1 ENS Live Breaking News

వ్యవసాయ శాఖలో రివర్స్ ఎక్స్ టెన్షన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖలో రివర్స్ ఎక్స్ టెన్షన్ మొదలు పెట్టింది..ఏళ్లతరబడి సర్వీసు చేస్తున్న అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను(ఏఈఓ)లను తిరిగి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా వున్న గ్రామీణ వ్యవసాయ సహాయకుల స్థానంలో పంపబోతున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్న ఈ రివర్స్ ఎక్స్ టెన్షన్ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈఓలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హేతు బద్దీకరణ పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఈ తిరకాసు వ్యవహారంపై మండి పడుతున్నారు. ఏళ్ల తరబడి సర్వీసు చేస్తున్నా కనీస పదోన్నతులకు నోచుకోని ఈఏఓల కోసం సర్వీసు నిబంధనలను సడలించి పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం గ్రామీణ వ్యవసాయ సహాయకులకు ఏఈఓలుగా పదోన్నతులు ప్రారంభించిన ప్రభుత్వం సర్వీసు నిబంధనలు సడలించకపోతే ప్రస్తుతం 26 జిల్లాలోని 15వేల 4 గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు కూడా జీవితాంతం ఏఈఓలుగానే గ్రామాల్లోనే విధులు నిర్వహించి రిటైర్ కాక తప్పదు..!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తమ సర్వీసులో పదోన్నతులు చూస్తామని ఆశపడిన అగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ ఆఫీసర్లకు చుక్కెదురైంది. పదోన్నతుల మాట దేవుడెరుగు ఉన్న క్యాడర్ ని. సీనియారిటీ పరిపాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలు ఉన్న విఏఏ(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు) స్థానాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం చూస్తున్న విధానం ఏఈఓలకు మింగుడు పడటం లేదు. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన ప్రభుత్వం ప్రస్తుతం మండ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నవారిని గ్రామాల్లో ఉన్న ఖాళీల్లో సర్ధుబాటు చేయడానికి చక చకా పనులు చేసేస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసినపుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో నియామకాలు చేయలేదు.

 దానితో అనుబంధ శాఖలుగా వున్న హార్టికల్చర్ అసిస్టెంట్లు, సెరీ కల్చర్ అసిస్టెంట్లతో గత ప్రభుత్వం పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నట్టుగా చూపించి మమ అనిపించేసింది.  కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ శాఖ ఉద్యోగులను ఆశాఖలోనే ఉంచాలని.. ఒక శాఖ ఉద్యోగులను మరోశాఖ సిబ్బందిగా చూపించకూడదని నిర్ణయించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ఖాళీలు బయట పడ్డాయి. దీనితో ఆ ఖాళీల్లో మండల కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్ ల్యాబుల్లోనూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తిరిగి సదరు ఖాళీల్లోకి భర్తీచేస్తే.. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నట్టుగా ఉంటుందని..కొత్తగా ప్రభుత్వంపై ఉద్యోగాలు తీసే భారం కూడా పడదనే ఆలోచనకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పనులను చకచకా చేసుకు పోతున్నది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈఓలకు పదోన్నతులు కల్పించడం కోసం ఏఈఓలు ఏఓలకు మధ్య ఒక క్యాడర్ ను ఏర్పాటు చేసి వారికి పదోన్నతులు ఇవ్వాలని ఆలోచన చేసింది. అయితే దానిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఓలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయాధికారులు  కూడా సహకరించడంతో దానిని కార్యారూపంలోకి రానీయకుండా చేశారు. దానితో ఆ ఆలోచనన ప్రభుత్వం కూడా విరమించుకుంది. వీరిలోనే మరికొందరిని ఇన్ సర్వీసు కి పంపి ఏఓలుగా పదోన్నతులు కల్పించింది. అలా కల్పించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిలో కొందరు ఇన్ సర్వీసులో పదోన్నతులు పొంది వెళ్లిపోయారు. తరువాత చాలా మంది ఏఈఓలకు వయస్సు పెరిగిపోవడంతో ఇన్ సర్వీసులో ఏజీబిఎస్సీ చేసే అవకాశం కల్పోయారు. అలా మిగిలిన వారంతా పదోన్నతులకు నోచుకోకుండా సర్వీసులోనే  మిగిలిపోయారు.

 ఏఈఓల సర్వీసుని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం నూతన సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ సమయంలో ఏఈఓలుగా ఉన్నవారినే ఖాళీల్లోకి పంపించాల్సి వుంటుంది. అలా పంపించడం ద్వారా  కొద్దిమేరకైనా ఖాళీలను భర్తీచేసినట్టు వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన. అదే సమయంలో ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసిన సమయం కూడా పూర్తవడంలో వీరిలోనే మరికొందరు ఉద్యోగులు రిటైర్ కానున్నారు. అలా రిటైర్ అవగా మిగిలిన వారిని గ్రామీణ వ్యవసాయ సహాయకుల స్థానంలోకి పంపితే మిగులు ఖాళీలు భర్తీ జరుగుతుందనేది ప్రభుత్వ బావన. అంతేకాదు వారికి పదోన్నతులు ఇచ్చే విషయం కూడా పక్కదారి పట్టించడానికే ఇపుడు వారిని రివర్స్ ఎక్స్ టెన్షన్ విధానంతో వెనక్కి పంపాలని ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది.

ఏఈఓలకు పదోన్నతులు కల్పించాలంటే ఖచ్చితంగా ఏఈఓలు, ఏఓలకు మధ్య ఒక క్యాడర్ ని ప్రభుత్వం  ఏర్పాటుచేయాల్సిన అవసరం వుంది. అలా చేయాలంటే ప్రస్తుతం వీరికున్న సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కొత్తగా రూపొందించాల్సి వుంటుంది. లేకపోతే ఉన్న నిబంధనలను అదనపు అంశాలతో నవీకరణ చేయాలి. అలా చేయడం వలన ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం ఏమీ పడదు కారణం ఇప్పటికే చాలా మంది ఏఈఓలు ఏఓ పే స్కేల్ ని కూడా దాటేశారు. ఈ సమయంలో ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వడానికి నిబంధనలు సడలించడమో.. లేదంటే సర్వీస్ రూల్స్ అమైండ్ మెంట్ చేయడమో చేయాలి. అలా చేయకపోతే ప్రస్తుతం ఉన్న ఏఈఓలకు వారి సర్వీసు కాలంలో పదోన్నతి పొందే అవకాశం ఉండదు. 

అంతేకాదు.. వారి స్థానంలో పదోన్నతులపై వచ్చే గ్రామీణ వ్యవసాయ సహాయకులు కూడా జీవితాంతం ఏఈఓలుగానే అదే పంచాయతీల్లోనే  మగ్గిపోవాల్సి వుంటుంది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆలోచించే సమయాన్ని ఏఈఓలకు పదోన్నతులు కల్పించడానికి ఆలోచించడం ద్వారా ప్రస్తుతం ఏఈఓలకు, తరువాత గ్రామీణ వ్యవసాయ సహాయకులకు పదోన్నతులు కల్పించడానికి వీలుపడుతుంది. పరిపాలనా సౌలభ్యం, ఖాళీల్లో సిబ్బంది సర్ధుబాటు కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది ప్రభుత్వం. ఈ తరుణంలో ఏఈఓలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తుందా.. వాళ్ల సంగతి ఆలోచించడం ద్వారా టైమ్ వేస్ట్ అని విఏఏ ఖాళీల్లోకే ఖచ్చితంగా వెనక్కి పంపి రివర్స్ ఎక్స్ టెన్సన్ మాత్రమే చేస్తుందా...? అనేది తేలాల్సి వుంది..! 

visakhapatnam

2024-10-28 14:14:52

డిప్యూటీ సీఎం పవన్ తలచుకుంటే.. సచివాలయ ఉద్యోగుల విలీనం అయిపోయినట్టే..?!

కొన్ని సార్లు రావడం ఆలస్యం అయితే అవొచ్చు కానీ.. రావడమైతే పక్కా అంటాడు పవన్ కళ్యాణ్  సినిమాలో.. కానీ ఇపుడు ఇపుడు అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం.. కట్ చేస్తే సరిగ్గా ఇపుడు అదే డైలాగుని అధికారికంగా చెబితే బాగుండునని  మూడు ప్రభుత్వశాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వెయిట్ చేస్తున్నారు.. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ సచివా లయ సిబ్బందిని మాతృశాఖల్లోకి విలీనం చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఒక్క మాట చెబితే ఒకేసారి నాలుగు విభాగల సచివాలయ సిబ్బం ది పంచాయతీరాజ్ శాఖలో విలీనం అయిపోతారు. ఇపుడు ఒక విభాగం విలీనమైనా దానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత రాలేదు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు క్యాబినెట్ సమావేశం అయిన కొద్ది రోజుల్లోనే మత్స్యశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిలతో ప్రత్యేక సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి తమ సిబ్బందిని తమకి అప్పగించేయాలని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు కమిషనర్ రాసిన లేఖ ఇపుడు మిగిలిన శాఖలు కదిలిస్తోంది. దానికితోడు ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలు కూడా 19 ప్రభుత్వశాఖలను చైతన్యం చేస్తున్నాయి. సత్వరమే సచివాలయంలోని 19శాఖల సిబ్బందిని మాతృశాఖల్లో విలీనం చేసేస్తే వారికి ఒక నిర్ధిష్ట ప్రభుత్వశాఖ ఏర్పడుతుందనేది ప్రభుత్వఆలోచన..! 

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగులను వారి మాతృశాఖలకు పంపించేందుకు రాష్ట్ర అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. వందలాదిగా రిటైర్ అవుతున్న ఖాళీలను ఒకేసారి భర్తీచేయాలంటే ప్రభుత్వం ముందున్న ఏకైన అవకాశం సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు పంపడమే తద్వారా తక్షణం ఖాళీల భర్తీతోపాటు, ఉద్యోగులకు ఒక చిరస్థాయి ప్రభుత్వశాఖ కేటాయింపు కూడా చేయవచ్చుననేది ప్రభుత్వం ముందున్న ఆలోచన. దానికోసం ఇటీవల క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అందునా మత్స్యశాఖ కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా మిగిలిన ప్రభుత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధికారుల బదిలీల నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యం అయినా.. సంక్రాంతి నాటికి సిబ్బందిని మాతృశాఖల్లోకి పంపే ప్రక్రియ దాదాపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే ఒకేసారి మూడు  ప్రభుత్వశాఖల్లోని నాలుగు విభాగాల ఉద్యోగులు వారి మాతృశాఖల్లోకి వెళ్లిపోవడానికి ఆస్కారం వుంటుంది. మత్స్యశాఖ కమిషనర్ రాసిన లేఖ ఆధారంగా మిగిలిన శాఖలు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో  కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..! శీర్షికన ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం వెంటనే స్పదించింది. ఆపై క్యాబినెట్ లో చర్చించి వారిని మాతృశాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ ఆదేశాలను తక్షణం అమలు చేసిన మత్స్యశాఖ తమ సిబ్బందిని తమశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనితో మిగిలిన శాఖల్లోనూ చలనం మొదలైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని నిర్ణయించి.. ఇన్చార్జిలతో నడుస్తున్న గ్రామ పంచాయతీల్లో కార్యదర్శిలను నియమిస్తే ఫలితం వస్తుందని బావించారు. దానికి అనుగుణంగానే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను బదిలీల పేరుతో చిన్న పంచాయతీలకు బదిలీలు చేశారు. తద్వారా ఇన్చార్జిలతో నడుస్తున్న చాలా పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శిలు నియామకాలు జరిగాయి. ఇంకా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 13వేల 326 గ్రామ పంచాయతీల్లో చాలా వరకూ ఇన్చార్జి పాలనే నడుస్తున్నది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అత్యధికంగా మేజర్ పంచాయతీల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలు ఇండివిడ్యువల్ పంచాయతీలకు బదిలీల్లోనే వెళ్లిపోయారు. ఒక రకంగా పంచాయతీ రాజ్ శాఖ ఒక విభాగం గా పంచాయతీ కార్యదర్శిలు అనధికారికంగా విభజన జరిగిపోయినట్టే. 

