1 ENS Live Breaking News

ముందు ఉద్యోగులకు బదిలీలు.. ఆపై సచివాలయ శాఖకు చట్టబద్దత

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం ఈశాఖ చట్టబద్ధత కంటే.. బదిలీలు చేపట్టి తర్వాత అసెంబ్లీ సమా వేశాల్లో చట్టబద్దత తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా కేవలం 10నెలలు మాత్రమే ఉండ టంతో ఈలోగా ఇతర 75శాఖల ఉద్యోగులు, అధికారులతోపాటు, సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టిన తరువాత చట్టబద్ధతకు కార్య రూపం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. దానికోసం కూడా విధి విధానాలు రూపొందించాలని ఇప్పటికే జిఏడి నుంచి సచివా లయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయా ల్లోని 1.25 లక్షలకు పైచిలుకు ఉద్యోగులకు(ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి) బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ బదిలీల ప్రక్రియలో ఇతర శాఖల్లోని సబార్డినేట్ సర్వీసు రూల్సు పాటించి జిల్లాలోపల బదిలీలు, అంతర్ జిల్లాలు, స్పౌజ్ కోటా, మ్యూచ్ వల్, ఎగ్జిస్టింగ్ వేకేన్సీ, హెల్త్ ఇష్యూస్ వారీగా బదిలీలు చేపడతారా వీరికి ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తారా అనే విషయంలో మా త్రం స్పష్టత రాలేదు.  కాకపోతేకే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనలనే సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని మాత్రం ప్రాధమిక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది.

వాస్తవానికి ప్రభుత్వంలో ఏదైనా ఒక  శాఖను కొత్తగా ఏర్పాటు చేసినపుడు అసెంబ్లీ సభ్యుల ఆమోదంతో ఎలాగైతే చేస్తారో..అదే అసెంబ్లీ సాక్షిగా దానికి చట్టబద్ధత కూడా తీసుకు వస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ముందుది వెనుక, వెనుకది ముందు అన్నట్టుగా ఒక్కో ప్రక్రియ ఒక్కోసారి చేపట్టడంతో ఉద్యోగులు సైతం గందరగోళంలో పడిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు ఈశాఖలో పనిచేసే 19శాఖల సిబ్బందికి చాలా వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. కొన్నిశాఖల సిబ్బందికి వాటిని ఏర్పాటు చేసినా.. మహిళాపోలీసు విభాగంలో ఇంకా కోర్టు కేసులు నలుగుతున్నాయి. వీరికి సాధారణ పోలీసులు మాదిరిగా యూనిఫాం ఇచ్చే విషయంతో  కూడా పోలీసుశాఖ ఇంకానిర్ణయం తీసుకోలేదు. దానికి కూడా ఇంకా స్పష్టత రావాల్సి వుంది. పేరుకి వీరు హోంశాఖ ఉద్యోగులు అయినప్పటికీ, సచివాలయాల్లో మాత్రం అధికంగా ఐసిడిఎస్, రెవిన్యూశాఖకు చెందిన బిఎల్వో లాంటి విధులు చేస్తున్నారు. ఈ తరుణంలో జిఏడి నుంచి వచ్చిన సూచనలు ఆధారంగా వీరికి బదిలీలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూస్తున్నారని సమాచారం. ఆ విధంగా ఒక్కసారి విధివిధానాలు రూపొందిస్తే మూడు దఫాలుగా జరిగిన ఈ నియామకాల్లో విధుల్లో చేరిక వారికి కూడా బదిలీలకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయశాఖలోని కొన్ని గ్రామీణ శాఖలకు చెందిన సిబ్బంది ఉండటంతో వారిని వార్డు సచివాలయాలకు బదిలీ చేసే అవకాశం లేదని కొందరు.. ఒకేశాఖ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంటే అక్కడి కూడా ఖాళీలను బట్టీ చేస్తారని మరికొంత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అర్భన్ ప్రాంతాల్లో పోలీస్, హెల్త్, ఇంజనీరింగ్, వెల్ఫేర్, సర్వేయర్, వీఆర్వో, పశుసంవర్ధక, ఇంజనీరింగ్, ఫిషరీష్ శాఖలకు సంబంధించిన స్పష్టత రావాల్సి వుంది. మిగిలిన శాఖలైన అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీ కల్చర్, పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ లు వార్డు సచివాలయాల్లో పనిచేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ కారణాలు కూడా సచివాలయ ఉద్యోగుల సామాజిక మాద్యమాల గ్రూపుల్లో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం బదిలీలు చేపడుతుందని స్పష్టత ఇచ్చితన తరువాత చాలా మంది వారి వారి సొంత జిల్లాలకు వెళ్లడానికి మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్స్ కోసం పెద్ద ఎత్తు శోధనలు మొదలు పెట్టారు. ఎవరికుండే పరిచయాలను, రాజకీయనాయకులతో పలుకుబడి, అధికారులను ప్రశన్నం చేసుకొని తొలిసారిగా జరిగే బదిలీల్లోనే ఉన్న ప్రాంతం నుంచి కదిలిపోవాలనే బలంగా ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారు.

ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాఖలో ఆదినుంచి ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. 19శాఖలకు చెందిన ప్రిన్స్ పల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఇటు జిల్లా కలెక్టర్లతో పరస్పర సహకారం, సమన్వయం లేకుండానే ఇంత కాలం నెట్టుకొచ్చేశారు. మరోవైపు గ్రామసచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు వారే మిగిలిన సిబ్బందికి జీతాలు ఇస్తున్నట్టుగా తెగ ఫీలపైపోయి వారి మాతృశాఖల విధులు నిర్వర్తించే సమయంలో ఉద్యోగులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు.  ముఖ్యంగా వారి ఇబ్బందులు తాళలేక ప్రభుత్వం కల్పించనున్న ఈ బదిలీల్లో వేరే ప్రాంతాలకు వెళ్లిపోవాలని చూస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ఈ విషయంలో వీరికి సంఘాలు ఉన్నప్పటికీ విధానపరమైన అంశాలను లేవనెత్తకుండా కేవలం ప్రభుత్వానికి విధేయత ప్రదర్శించే కార్యక్రమం మాత్రమే చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న శాఖపరమైన విధినిర్వహణ విషయంలో అటు ప్రభుత్వంలోని ముఖ్యకార్యదర్శి నుంచి, ఆయాశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా జిల్లా కలెక్టర్లకు సైతం సమన్వయాన్ని చేయలేకపోవడం చర్చనీయాంశం అవుతుంది. తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయినా ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా తమకు అన్ని జిఓలు, పదోన్నతులు, బదిలీలు జరుగతాయా లేదా అనే అనుమానం ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులను తీవ్రంగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జరిగే బదిలీల ప్రక్రియలో ఒక్కో విషయం ఒక్కోసారి వైరల్ అవుతోంది. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీల విషయంలో ఎలాటి నిబంధనలు పాటించి, ఈ శాఖకు చట్టబద్ధత కల్పిస్తుందనేది..!

Tadepalli

2023-05-16 02:03:48

మే 6దాటినా ఇంకా పెన్షన్ల కోసం ఎదురుచూపులే

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ కోసం ప్రతీనెలా ఎదురుచూసే పరిస్థితే దాపురిస్తోంది. మే నెల 6వ తేదీ నాటికి కూడా వారి అకౌంట్ లో పెన్షన్లు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  రిటైర్డ్ ఉద్యోగులు వారి పెన్షన్ పైనే బ్రతుకుతు న్నారు. మరికొందరు పెన్షన్ పై హౌసింగ్ లోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. వాటికి ప్రతీనెలా 5వతేదీ నాటికే ఈఎంఐలు కట్టాల్సి వుంది. దీనితో ప్రతీనెలా 5దాటిన తరువాత పెన్షన్లు పడటంతో ఈఎంఐకి ఇచ్చిన పోస్టు డేటెడ్ చెక్కులు బౌన్స్ అయ్యి వాటికి పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తమను పెన్షన్ల కోసం ఎదురు చూసేలా చేస్తోం దని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోపక్క మరికొంత మంది పెన్షనర్లు కుటుంబాలు లేక ఒంటరిగా జీవిస్తుండటంతో వచ్చిన పెన్షను పైనే ఆధార పడాల్సి వస్తున్నది. అలాంటి వారు ప్రతీ నెలా పెన్షను వచ్చేంత వరకూ వేచిచూడకుండా ముందస్తుగా అప్పులు చేసుకొని, వాటి కి వడ్డీలు కూడా కట్టుకోవాల్సి వస్తున్నది. ఈవిధానం కొనసాగితే ప్రభుత్వంపై పెన్షనర్ల తిరుగుబాటు తప్పేటట్టు లేదు.

