1 ENS Live Breaking News

విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్బంగా సీఎం జగన్‌ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని, విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు సీఎం జగన్‌. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు. 

Amaravati

2023-09-20 08:42:07

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో సేవింగ్స్ చేసుకునేందుకు వీలుగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను ఉద్యోగులకు ప్రత్యేకంగా తెరిచి వారి శాలరీ బ్యాంకు ఖాతాలను కూడా లింక్ చేసింది. తద్వారా ఉద్యోగులు పెట్టుకున్న కటింగ్స్ నేరుగా పిపిఎఫ్ అకౌంట్ లోకి జమ అవుతా యి. వాస్తవానికి ఉద్యోగంలోకి చేరిన వెంటనే పిపిఎఫ్ అకౌంట్లు ప్రభుత్వం తెరవాల్సి వుంటుంది. కానీ ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సుమారు ఆరు నెలలకు ఈ ఖాతాలను తెరిచింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన తొలి ఏడాది ఇంక్రిమెంట్ ఆర్డర్లు 19శాఖల సిబ్బందికీ పూర్తిస్థాయిలోరాలేదు. ఆయా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఉంచి జిల్లా నేరుగా వీరికి సమాచారం అందుతుంది. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెం ట్లను ఇవ్వలేదు. కొత్తగా వేసిన ఇంక్రిమెంటుకి ఆర్ఢర్లు అందరికీ పూర్తిగా రాకపోవడం విశేషం.

Tadepalli

2023-09-08 11:55:27

రాష్ట్రంలో 10 మంది ఐపిఎస్ లకు బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌషల్‌,  అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా విశ్వజిత్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా త్రివిక్రమ వర్మ, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్‌,విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా కే. శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్‌ ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడు, అనంతపూర్‌ 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఆర్‌. గంగాధర్‌రావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయిం అస్మీ, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్‌ నియామకం అయ్యారు. విశాఖ సిపి త్రివిక్రమ వర్మను అత్యంత తక్కువ సమయంలోనే బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో విశాఖ సిపీ ప్రభుత్వం అడిషనల్ రేంక్ అధికారిని నియమించింది.

Tadepalli

2023-09-05 09:47:20

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో శుభవార్త..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పబోతున్నట్టు తెలిసింది. సచివాలయశాఖలో ఉన్న 19 విభాగాల్లో ఇన్ సర్వీస్ కోటాలో ఉద్యోగులకు ఉన్నత చదువులు, శిక్షణకు లైన్ క్లియర్ చేసేందుకు యోచన చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏఎన్ఎంలుగా  పనిచేస్తూ ఇంటర్ క్వాలిఫై అయిన వారికి జిఎన్ఎం(నర్శింగ్)లో శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వం . ఇక వ్యవశాయశాఖలోని డిప్లమా అగ్రికల్చర్, డిప్లమా హార్టికల్చర్, డిప్లమా సెరీకల్చర్, డిప్లమా ఫిషరీష్, డిప్లమా యానిమల్ హజ్బండరీ, డిప్లమా ఎలక్ట్రికల్, డిప్లమా ఇంజనీరింగ్, క్వాలిఫికేషన్ తో ఉద్యోగాల్లోకి చేరిన వారికి వారి మెరిట్ ఆధారంగా ఇన్ సర్వీసు శిక్షణ ఇస్తే పదోన్నతులతోపాటు త్వరలో ఖాళీలు కాబోతున్న ఉద్యోగాలను కూడా భర్తీచేయాలని యోచిస్తున్నది. ఉద్యోగులకు ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు పదోన్నతి ఉద్యోగాలకు అర్హులవుతారు. అదే కొత్త ఉద్యోగాలు భర్తీచేయాలంటే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అదే ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులకే ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వడం ద్వారా త్వరలో ఖాళీలు కాబోతున్న స్థానాలకు వీరిని సిద్ధం చేయవచ్చు. అదేవిధంగా మళ్లీ ఖాళీలు భర్తీచేయాలనుకుంటే సచివాలయశాఖలోనే భర్తీచేయడం ద్వారా తక్కువ జీతంతో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం వుంది. దీనితో ఏఏ శాఖల్లోని ఉద్యోగులు ఇన్ సర్వీసు శిక్షణకు అర్హులుగా ఉన్నారనే కోణంలో జోరుగా పరిశీలనలు జరుగుతున్నాయని సమాచారం.

వైఎస్సార్సీపీ అధికారంలోని వచ్చిన తరువాత రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు విరమణ వయస్సుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఆ పెంచిన వయస్సు కూడా 2024 డిసెంబరులోగా వివిధ నెలలతో పూర్తయి ఉద్యోగ విరమణలు జరుగనున్నాయి.  ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి. వాటిని భర్తీచేయాలంటే ప్రభుత్వంపై అత్యంత అధిక ఆర్ధిక భారం పడుతుంది. అలాంటి సందర్భంలో ప్రస్తుతం 19 విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆ ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించడానికి కూడా సర్వీసు నిబంధనలు అడ్డంకి తొలగుతుంది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు 2 పీఆర్సీలు, బకాయిపడ్డ ఇంక్రిమెంట్లు వర్తింపజేస్తే సాధారణ మండల స్థాయి ఉద్యోగుల పేస్కేలుకి చేరుకుంటారు. దీనితో వారికి ఇచ్చే ఇన్ సర్వీసు శిక్షణ వలన మండల స్థాయిలో ఉద్యోగులను ప్రత్యేకంగా అత్యధిక జీతంతో నియమాకాలు చేపట్టే పనుండదు. ఏదైనా కొత్త ఉద్యోగాలు భర్తీచేయాలన్నా క్రింది స్థాయి ఉద్యోగాలతోనే భర్తీచేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులుకు పదోన్నతులు, ఇన్ సర్వీసు శిక్షణ, ప్రభుత్వంపై ఆర్ధిక భారం అన్నీ తగ్గుతాయి. 