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జి కార్యదర్శిలతో నడుస్తున్న పంచాయతీల్లో కూడా మేజర్ పంచాయతీల్లో ఉన్న కార్యదర్శిలను బదిలీచేసి పూర్తిస్థాయి కార్యదర్శిలు ఉండే విధంగా చేయొచ్చు.  ఇంకా మిగిలివున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శిలు(డిజిటల్ అసిస్టెంట్లు), ఇంజనీరింగ్ అసిస్టెంట్లు,  వెల్పేర్ అసిస్టెంట్లకు కూడా స్థానచలనం వచ్చే అవకాశలుంటాయి. ప్రస్తుతం మత్స్యశాఖ కమిషనర్ ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడుతో జరిగిన ప్రత్యేక సమావేశ వివరాలను, ఇతర ఇబ్బందులను ఉంటకిస్తూ రాసిన లేఖ ఇపుడు పంచాయతీరాజ్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. డిప్యూటీ సీఎం ఆదేశం కోసమే అధికారులు వేచి చూస్తున్నారట. ఒక్క ఆదేశం వస్తే 70శాతం పంచాయతీలకు ఇన్చార్జిల వ్యవస్థ తప్పిపోతుంది. అంతేకాకుండా నాలుగు విభాగాల సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖలో విలీనం కూడా అయిపోతారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ లు సంయుక్తంగా ఈ శాఖలో జరిగే అన్ని రకాల వ్యవహారాలపైనా ప్రత్యేక కథనాలు ప్రచురించడం కూడా ప్రభుత్వంలోని కదలికలకు కారణం అవుతున్నది. 

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి తలా తోకా లేకుండా.. కనీసం ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్ధత లేకుండా.. ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేసింది. ఫలితంగా మహిళా పోలీసుల పోస్టులపై కోర్టుల్లో కేసులు పడి .. ఇపుడు వారు ఏ ప్రభుత్వశాఖకీ చెందని వారుగా ఉండిపోయారు. వారిని పోలీసుశాఖలోనే ఉంచేస్తారా..? లేదటే అర్హతలను బట్టి సైబర్ క్రైమ్ విభాగానికి పంపిస్తారా..? లేదంటే భారీగా రిటైర్ అవుతున్న పంచాయతీ కార్యదర్శిల ఖాళీల్లో భర్తీచేస్తారా..? లేదంటే దేనికీ చెందకుండా గాల్లోనే ఉంచేస్తారా..? అనే విషయంలో మాత్రం చిన్న క్లారిటీ కూడా రాలేదు. ఈ విషయంలో హోం మంత్రి అనిత నిర్ణయం తీసుకొని డిజిపీతో మాట్లాడి ఒక దారి చూపించాల్సి వుంది. కానీ అక్కడ కూడా పనిజరగలేదు. అన్నిశాఖల మంత్రులు ఒకేలా ఆలోచించగలిగితే వ్యవహారం ఇట్టే తేలిపోతుంది. 

 గత ప్రభుత్వ తేడా విధానాలే ఇపుడు కూటమి ప్రభుత్వానికి ఈ శాఖలోని సిబ్బందిని ఒక్కొక్కరుగా మాతృశాఖల్లోకి విలీనం చేసేయడానికి అవకాశాలుగా మారాయి. అన్నీ అనుకుంటే వచ్చే సంక్రాంతి నాటికి సచివాలయశాఖలోని అన్ని ప్రభుత్వాశాఖల అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసి సిబ్బందిని మాతృశాఖల్లోకి విలీనం చేస్తాయని సమాచారం అందుతుంది. ఆపై గ్రామ, వార్డు సచివాలయశాఖను ఉంచాలా..? లేదంటే ఐదారుగురితో నడిపి గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాలుగా నడపాలా అనేదానిపై స్పష్టమైన నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి రాజున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది.


visakhapatnam

2024-10-26 14:44:32

అదనపు విధులు.. సచివాలయ సిబ్బందికి జేబులు చిల్లు..!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖ 2019 అక్టోబర్ 2 ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశాఖగా ప్రారంభమైన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో విషయంలో మీడియాలో నలుగుతూనే వుంటుంది.. మంచిగా అనుకునేరు.. తేడా వ్యవహారాల్లోనే సుమీ..అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే..అసలు విషయం తెలిస్తే మీరే నోరెళ్ల బెడతారు. అంతే కాదు అయ్యో పాపం అంటూ ముక్కున కూడా వేలేసుకుంటారు. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని తేడా వ్యవహారాలన్నీ ఈ శాఖలోనే జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. దానికి సాక్షులు మండలాల్లో ఎంపీడీఓలు.. డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు.. పట్టణాల్లో జోనల్ కమిషనర్లు.. నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్లు.. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లు.. ఏంటి ఇంత మంది తేడాగానే ఉంటున్నారా అంటే ముమ్మాటికి ఇది నిజం. అధికారులు ఓ.. తెగఫీలపోయినా..కాదనలేని వాస్తవం.  గ్రామ, వార్డు సచివాలయశాఖలో సిబ్బంది వారిశాఖ విధులకు బధులు, అదనంగా చేస్తున్నవిధుల విషయమై ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలోని అంశాలను సదరు శాఖ కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక ప్రభుత్వశాఖ కమిషనరే ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖల్లో అధికారులు, సిబ్బంది వారి శాఖకు సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటే 75వ ప్రభుత్వశాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రం ప్రభుత్వశాఖల్లోని అన్ని విధులు, పనులు చేసి.. ఆఖరికి వారికొచ్చే జీతంలో నుంచి స్టేషనరీకి, వైట్ పేపర్లకు, జెరాక్స్ లకు నెలకీ కనీసం రూ.500 వరకూ ఖర్చు చేస్తున్నపరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీసం స్టేషనరీ కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటే నమ్ముతారా..? దానికి ఇప్పటి వరకూ సచివాలయ సిబ్బంది స్టేషనరికీ పెట్టిన ఖర్చులే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది కేవలం స్టేషనరీ బిల్లులే ఒక్కో ఉద్యోగికి సుమారు ప్రభుత్వం రూ.25వేలకి పైగా ఇవ్వాలంటే నమ్ముతారా.. కానీ ఇది అక్షర సత్యం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని 1.35లక్షల మంది ఉద్యోగులు సగటుని నెలకి సుమారుగా ఒక్కొక్కరూ రూ.600 పైగా కేవలం వైట్ పేపర్లు, ఇతర స్టేషనరీలకు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరు చేసే అదనపు విధులు బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) గా చేసేటపుడు అయితే ఈ మొత్తం రూ.1000 నుంచి 2వేల వరకూ చేరేది. చేసేది అదనపు పనైనా.. స్టేషనరీ ఖర్చులు కూడా వీరితోనే పెట్టించింది గత ప్రభుత్వం. ఆ విధానం కూటమి ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అమలు చేసేస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను వారి మాతృశాఖలల్లో విలీనం(ఇన్ కార్పోరేట్) చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత.. సచివాలయ ఉద్యోగులు ఏ తరహా అదనపు విధులు నిర్వహిస్తున్నదీ రాష్ట్రమత్స్యశాఖ, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని అధికారులు చాలా చక్కగా ప్రభుత్వానికి వివరించారు. మొత్తం ఎనిమిది రకాల సర్వీసులు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని.. అందునా గ్రామీణ మత్స్య సహాయకులు చేస్తున్నారని ఉటంకించారు. అందులో మొదటిది 1)కేస్ట్ సర్వే 2) పంచన్ల పంపిణీ 3)బిఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్) 4)ఇంటి పన్నుల వసూలు 5) గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆపాదించిన పనులు 6)ఇరిగేషన్ కెనాల్ డ్యూటీస్ 7) హౌస్ హోల్డ్ సర్వే  8)మిగిలిన ప్రభుత్వశాఖల పనులు చేస్తున్నారని.. తద్వారా మత్స్యశాఖ పనులు చేయడానికి ఎక్కడా వీలు పడలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా మత్స్యశాక కమిషనర్  డోలా శంకర్ రాసుకొచ్చారు. సచివాలయశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పివరకూ ఏ ప్రభుత్వశాఖ కమిషనర్లు గానీ, కార్యదర్శిలు గానీ.. ప్రభుత్వానికి ఈ తరహా లేఖలు రాయలేదు. వాస్తవాన్ని మొట్టమొదటి సారికి మత్స్యశాఖ మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. కనీసం ఈ విధంగానై ప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు సమస్యలు వెళతాయని చిన్న నమ్మకం.

ఏదైనా ప్రభుత్వశాఖలో అయితే వారి శాఖల పనులు మాత్రమే ఉద్యోగులు చేస్తుంటారు. కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం వారి మాతృశాఖల పనులు కంటే ఇతర ప్రభుత్వశాఖల పనులే అదనంగా చేయాల్సి వస్తుంది. దానికి అయ్యే ఖర్చు కూడా ఉద్యోగులే భరిస్తున్నారు. ఈ విషయంలో పంచాయతీల్లో కార్యదర్శి దగ్గర నుంచి మండలాల్లో ఎంపీడీఓ.. డివిజనల్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఉద్యోగులపైనే అదనపు భారాన్ని మోపుతూ వస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఉద్యోగులకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వలేదనే విషయం ఒక్క అధికారి కూడా దృష్టిపెట్టిన పాపాన పోలేదు. కానీ సచివాలయాలకు స్టేషనరీ పంపిణీ చేస్తున్నట్టు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు.. పట్టణాల్లో జోనల్ అధికారులు, మున్సిపల్ కార్యాలయాలు మాత్రం లక్షలకు లక్షలు బిల్లులు డ్రా చేస్తున్నారు. 

పంచాయతీల్లో అయితే పరిస్థితి మరీ దారుణం అదనపు పనులు చేస్తున్నదే కాకుండా వైట్ పేపర్లు తమ సొంత ఖర్చుతో తేలేదనే సాకుతో సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు లేకపోలేదు. ఎంత మంది అధికారులకు చెప్పినా.. ఏం సచివాలయ ఉద్యోగులంటే ఆ మాత్రం కూడా స్టేషనరీ మీ సొంత ఖర్చులతో కొనుక్కోలేరా అని అడిగేవారే తప్పితే.. ఏ ఒక్క జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సైతం ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు పట్టించుకున్న దాఖలాలు లేవు. చేసిన అదనపు బిఎల్వో పనులకు గత నాలుగేళ్లు ప్రభుత్వం ఇవ్వాల్సిన అదనపు గౌరవ వేతనం కూడా ఎగ్గొట్టేసింది ప్రభుత్వం. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు స్టేషనరీ బిల్లులు చెల్లిస్తుందా..? లేదంటే గత ప్రభుత్వమే ఇవ్వకుండా వారితోనే ఖర్చు పెట్టించగా లేనిది.. తామెంకుదుకు ఇచ్చి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తామని.. అదే పాత విధానాన్ని కంటిన్యూ చేస్తుందా.. అనేది..?!

visakhapatnam

2024-10-25 19:56:43

చిన్న పత్రికల ప్రధాన సమస్యలను పరిష్కరిస్తాం.. సమాచారశాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా హామీ

రాష్ట్రంలో చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంసు శుక్లా హామీ ఇచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(రి.నెం.312/2024)ప్రతినిధి బృందం ఆయనతో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పలు సమస్యలతో  కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఎంప్యానల్డ్  దిన పత్రికలకు  రెగ్యులర్ గా యాడ్స్ రేటు కార్డు ప్రకారం విడుదల చేయాలని,  రేటు కార్డు పెంచాలని కోరారు.  పెండింగ్ లో ఉన్న చిన్న దినపత్రికలకు ఎంప్యానల్ మెంట్  ప్రక్రియను పూర్తి చేయాలని,కొత్తగా దరఖాస్తు చేసు కోవడానికి అవకాశం కల్పించాలని  ఆయనను కోరారు.  వార, పక్ష, మాస  పత్రికలకు యాడ్స్ విడుదల చేయాలని కోరారు. స్థానిక దినప త్రికలకు పిరియాడికల్స్  కు అక్రిడేషన్లు పెంచాలని జీ ఎస్ టీ,  ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ నిబంధనను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.  

 పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్  ఎంప్యానల్డ్  దిన పత్రికలకు సమాచార శాఖ యధావిధిగా యాడ్స్ విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. అక్రిడేషన్లు పెంచుతామని తెలిపారు.పెండింగ్ లో ఉన్న  ఎంప్యానల్ మెంట్ పైళ్లను క్లియర్ చేయాలని , కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూదన పాల్గొన్నారు. సమాచారశాఖ డైరెక్టర్ తో  చర్చించిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  పి. సత్య నారాయణ, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్ కుమార్,ఎన్.కోటే శ్వరావు, కార్యదర్శి మల్లెల శ్రీనివాసరావు, కార్యనిర్వహక కార్యదర్శి టి. మారుతీ రావు, చెవుల రంగారావుతో పాటు పలు పత్రికల ఎడిటర్లు ఉన్నారు.

visakhapatnam

2024-10-24 16:11:43

గ్రామ సచివాలయ ఉద్యోగుల విభజన షురూ..?!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ మాతృశాఖల్లోకి వెళ్లే ప్రక్రియ మొదలైంది. సచివాలయంలో కలిపి ఉన్న మత్స్యశాఖ తమ గ్రామీణ మత్స్యసహాయకులను అప్పగించాలని కోరుతూ కమిషనర్ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. ‘సచివాలయ ఉద్యోగులు మాతృశాఖలకే’ శీర్షికన ‘ఈరోజు-ఈఎన్ఎస్’ రాసిన కథనాలు, క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో మొట్ట మొదటిసారిగా మత్స్యశాఖ స్పందించింది. దానికి సంబంధించి మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ రాసిన లేఖ మిగిలిన 18 ప్రభుత్వశాఖలను కదిలించేదిగా వుంది. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి మాతృశాఖ విధులకంటే అధనంగా మిగిలిన ప్రభుత్వ శాఖల విధులు నిర్వర్తించడం వలన ఉద్యోగుల ప్రభుత్వశాఖకు న్యాయం చేయలేకపోతున్న విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించు కుంటున్నది. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి ప్రభుత్వశాఖకు బదులు ఇతర విధులు అత్యధికంగా చేస్తున్నారనే విషయాన్ని ‘ఈరోజు-ఈఎన్ఎస్’లు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. అంతేకాకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖలు ఒకలా 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఒకలా ఉందనే విషయాన్ని ప్రత్యేక కథనాల రూపంలో అందించడంతో మత్స్యశాఖ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వాస్తవానికి మత్స్యశాఖలోని విఎఫ్ఏలకు మాతృశాఖ డ్యూటీ చార్టే చాంతాండంత వుంటుంది. అలాంటిది వారి శాఖకు కంటే ఎక్కువగా ఇతర శాఖల పనులుచేయడం, అదీ కనీసం స్టేషనరీ కూడా గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎలా ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు తొలగించాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేబినెట్ నిర్ణయం కూడా తోడవడంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులోని ప్రధాన అంశాలు, విఏఎఫ్ఏ అసోసియేషన్ ఇచ్చిన అభ్యర్ధనను కూడా పరిగణలోనికి తీసుకొని మొత్తం అంశాలను క్రోడీకరిస్తూ..లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

-మత్స్యశాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఒకే చెబితే మిగిలిన 18 శాఖలు రెడీ..?
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 ప్రభుత్వ శాఖల్లో ఒకటైన మత్స్యశాఖ తమ ఉద్యోగులకు మాతృశాఖకు అప్పగించాలని రాసిన లేఖపై ప్రభుత్వం అంగీకారం తెలిపితే మిగిలిన శాఖలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీ చేయాలనే ప్రతిపాదన ఫిషరీష్ మినిస్టర్ కె. అచ్చెన్నాయుడతో ప్రారంభం అయ్యింది. ఏ శాఖ మంత్రి ప్రతిపాదిత లేఖలతో ఉద్యోగల విభజన పూర్తవుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే అయినా ప్రక్రియ మొదలు కావడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో చాలా మంది ఉద్యోగుల రెండేళ్లు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. ఇపుడు అన్ని ప్రభుత్వశాఖల్లో ప్రతీనెలా వందల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులను వారి మాతృశాఖలు వెనక్కితీసుకోకపోతే పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అలాగని కొత్త ఉద్యోగాలకు ఇప్పుడపుడే నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రస్తుతం సచివాలయాల్లో ఉన్న ప్రభుత్వశాఖలన్నీ తమ ఉద్యోగులను వారి శాఖల్లోకి తీసేసుకోవాల్సిన సమయం ఆశన్నమైంది. 

గత ప్రభుత్వం చేసిన ప్రధాన తప్పిదం వలన కూటమి ప్రభుత్వం సచివాలయాల్లోని ఉద్యోగులను మాతృశాఖలకు పంపడానికి  మార్గం సుగమం అయ్యింది. కేవలం గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత కల్పించని కారణంగానే ఉద్యోగులను వెనక్కి పంపాలంటూ మాతృశాఖలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. గ్రామ,వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ప్రభత్వ అనుకూల మీడియా కూడా బయట పెట్టని అంశాలు ఒక్క ‘ఈరోజు-ఈఎన్ఎస్’ మీడియా మాత్రమే బయట పెట్టింది. ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విషయంలోనూ నష్టపోకూడదనే సామాజిక బాధ్యతతో ‘ఈరోజు-ఈఎన్ఎస్’ఈ శాఖలో జరిగే ప్రతీ అంశాన్నీ ప్రభుత్వశాఖలకు తెలిసేలా ప్రత్యేక కథనాల ద్వారా బయట పెడుతున్నది. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహా సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు.. ప్రజలకు సేవలు చేసే సచివాలయ ఉద్యోగులకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా ‘ఈరోజు-ఈఎన్ఎస్’తెలియజేస్తున్నది.

-గాల్లో ఉన్న ఆ శాఖల సిబ్బందికి ఉద్యోగ భద్రత, పదోన్నతులు
గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన తరువాత కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలేదు. దానితో వారికి సర్వీసు కాలంలో పదోన్నతులు వచ్చే అకవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పటి వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ లేని మహిళా పోలీసులు, ఏఎన్ఎం(ఇన్ సర్వీస్ స్టాఫ్ నర్స్), వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లుకి ఉద్యోగత భద్రత కూడా వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీరింతా కూడా మాతృశాఖల్లో విలీనం అయితే వారికి ప్రస్తుతం సదరు శాఖలో ఉన్న సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం వుంటుంది. 

 ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో కాస్త లోతుగా ఆలోచించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు పంపిస్తున్న దనే చర్చ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది. అన్ని ప్రభుత్వశాఖల కంటే ముందుగా మత్స్యశాఖ తమ ఉద్యోగులను తమశాఖలో విలీనం చేసి ప్రభుత్వ పథకాల అమలుకి సహకరించాలని లేఖరాయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా మాతృశాఖలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. చూడాలి సచివాలయంలోని మిగిలిన 18ప్రభుత్వశాఖల కూడా వారి ఉద్యోగులను వెనక్కి పంపాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తాయో.. లేదంటే సచివాలయశాఖలోనే ఉంచేసి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వ్యవహరించినట్టే వ్యవహరిస్తాయా.. అనేది..?!

visakhapatnam

2024-10-23 13:42:59

అట్లుంటది మనతోని.. జిల్లా సమాచార శాఖ బాధ్యతా రాహిత్యం..!

విశాఖజిల్లాలో సమాచారశాఖ అధికారుల బాధ్యత రాహిత్యం ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా జిల్లాకలెక్టర్, డిస్ట్రిట్ మెజిస్ట్రేట్, జిల్లా అక్రి డిటేషన్ కమిటీ చైర్మన్ సంతకాన్నే అపహాస్యం చేసేంతగా మారిపోయింది.. ఏంటి నమ్మకం లేదా.. లేదంటే మీరూ డిపీఆర్వో కార్యాలయ సిబ్బంది గత కలెక్టర్ డా.మల్లిఖార్జున సేవలోనే తరిస్తున్నట్టుగా.. మీరూ అదే బ్రమలోనే ఉన్నారా..? జిల్లా సమాచారశాఖ అధికారుల పరిస్థితి అలానే ఉంది కాబోలు. అందుకే జర్నలిస్టులకు ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సంతకానికి బదులు, గత కలెక్టర్ డా. మల్లిఖార్జున సంతకంలో అక్రిడిటేషన్ కార్డులను ప్రింటింగ్ కి పంపించారు ఇక్కడి సిబ్బంది. అదేంటి మరీ ఇంత కళ్లుమూసుకొని పంపిస్తారా..?  అంటే.. పంపిస్తేనే కదా అసలు విషయం బయటకొచ్చింది. 

అక్టోబరు 3న విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ తరువాత సమావేశంలో సభ్యులతోపాటు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆమోదం తెలిపారు. ఆ తరువాత ప్రక్రియ మొత్తం జిల్లా సమాచారశాఖ కార్యాలయం చేపట్టాలి. కమిటీలో అప్రూవల్ చేసిన కార్డులను సమాచారశాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసి విజయవాడ రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయానికి ప్రింటింగ్ కి పంపించాలి. వీళ్లూ అలానే చేశారు. కాకపోతే జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకానికి బదులు.. గత కలెక్టర్ డా.మల్లిఖార్జున సంతకాన్నే ఉంచేసి పంపించేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్దం. అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకానికి బందులు గత కలెక్టర్ సంతకం ఉండటంతో రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయంలోని అక్రిడిటేషన్ కార్డులు ప్రింటింగ్ చేసే సిబ్బంది కార్డుల ప్రింటింగ్ నిలిపివేసి విశాఖజిల్లా సమాచారశాఖ సిబ్బంది చేసిన ఘనకార్యంపై కొర్రీ వేసి వెనక్కి పంపారు.

 ఆ విషయం కాస్త మీడియాకి తెలియడంతో విషయం బగ్గుమంది. ముఖ్యంగా పెండింగ్ అక్రిడిటేషన్ల విషయంలో మీడియా జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ పై ఒత్తిడి తీసుకు రావడంతో కలెక్టర్ మంచి మనసుతో కార్డుల జారీకి అనుమతించారు. దానిని జీర్ణించుకోలేకపోతు సమాచారశాఖ సిబ్బంది అడుగడుగునా సాంకేతిక కారణాలను సాకుగా చూపి నేటి వరకూ తాత్సారం చేస్తూ.. చేసిన పనుల్లో తప్పులు చేస్తూ వస్తున్నారు. కనీసం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రెస్ నోట్లు రాయడం రానివారు జిల్లా సమాచారశాఖ అధికారులుగా ఉండటం.. వారి ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బంది మరింత బాధ్యతా రాహిత్యంగా ఉండటం.. వారి పనులు కూడా జిల్లా కలెక్టర్ కి మచ్చతెచ్చే విధంగా ఉండటం విశేషం.

-జిల్లా సమాచారశాఖ ఏం చేయాలి..? మరేం చేసింది..!
సమాచారశాఖ జిల్లా అధికారులు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం అయిన తరువాత ముఖ్యంగా ఆన్ లైన్  వెస్ వెబ్ సైట్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ సంతకాన్ని ఎన్ఐసి అధికారుల సహకారంతో అప్లోడ్ చేయాలి. అదే పాత కలెక్టరే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ గత కలెక్టర్ మల్లిఖార్జున బదిలీ అయిపోయిన తరువాత హరేంధిరప్రసాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే అక్రిడిటేషన్ కమిటీ సమావేశం కూడా అయ్యింది. కానీ సమాచారశాఖ సిబ్బంది మాత్రం ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై కొత్త కలెక్టర్ సంతకాన్ని అప్డేట్ చేయడం మానేశారు. దీనితో పాత కలెక్టర్ సంతకమే ఉండిపోయింది.

 కనీసం అక్రిడిటేషన్ కార్డులు డౌన్ లోడ్ చేసి.. వాటిని రాష్ట్ర సమాచారశాఖ కార్యాలయానికి మెయిల్ చేసినపుడు కూడా జిల్లా సమాచారశాఖ అధికారులు వాటిని కనీసం పరిశీలించలేదు. దీనితో కార్డులు పాత కలెక్టర్ సంతకంతోనే విజయవాడ వెళ్లిపోయాయి. తీరా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులపై పాత కలెక్టర్ సంతకాన్ని గమనించిన ప్రింటింగ్ సిబ్బంది కార్డుల ప్రింటింగ్ నిలిపివేశారు. ఇదే కార్డులను ప్రింటింగ్ చేస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోననే భయంతో జిల్లా సమాచారశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది చేసిన తప్పుని వీరికి తెలియజేశారు. దీనితో కార్డుల ప్రింటింగ్  ప్రక్రియ కాస్తా నిలిచిపోయింది.