Amaravati

2023-05-05 05:16:58

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల విషయంలో ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది.  వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీస్ రూల్స్, పదోన్నతులు, బదిలీల అంశాలే పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది. కాకపోతే ఈ శాఖకు ప్రభుత్వం ఇంకా చట్టబద్దత కల్పించలేదనే విషయాన్నిఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారికి మొబైల్ యాప్ Ens Live, అధికారిక వెబ్ సైట్ www.enslive.net ద్వారా  ప్రత్యేక కథనం ప్రచురిచింది. దీనితో విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వెంటనే ఆదిశగా చర్యలు చేపట్టింది.  ఈనేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత ప్రత్యేక కార్యదర్శిలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందులో భాగంగా సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారు, ఇంకా పూర్తికాని వారు, జిల్లా పరిధిలోని బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలు, పరస్పర బదిలీలు(మ్యూచ్ వల్) తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని విధివిధానాలు, నిబంధనలను రూపొందించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 15వేల 4  గ్రామ, వార్డు సచివాలయాల్లో  1.25 లక్షల మంది ఉద్యోగులు 19 ప్రభుత్వ శాఖలకు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. వీరంతా మూడు దశల్లో  అంటే రెందు దఫాలుగా నోటిఫికేషన్లు, మరికొందరు కారుణ్య నియామకాల ద్వారా విధుల్లోకి చేరారు. వీరిలో నోటిఫికేషన్ల ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులందరి సర్వీసులు ప్రొభేషన్లు ఖరారు అయ్యాయి. కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇంకా ప్రొభేషన్ ఖరారు కావాల్సి ఉన్నది. కాగా ఇటీవలే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో అసెంబ్లీలో చట్టబద్దత తీసుకురావడానికి కేబినెట్ లో నిర్ణయించింది. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.  ఈ క్రమంలో ఉద్యోగులంతా విధుల్లోకి చేరి మూడేళ్లు దాటిపోవడంతో ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా వీరికి కూడా బదిలీలు చేపట్టాలని ఉద్యోగు సంఘాల అభ్యర్ధన మేరకు అంగీకారం చెప్పింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల్లోని సబార్డినేట్ సర్వీస్ రూల్సుని గ్రామ, వార్డు సచివాలయశాఖకు కూడా అమలు చేయాలి. కాకపోతే కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో వీరికి ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ సైతం ప్రకటించారు.

ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారులు మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఆన్ లైన్ విధానంలోనే ఆప్షన్లు ఏర్పాటుచేసి బదిలీలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దానికోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా రూపొందించనున్నారు. అక్కడే ఆప్షన్లు, స్థానిక బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలు, పరస్పర బదిలీలు, సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి ఒకలా, ఇంకా పూర్తికాని వారికి ఒకలా చేసే విధంగా నిబంధనలు రూపొందించే అవకాశాలున్నాయని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. ఈ బదిలీల ప్రక్రియ మొత్తం మూడు నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకోగా.. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేస్తున్న 19 ప్రభుత్వశాఖలకు చెందిన కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిల నుంచి ఆయా ప్రభుత్వశాఖల సర్వీస్ రూల్స్ ను కూడా తెప్పించి క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.. ఈ బదిలీలన్నీ పారదర్శకంగా చేపట్టాలంటే ముందు ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేవిధంగా విధివిధానాలు రూపొందించిన తరువాత ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే తీపి కబురు బదిలీల ప్రత్యేక జీఓ ద్వారానే చెప్పే అవకాశం ఉంది...!