రాష్ట్రంలో వివిధశాఖల్లోని ఉద్యోగాల్లో చాలాశాఖల్లో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీచేయాలంటే గ్రూప్-1, 2, 4, 5 కేటగిరీల్లో భర్తీచేయాల్సి వుంటుంది. ప్రస్తుతం
ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇస్తే  తద్వారా చాలా మంది గ్రూపు-2 కేడర్ కు చేరుకుని మండల స్థాయి అధికారులుగా మారే అవకాశం ఉంటుంది. అప్పటికే మండల స్థాయి అంటే గ్రూపు-2 కేటగిరీల్లో ఉన్న అధికారులు పదోన్నతుల ద్వారా గ్రూప్-1 అధికారులుగా మారడానికి అవకాశం వుంటుంది. అప్పుడు ఉద్యోగాల కల్పన, జీతాలు చెల్లింపుల భారం ప్రభుత్వంపై పెద్దగా ఉండదు. దానికి తోడు ఉద్యోగులందరికీ సకాలంలో పదోన్నతులు ఇస్తున్నప్రభుత్వంగా కూడా కీర్తిని ఆర్జించవచ్చు. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ శిక్షణ, లేదా చదువు చెప్పించడానికి సర్వీసు రూల్స్ ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వాలంటే ప్రభుత్వ కళాశాలల్లోనే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల్లో అవకాశం ఉన్నంత మేరకు ఎక్కువ మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం చేస్తున్న విధులకు ఆటంకం రాకుండా నైట్ కాలేజీ విధానం లేదా, ప్రత్యేక పూర్తిస్థాయి ఇన్ సర్వీసు శిక్షణ విధానంలో ఉద్యోగులను ఎంపికి చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచం అందుతున్నది. 

డిప్లమా అగ్రికల్చర్ చేసిన వారికి బిఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సర్వీసు శిక్షణ వచ్చి పూర్తయితే వీళ్లు మండల అధికారులుగా పదోన్నతి పొందవచ్చు. డిప్లమా హార్టికల్చర్ వారికి బిఎస్సీ హార్టికల్చర్ శిక్షణ పూర్తిచేసుకుంటే వీరు మండల హార్టికల్చర్ అధికారిగా పదోన్నతి పొందవచ్చు. డిప్లమా సెరీ కల్చర్ వారు బిఎస్సీ సెరీకల్చర్ పూర్తిచేస్తే మండల సెరీకల్చర్ ఆఫీసర్, డిప్లమా ఫిషరీష్ వాళ్లు బిఎస్సీ ఫిషరీష్ పూర్తిచే ఎఫ్డీఓ లేదా ఎఎఫ్ఇ, డిప్లమా వెటర్నరీ సైన్స్ వాళ్లు పశువైద్యులు , బివిఎస్సీ, డిప్లమా ఇంజనీరింగ్ వాళ్లు బిటెక్ ఇంజనీరింగ్( సివిల్, అండ్ ఎలక్ట్రకల్, అండ్ మెకానికల్) మండల ఇంజనీరింగ్ అధికారులు ఏఈగానూ,విద్యుత్ శాఖలో ఏఈలుగానూ  ఏఎన్ఎం చేసిన వారు జిఎన్ఎం(నర్శింగ్) పూర్తిచేసిన వారు స్టాఫ్ నర్సులుగానూ పదోన్నతులు పొందడానికి అవకాశం వుంటుంది. ఇప్పటికే ఏఎన్ఎంల ఇన్ సర్వీసు శిక్షణను రాష్ట్రప్రభుత్వం మరో ఏడాదిలో పూర్తిచేయబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7నుంచి 10వేల మందికి పైగా జిఎన్ఎం శిక్షణ పూర్తిచేయబోతున్నారు. వీరంతా శిక్షణ అంనంతరం మళ్లీ సచివాలయాలు, లేదా గ్రామీణ విలేజ్ క్లినిక్ విధులు నిర్వహించడానికి వినియోగించుకునే అవకాశం వుంటుంది. కాగా ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లుగా ఉన్నవారికి ఇన్ సర్వీసు బిఈడి లేదా డిఈడి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులుగా లేదా హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా పదోన్నతి కల్పించే అవకాశాలు, ఇతర శాఖల ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షల ద్వారా పదోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భారం పూర్తిగా తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. చూడాలి ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

Amaravati

2023-08-27 02:31:09

గ్రామ, వార్డు సచివాలయశాఖను కదిలించిన ఆర్టీఐ

ఏపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై దాఖలైన సమాచారహక్కు చట్టం దరఖాస్తుపై స్పందించింది. ఉద్యోగులకు సర్వీసు రూల్స్ అమలు చేస్తూ జీఓల ఆధారంగా పదోన్నతులు కల్పిస్తున్నది. శ్రీకాకుళంజిల్లాలో 10మంది, గుంటూరు జిల్లాలో 1, వైఎస్సార్‌ జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 2 చొప్పున పదోన్నతులు పొందారు. మిగిలిన జిల్లాల్లో 35మందికి పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 17శాఖల సిబ్బందికే ప్రమోషన్ ఛానల్ ఉండగా, ఇంజనీరింగ్ , ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. వారికి కూడా త్వరలోనే విధి విధానాలు ఖారారు చేయనుంది . అదే సమయంలో ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, పీఆర్సీ అరియర్స్, 9నెలల బకాయిల విషయం, మిగులు ఉద్యోగాల ఖాళీలపైనా స్పష్టత రానుంది.

Vijayawada

2023-08-26 06:36:47

పదోన్నతులు సరే.. ఎగ్గొట్టిన ఆ ప్రయోజనాల మాటేమిటి..?!

