం సర్పంచి కోటిబాబు, బలరామపురం సర్పంచ్ తాతాజీ, ఎస్సీసెల నాయకుడు కె.రాజేశ్వర్రావు. తదితరులు పాల్గొన్నారు.

Rowthulapudi

2021-07-04 06:37:57

మార్కండేయ ఆలయానికి సహకరించండి..

విశాఖజిల్లా, గొలుగొండ మండలం, ఏఎల్ పురం(క్రిష్ణదేవిపేట)లోని  భావనా ఋషి, భద్రావతి, మార్కండేయ స్వామివారి ఆలయానికి దాతలు ఆర్ధికంగా సహకరించాలని నిర్వాహకులు చుక్కుల సత్యన్నారాయణ కోరుతున్నారు. శనివారం ఏఎల్ పురంలో ఆయన స్వామవారి ఆలయంలో మీడియాతో మాట్లాడారు. సుమారు 5సెంట్ల విస్తీర్ణంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసిన తరువాత తాత్కాలికంగా రేకుల షెడ్డుతో ఆలయం ఏర్పాటు చేసి నిర్వహణ చేస్తున్నామన్నారు. అయితే ఇపుడు స్వామివారికి పూర్తిస్థాయి శాస్వత నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దానికోసం దాతలు, స్వామివారి భక్తులు ఆలయ నిర్మాణానికి తోచిన విధంగా సహకారం అందించాలని కోరుతున్నారు. వస్తురూపంలోగానీ, సిమ్మెంటు, ఇసుక, ఇటుకలు, ఐరన్, టైల్స్ తదితర రూపంలో దాతలు తమ సహాయాన్ని సమర్పించవచ్చునన్నారు. ఆర్ధిక సహాయం చేయాలనుకునే వారు 9441571806, 9491792919 నెంబర్లుకు ఫోన్ పే చేయాలని కోరుతున్నారు. రూ.5లక్షలు సహాయం చేసిన వారిని మహారాజ పోషకులుగా గుర్తించి వారి పేరుతో జీవితాంతం స్వామిఆలయంలో పూజలు చేయిస్తామని చెప్పారు.

Krishnadevipeta

2021-07-03 13:26:50

ఇళ్ల నిర్మాణాలు పండగలా జరగాలి..

పేదలందరికి ఇళ్ల పధకం క్రింద ఇంటి స్థలం పొందిన లబ్దిదారులందరూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం పేదలందరికి ఇళ్లు వైయస్సార్ జగనన్న కాలనీలలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో భాగంగా ఏటుకూరు లోని వైయస్సార్ జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల శంఖుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మాద్ ముస్తఫా తో కలిసి పాల్గొన్నారు. కాలనీలో ఇళ్ల నిర్మాణంకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి లబ్దిదారులతో కలిసి శంఖుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు ఇసుక ఉచితంగా అందిస్తున్నదన్నారు. సిమెంట్, ఇనుము ఇతర గృహ నిర్మాణ సామాగ్రి రాయితీ పై అందిస్తున్నదన్నారు. శంఖుస్థాపనలు చేసిన ఇళ్లకు నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా లబ్దిదారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అధికారులు అందిస్తారన్నారు. మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో భాగంగా మొదటి రోజైన గురువారం ఇళ్లకు శంఖుస్థాపనలు చేసి వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయటం జరిగిందన్నారు. లబ్దిదారులు స్వంత ఇంటి కల నిజం చేసుకునేందుకు అధికారులకు సహకరించి ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు మహ్మాద్ ముస్తఫా లబ్దిదారులతో మాట్లాడుతూ అధికారుల సహకారంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలన్నారు. తన వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామన్నారు. ఇళ్లకు శంఖుస్థాపన కార్యక్రమానికి ముందు కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డివో భాస్కర్ రెడ్డి, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ కమీషనరు చల్లా అనురాధ, తూర్పు మండల తహశిల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాసరావు, ఇ.ఇ.శాంతి రాజు, హౌసింగ్ ఇ.ఇ ప్రసాద్, సిటి ప్లానర్ సత్యానారాయణ, లబ్దిదారులు పాల్గొన్నారు.

Etukuru

2021-07-03 12:07:22

లబ్ధిదారులు భూపూజకి సిద్దమవ్వాలి..

 పేదలందరికీ  ఇళ్ళు క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన  గృహాలకు లబ్ధిదారులంతా  భూమి పూజ చేసుకొని ఇళ్ల నిర్మాణాలకు సిద్ధం కావాలని సంయుక్త కలెక్టర్  డా.జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు.  బొబ్బిలి మున్సిపాలిటీ లో శనివారం  మున్సిపల్ ఛైర్పర్సన్  పావు వెంకట కృష్ణ తో కలసి లబ్ధిదారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా జె.సి మాట్లాడుతూ గృహాల ప్రారంభలకు  ప్రభుత్వం  ఇచ్సిన గడువు ఆదివారం వరకూ ఉన్నందున ఇప్పటివరకు భూమి పూజ చేయని వారు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం  ఎంతో ఖర్చును భరిస్తూ పేదల కోసం నిర్మిస్తున్న గృహాలలో అన్ని రకాల సౌకర్యాలను, వసతులను కల్పిస్తోంద ని పేర్కొన్నారు.  ఎలాంటి వివాదాలు లేని గృహాలు స్వంతం అవుతాయని, ప్రతి ఒక్కరు నిర్మించుకోడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ సమావేశం లో బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ,  తహసీల్దార్ రామస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Bobbili

2021-07-03 11:26:15