Tadepalli

2023-04-28 03:15:21

మే 4న తిరుమల‌లో శ్రీ నృసింహ జయంతి

తిరుమల‌ శ్రీవారి ఆల‌యంలో మే 4న నృసింహ జయంతి జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూల‌మూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా తిరుమల‌ వసంత మండపంలో మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల‌ వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.  శ్రీవారి ఆల‌య మొదటి ప్రాకారంలో గర్భాల‌యానికి ఈశాన్యం వైపున గల‌ మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆల‌యం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆల‌యంలో శ్రీ రామానుజాచార్యుల‌ వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Tirumala

2023-04-27 11:26:34

ఆన్ లైన్ రిజర్వేషన్ లో అన్నవరం వసతి గదులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం వసతి సౌకర్యాల రిజర్వేషన్ ఆన్ లైన్ చేశారు. ఈ మేరకు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ మీడియాకి  ఒక ప్రకటన జారీచేశారు. ప్రస్తుతం వివిధ కాటేజీలలో అందుబాటులో ఉ న్న వసతి, గదులు 50% కోటాను ఆన్ లైన్ లో ఈనెల 26 నుంచే అందుబాటులో ఉంచారు(దీని నుంచి ఎస్ఆర్సీ, ఎస్న్సీని మినహాయిం చా రు).  ఇప్పటివరకూ అన్నవరం దేవస్థానంలో కాటేజీల బుకింగ్ ఒక ప్రహసనంలా ఉండేది. కొత్తగా దేవదాయశాఖలో కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.సత్యన్నారాయణ బాధ్యతలు తీసుకున్న తరువాత భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అన్నవ రంలోని గదుల రిజర్వేషన్ ఆన్ లైన్ చేశారు. ఇక నుంచి భక్తులు  www.aptemples.ap.gov.in ద్వారా 50% వసతిని నేరుగా రిజర్వేషన్ ఆన్ లై న్ లో చేసేకోవచ్చు. తద్వారా దళారీ వ్యవస్థకు చాలా వరకూ అడ్డకట్ట వేసినట్టు కూడా అయ్యింది.

Annavaram

2023-04-26 08:57:16

జిల్లాశాఖల తరువాతే సచివాలయ ఉద్యోగుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 75 శాఖల్లోని జిల్లా అధికారులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తరువాతనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈమేరకు జిఏడిలోని అధికారులు ఆయాశాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈనెలాఖరులేదా వచ్చే నెల మొదటి వారంలో జిల్లాఅధికారుల బదిలీల తరువాత మిగిలిన ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా అన్ని ప్రభుత్వశాఖల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టభద్దత ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈకారణంగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల నిబంధనలు అమలు చేయాలా..? లేదంటే ప్రత్యేకంగా వీరి కోసం నిబంధనలు రూపొందించాలా అనే విషయాన్ని సచివాలయశాఖ ప్రత్యేక కార్యదర్శి ముఖ్యమంత్రి దృష్టికి, జిఏడి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే సచి వాలయ ఉద్యోగుల బదిలీలకు  విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయంటున్నారు రాష్ట్ర అధికారులు.!

Tadepalli

2023-04-26 04:57:16

ఏపీ ఉద్యోగులకు మరో 46 రకాల వైద్యసేవలు

ఆంధ్రప్రదేశ్ లోని  ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మేలు కలిగేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉ‍ద్యోగుల హెల్త్‌ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్‌ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ జీఓఎంఎస్ నెంబరు 49ని విడుదల చేసింది. ఇక ప్రతీ ఉద్యోగుల హెల్త్ కార్డులను ఏటా రెన్యువల్‌ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్‌(సర్జికల్ అంకాలజీ-10,  మెడికల్ అంకాలజీ -32, రేడియేషన్ అంకాలజీ-4) చికిత్సలు అందేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా అందులో వివరించింది. కాగా,  రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకు ఆదేశించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Tadepalli

2023-04-19 14:07:31

విశాఖలో సెప్టెంబరు నుంచి పరిపాలన..సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖకు షిఫ్ట్ అవుతా మని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ విశాఖ ఆమోదయోగ్యమైనదని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుగా ప్రకటిం చినట్టు గా పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడే ఉన్నామన్నారు. విశాఖ నుంచి పరిపాలన చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎంఓ లోని పరిపాలనా విభాగంలోని సీనియర్ ఐఏఎస్ లను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో కొన్ని భవనాలు సీఎం కార్యాల యం, క్యాంపు కార్యాలయం జిఏడి కి పనికొచ్చేలా సిద్ధం చేసినట్టు సమాచారం. గీతం యూనివర్శిటీకి దగ్గర్లో నిర్మాణం అవుతున్న భారీ కట్టడా లు కూడా ప్రభుత్వశాఖల కోసమే వినియోగించనున్నారని కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనలో వైఎస్సార్సీ పీ ఉత్తరాంధ్రా శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Tadepalli

2023-04-19 06:59:03

విజెఎఫ్ పాలకవర్గంలో ఎవరికి సొసైటీ రూల్స్ తెలుసు?!