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగిచూసేలా గ్రామంలోనే సేవలు అందేలా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి ఒకేసారి 1.26లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వం సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కాకుండా ఇపుడు పదోన్నతులు కూడా ఇస్తుండటం ఎంతో శుభపరిణామం. ప్రజల సేవల కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మాత్రం ఇంకా మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది..కాదు కాదు ఆ విషయాన్ని మాట్లాడకుండా చేస్తున్నదనే అపవాదుని మూటగట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో ఉద్యోగాలు పొందిన సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో మరెందరో ఉద్యోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం సాధారణ సెలవులు, 2వ శనివారాలు, ఆదివారాలు కూడా తీసుకోకుండా పనిచేసిన ఉద్యోగులకు మాత్రం రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలను, బకాయిలను మాత్రం పూర్తిగా పెడచెవిన పెట్టింది. వాటికోసం ఏమీ మాట్లాడకుండా ఇపుడు పదోన్నతులు ఇస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఒకేసారి లక్షా 26వేల మంది ఉద్యోగులను నియమించి.. ఆతరువాత కారుణ్య నియామకాల్లో మిగిలి పోస్టులు భర్తీ చేయడం ద్వారా సుమారు లక్షా 34 వేల ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు విషయం పెద్ద లెక్కేం కాదు. ఇక్కడ ఈశాఖను చూసే రాష్ట్ర అధికారులు ఆ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లలేదా.. కావాలనే ప్రయోజనాలేమీ ఇవ్వకుండా వారికి పదోన్నతులు ఇచ్చేస్తే ఇవ్వాల్సిన ప్రయోజనాల మాట అడగరని అధికారులు భావించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారా అనే విషయం తేలడం లేదు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాల్లోనే రెండేళ్లు ప్రొబేషన్ తరువాత సర్వీసులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వ కంగా తెలియజేసింది. కానీ వీరి ఉద్యోగాలనే 2.9 ఏళ్ల తరువాత దశల వారీగా క్రమబద్దీకరణ చేస్తూ వచ్చింది అదీ కూడా వీరికి ప్రత్యేకంగా పెట్టిన పరీక్షలు పాసైన వారికి. ఇంకా నేటి వరకూ చాలా మందికి ఉద్యోగాలు కూడా రెగ్యులర్ కాలేదు. అలా తొమ్మిది నెలలు అదనంగా పనిచేయించుకున్న సమయంలో ఉద్యోగులు తొమ్మిది నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు సుమారుగా రెండు డిఏలు కూడా కోల్పోయారు. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన తొలి రెండు ఇంక్రిమెంట్లను ప్రభుత్వం నేటి వరకూ ఉద్యోగుల బేసిక్ పేకి కలపనేలేదు. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రెండేళ్లు ప్రొభేషన్ అంటే ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను అనుసరించి రెండు ఇంక్రిమెంట్లను కలిపి వారి పేస్కేలు రివైజ్డ్ చేసి సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సి వుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే సమయంలో సచివాలయ ఉద్యోగులకు కూడా వాటిని వర్తింపచేస్తున్నామని పేస్కేలు పెంచి  వీరికి పీఆర్సీ అరియర్సు ఇవ్వ లేదు. అంతేకాదు వీరికి పీఆర్సీ ఇచ్చే ముందే ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఏ, డిఏల్లోనే ముందుగా ప్రత్యేక జీఓని విడుదల చేసి కోత పెట్టింది. ఆ తరువాత మళ్లీ కాస్త మార్పులు చేర్పులు చేసి వాటిని పెంచుతున్నట్టు పాత వాటినే రివైజ్డ్ పీఆర్సీగా మార్పు చేసి వీరికి పీఆర్సీని అమలు చేసింది. ఈ ప్రయోజనాల బకాయిలను రాష్ట్రప్రభుత్వం నేటి వరకూ సచివాలయ ఉద్యోగులకు చెల్లించనే లేదు. ఇపుడు సర్వీసు రెగ్యులైజేషన్ పూర్తయిన వారికి ఒక ఇంక్రిమెంటు ఇస్తున్నట్టు చెబున్న ప్రభుత్వం పాత రెండు ఇంక్రిమెంట్ల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.

సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరి నాలుగేళ్లు పూర్తవుతున్న సమయంలో ఉద్యోగ ప్రవేశ పరీక్షలో టాప్ టెన్ లో నిలిచిన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలా తొలుత హార్టికల్చర్ విభాగంలో గ్రామీణ ఉద్యాన సహాయకులకు, విలేజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించింది. అయితే ఇక్కడ పదోన్నతి కల్పించే సమయంలోనూ వారికి 2 ఇంక్రిమెంటు కలపాల్సి వుంటుంది. కానీ వాటిని వారికి కలిపిందా..? లేదా..? అనే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మొత్తం 19శాలఖల ఉద్యోగుల్లో నేటి వరకూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయనే లేదు. వారికి ప్రస్తుత ఉద్యోగాల తరువాత ఏ పదోన్నతి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సచివాలయ మహిళ సంరక్షణా కార్యదర్శి(మహిళా పోలీసు)లకు కోర్టుకేసుల నేపథ్యంలో వారికి పోలీస్ స్టేషన్ విధులు, బందోబస్తు డ్యూటీలు వేయమని చెబుతూ డిజిపి ఆదేశాలతో వారికి పోలీసుశాఖ విధుల నుంచే పూర్తిగా పక్కన పెట్టేశారు. మిగిలిన 17శాఖల ఉద్యోగులకు ఏ తరహా పదోన్నతులు వస్తాయో అధికారులు తెలియజేస్తున్నారు తప్పితే వారికి ఇప్పటి వరకూ ఎగ్గొట్టిన ప్రయోజనాల విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఆ విషయాన్ని వీరికి సర్వీసు రిజిస్టర్ లో కూడా ఎక్కడా పొందు పరచలేదు. అసలు రెండేళ్ల తరువాత రెగ్యులర్  చేయాల్సిన ఉద్యోగాలను, ప్రభుత్వం ఆలస్యంగా రెగ్యులర్ చేయడంతోపాటు, వారికి న్యాయబద్దంగా రావాల్సిన, ఇవ్వాల్సిన ఇంక్రింమెంట్లు ఇవ్వకపోవడంపై సచివాలయ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. అయితే ఆ నిరసనను కల్పిపుచ్చడానికే పదోన్నతులను తెరపైకి తెచ్చారని ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. 