వాస్తవానికి ఐఏఎస్ అధికారులు జిల్లాకి కలెక్టర్ గా వచ్చినపుడు ఆయన సంతకాన్ని ప్రభుత్వం ఎన్ఐసి విభాగం ద్వారా ఆన్ లైన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా జిల్లా సమాచారశాఖ ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కానీ జిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది చాలా లైట్ తీసుకొని ఆయన సంతకాన్ని సమాచారశాఖ వెబ్ సైట్ లో కూడా అప్డేట్ చేయించడం మానేశారు. అలా చేయించాలంటే ముందుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాచారశాఖ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ పెట్టాల్సి వుంటుంది. 

గత కలెక్టర్ సంతం మార్పుచేసి.. ప్రస్తుతం కలెక్టర్ సంతకం సమాచారశాఖలో అప్లోడ్ చేయడానికి అనుమతులు ఇవ్వాలని. కానీ జిల్లా కలెక్టర్ వచ్చిన తరువాత గానీ, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం పూర్తయిన తరువాత గానీ సమాచారశాఖ అధికారులు ఆ పనిచేయలేదు. ఏ పనైనా టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉండేండుకు అన్ని జాగ్రత్తలూ తీసుకొని మాత్రమే పనులు చేస్తుంటామని చెప్పే సమాచారశాఖ సిబ్బంది ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలోనూ, కార్డుపై ప్రస్తుత జిల్లా కలెక్టర్ సంతకం కాకుండా గత జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఉంచేసి పంపడంపై ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యం ఏంటో చెప్పాల్సి పనిలేదు.

-క్యాడర్ ఉండటంతో టెక్నికల్ సిబ్బందికి డిఐపీఆర్వోగా బాధ్యతలు
రాష్ట్రంలో 13జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసిన సమయంలో కొత్త జిల్లాలకు డిపీఆర్వోలను సమాచారశాఖలో నియమించాలటే ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. దీనితో ఇదేశాఖలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నవారిని తీసుకువచ్చి జిల్లా సమాచారశాఖ అధికారులగా సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయం నియమించేసింది. వాస్తవానికి ఇంజనీరింగ్ పనులు తప్పా.. వీరికి  మీడియా విభాగం పనులు చేతకావు.. కాదు కాదు చేయడం రాదు.. ఎవరై ఆ పనులు తెలిసిన వారుంటే వారితో డిపీఆర్వో హోదాలో చెప్పి చేయించుకోవడం తప్పితే. అదే సమయంలో ఏపీఆర్వోలు, సాంకేతిక సిబ్బందిని కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో కనీసం సమాచారశాఖ, కార్యాలయ వనులను తెలియని వారిని కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏపీఆర్వోలుగా నియమించారు. వీరంతా కార్యాలయానికి వస్తారు తప్పితే చేసే పనిలో అస్సలు క్లారిటీ ఉండదు. సరిగ్గా విశాఖజిల్లాలోనూ అదే జరిగింది.

 డిఐపీఆర్వోగా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎస్వీరమణను తీసుకు వచ్చి డిపీఆర్వోగా నియమించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కూడా ఇంజనీరింగ్ విభాగంతో ఉన్న ఇంద్రావతిని కూడా కొత్త జిల్లాలో డిఐపీఆర్వోలుగా నియమించారు. వాస్తవానికి వీరికి మీడియా పనులుగానీ, కార్యాలయ పనులుగానీ చేతకావు. ఉన్న సిబ్బందిని వినియోగించుకొని మాత్రమే వీరు పనులు చేయించుకోవాలి. కానీ జిల్లాల విభజన సమయంలో గత ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర సమాచారశాఖ అమలు చేస్తూ.. మీడియా, మీడియా లైజన్, ప్రెస్ అక్రిడిటేషన్, ప్రెస్ నోట్ ప్రిపరేషన్, తెలియని వారిని నియమించడంతో వారికి తెలిసినట్టుగానే పనులు చేస్తున్నారు. దీనితో వారం రోజుల్లో కావాల్సిన పనులు నెలలైనా పూర్తి కావడం లేదు. అన్ని అర్హతలు, పనిచేయడం వచ్చినవారు పదోన్నతుల కోసం వేచిస్తున్నా.. పదోన్నతులు కూడా కల్పించకకుండా పనులు రాని వారినే జిల్లా అధికారులగా నియమిస్తున్నారు.

-విశాఖ జిల్లా కలెక్టర్ సంతకానికి మచ్చ తెచ్చిన సమాచారశాఖ
కొత్తగా విశాఖజిల్లా కలెక్టర్ గా వచ్చిన హరేంధిర ప్రసాద్ సంతకానికి జిల్లా సమాచారశాఖ మచ్చతెచ్చింది. వాస్తవానికి జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్,  జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఉన్న  అధికారుల సంతకాల విషయంలో ప్రభుత్వ శాఖలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. సాంకేతిక కారణాలు, సమస్యలుంటే ముందుగా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి.. అవి పరిష్కారం అయిన తరువాత మాత్రమే మిగిలిన కార్యాచరణ చేయాలి. కానీ విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ శాఖలన్నా.. అందులోని అధుకారులన్నా.. ఆఖరుకి కలెక్టర్ అన్నా కూడా నిర్లక్ష్యమనే విషయం ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో తేట తెల్లం అయిపోయింది. 

మమ్మల్ని మీడియా ప్రశ్నించకూడదు.. చేసిన తప్పులను కూడా వార్తలుగా రాయకూడదని తెగ బీరాలు పోయే సమాచారశార అధికారులు.. ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకానికే ప్రెస్ అక్రిడిటేషన్ కార్డుల విషయంలో మాయని మచ్చతెచ్చి.. అక్రిడిటేషన్ కార్డులు ప్రింటింగ్ కాకుండా సాంకేతికంగా ఆగిపోయేలా చేశారంటే.. ఇది కావాలని చేసిందా..? బాధ్యతా రాహిత్యంగా చేసిందా..? పనిచేతకాక చేసిందా అనేవిషయం జిల్లా కలెక్టర్ హరేంధిరప్రాద్ తేల్చాల్సివుంది. మీడియా విషయంలో సమాచారశాఖ కలెక్టర్ సంతకాన్ని లైట్ తీసుకుంటే.. మిగిలిన ప్రభుత్వశాఖల విషయంలో ఇంకెంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో జిల్లా కలెక్టర్ చెప్పాల్సివుంది. చూడాల సమాచారశాఖ అధికారులు చేసిన నిర్వాకంపై జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారనేది.!

visakhapatnam

2024-10-21 09:00:11

ఆంధ్రప్రదేశ్ లో విభజన జిల్లాల ఆత్మఘోష..?!

ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు..  ఆ ప్రభుత్వమే ప్రజలను పాలిస్తుంది.. ఇక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వంలోని ఐఏ ఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారతస్థాయి అధికారులు, స్టేట్ క్యాడర్ జిల్లా అధికారులే  ప్రభుత్వ ప్రతినిధులుగా పరిష్క రిస్తారు..  అదే ఆ అఖిల భారతస్థాయి అధికారులకి, 75 ప్రభుత్వశాఖల జిల్లా అధికారులకే సమస్య ఎదురైతే..  వారంతా ఉండటానికి గూడు కరువై.. పరిపాలన చేయడానికి ప్రైవేటు భవనాలే దిక్కైతే.. కనీసం ప్రజల ముందుకి వెళ్లడానికి వాహనాలు సైతం కరువైతే.. వారెళ్లి ఎవరికి మొరపె ట్టుకోవాలి..? వారి సమస్యను ఎవరు పరిష్కరిస్తారు..? ఇవేమీ ఆలోచించలేదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అనుకున్నదే తడవుగా విభజన ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేస్తూ.. అరకొర వసతులతో చేతులు దులిపేసుకుంది.. కొత్త జిల్లాలకు రాష్ట్ర పతి ఆమోదం లేకపోవడంతో కేంద్ర నిధులు రాక.. రాష్ట్ర ఖజానా  నిధులు కరువై నమో నరాయణా అంటూ గొల్లుమంటున్నాయి. పరిపాలనా సౌల భ్యం మాట దేవుడెరుగు.. కనీసం పరిపాలించే అధికారులకే దిక్కూ మొక్కూ లేకుండా పోయిన విభజన జిల్లా ఆత్మఘోషపై ప్రత్యేక కథనం..!

 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014)  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి అదీ అరకొరగానే.  పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 13 జిల్లాలను 26 జిల్లాలగా ఏర్పాటు చేసి అరకొరగా జిల్లాల విభజన చేపట్టింది. ఆతరువాత ప్రభుత్వశాఖల విభజన, కార్యాల యాల విభజన కూడా పూర్తిగా జరగలేదు. అంతెందుకు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తప్పితే.. కేంద్రం నుంచి మాత్రం అనుమతి పొందలేకపోయింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 52  ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి విభజనలు చేపట్టినా దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర, పార్లమెంటు ఆమోదంతో చట్టబద్దత అవసరం.

 కానీ అధికారంలో ఉండగా అంతమంది ఎంపీలు గెలిచినా కూడా కేంద్రంలో కొత్తజిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆమోద ముద్ర మాత్రం తెచ్చే ఏర్పాటు చేయలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం. కనీసం కొత్త జిల్లాల్లో ప్రభుత్వ అధికారులకు క్వార్టర్స్ ఏర్పాటు చేయలేదు సరికదా.. ప్రభుత్వశాఖల కార్యాలయాలను కూడా అద్దెభవనాల్లోనే నెట్టుకొస్తున్నది. ప్రజల సమస్యలు పరిష్కరించే జిల్లా అధికారుల ప్రధాన సమస్యలు తీరక.. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించలేక తీవ్ర మదన పడుతున్నారు.. ఐఏఎస్ అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకూ..

- రాష్ట్రంలో కొత్తజిల్లాలకు చట్టబద్ధత రావాలంటే ఏం చేయాలి..?
భారదేశంలోని 29 రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 52  ప్రకారం ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ముందుగా దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి. రాష్ట్రపతి ఆమోదం కావాలంటే రాష్ట్రంలో చేసిన మార్పులపై రాష్ట్రప్రభుత్వం రాజపత్రం విడుదల చేయాల్సి వుంటుంది. దానిని రాష్ట్రపతి ఆమోదించిన తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదించి దానిని బిల్లుగా పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. అక్కడ బిల్లు పాసైన తరువాత మాత్రమే దానికి కేంద్రం విడుదల చేసి రాజపత్రం ద్వారా చట్టబద్దత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సత్సంబంధాలు కలిగిఉండాలి. ప్రాధాన్యతా పరమైన అంశానికి సంబంధించి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరగాలి. 

కానీ ఈ విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సైతం  ఆ చట్టబద్ధత తేలేకపోయింది. గత ప్రభుత్వ విధానాలే ఇపుడు మళ్లీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకి మార్గం సుగంచేశాయి. అంటే 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చినా కూడా కేంద్రం అనుమతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర లేదు. కేవలం రాష్ట్రంలోని పరిపాలన, రికార్డుల్లో మాత్రమే రాష్ట్రంలో ఇప్పటి వరకూ 26 జిల్లాలు కానీ.. కేంద్రప్రభుత్వం దృష్టిలో కూడా విభజన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది 13 జిల్లాలే. ఆ జిల్లాల గణాంకాల ఆధారంగానే అధికారుల(ఐఏఎస్, ఐపీఎస్) పంపిణీ జరుగుతున్నది. అదనంగా కొన్ని సివిల్ సర్వీసు పోస్టులు మంజూరు చేసినా రాష్ట్రంలోని ప్రభుత్వశాఖల్లో అవసరాన్ని బట్టి వాటిని రాష్ట్రప్రభుత్వం వినియోగించుకుంటోంది.