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)లో కార్యవర్గం అంటే ఒక ఆదాయ వనరు అంటే తెలుసుగానీ..అదొక సొసైటీ/ట్రస్టు/సంఘం అని..అది (Under Section 23 Of The Andhrapradesh Societies Registration Act-2001)లోబడే ఉందని, ఇదికూడా చట్ట పరిధిలోకే వస్తుందని, సొంతనిర్ణయాలు, కాలం చెల్లిపోయిన పాలవర్గం కార్యక్ర మాలు చట్టవ్యతిరేకమని ఎవరికైనా తెలుసా? నిజంగా విజెఎఫ్ బయిలా ప్రకారమే ప్రస్తుత పాలకవర్గం నడుచుకుంటే..కోర్టుకేసుల విషయం కేసుల నెపంతో 12ఏళ్లు గడిపే సిన కాలంలో సర్వసభ్య సమావేశం పెట్టి చెప్పాలని తెలీదా? లేదంటే భారత రాజ్యాంగం విజెఎఫ్ కి ఏమైనా అతీత శక్తులు, అవకాశాలు, మినహాయింపులు ఇచ్చిందా? ఎం తకాలమైనా ఇష్టం వచ్చినట్టు జనరల్ బాడీ సమావేశాలు, ఆడిట్ లెక్కలు తేల్చకుండా, సొసైటీని నిబంధనల ప్రకారం రెవిన్యువల్ చేయకుండా ప్రత్యేక అనుమతులు తె చ్చుకుందా..? కాస్త చెప్పండి బాబు ఇప్పటికైనా తెలుసుకుంటాం అంటున్నారు జర్నలిస్టులు.

Visakhapatnam

2023-04-17 17:47:54

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సెల్ ఫోన్ డౌన్ మొదలైంది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీజేఏసి ఉద్యోగులు అసలైన నిరసన మొదలు పెట్టారు.. ఒకరోజంతా ఉద్యోగులు సెల్ ఫోన్ వాడకూడదు. మామూ లుగా ఉద్యోగులు పనిచేస్తేనే పనులు అంతంత మాత్రంగా పనిచేస్తాయి. అలాంటి ఒకరోజంతా ఉద్యోగులు వారి వారి సెల్ ఫోనులు వినియో గిం చకుండా నిరసన తెలియజేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే అది ఊహకే అందదు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజె న్సీ, Ens Live App, www.enslive.net లో ఇటీవలే ఉద్యోగుల వర్క్ టు రూల్ నిరసనలో సెల్ ఫోన్ లు కూడా పాల్గొంటాయని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అపుడు ఉద్యోగ సంఘాలు ఆవిషయాన్ని లైట్ తీసుకున్నాయి. కానీ ఇపుడు ఉద్యోగులు ఒక రోజు సెల్ ఫోన్ డౌన్ చేస్తున్నారని అమరావతి ఏపీజెఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించడంతో ఈఎన్ఎస్ ప్రచురించిన కథనం వాస్తవమేనని.. ఒక్కసారి ఉద్యో గులు రాష్ట్రవ్యాప్తంగా సెల్ డౌన్ చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Tadepalli

2023-04-11 03:22:32

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వెహికిల్స్కు 40జీ సిరీస్​

ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తు న్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. వీటి స్థానం లో కొత్త సిరీస్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.
 
ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చే సింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనా ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Amaravati

2023-04-06 06:23:30

ఆ ఉద్యోగుల ప్రమోషన్ డౌటు.. మరి చట్టబద్దత దారెటు

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటికీ ప్రమోషనల్ ఛాన ల్  ప్రభుత్వం విదివిధానాలు రూపొందిం చలేదు. కనీసం ఈశాఖకు చట్టబద్దత కూడా కల్పించలేదు. కాకపోతే మంత్రివర్గ సమావేశంలో చట్ట బ ద్దతకి ఆమోదం మాత్రమే తెలిపారు. 19విభాగాల ఉద్యోగుల్లో ఇప్పటివరకూ కేవలం 5విభాగాల ఉద్యోగులకు మాత్రమే ప్రమోషనల్ ఛానల్ రూ పొందించారు. ఉదాహరణకు మహిళా పోలీసులను తీసుకుంటే మొదటి ప్రమోషన్ ఆరేళ్లు దాటగానే హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తా రు. తరువాత ఐదేళ్లకు ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వరకూ వీరి పదోన్నతులున్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు గ్రామ, వార్డు సచివాలయ శాఖకు అ సెంబ్లీలో చట్టబద్దత తీసుకురావాలి. దానికంటే ముందు మిగిలిన విభాగాల సిబ్బందికి, సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేయా లి.  అయితే వీరి సర్వీసు రెగ్యులరైన 6ఏళ్లా, లేదంటే విధుల్లోకి చేరిన ఆరేళ్లకు పదోన్నతిస్తారా అనేది క్లారిటీలేదు..!

Amaravati

2023-04-06 01:18:45

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌

శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు. ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు,  మామిడాకులు, మామిడికాయలు, ఆస్ట్రేలియా ఆరెంజ్, వాషింగ్టన్ ఆపిల్,  ద్రాక్ష, చిలకలు, తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయపుష్పాలు,  30 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌  శ్రీనివాసులు పర్యవేక్షణలో 3 రోజులపాటు 60  మంది అలంకరణ నిపుణులు, 30 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం పనిచేశారు.
 

Ontimitta

2023-04-05 15:39:01

ఎన్నికలకు ఇంకా ఏడాది..ఉద్యోగుల పదోన్నతి జాడేది..?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నది. నేటి వరకూ 75 ప్రభుత్వ శాఖల్లో పదోన్న తుల ఫైళ్లు మాత్రం ముందుకి కదలడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమకు పదోన్నతులు వస్తాయని ఎదురు చూసిన ఉద్యోగులు, అధి కారులకి కొంతమేర మాత్రమే న్యాయం జరిగింది. ఇంతా అత్యధిక ప్రభుత్వశాఖల సిబ్బంది, అధికారులు వారి పదోన్నతల కోసం తమ రాష్ట్ర కార్యాలయం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటు అయిన తరువాత అన్నిశాఖల ఉద్యోగులకు పదోతన్నతులు కల్పించడం ద్వారా క్రిందిస్థాయి ఉద్యోగులు, అధికారుల ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలిసేది. కానీ ప్రభుత్వం ఉద్యోగుల పదో న్నతుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందని..ఇంకో 6నెలల్లో తమకు పదోన్నతులు రాకపోతే, మళ్లీ వచ్చే ప్రభుత్వం వరకూ వేచి చూడా ల్సిందేనని..ఈలోగా ఎంతమంది ఉంటారో, మరెంత మంది సర్వీసులోనే కాలం చేస్తారో నని ఉద్యోగులు వాపోతున్నారు.

Tadepalli

2023-04-05 06:39:54

రిటైర్డ్ ఉద్యోగులకు 4వ తేదీవచ్చినా పెన్షన్లు పడలేదు

ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3.50లక్షలకు పైగా ఉన్న రైటర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4వ తేదీ వచ్చినా పెన్షన్లు పడేలేదు. మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులకే ఆలస్యం అయ్యేది ఇపుడు పెన్షనర్లమైన మాకు కూడా ప్రభుత్వం పెన్షన్లు ఆలస్యంగానే వేస్తోందని అంటున్నారు పెన్షనర్లు. తమ సర్వీసు మొత్తం ప్రభుత్వంలోనే చేసినా..నేడు పెన్షన్లు ఎప్పుడు పడతాయాని ఎదురుచూసే రోజులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకరి దశలో కాస్త సేదతీరుదామంటే, ఒకటో తేదీన పడాల్సిన పెన్షన్లు ఎప్పుడు పడతాయాని రోజులు లెక్కించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

Amaravathi

2023-04-04 07:19:36