ప్రభుత్వం ప్రకటించినట్టుగా, చెప్పినట్టుగా, ఉద్యోగుల పక్షాన ప్రేమాభిమానాలు చూపిస్తున్నట్టుగా పదోన్నతులు ఇస్తే.. ఒకేసారి 1.30లక్షల మంది ఉద్యోగుల్లో సర్వీసు రెగ్యులర్ అయిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి. అలా కల్పించిన సమయంలో వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను కూడా సర్వీసు రూల్స్ ప్రకారం ఎస్ఆర్ లో నమోదు చేయాలి. ‘‘మొదటి దానికి మొగుడు లేడు.. కడదానికి కళ్యాణం అన్నట్టుగా’..’ముందు ఎగ్గొట్టిన ప్రయోజనాల విషయం తేల్చకుండా.. పదోన్నతుల విషయాన్ని తెరపైకి తీసుకురావడం అంటే ఉద్యోగులను పూర్తిగా మోసం చేయడమేనని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ సెలవురోజుల్లో కూడా ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వ విధులు ఇంటి దగ్గర నుంచే చేయిస్తూ.. జూమ్ మిటీంగులు, వివిధ రకాల సర్వేలు నిర్వహిస్తూ పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయంలో అధికారులు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఉద్యోగలకు జీతం 31రోజులకీ కలిపే ఇస్తున్నప్పుడు..ప్రభుత్వం ఎప్పుడు పనిచెబితే అపుడు చేయాలని హుకుం జారీ చేస్తున్న ప్రభుత్వం..సబార్డినేట్ సర్వీసు రూల్స్ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఎందుకు ఎగ్గొట్టిందనే విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎనర్జీ అసిస్టెంట్లలో ఇప్పటి వరకూ విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదు.

 ఇవన్నీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కి తెలిసే సచివాలయ రాష్ట్ర అధికారులు చేస్తున్నారా..? లేదంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు విధులు మాత్రం అధికంగా చేయించేసి.. తీరా ప్రయోజనాలు ఇచ్చే సమయానికి మాత్రం ఎక్కడలేని నొప్పులతో అధికారులే వారి సొంత డబ్బులు వీరికి జీతాలుగానూ, ప్రయోజనాలుగానూ ఇస్తున్నట్టు ఫీలైపోతున్నారా అనే విషయం మాత్రం తెలియడం లేదు. దేశం మొత్తం తొంగిచూసే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల శ్రమదోపిడీ చేసి కూడా వారికి న్యాయబద్దంగా..చట్టబద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాల ఇచ్చేందుకు సాకులు చూపడాన్ని ఏమంటారో ప్రభుత్వమే ఉద్యోగులకు సమాధానం చెప్పాల్సి వుంది. ఉద్యోగులకు ఎన్నడూ లేనివిధంగా పదోన్నతులు ఇస్తున్నామని గర్వంగా చెబుతున్న ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రయోజనాలను ఇస్తుందా..? లేదటే వాటికి ఈ పదోన్నతులను ముడిపెడుతుందా..? లేదంటే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని అంటగడుతుందా..? అదీ కాదంటే ఈ శాఖకు చేయాల్సిన చట్టబద్దత.. వచ్చే ఎన్నికల నాటికి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఒక హామీగా దాచుకుంటుందా అనేది కూ డా తేలాల్సి వుంది..గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కమిషనర్, ఇద్దరు డైరెక్టర్లు, జిల్లాల్లో కలెక్టర్లు, మండలాల్లో ఎంపీడీఓలు ప్రత్యేకంగా మానటరింగ్ చేస్తున్నా.. ప్రభుత్వంలో జరిగిన తప్పుని మాత్రం ఎక్కడా ఒప్పుచేసే పనికి పూనుకోవడం లేదు. ఇదే పద్దతి కొనసాగితే దీని ప్రభావం వచ్చే 2024 ఎన్నిల్లో తప్పని సరిగా పడుతుందనే ప్రచారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది.. విధినిర్వహణ విషయంలో ఆంక్షలు, ఆదేశాలు, టార్టెట్లు పెట్టే ప్రభుత్వం తీరా తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఏం మాట్లాడకుండా ఉండటాన్ని పరిశీలకులు కూడా రక రకాలుగా అంచనాలు వేస్తున్నారు.. ?!
 

Tadepalli

2023-08-26 05:02:37

తిరుమలలో మరో ఐదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

తిరుమల కాలిబాటల సమీపాన మళ్లి ఐదు  చిరుతల కదలికలు కనిపించాయి. నామాల గవి, నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో ఐదు చిరుతల కదలికలు గుర్తించారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు బోన్లు పెట్టి మూడు చిరుతలను బంధించగా ఇపుడు కనిపించినవి కొత్తవిగా భావిస్తున్నారు. తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాప్‌ కెమెరాల ఆధారంగా ఇంకా ఐదు చిరుతలు ఉన్నట్లు- అధికారులు గుర్తించారు. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి..వాటిని ఎలా బంధించాలి అనే దానిపై అటవీ శాఖ వ్యూహం సిద్ధం చేస్తోంది. త్వరలో వాటిని బంధించి జూకు తరలిస్తామని డిఎఫ్‌ఓ సతీష్‌రెడ్డి చెబుతున్నారు. గతంలో అప్పుడప్పుడు తిరుమల కాలినడక బాట, అడవికి సమీపాన ఉండే గెస్ట్‌హౌస్‌ల వద్ద మాత్రమే కనపించిన వన్యమృగాలు.. ఇటీవల జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే ధైర్యంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