-కొత్తజిల్లాల్లో రాష్ట్రపతి ఆమోద ముద్రతో లాభమేంటి..?
దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే..వెంటనే పార్లమెంటులో బిల్లుగా పాసై చట్టం అవుతుంది. అలా చట్టం చేస్తే కొత్త జిల్లాలకు కేంద్రప్రభుత్వంలో గుర్తింపు వస్తుంది. అపుడు పాత 13 జిల్లాల స్థానంలో కొత్తగా గుర్తింపు వచ్చిన జిల్లాలు నమోదు అవుతాయి. ఆ తరువాత జనాభా గణన, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పెంపు కూడా జరుగుతుంది. అంతేకాదండీ.. ఇప్పటి వరకూ ఉన్న జిల్లా పరిషత్ లు కలెక్టరేట్లకు నిర్మాణాలు, అధికారుల కేటాయింపులు కూడా అదనంగా జరుగుతాయి. అవసరాన్ని బట్టి కొత్తగా పంచాయతీలు, మండలాల ఏర్పాటు కూడా జరుగుతుంది. 

తద్వారా విభజన జరిగిన స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధుల మొత్తం పెరుగుతుంది. కేంద్రం నియమించే అఖిలభారత సర్వీసుల అధికారుల కేటాయింపులు కూడా అధికంగా జరుగుతాయి. తద్వారా కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కమిషనర్ పోస్టులు కూడా పెరిగే అవకాశం వుంటుంది. జిల్లాల అభివృద్ధికి నిధులు కూడా మంజూరువు  అవుతాయి. సర్వసాధారంగా జిల్లాలకు ఉన్న నిధుల కంటే అధనంగా పెంచి ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కేంద్రంలో విభజన అంశాలకు చట్టబద్దత లేకుండా అలానే ఉంచేస్తుంటాయి. దానికి కారణం రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడమే. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులకు రాష్ట్రాలు కేంద్రం ద్వారా వచ్చే నిధులు కోల్పోవాల్సి వస్తుంది.

-చిన్న జిల్లాల వలన ఉపయోగమేంటి-లాభం ఇంకేంటి..?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాది అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వశాఖల్లో నియమకాలు చేపడతారు ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగాలు ఏర్పాటు కావడంతో ప్రభుత్వంపై సమస్యల పరిష్కార భారం తగ్గుతుంది. ఏ జిల్లా పరిధిలోని సమస్యలను ఆ జిల్లాయంత్రాంగం పరిష్కరించడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా కేంద్రప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రైవేటు కంపెనీలు రావడానికి, రవాణా మార్గాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇపుడు కొత్త జిల్లాల ప్రతిపాదనతో చాలా కాలం క్రితం జరగాల్సిన జనాభా గనణ, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పెంపు అన్నీ ఒకేసారి జరగడానికి వీలుపడుతుంది. ఒక రకంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రకాలుగా కూడా ఈ విభజన ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది.

 అయితే ఇక్కడ రాష్ట్రప్రభుత్వంలో అధికారంలో ఉన్నపార్టీలు కేంద్రాన్ని ప్రశన్నం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ తరహా పనులు వేగవంతం అవుతాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా..అది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందులోనూ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి జోనల్ విధానం, ఉమ్మడి జిల్లాల ప్రాతిపధిక అంశం మార్పు కాకపోతే ప్రభుత్వశాఖల్లో బదిలీలు, నియమాకాలన్నీ కూడా ఉమ్మడి జిల్లాల్లో నే చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయినా.. ఇంకా ప్రభుత్వ పరిపాలన అంశాలన్నీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి. అంతేకాదు కేంద్రప్రభుత్వం దృష్టిలో ఏపీలో ఉన్న జిల్లాలు కేవలం 13 మాత్రమే. పెంచిన జిల్లాల అంశం కేవలం రాష్ట్రానికే పరిమితం అయిపోయింది. అదే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే.. కొత్తగా జిల్లా పరిషత్ లు, జిల్లా అధికారులకు నివాస, ప్రభుత్వ కార్యాలయా నిర్మాణాలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. కానీ ఆ దిశగా గత ప్రభుత్వం.. కేంద్రంతో స్నేహంగా ఉన్న ఇప్పటి కూటమి ప్రభుత్వం గానీ ప్రయత్నించడం లేదు.

-వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంతా అరకొరగానే..
2019-2024 వరకూ అధికారంలో వున్న వైఎస్సార్సీపీ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా గెజిట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నది. కొత్త జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఐ అధికారులను మాత్రం నియమించింది తప్పితే 75 ప్రభుత్వశాఖలను మాత్రం పూర్తిస్థాయిలో విభజన చేయలేదు. కేవలం కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే విభజన జిల్లాల్లో ఏర్పాటు చేసి.. చాలా కార్యాలయాలు ఇంకా ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఉంచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్లు, 12 భాగాలు ఉన్నాయి.  దానిప్రకారం కేంద్ర ప్రభుత్వం విభజన అంశాలన్నీ అమలు చేయాల్సి వుంది. అటు కేంద్రం రాష్ట్రానికి అమలు చేయడం మానేస్తే.. ఇటు రాష్ట్రం కూడా జిల్లాల్లో చేపట్టిన విభజన కూడా తూ తూ మంత్రంగానే చేపట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ఐటిడిఏలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన కూడా పరిపాలనకు కాస్త విఘాతం ఏర్పడింది.

 దానికి ఉదాహరణ.. ఉమ్మడి విశాఖజిల్లాలోని పాడేరులో ఐటిడిఏ ఉండగా అక్కడే అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసింది.  వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జిల్లా కాకుండా మొదట నర్సీపట్నంలోనే జిల్లా ప్రారంభం కావాల్సి వుంది. జిల్లా కార్యాలయానికి సరిపడ అన్ని రకాల ప్రభుత్వ భవనాలు, సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అనివార్య కరాణాల వలన అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రదేశాలు ఏజెన్సీలో ప్రాంతంలో అధికంగా ఉండటం.. అవన్నీ పాడేరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉండటంతో అన్నింటిని అల్లూరి సీతారామరాజు జిల్లా(పాడేరు) జిల్లా మార్పు చేశారు. ఇలా చాలా అంశాలన్నీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి.  కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేస్తే తప్పా.. అభివృద్ధి కానరాదు.. పెరుగుతాయనుకున్న నిధులు కూడా పెరిగే అవకాశం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో విభజన ఆంధ్రప్రశ్ అంశం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు పార్లమెంటులో బిల్లు అయ్యే అవకాశం వుంటుంది.  లేదంటే గత ప్రభుత్వం మాదిరిగానే.. చేసిన మార్పులన్నీ రాష్ట్రానికి సరిపెట్టుకోక తప్పదు. చూడాలి ఏం జరుగుతుందనేది..!

visakhapatnam

2024-10-14 15:40:43

దసరా పండుగకి దెబ్బేసేసిన కూటమి సర్కారు..?!

మందేస్తూ చిందెయ్ రా.. చిందేస్తూ మందెయర్.. జల్సా చెయ్యి జల్సా చెయ్యి.. బారులన్నీ ఇరగదియ్యి..తగ్గిన రేట్లతో బాటిలంతా కుషీ చెయ్.. ఈ రేంజ్ లో ఊహించుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోని మందులు బాబులు.. దసరాకి కూటమి ప్రభుత్వం తగ్గించిన మద్యం ధరలతో ఎంచెక్కా ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఖాళీ అయిన ఖజానాని మద్యం టెండర్లు ద్వారా నింపుకోవాలనుకున్న ఏపీ సర్కారు.. మందుబాబుల కిక్కుపై దారుణంగా దెబ్బేసేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం నేరుగా మద్యం ద్వారా ప్రధాన ఆదాయాన్ని సమకూర్చు కోవాలనే లక్ష్యంతో టెండర్ల ప్రక్రియకు తెరతీసింది. అనుకున్నట్టుగానే ఖజానికి నాన్ రిఫండబుట్ ఆదాయం క్రింద సుమారు రూ.1000 కోట్ల పైనే ఆదాయం వచ్చింది. కాసుల కిక్కుతో జోష్ పెంచుకొని మరీ టెండర్ల ప్రక్రియను గడువు పెంచేసిన సర్కారు మందుబాబుల ఆశల నిషాని ఒక్కసారిగా దించేసింది. దీనితో ఓటుతో కూటమిని గద్దెనెక్కించినా.. పండుగ రోజు కూడా పెంచేసిన మద్యం రేట్లతోనే మందు కొనుక్కోవాల్సి వస్తుందని బరువెక్కిన హృదయాలతో మందుబాబులు తెగ బాధపడిపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా మద్యమే ప్రభుత్వాలకి ప్రధాన, నిత్య ఆదాయ వనరు. బార్లు బార్లా తెరిచి.. మద్యం షాపులు ఎక్కువ సమయం ఉంచితేనే సర్కారుకి కాసులు గళ గళ లాడతాయి. మందుబాబులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వ ఖజానా పూర్తిగా డీలా పడిపోతుంది. ఒక్కసారిగా ఆదాయం పడిపోతుంది. ప్రతిరోజూ కోట్లాది రూపాయలు ఆదాయాన్ని తెచ్చి పెట్టే మందు బాబుల కోసం కూటమి సర్కారు కనీసం ఆలోచించకపోవడపై మందుబాబుల మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మందు రేట్లను అమాంతంగా పెంచేస్తే.. ఆ ప్రభుత్వంపై కిక్కుతో కసితీర్చుకున్న మందుబాబుల ఆనందం కనీసం మూడు నెలలు తిరగకముందే కూటమి ప్రభుత్వం కూడా మీ కిక్కు కంటే కాసుల కిక్కే మాకు ముఖ్యమంటూ మద్యం టెండర్ల ప్రక్రియను మరో రెండు రోజులు పెంచేసింది. దీనితో దసరా పండుగ రోజు తగ్గిన మద్యం ధరలతో మందు తాగుదామనుకున్న మందుబాబుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. 

ప్రభుత్వం మందుబాబుల మనోగతాన్ని దృష్టి పెట్టుకుంటే ఈ విధంగా వ్యవహరించేదా..? కష్టపడి పనిచేసుకొని వచ్చి కూలీ ఇంటికి కూడా ఇవ్వకుండా ముందుగా ఆనందంతోనే వైన్ షాపులో చుక్క సీసా కోసం ఇచ్చేస్తున్నామే.. అయినా కూటమి సర్కారుకి కరుణలేదు.. కనికరం లేదు.. కనీసం పండుగకైనా తగ్గించిన మద్యాన్ని ఇద్దామనే ఆలోచన లేదు.. ఇదేనా మందుబాబులకి కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం.. ఇదేనా కూటమి సర్కారు పెద్దరికం.. మంచి మనసుతో మద్యం రేట్లు తగ్గించి దసరా పండుగకు మన ముందుకి ఠీవిగా మందుసీసా వస్తుందనుకుంటే ఇదా కూటమి సర్కారు చేసిన కుట్ర.. ఏం రెండు రోజుల టెండరు ప్రక్రియ ముందుగానే చేసుకుంటే.. మందు రేటు తగ్గించారనే ఆనందంతో మరో రెండు సీసాలు కొనుక్కోమా.. అపుడైనా ప్రభుత్వానికి ఆదాయం రాదా..? చఛా చాలా తప్పుచేశాం. కూటమిని నమ్ముకున్నందుకు దసరా పండుగరోజే దెబ్బేసేస్తుందా..? అంటూ బాధాతత్ప హృదయాలతో మందుబాబులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 3,396 మద్యం దుఖాణాల పరిధిలోని మందు బాబులు అత్యవసర సమావేశాలు పెట్టి మరీ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేస్తున్నారట. ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది.  

కొత్త మద్యం షాపులు వస్తున్నాయని సంబర పడిన మందుబాబుల ఆనందం దసరా పండుగ రోజుతో మొదలవుతుందనుకుంటే.. ఆరోజే వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటు చేసిన రేట్లు పెంచిన మందునే కొనుక్కుని తాగేలా చేయడానికి మనుసు ఎలా వచ్చిందంటూ మందు బాబు ప్రెస్టేషన్ లో చాలా ఎక్కువ మందు తాగేస్తున్నారు. మద్యం షాపుల దగ్గరే కూటమి ప్రభుత్వ తీరుపై తన నిరసనను తెలియజేస్తున్నారు. మందుకొట్టిన బాధలతో కాస్త గట్టిగానే కూటమి సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు. కాస్త రేటు తక్కువగా ఉన్న మందుతాగే వారు మద్యం షాపుల ద్గగర చర్చలు పెడుతుంటే..  రేటు ఎక్కువ మద్యం తాగేవారు మాత్రం ప్రతీరోజూ వేసే సిటింగ్ లో ఈ విషయాన్నే అధికంగా చర్చిస్తున్నారట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మందు బాబుల ఓట్లు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఎంతో కీలకం అయ్యాయి. ప్రభుత్వం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం రేట్లు తగ్గించాలని చూసిన ప్రకటన కూడా మందుబాబుల గొంతులో రేట్లు తగ్గించిన మందుపోసినంత పనిచేశా యి. కానీ ఆ ప్రకటన అంతలోనే తీరని బాధ మిగిల్చిందని తెగ బాధపడుతున్నారు. వీరి బాధలు విన్న చూపరులు కూడా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఈ ప్రభావం ఏపీ సర్కారుపై ఏ విధంగా చూపిస్తుందో మరి..?!

visakhapatnam

2024-10-09 14:03:53

13.. 26.. 30.. తెరపైకి కొత్త జిల్లాలు..?!

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014)  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి.. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 26 జిల్లాలు కాస్తా 30 జిల్లాలు కాబోతు న్నాయి.. అదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజమే.. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్ర దేశ్ లో కూడా 26 జిల్లాలను 30 జిల్లాలుగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చిందట. ఇదే విషయం ఒక పోస్టు విషయంలో తెగ వైరల్ అవుతోంది. అందులో గతంలో ఏర్పాటు చేసిన జిల్లాలు ఒకటి రెండు కనుమరుగై.. వాటి జిల్లా కేంద్రాలు మరో ప్రదేశానికి మారనున్నాయని.. కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటు కానున్నాయనేది ప్రతిపాదిత జిల్లాల సారాంశం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేసి అరకొరగా జిల్లాల విభజన చేపట్టింది.  ఆతరువాత ప్రభుత్వశాఖల విభజన, కార్యాలయాల విభజన కూడా పూర్తిగా జరగలేదు. అంతెందుకు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తప్పితే.. కేంద్రం నుంచి మాత్రం అనుమతి పొందలేకపోయింది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 52  ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి విభజనలు చేపట్టినా దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర, పార్లమెంటు ఆమోదంతో చట్టబద్దత అవసరం. కానీ అధికారంలో ఉండగా అంతమంది ఎంపీలు గెలిచినా కూడా కేంద్రంలో కొత్తజిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆమోద ముద్ర మాత్రం తెచ్చే ఏర్పాటు చేయలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఇపుడు కూటమి ప్రభుత్వం తాజా గా పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలను 30 జిల్లాలుగా ప్రతిపాదిస్తూ చేస్తున్న సవరణ ఏర్పాట్లు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు ఇంకా చాలా వరకూ కేంద్రం అమలు చేయాల్సి వున్నది. దానిపై అటు తెలంగాణ కానీ.. ఇటు ఆంధ్రప్రదేశ్ గానీ కేంద్ర ప్రభుత్వంపై ఈ విషయంపై ఒత్తిడి తీసుకురాలేదు. 

- రాష్ట్రంలో కొత్తజిల్లాలకు చట్టబద్ధత రావాలంటే ఏం చేయాలి..?
భారదేశంలోని 29 రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 52  ప్రకారం ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ముందుగా దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి. రాష్ట్రపతి ఆమోదం కావాలంటే రాష్ట్రంలో చేసిన మార్పులపై రాష్ట్రప్రభుత్వం రాజపత్రం విడుదల చేయాల్సి వుంటుంది. దానిని రాష్ట్రపతి ఆమోదించిన తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదించి దానిని బిల్లుగా పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. అక్కడ బిల్లు పాసైన తరు వాత మాత్రమే దానికి కేంద్రం విడుదల చేసి రాజపత్రం ద్వారా చట్టబద్దత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్ర భుత్వా నికి పూర్తిస్థాయిలో సత్సంబంధాలు కలిగిఉండాలి. ప్రాధాన్యతా పరమైన అంశానికి సంబంధించి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరగాలి. 

కానీ ఈ విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సైతం  ఆ చట్టబద్ధత తేలేకపోయింది. గత ప్రభుత్వ విధానాలే ఇపుడు మళ్లీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకి మార్గం సుగంచేశాయి. అంటే 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చినా కూడా కేంద్రం అనుమతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర లేదు. కేవలం రాష్ట్రంలోని పరిపాలన, రికార్డుల్లో మాత్రమే రాష్ట్రంలో ఇప్పటి వరకూ 26 జిల్లాలు కానీ.. కేంద్రప్రభుత్వం దృష్టిలో కూడా విభజన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది 13 జిల్లాలే. ఆ జిల్లాల గణాంకాల ఆధారంగానే అధికారుల(ఐఏఎస్, ఐపీఎస్) పంపిణీ జరుగుతున్నది. అదనంగా కొన్ని సివిల్ సర్వీసు పోస్టులు మంజూరు చేసినా రాష్ట్రంలోని ప్రభుత్వశాఖల్లో అవసరాన్ని బట్టి వాటిని రాష్ట్రప్ర భుత్వం వినియోగించుకుంటోంది.

-కొత్తజిల్లాల్లో రాష్ట్రపతి ఆమోద ముద్రతో లాభమేంటి..?
దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే..వెంటనే పార్లమెంటులో బిల్లుగా పాసై చట్టం అవుతుంది. అలా చట్టం చేస్తే కొత్త జిల్లాలకు కేంద్రప్రభుత్వంలో గుర్తింపు వస్తుంది. అపుడు పాత 13 జిల్లాల స్థానంలో కొత్తగా గుర్తింపు వచ్చిన జిల్లాలు నమోదు అవుతాయి. ఆ తరువాత జనాభా గణన, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పెంపు కూడా జరుగుతుంది. అంతేకాదండీ.. ఇప్పటి వరకూ ఉన్న జిల్లా పరిషత్ లు కలెక్టరేట్లకు నిర్మాణాలు, అధికారుల కేటాయింపులు కూడా అదనంగా జరుగుతాయి. అవసరాన్ని బట్టి కొత్తగా పంచాయతీలు, మండలాల ఏర్పాటు కూడా జరుగుతుంది. 

తద్వారా విభజన జరిగిన స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధుల మొత్తం పెరుగుతుంది. కేంద్రం నియమించే అఖిలభారత సర్వీసుల అధికారుల కేటాయింపులు కూడా అధికంగా జరుగుతాయి. తద్వారా కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కమిషనర్ పోస్టులు కూడా పెరిగే అవకాశం వుంటుంది. జిల్లాల అభివృద్ధికి నిధులు కూడా మంజూరువు  అవుతాయి. సర్వసాధారంగా జిల్లాలకు ఉన్న నిధుల కంటే అధనంగా పెంచి ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కేంద్రంలో విభజన అంశాలకు చట్టబద్దత లేకుండా అలానే ఉంచేస్తుంటాయి. దానికి కారణం రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడమే. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులకు రాష్ట్రాలు కేంద్రం ద్వారా వచ్చే నిధులు కోల్పోవాల్సి వస్తుంది.

-చిన్న జిల్లాల వలన ఉపయోగమేంటి..?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాది అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వశాఖల్లో నియమకాలు చేపడతారు ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగాలు ఏర్పాటు కావడంతో ప్రభుత్వంపై సమస్యల పరిష్కార భారం తగ్గుతుంది. ఏ జిల్లా పరిధిలోని సమస్యలను ఆ జిల్లాయంత్రాంగం పరిష్కరించడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా కేంద్రప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రైవేటు కంపెనీలు రావడానికి, రవాణా మార్గాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇపుడు కొత్త జిల్లాల ప్రతిపాదనతో చాలా కాలం క్రితం జరగాల్సిన జనాభా గనణ, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పెంపు అన్నీ ఒకేసారి జరగడానికి వీలుపడుతుంది. ఒక రకంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రకాలుగా కూడా ఈ విభజన ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది.

 అయితే ఇక్కడ రాష్ట్రప్రభుత్వంలో అధికారంలో ఉన్నపార్టీలు కేంద్రాన్ని ప్రశన్నం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ తరహా పనులు వేగవంతం అవుతాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా..అది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందులోనూ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి జోనల్ విధానం, ఉమ్మడి జిల్లాల ప్రాతిపధిక అంశం మార్పు కాకపోతే ప్రభుత్వశాఖల్లో బదిలీలు, నియమాకాలన్నీ కూడా ఉమ్మడి జిల్లాల్లో నే చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయినా.. ఇంకా ప్రభుత్వ పరిపాలన అంశాలన్నీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి. అంతేకాదు కేంద్రప్రభుత్వం దృష్టిలో ఏపీలో ఉన్న జిల్లాలు కేవలం 13 మాత్రమే. పెంచిన జిల్లాల అంశం కేవలం రాష్ట్రానికే పరిమితం అయిపోయింది.

-వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంతా అరకొరగానే..
2019-2024 వరకూ అధికారంలో వున్న వైఎస్సార్సీపీ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా గెజిట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నది. కొత్త జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఐ అధికారులను మాత్రం నియమించింది తప్పితే 75 ప్రభుత్వశాఖలను మాత్రం పూర్తిస్థాయిలో విభజన చేయలేదు. కేవలం కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే విభజన జిల్లాల్లో ఏర్పాటు చేసి.. చాలా కార్యాలయాలు ఇంకా ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఉంచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్లు, 12 భాగాలు ఉన్నాయి.  దానిప్ర కారం కేంద్ర ప్రభుత్వం విభజన అంశాలన్నీ అమలు చేయాల్సి వుంది. అటు కేంద్రం రాష్ట్రానికి అమలు చేయడం మానేస్తే.. ఇటు రాష్ట్రం కూడా జిల్లాల్లో చేపట్టిన విభజన కూడా తూ తూ మంత్రంగానే చేపట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ఐటిడిఏలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన కూడా పరిపాలనకు కాస్త విఘాతం ఏర్పడింది.

 దానికి ఉదాహరణ.. ఉమ్మడి విశాఖజిల్లాలోని పాడేరులో ఐటిడిఏ ఉండగా అక్కడే అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసింది. ఇపుడు తాజాగా మళ్లీ కొత్త జిల్లా ప్రతిపాదనలో ఆ జిల్లా అలాగే ఉంచి జిల్లా కేంద్రాన్ని నర్సీపట్నంలో పెట్టాలన్నది ప్రతిపాదన. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జిల్లా మొదట నర్సీపట్నంలోనే ప్రారంభం కావాల్సి వుంది. అనివార్య కరాణాల వలన అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రదేశాలు ఏజెన్సీలో ప్రాంతంలో అధికంగా ఉండటం.. అవన్నీ పాడేరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉండటంతో అన్నింటిని అల్లూరి సీతారామరాజు జిల్లా(పాడేరు) జిల్లా మార్పు చేశారు. ఇలా చాలా అంశాలన్నీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ప్రతిపాధించిన కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేస్తే తప్పా.. అభివృద్ధి కానరాదు.. పెరుగుతా యనుకు న్న నిధులు కూడా పెరిగే అవకాశం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో విభజన ఆంధ్రప్రశ్ అంశం, నియోజ కవర్గాల పునర్విభజన అంశాలు పార్లమెంటులో బిల్లు అయ్యే అవకాశం వుంటుంది. అదీ ప్రస్తుతం వైరల్ అవుతున్న కొత్త జిల్లాల ప్రతిపాదన అంశం నిజమైతే.. లేదంటే గత ప్రభుత్వం మాదిరిగానే.. చేసిన మార్పులన్నీ రాష్ట్రానికి సరిపెట్టుకోక తప్పదు. చూడాలి ఏం జరుగుతుందనే ది..!

visakhapatnam

2024-10-06 18:20:21

గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు పంగనామం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధత లేని గ్రామ, వార్డు సచివాలయశాఖను పూర్తిగా తొలగించి ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేయడానికి పూనుకోవడంతోపాటు.. వాలంటీర్లను కూడా తొలగించేసి వారి కోసం ప్రత్యామ్నాయం కోసం ఆలోచనలు చేస్తున్నది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేదుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను పొమ్మనకుండా పొగపెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4 లక్షల మంది వాలంటీర్ క్లస్టర్  పరిధిలో ఉన్న 50 కుటంబాలను ఆయా సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేస్తోంది. గత మూడు నెలలుగా పించన్లు పంపిణీ కూడా ఈ విధంగానే చేపట్టిన ప్రభుత్వం అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలన్నీ ఉద్యోగులతోనే చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల ముందే చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు సమర్పించడం, గత ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకుండా వదిలేయడం కూడా కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చింది. 