 నడకదారి భక్తబృందంలోని ఓ బాలుడిపైన చిరుత దాడి చేసి గాయపరచడం, ఇటీవల బాలిక లక్షితను ఓ పొట్టన పెట్టుకోవడడం వంటి సంఘటనలతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నా యి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ కాలినడక మార్గాలు ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.  దీంతో టిటిడి అటవీ శాఖ వన్యమృగాల రాకను అడ్డుకోవడానికి భక్తులలో నెలకొన్న భయాందోళ నలు తొలగించడానికి అనేక చర్యలు చేపట్టాయి. తిరుమలలో సాగుతున్న ఆపరేషన్‌ చిరుతలో భాగంగా కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ చిరుత బోను దగ్గరికి వచ్చి వెంటనే పక్క నుంచి వెళ్లిపోయిందని డిఎఫ్‌ఓ చెప్పారు. మరో ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు- గుర్తించారు. వీటిని బంధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Tirupati

2023-08-25 17:02:57

బయో మెట్రిక్ అటెండెన్స్ వేయకపోతే జీతానికి రంగుపడుద్ది

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జిఎస్ డబ్ల్యూఎస్ యాప్ ద్వారా నూరుశాతం బయో మెట్రిక్ అటెండెన్సు పడితేనే ఉద్యోగులకు ఇకపై పూర్తిస్థాయి జీతాలు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులు విధిగా ఉదయం విధులకు వచ్చినపుడు పది గంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఖచ్చితంగా హాజరు వేయాల్సి వుంటుంది. కాగా చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉత్తర్వులను పెడచెవిన పెట్టి వారికి నచ్చినట్టుగా ఉద్యోగాలు చేస్తూ బయో మెట్రిక్ అటెండెన్స్ వేయడం మానేస్తున్నారు. దానిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. అటెండెన్సు ఆధారంగానే జీతాలు ఇస్తామని సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానికోసం గ్రామ,సచివాలయశాఖ డైరెక్టర్ డా.లక్ష్మీషా మెమో-114/F/2022ను జారీచేశారు. ఈ మెమో ప్రకారం ఆగస్టు 1నుంచి 31 వర్తిస్తాయని, దానికి బాధ్యత డిడిఓలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. దీనితో ఉద్యోగులు క్రమం తప్పకుండా బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. 

Vijayawada

2023-08-25 04:14:20

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు దారెటు..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖకి బాలారిష్టాలు తీరకపోగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్  అధికారుల ముందుచూపులేకపోవడం, సరైన మార్గదర్శకాలు రూపొందించకపోవడం, ఉద్యోగనిమకాల్లో నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలు ఇపుడు ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించాయి. గ్రామాల్లో రక్షణ, విద్యార్ధినిలు, మహిళలు, గృహిణిల సంరక్షణార్ధం నియమించిన సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. అసలు వీరు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులా..లేదంటే..మరే ఇతర శాఖకు చెందిన ఉద్యోగులో తెలియని పరిస్థితి కోర్టుకేసులతో దాపురించింది. వీరి నియామకాలు పోలీసు నియామ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఏ ముహూర్తాన ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రైవేటు కేసు హైకోర్టులో పడిందో నాటి నుంచి నేటివరకూ కోర్టు కేసులు ఈశాఖను వెంటాడుతూనే ఉన్నాయి. ఫలితంగా సచివాలయ మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ విధులు, బందో బస్తు డ్యూటీలు అప్పగించమని నేరుగా ఆంధ్రప్రదేశ్ డిజిపి కోర్టుకి విన్నవించుకోవాల్సి వచ్చింది. అక్కడితో కధ ఆగిందా అనుకుంటే అక్కడి నుంచే కష్టాలు మరింత  ఎక్కువై..వీరిని దారుణంగా వెంటాడుతున్నాయి. నేరుగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి 26 జిల్లాల ఎస్పీలకు, సిపిలను మహిళా పోలీసులను పోలీసుశాఖ విధులకు వినియోగించవద్దని హెచ్చిరించి చెప్పినా ఫలితం లేకపోయింది. డిజిపి మాటలు, కోర్టు ఉత్తర్వులు నీటి మీద రాలతే అనుకున్నారో ఏమో పోలీసు అధికారులు..ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ..వారిని కోర్టు కేసు తరువాత కూడా స్టేషన్ డ్యూటీలు, తీర్ధాలు, ఉత్సవాల్లో బందో బస్తు డ్యూటీలకు వినియోస్తూ కోర్టు దిక్కారానికి, డిజిపి ఆదేశాల బేఖాతరుకు పాల్పడుతున్నారు.

సచివాలయ మహిళా పోలీసులను పోలీసుశాఖ ద్వారా నియమించినప్పటికీ వీరికి ఐసిడిఎస్, ఎన్నికల కమిషన్ బిఎల్వో, సచివాలయాల్లో ఇతర ప్రభుత్వ పథకాల విధులు అప్పగించారు. అంతేకాదు వీరికి ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేక జీఓ ఇచ్చారు. ఇపుడు ఆ జీఓ పనిచేస్తుందో లేదో తెలియకుండా పోయింది. పోలీసుశాఖ ద్వారా నియమితులైన మహిళా పోలీసులకు ఏకంగా ఆ పోలీసుశాఖ విధులే అప్పగించమని డిజిపి ఏపీ హైకోర్టుకి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అలాంటపుడు వీరు ఏ ప్రభుత్వశాఖకు చెందుతారు..? వీరికి డ్యూటీ చార్టు ఏవిధంగా అమలు చేస్తారనేది ప్రశ్నార్ధకమైంది..? ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో పోలీసులు డిజిపి ఆదేశాలున్నా వారికి స్టేషన్ డ్యూటీలు, బందో బస్తు డ్యూటీలు వేస్తుంటే..మరికొన్ని జిల్లాల్లో కోర్టులతో వ్యవహారం మనకెందుకులే అని వారిని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకూ సచివాలయ విధులకే వినియోగించుకోవాలని వదిలేశారు. దీనితో ప్రభుత్వ పథకాలు, ఇతర పంచాయతీ వ్యవహారాలకు మహిళా పోలీసులనే వినియోగిస్తున్నారు. ఈపరిస్థితుల్లో తమ పరిస్థితి ఏమిటో తమకు అర్ధం కావడంలేదని.. తమకు మళ్లీ పోలీసుశాఖనే కేటాయించాలని, యూనిఫాం ఇవ్వాలని, డ్యూటీ చార్టు అమలు చేయాలని కోరుతూ మెజార్టీ మహిళా పోలీసులు ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి తమ గోడును వెల్లగక్కుతున్నారు. వినతి పత్రాలు ఇస్తూ వారిని ప్రశన్నం చేసుకుంటున్నారు. విషయం కోర్టులో ఉండటంతో ప్రజాప్రతినిధులు మహిళా పోలీసులు చేస్తున్న వినతులను భద్రంగా తమ కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు.

 గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు ఉద్యోగాలను ప్రభుత్వం సుమారు 14వేలకు పైగా నియమించడంతో.. అసలైన కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి విఘాతం కలిగినట్టు అయ్యింది. దీనితో తాము ఉద్యోగాలు కోల్పాయమంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నవేళ..పోలీసుశాఖలోని కొందరు సిబ్బంది ప్రభుత్వం చేసిన తప్పును, నిబంధనలను బయటకు తీసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందించడంతో కోర్టులో కేసులు పడ్డాయని కూడా చెబుతున్నారు. అలా మొదటి కోర్టు కేసు పోలీసు నియామక బోర్డు ద్వారా కాకుండా వీరిని డిఎస్సీ ద్వారా ఎలా నియమిస్తారంటూ దాఖలైంది. అక్కడి నుంచి వరుస కోర్టు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుళ్లకు, హోం గార్డులకు గ్రామాల్లో కాస్త పరపతి తగ్గింది. ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా మహిళా పోలీసులనే ప్రజలు కవడం, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, సారా నియంత్రణలో కీలకంగా వ్యవహరించడం, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ లు ఇవ్వడం.. అన్ని కార్యక్రమాల్లో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలతో మహిళా పోలీసులే ఉండటంతో క్రిందిస్థాయి కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది మింగుడు పడకుండా పోయింది.. ఒకరకంగా స్టేషన్ లోని కానిస్టేబుళ్లే నేరుగా ఎస్ఐలతోనూ, సిఐలతో ప్రతినిత్యం మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది మహిళా పోలీసుకు నేరుగా ఎస్ఐలు, సిఐలు, ఇంటెలిజెన్సు సిబ్బందితో మాట్లాడే అవకాశాలు రావడం, స్టేషన్ సిబ్బంది పనులు కూడా సచివాలయ మహిళా పోలీసులతోనే చేయించుకోవాల్సి రావడంతో వారికి ఏం చేయాలతో పాలుపోకననే ప్రభుత్వ లోపాలను బయట పెట్టడం ప్రారంభించారనే విషయం ఇపుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 ఆకారణంతోనే  ఎలాగైనా మహిళా పోలీసులను పోలీసుశాఖ నుంచి వెల్లగొట్టాలనే నెపంతోనే పోలీసుశాఖలోని సిబ్బందే ప్రభుత్వం అనాలోచితంగా నియమించిన మహిళా పోలీసు ఉద్యోగాలను కోర్టు కేసుల ద్వారా ప్రభుత్వానికి విసుగు వచ్చేలా చేస్తే.. ప్రభుత్వమే వారిని వేరొక శాఖలో విలీనం లేదా, ఇదే పోలీసు శాఖలో మినిస్టీరియల్ స్టాఫ్ గా మార్చడానికి అవకాశం వస్తుందని భావించినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసు నియామక బోర్డు ద్వారా వీరి నియామకాలు జరగలేదనే విషయం, వారు పోలీసు ఉద్యోగాలకు సరిపోరనే విషయాన్ని పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది చెబితే తప్పా అసలు విషయం బయటకు రాదని, ఇది కావాలని పోలీసుశాఖ సిబ్బంది చేసిన పనిగానే ఇటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదట. గ్రామ, వార్డు సచివాలయశాఖపై మొదటి కోర్టు కేసు నమోదు అయిన దగ్గర నుంచి తరువాత కోర్టు కేసులు ఏవిధంగా నమోదు అవుతున్నాయో వాటిని కూడా ప్రభుత్వం నిసితంగా పరిశీలించడంతోపాటు, వీటి వెనుక ఎవరెవరి ఇంటి దొంగల హస్తం వుందనే విషయంలో కూడా నిఘా పెట్టినట్టు తెలిసింది. ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు పోలీసు సిబ్బంది ఇదే మహిళా పోలీసుల్లో యూనిఫారం, పోలీసు విధులు ఇష్టం లేని వారిని గుర్తించి వారి ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా కొందరు మహిళా పోలీసులు తమకు యూనిఫారం, స్టేషన్ డ్యూటీలు వద్దంటూ ప్రభుత్వానికి అర్జీలు కూడా పెట్టారు. అయితే మెజార్టీ ఉద్యోగులు పోలీసుశాఖతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పడంతో ఆ విషయం ఇపుడు ఈ శాఖలో నానుతూ వస్తోంది. పైగా ఈవిషయంలో క్లారిటీ వస్తే ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టు ఏడాదికి ఒకసారి ఐదువేల మంది కానిస్టేబుళ్లు ఇతర పోస్టులను భర్తీచేస్తుందని కూడా మహిళా పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న పోలీసుశాఖలోని పనిచేస్తున్నట్టుగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