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వశాఖల్లో కార్యాలయ సహాయకులు కూడా పెద్ద ఎత్తు ఉద్యోగ విరమణలు చేస్తున్నారు. ఇపుడు అక్కడ రెగ్యులర్ ఉద్యోగాలను నియమించాలంటే ప్రభుత్వానికి అతి పెద్ద భారం అవుతుంది. అదే వాలంటీర్లను ప్రభుత్వ కార్యాలయాలయాల్లోకి వినియోగిస్తే ఎలావుంటుందనే కోణంలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. దానికోసం సాధ్యా సాధ్యానాలను కూడా 19 ప్రభుత్వశాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శిలు, కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయశాఖ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నది. అదే సమయంలో ప్రస్తుతం ఇదే శాఖలో చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇక భర్తీచేయకుండా  ఉన్న పోస్టులను కుదించేస్తే ప్రభుత్వానికి ఆర్ధిక భారం కూడా తగ్గుతుందనే ప్రతిపాదన ప్రభుత్వశాఖల అధికారులు క్యాబినెట్ ముందుకి తీసుకెళ్లనున్నట్టు తెలస్తోంది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే గ్రామ, వార్డు సచివాలయశాఖకు కావాలనే చట్టబద్ధత చేయకుండా వదిలేయడంతో ఈ శాఖను అదే కారణంతో ఏమైనా చేయడానికి, ఉన్న ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీలు చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం అపుడే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఖాళీగా ఉన్న పంచాయతీల్లో నియామకాలు చేపట్టింది. ఇప్పటి వరకూ మేజర్ పంచాయతీల్లో ముగ్గురుచొప్పున ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఇటీవల జరిగిన బదిలీల్లో ఖాళీగా ఉన్న పంచాయతీలకు బదిలీలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి నాలుగైదు పంచాయతీలకి ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కూడా మేజర్ పంచాయతీల్లో అదనంగా ఉన్న పంచాయతీ కార్యదర్శిలకు బదిలీల పేరుతో పంచాయతీలను అప్పగించింది. తద్వారా ప్రస్తుతం అదనపు విధులు చేస్తున్న వారికి భారాన్ని తగ్గించి.. మాతృశాఖల్లోకి ఉద్యోగుల విలీనం కూడా మొదలు పెట్టింది.

 అంటే ఇక్కడ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను  వారి మాతృశాఖలకు పంపించే కార్యక్రమం పంచాయతీరాజ్ నుంచే ప్రారంభం అయ్యిందన్నమాట. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 పెంచడంతో ఆ రెండేళ్ల సమయం ఉద్యోగులకు 90శాతం పూర్తయిపోయింది. దీనితో ప్రతీ నెలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఉద్యోగులు వందలాదిగా రిటైర్ అవుతున్నారు. అక్కడ ఉద్యోగాలు కూడా భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ముందుగానే మేలుకున్న ప్రభుత్వం అత్యధిక ఉద్యోగులున్న ప్రభుత్వశాఖగా గుర్తింపు పొందిన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను మాతృశాఖలకు పంపేయడం ద్వారా ఖాళీ అయిపోయిన ఉద్యోగాల భర్తీ, పరిపాలనా సౌలభ్యం రెండూ కలిసి వస్తాయని భావించి వాటికి పచ్చజెండా ఊపేసింది.

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు నియమాకాలు చేపట్టినపుడే ఐదేళ్లు దాటిన తరువాత సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ చార్ట్ ప్రకారం పదోన్నతులు కల్పిస్తామని వారికి ఏర్పాటు చేసిన సర్వీసు రూల్స్ లో పేర్కొంది. అయితే చాలా ప్రభుత్వశాఖల్లో చాలా ఉద్యోగాలు ఖాళీ అయిపోతుండటంతో ముందు ఆ ఖాళీలు భర్తీచేసి, ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీచేసేస్తే తరువాత.. పదోన్నతులన్నీ ఒకేసారి ఏకీకృత విధానాలు అమలు చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారితోపాటు 4 లక్షల మంది వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. వీరందరినీ ఆయా ప్రభుత్వశాఖల్లోకి బదిలీచేసేస్తే.. వాలంటీర్లు తీసేయడం ద్వారా వీరు చేసే అన్నిపనులనూ ఉద్యోగులతో చేయించాలనే ప్రభుత్వ ఆలోచన. 

దానికి అనుగుణంగా ఇప్పటికే వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లను, వారికి కేటాయించిన కుటుంబాల వివరాలను సేకరించింది. వాటన్నింటినీ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సచివాలయ ఉద్యోగులతోనే ప్రస్తుతానికి పెన్షన్లను పంపిణీ చేయిస్తుంది. ఇకపైనా ఉద్యోగులతోనే పనిచేయిస్తే.. సరిపోతుందని దానికోసం ప్రత్యేకంగా వాలంటీర్లును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదనేది ప్రభుత్వం ఆలోచన. దానికి అగుగుణంగానే ముందు ఉద్యోగుల కేటాయింపులు, మాతృశాఖల్లో విలీనాలు జరిగిపోతే ప్రక్రియ ఒక కొలిక్కి తీసుకురావొచ్చుననేది అధికారులు సాధ్యాసాధ్యాలను అత్యంత వేగంగా పరిశీలిస్తున్నారు. ఇది పూర్తయిపోతే దాదాపు గ్రామ, వార్డు సచివాలయశాఖ బోర్డు తీసేయడం ఒక్కటే మిగిలివుంటుంది.

 ప్రస్తుతానికి సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల విధులు, ఆధార్ నమోదులు, ఇతర సమాచార సేకరనణ తప్పితే మరేమీ లేవు. దానిని గుర్తించిన ప్రభుత్వం సిబ్బంది అందరినీ అవకాశం ఉన్నంత మేర గ్రామాల్లో  గ్రామ పంచాయతీలకు, పట్టణాలు, నగరాల్లో పురపాలకశాఖలోనూ విలీనం చేసేయడం ద్వారా  గ్రామ, వార్డు సచివాలయశాఖకు మంగళం పాడేయవచ్చుననేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తున్నది. ఇప్పటికే సచివాలయాల్లోని ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు స్టాఫ్ నర్సు శిక్షణ ఇచ్చి వారికి పదోన్నతులు కల్పించి వారిని ఆరోగ్యశాఖలో విలీనం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల్లో వారిని నియమించేందుకు జీఓనెంబరు 115ని తీసుకొచ్చింది. అయితే అనూహ్యంగా ఈ జీఓపై కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు కోర్టుకి వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తరువాతనైనా వీరిని ఆరోగ్యశాఖలోకి విలీనం చేసేయడానికే కార్యాచరణ వేగంగా సాగుతోంది. ఇక గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పంచాయతీరాజ్ లో విలీనం చేస్తారు. వీఆర్వోలు, సర్వేయర్లు రెవిన్యూశాఖలోనికే వెళ్లిపోతారు.

 గ్రామీణ వ్యవసాయ సహాయకులు వ్యవసాయశాఖలోకి, హార్టికల్చర్ సహాయకులు హార్టికల్చర్ లోకి, యానిమల్ హజ్బెండరీ సహాయకులు పశు సంవర్ధక శాఖలోనికి, మత్స్య సహాయకులు మత్స్యశాఖలోకి, సెరీకల్చర్ సహాయకులు సెరీ కల్చర్ లోనికి పంపేస్తారు. ఇక మిగిలి ఉన్నది ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు. ఇందులో మహిళా పోలీసులపై కోర్టు కేసులు ఉన్నాయి. వెల్పేర్ అసిస్టెంట్లను సోషల్ వెల్పేర్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ల కి గానీ, లేదా పాఠశాల విద్యాశాఖలోకి గానీ విలీనం చేసి పాఠశాలల్లో మినిస్టీరియల్ స్గాఫ్ గా నియమించే ఆలోచనలు జరుగుతున్నాయని వినికిడి.  ఎటొచ్చీ  ఏ ప్రభుత్వశాఖ లేకుండా ఉండిపోయిన మహిళా పోలీసులను పోలీసు స్టేషన్లలో మినిస్టీరియల్ స్టాఫ్ గా వినియోగించాలా..?

 లేదంటే వారి విద్యార్హతలు పెరిగిన పేస్కేలును అనుసరించి వార్డు సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శిల ఖాళీల్లోకి పంపాలా..? అదీ కుదరదంటే జిల్లా పోలీసు శాఖలోని ఉద్యోగుల విద్యార్హతలను బట్టి సైబర్ విభాగం, స్పెషల్ టీం,  కార్యాలయ సహాయకులుగా పంపాలనే దానిపై సమాలోచనలు జరగుుతున్నాయి. అందరిని అన్నిశాఖలకు పంపేస్తే.. ఇక వాలంటీర్లతో పని ఉండదు కనుక. వారికోసమే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందనేది ప్రభుత్వం ముమ్మరంగా చర్చలు జరుపుతున్నది. త్వరలో జరగబోయే క్యాబినెట్ బేటీలో విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి..ప్రభుత్వం ప్రకటించినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లను ప్రభుత్వశాఖల్లో సహాయకులుగా నియమిస్తుందా.. ఆ ప్రకనటతో వారిని ఏమీ చేయకుండా అలానే ఉంచి.. సచివాలయ ఉద్యోగులను ముందు విభజన చేసి వారి మాతృశాఖలకు పంపించి.. చట్టబద్దత లేని శాఖను పూర్తిగా రద్దు చేస్తుందా అనేది..! 

visakhapatnam

2024-10-05 13:37:05

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాతృశాఖలకే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో  గ్రామ, వార్డు సచివాలయ శాఖ రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. గత ప్రభుత్వం చేసిన తప్పులే ప్రస్తుతం ఈ ప్రభుత్వశాఖ రద్దు అవడానికి కారణమవుతున్నాయి.. దానికితోడు రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు వారి విధులు వారు నిర్వర్తించుకుంటే.. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల విధులు చేపడుతున్నా..వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు మాత్రం రావడం లేదు. ఐదేళ్లు దాటిపోయినా వీరికి పదోన్నతులు దక్కలేదు. కొన్నిశాఖలకు సర్వీసు నిబంధనలే ఏర్పాటుచేయలేదు. మరి కొన్నిశాఖల సిబ్బంది ఉద్యోగాలపై కోర్టు కేసులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అన్నింటికీ మించి ఈ సచివాలయశాఖకు చట్టబద్ధత లేనేలేదు. ఈ తరుణంలో ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర అధికారులు గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులను వారి మాతృశాఖల్లో విలీనం చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారట రాష్ట్ర అధికారులు. అంతేకాదు.. గత ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచేయడంతో ఇపుడు ఆ సమయం కూడా పూర్తయిపోతున్నది. ఈ తరుణంలో 74 ప్రభుత్వశాఖల్లో భారీగా ఉద్యోగుల కొరత ఏర్పడనున్నది. 

ప్రస్తుతం ఖజానాలో కాసులు నిండుకుండటంతో.. కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్లు తీసే పరిస్థితి లేదు. పరిపాలనా సౌలభ్యం కారణం చూపి ఉన్న ఉద్యోగులనే ప్రభుత్వశాఖలకు సర్ధుబాటు చేస్తే తప్పా..మరే ఇతర పనులూ పూర్తయ్యేటట్టు కనిపించడంలేదు. దీనితో గ్రామ, వార్డు సచివాలయశాఖను రద్దు చేసి ఇందులోని 19 ప్రభుత్వశాఖల ఉద్యోగులను వారికి నియామాకాలు చేపట్టిన మాతృశాఖల్లో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి వీలుపడుతుందని ప్రభుత్వం యోచిస్తున్నది. అలాగని ఈ ప్రభుత్వశాఖను అలాగే ఉంచేయాలన్నా వీలుకాని పరిస్థితి నెలకొంది. నేటికీ ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత లేకపోవడంతో ఈ ప్రభుత్వశాఖను రద్దు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా అధికారులు వెతుకుతున్నారనే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖల్లోనూ ఉద్యోగులు రిటైర్ కావడంతో వారి స్థానాల్లో సచివాలయ ఉద్యోగులను నియమించడం ద్వారా పరిపాలన విధులకు భంగం వాటిల్ల కుండా వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన. పైగా ఇపుడు ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఇచ్చే అంశాలని కూడా పరిశీలన చేస్తుందట. అలా చేయడం ద్వారా సచివాలయ ఉద్యోగులకంటూ ఒక ప్రభుత్వ శాఖ ఉంటుంది. అదే సమయంలో సదరు శాఖలోని ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వీరికి కూడా అందే అవకాశం ఏర్పడుతుంది. 