మహిళా పోలీసుల్లో కొందరు తమకు ఈ పోలీసు విధులు వద్దని, అత్యధిక మంది కావాలని ఎవరకి వారు ప్రభుత్వానికి అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొందరు కోర్టు కేసులు కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు వేయమని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన దగ్గరనుంచి వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసలు వీరు పోలీసుశాఖ ఉద్యోగులేనా అనే అనుమానం వీరికే వస్తున్నది. తమను మళ్లీ పోలీసుశాఖలో ఉంచి తమకు డ్యూటీచార్ట్, ప్రమోషన్ ఛానల్, సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విషయం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం కూడా వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క గ్రామ, వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం కూడా చట్టబద్ధత కల్పించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగం ఉంటుందా..? ఊడుతుందా అనే భయం మరింత ఎక్కువైంది. 2024 ఎన్నికలు తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే సరేసరి..ఒక వేళ రాకపోతే తమ పరిస్థితి ఏంటనే అనుమానానికి వచ్చి తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు. మరోప్రక్క వీరికి ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోవడం కూడా వీరి ఉద్యోగంపై ఆందోళనలు మరింత ఎక్కువవుతున్నాయి. చూడాలి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఈ శాఖకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తుంది..?ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇవ్వకుండా ఉండిపోయిన ప్రయోజనాలు..పీఆర్సీ అరియర్స్ బకాయిలు, రెండు ఇంక్రిమెంట్లు, కోల్పోయిన 9నెలల పేస్కేసలు, ప్రమోషన్ ఛానల్, సర్వీసు రూల్స్, తదితర విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

Tadepalli

2023-08-24 04:22:28

సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై ఆర్టీఐ

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న సుమారు 1.30లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై సమాచారహక్కు చట్టం దాఖలైంది. సచివాలయశాఖలోని సుమారు 19శాఖల సిబ్బంది నియామకాలు, డ్యూటీ చార్ట్, సర్వీస్ రూల్స్, పీఆర్సీఅమలు, సర్వీస్ రెగ్యులర్ చేసిన సమయంలో రెండు ఇంక్రిమెంట్లు కలపకపోవడం, కోల్పోయిన డిఏలు, పేస్కేలు, డ్యూటీచార్ట్, ప్రమోషన్ ఛానల్ తదితర అంశాలపై 20 అంశాలతో కూడిన దరఖాస్తు దాఖలైంది. సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లకు చేయాల్సిన ప్రొబేషన్ డిక్లరేషన్ తొమ్మిది నెలలు ఆలస్యంగా చేశారు. అదే సమయంలో పీర్సీ అమలు చేస్తున్నారని చెప్పి వీరికి పేస్కేలు పెంచారు తప్పితే అరియర్స్ జమచేయలేదు. ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం ఏం చేస్తుంది, వీరికి జరిగిన అన్యాయంపై ఏ విధమైన సమాధానం ఇస్తుందనే సమాచారం తెలుసుకునేందుకు దాఖలైంది. అయతే ప్రభుత్వం  సమాచారం ఏవిధంగా ఇస్తుందనేది వేచి చూడాలి.

Tadepalli

2023-08-24 03:03:55

పక్కాగా హైకోర్టు ధిక్కారం.. డిజిపి ఆదేశాలు బుట్టదాఖలు..!

ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ హైకోర్టుకి డిజిపి కార్యాలయం నుంచి ఏజి ద్వారా సమర్పించిన అఫడవిట్ అంతా వట్టిదేనని..ఈ విషయంలో డిజిపి ఉత్తర్వులు కూడా ఎక్కడా అమలు చేయమని ఉమ్మడి విశాఖజిల్లా పోలీసులు, విభజన అనకపల్లి జిల్లా పోలీసులు ఆధారాలతో సహా రుజువుచేసి చూపించారు. ఇటీవల కాలంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీస్ స్టేషన్ విధులు నిర్వహించడంపై హైకోర్టులో కేసు దాఖలైంది. దానికి స్పందించిన రాష్ట్రప్రభుత్వంలోని పోలీసుశాఖ..వారిని పోలీసు సిబ్బందిగా పరిగణించమని, పోలీస్ స్టేషన్ విధులు, బందో బస్తు విధులు అప్పగించమని హైకోర్టుకి ప్రత్యేక అఫడవిడ్ దాఖలు చేసింది. అయితే దాఖలు చేసిన నెలరోజులు గడవక ముందే ఉమ్మడి విశాఖజిల్లా పోలీసులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా పరిధిలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ లోనూ, అనకాపల్లి జిల్లా పరిధిలోని అరట్లకోట గ్రామంలోని జాతరలో బందోబస్తు డ్యూటీలు మహిళా పోలీసులకు వేశారు.  రెండు రోజుల వ్యవధిలో పోలీసులు దిక్కరించిన హైకోర్టు ఆఫడవిట్ నిబంధనను ఉల్లంఘించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిజిపీ లేదూ..హైకోర్టికి సమర్పించిన అఫడిట్ భయం అసలే లేదు..అలాంటివేమీ ఏపీ పోలీస్ అందునా ఉమ్మడి విశాఖజిల్లా, విభజన విశాఖ జిల్లా పోలీసులకు అసలే పట్టవని..మళ్లీ అదే పోలీసు స్టేషన్ల విధులు, బందో బస్తు విధులు మహిళా పోలీసులకు అప్పగిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

 ఇపుడు ఇవే ఆధారాలు హైకోర్టుకి ఏపీపోలీసుశాఖ దిక్కరించిన ఆధారాలుగా కూడా మరనున్నాయి. పోలీసుశాఖలో ఉన్నతాధికారులు పర్యవేక్షణ, డిజిపి ఉత్తర్వులు ఏ స్థాయిలో అమలు జరుగుతున్నాయనే అంశానికి క్రింది స్థాయి పోలీసులు ఇస్తున్న గౌరవం ఏంటో కూడా పక్కాగా రుజువైంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పోలీసుశాఖ విధులు అప్పగించకూడదని, 26 జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరీ చేసిన ఆదేశాలు విశాఖ, అనకాపల్లి జిల్లాలో పక్కాగా బుట్టదాఖలు అయ్యాయి. ఇంకా కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుశాఖలోని స్టేషన్లలోని అధికారులు సచివాలయ మహిళా పోలీసులకు పోలీసు బందోబస్తు, స్టేషన్ డ్యూటీలు డిజిపి ఆదేశాలు ఉల్లంఘించి మరీ వేయడాన్ని బట్టి మహిళాపోలీసు విభాగంలో కోర్టుకేసులకు సిబ్బందే ఉప్పందించి, కేసులు వేయించారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏపీ పోలీస్ బాస్ ఆదేశాలను క్రిందిస్థాయి పోలీసులు ఏ స్థాయిలో అమలు చేస్తున్నారో..కోర్టు కేసులు ఉండగా కోర్టు దిక్కారానికి ఏ విధంగా పాల్పడుతున్నారో రెండురోజులు పాటు మహిళా పోలీసులకు అదనంగా వేసిన విధులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.  ఇప్పటికే పోలీసుశాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా పోలీసులను పోలీసు విధులకు పక్కనపెట్టడంతో ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ఇబ్బందులను ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. విషయం చక్కబడుతుందని ఆశపడుతున్న వేళ పోలీసులు కోర్టు దిక్కారానికి పాల్పడటం కూడా చర్చనీయాంశం అవుతున్నది. చూడాలి ఈ విషయంలోడిజిపి కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందనేది.

Tadepalli

2023-08-22 17:01:58

గ్రామ, వార్డు సచివాలయశాఖలో మరణ మృదంగం..!

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులు ఉసురు అర్ధాంతరంగానే ముగిసి పోతున్నది. ఒకటి కాదు 2కాదు ఏకంగా 125 మంది ఉద్యోగులు ఒక్క విద్యుత్ విభాగం విధినిర్వహణలో మృత్యువాత పడటంతోపాటు,  మరో 250 మంది శాస్వతంగా అంగవైక ల్యాని కి గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత జరిగినా సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నవారికి ప్రాణ భద్రత లేకుండా పో తుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాల్లో ఒక్క ఎనర్జీ అసిస్టెంట్ కి నేటి వరకూ సేఫ్టీ పరికరాలుగానీ, పనిముట్లు గానీ ప్రభుత్వం పంపిణీ చేయలే దు. పైగా తమ పరిధిలోకి రాని 11కెవి, 33కెవి విద్యుత్ ఫోల్స్ పై పనులు చేయిస్తున్నారని వాపోతున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహా రం ఇవ్వకపోగా కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలివ్వకపోవడం విశేషం..! 

Amaravathi

2023-08-21 15:14:58

9శాతం ఫిట్ మెంట్ కి ఓకే..విద్యుత్ సమ్మె లేదు..

విద్యుత్ ఉద్యోగులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పీఆర్సీపై ఉభయుల మధ్య అంగీకారం కుదిరింది. విద్యుత్ జేఏసీ 15 శాతం ఫిట్మెంట్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం 9శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీనికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా అంగీకరించింది. ఈ ఒప్పందంపై యాజమాన్యంతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు. సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్టు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు సబకమిటీ ఆమోదం తెలిపినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. ఆఖరు నిమిషంలో బంద్ లేదనే విషయం ఉపసమనం కలిగించింది.

Vijayawada

2023-08-09 16:00:27

మెగాస్టార్ ఆరోజు ప్రభుత్వానికి వ్యతిరేంగా గళమెత్తారు

మెగాస్టార్ చిరంజీవి‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల దినోత్సవ వేడుకలలో చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సమర్థించారు. రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ, చిరంజీవి చెప్పినట్లు సినీ పరిశ్రమ నిజంగా పిచ్చుకే కానీ.. చిరు మాత్రం కాదన్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కేంద్రమంత్రిగా పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడారని గుర్తు చేశారు. దీనితో రాజకీయంగా వేడి రాజుకుంది. కేంద్ర మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అంత ఆషామాషీ విషయం కాదు.. అలాంటి  చిరంజీవి మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందనే విషయం చాలా మంది తెలుసుకోవాలన్నారు. చిరులాంటి వ్యక్తి ప్రత్యేక హోదాపై పోరాడమని మంత్రులకు సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పు లేదని లేదన్న ఉండవల్లి మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు..

ఆంధ్ర కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని.. అది సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హాయంలో కంటే వైఎస్సార్సీపీ హాయంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పత్రికను, ఛానల్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు అక్రమాలు, అవకతవకాలు పాల్పడ్డారని ఆరోపించారు. విదేశాలకు కళాంజలి కళకృతులు అని కేంద్ర ప్రభుత్వ చర్యలను పత్రికలో రాసినందుకు సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌పై కేసు పెట్టారన్నారు. ఈ కేసులో రామోజీరావుపై పోరాడలేక ఏబీకే ఫైన్ కట్టి బయటపడ్డారని చెప్పారు. డబ్బున్న వారికే కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం సహకరిస్తోంది కాబట్టి మార్గదర్శిపై పోరాటం చేస్తున్నానన్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారిన ఈ ప్రాజెక్టు పూర్తి కాదని రుజువైందని అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ కాకుండా వేరే ప్రభుత్వం రావాలని బాంబు పేల్చారు.

Rajamahendravaram

2023-08-09 11:04:34

ఏపీలో రేపటి నుంచి విద్యుత్ కార్మికుల సమ్మె..

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు, ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు. కాగా ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌదా వద్ద 2000 మంది పోలీస్ బలగాలతో భారీ బద్రత ఏర్పాట్లు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడ నందు 144 సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై గుర్రుగా వున్న కార్మిక సంఘాలు కూడా విద్యుత్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. కాగా ఉద్యోగుల సమ్మె ముందుగానే ఊహించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అయితే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నందున వలనే తాము సమ్మె చేస్తున్నట్టు కార్మికులు ప్రకటించారు.

Vijayawada

2023-08-08 16:04:12