లేదంటే చట్టబద్ధత లేని ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు గత ప్రభుత్వం కుదించేసినట్టుగానే అన్ని ప్రయోజనాలు కూటమి ప్రభుత్వం కూడా కుదించేయక తప్పదు. అలా చేయకపోతే ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా పడుతుంది. పైగా ఈసచివాలయశాఖలోని కొన్ని శాఖల సిబ్బందికి పూర్తిస్థాయిలో పనులు కూడా ఉండటం లేదని రాష్ట్ర అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్టు గా తెలిసింది. ఇలాంటి సమయంలో ఈ శాఖను రద్దు చేసి.. ఉద్యోగులను వారి విద్యార్హతలను బట్టి.. వారిపోస్టులను బట్టి ఇతర ప్రభుత్వశాఖలకు అప్పగించేయడం ద్వారా రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో ఖాళీలు భర్తీచేసినట్టు అవుతుంది. ఇప్పటికే సచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లను పంచాయతీరాజ్ లోని భారీగా ఖాళీలు ఏర్పడే పంచాయతీ కార్యదర్శిల పోస్టుల్లో భర్తీచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు పంచాయతీలను అప్పగించి.. అక్కడ ఇన్చార్జి వ్యవస్థను తొలగించాలని.. ఇంకా ఖాళీలు ఉంటే డిజిటల్ అసిస్టెంట్లను కూడా చిన్న పంచాయతీల్లో సర్దు బాటు చేయాలనే యోచనకువచ్చారట అధికారులు. 

 అందులోనూ ఇపుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖనూ కేటాయించకుండా కోర్టు కేసుల నెపంతో గాల్లో ఉంచారు. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లకు నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖ ను రద్దు చేసి.. గ్రామ పంచాయతీల్లో గతంలో మాదిరిగానే కనీసం ఐదుగురు సిబ్బంది ఉండేలా ప్రణాళికలు చేయడానికి.. వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని పట్టణ పురపాలక సంస్థలో విలీనం చేసి కార్పోరేషన్లు, మున్సిపాలిటీ సిబ్బందిగా మార్చడానికి సమాచాలోచనలు చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

వాలంటీర్లను తొలగించి.. ప్రభుత్వశాఖల్లో నియమించి..?
గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న వాలంటీర్లను గత ప్రభుత్వమే వారి కాంట్రాక్టును రెవిన్యువల్ చేయలేదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం గత మూడు నెలలుగా జీతాలు చెల్లిస్తూ వస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయశాఖను రద్దు చేస్తే అత్యవసరంగా వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేసేయవచ్చు. తద్వారా అక్కడి సిబ్బందిని ప్రభుత్వశాఖల్లో సహాయకులగా నియమించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. అందులోనూ ఎలాగూ వీరి జీతం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచే సమయంలో వారిని ఇళ్ల దగ్గర కాకుండా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అవకాశం ఉంటే మరో రూ.5 వేలు పెంచి వారికి కార్యాలయాల్లో సహాయకులుగా నియమించాలని ప్రభుత్వంలోని అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. అలా ఎవరైతే ఇష్టంగా పనిచేయడానికి ముందుకి వస్తారో అలాంటి వారందని ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వశాఖల్లో నియమించి వారి సేవలను వినియోగించుకోనున్నారట. అయితే ఇవన్నీ ప్రాధమికంగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు ఆలోచిస్తున్న తీరు మాత్రమే. 

ఇది పూర్తిగా అమలు అయినా.. అమలు కాకపోయినా ఆశ్చర్యపోనవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకే బాగా చేరువ అయిపోయాయి. ఒక్కసారిగా వీటిని రద్దు చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరే భావం ఏర్పడుతుందని.. నిరుద్యోగులకు తెలిస్తే.. తమకు వచ్చే ఉద్యోగాలను సచివాలయ ఉద్యోగులతో సర్ధుబాటు చేసేసుకుంటున్నారనే ఆందోళనలు కూడా అధికమవుతాయనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారట. ఈ పనులన్నీ జరిగి కార్యరూపంలోకి రావాలంటే సుమారు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టినా పట్టొచ్చునన చెబుతున్నారు. చూడాలి గ్రామ, వార్డుసచివాలయశాఖను పూర్తిగా రద్దుచేస్తారా..? ఇందులోని ఉద్యోగులను మాతృశాఖల్లోకి విలీనం చేస్తారా..వాలంటీరల్లను తొలగించి ప్రభుత్వశాఖల్లోని సహాయకులుగా నియమిస్తారా..? కాదూ కూడదు.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను అలాగే ఉంచి ఉద్యోగుల ప్రయోజనాలను పెంచి.. ప్రభుత్వానికి అనుకూలంగా వారి సేవలను వినియోగించుకుంటుందా.. అనేది. ..!

visakhapatnam

2024-09-26 06:18:51

ఈఎన్ఎస్-ఈరోజు వార్త నిజమైంది..! గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు మంగళం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అతి కొద్ది సమయంలోనే చట్టబద్దత లేని ఒక ప్రభుత్వ శాఖ కనుమరుగు కాబోతుంది.. గతప్రభుత్వం కావాలని చేసిన తప్పు ప్రస్తుత ప్రభుత్వానికి అది సాంకేతిక కారణంగా కనిపించింది.. అంతే వెను వెంటనే దానిని కేబినెట్ లో చర్చించి.. సాధ్యా సాధ్యాలను పరిశీలించి ఆపై ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయడానికి నిర్ణయం తీసుకుంది.. ఆ ప్రభుత్వ శాఖ మరేంటో కాదు. ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ శాఖే.. మేమేదో కావాలని రాస్తున్న వార్త కాదిది.. సాక్షత్తూ కూటమి ప్రభుత్వంలోని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి క్యాబినెట్ లో ప్రస్తావించిన అంశాలు మీడియాకి ప్రకటించిన విషయమిది..  ఒక్క ఉద్యోగులనే కాదు.. గ్రామ,వార్డు సచివాలయాల్లో వాలంటీర్లను కూడా ఇతర ప్రభుత్వ శాఖలకు బదలాయింపు కోసం సాధ్యాసాధ్యాలు వెతుకుతున్నామన్నది ఆ ప్రకటన యొక్క సారాంశం.

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ-ఈరోజు దినపత్రికలు ఏ పరిశోధనాత్మక కథనం ప్రచురించినా.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వమైనా.. నేటి కూటమి ప్రభుత్వమైనా నిజమవుతూనే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అంటే సరిగ్గా 3 నెలల ముందు రాసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ‘ఉంటుందా..ఊడుతుందా..’ కథనాన్ని ప్రచురింది. దానిని కాస్త నిజం చేస్తూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను, వాలంటీర్లను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయడానికి సాంకేతిక అంశాలు పరిశీలిస్తున్నామని చేసిన ప్రకటన ఇటు ఉద్యోగులను, మీడియాను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది.. ఈఎన్ఎస్-ఈరోజు  మీడియా ఎప్పుడూ చీకటిలో బాణాలేస్తూ.. గ్రామ, వార్డు సచివాలయశాఖపై తాము మాత్రమే పరిశోధన చేసి ప్రత్యేక కథనాలు రాస్తున్నామని..మరే ఇతర మీడియా రాయడం లేదని ఎద్దేవా చేసిన ఇతర మీడియాలన్నింటికి సరిగ్గా ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. 

అసలు అంత పెర్ ఫెక్ట్ గా సమాచారం తెలుసుకొని మరీ రాయడానికి గల కారణాలేంటో తెలియని వారంత ఇపుడు తలలు  పీక్కుంటున్నారు. ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖ తలా తోకా లేకుండా ఏర్పాటైతే సర్వీసు నిబంధనలు ఉద్యోగుల పాలిట శాపాలవుతాయని గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి నిజం  చేసి కూడా చూపించింది. 2019లో అక్టోబరు 2 గాంధీజయంతి రోజు ఏర్పాటైన ఈ ప్రభుత్వ శాఖ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలని తప్పులు చేస్తూనే వచ్చింది. అందులో ప్రధాన మైనది.. నేటి కూటమి ప్రభుత్వానికి ఈశాఖలోని ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి విలీనం చేయాలని పించేలా చేసిన సాంకేతిక కారణం ‘ఈ ప్రభుత్వ శాఖకు చట్ట బద్ధత చేయకపోవడం’ అంటే కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలో తీర్మాణం చేసి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా పక్కాగా ఏర్పాటు చేయడం.

 దీనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలనే చేయలేదు. సదరు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో జరిపిన క్యాబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖ విషయంలో సుస్థిర నిర్ణయాలు తీసుకోలేదంటే ఏమనుకోవాలి. నిజంగానే కావాలని చేయలేదా..? లేదంటే ఉద్యోగులను భయపెట్టడానికి చేయలేదా..? అదీ కాదనుకుంటే ఎలాగూ ఈశాఖకు నూతన భవనాలు నిర్మించేశాం కదా ఈ శాఖను ఎవరూ టచ్ చేయలేరని చేయలేదా..? అనే విషయాలు పక్కన పెడితే.. గత ప్రభుత్వం అనుసరించిన తేడా విధానాలనే నేడు కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు, వాలంటీర్ల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యాయి. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొబేషన్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఈఎన్ఎస్-ఈరోజు ప్రత్యేక కథనాల ద్వారా ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ‘ఉంటుందా..ఊడుతుందా..’ శీర్షికన రాసిన కథనాన్ని మాత్రం కాస్త సీరియస్ గానే తీసుకుంది. వెంటనే స్పందించకపోయినా మూడు నెలల తరువాత క్యాబినెట్ సమావేశం అయిన తరువాత స్పందించింది.  గత ప్రభుత్వం చేసిన తేడా వ్యవహారాలన్నింటినీ ఉటంకిస్తూ రాసిన కథనాలపై మాత్రం మూడు నెలల్లోనే స్పందించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునేలా చేసింది.  

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో కవాలని చేసిన తప్పులు
-ఈ శాఖ ఏర్పాటు చేసి కూడా చట్టబద్దత చేయకపోవడం
-ఈ శాఖకు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ను నియమించకపోవడం
-సుమారు రాష్ట్ర ప్రభుత్వంలోని 19శాఖలను ఒక ప్రభుత్వ శాఖ కలిపి ఏర్పాటు చేయడం
-ఈ శాఖలోని ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం
-ఉద్యోగులకు 2ఏళ్ల సర్వీసు ప్రొబేషన్ పూర్తయిన వెంటనే 2 ఇంక్రింమెంట్లు కలపకపోవడం
-పేస్కేలు ఇవ్వాల్సి వస్తుందని రెండేళ్లకంటే అదనంగా మరో తొమ్మిది నెలలు అధనంగా  ఉద్యోగులతో రూ.15వేలకే పనిచేయించడం
- సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ముందే డిఏ, హెచ్ఆర్ఏలు కుదించేసి ఆ తరువాత మళ్లీ సవరణలు చేయడం
-ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతో సమానంగా కాకుండా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేకంగా.. అంటే తక్కువగా పీఆర్సీ అమలు చేయడం
-ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ఈశాఖ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రయోజనాలు ఏర్పాటు చేకపోవడం
- గ్రామ, వార్డు సచివాలయా మహిళా పోలీసు పోస్టులపై ప్రైవేటు వ్యక్లులు కేసులు వేస్తే కౌంటర్ ఫైల్ దాఖలు చేసి పరిష్కరించకపోవడం
-పోలీసుశాఖకు మహిళా పోలీసు ఉద్యోగులకు సంంధం లేదని  కోర్టుకి చెప్పి వీరికి ఏశాఖా కేటాయించకుండా వదిలేయడం.
-వెల్పేర్ అసిస్టెంట్లకు సర్వీసు నిబంధనలు, ప్రోమోషన్ ఛానల్ ఏర్పాటు చేయపోవడం
-సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు శిక్షణ ఇచ్చి.. వారికి సక్రమ పద్దతిలో ప్రమోషన్ కల్పించకపోవడం
-అదే ఇన్ సర్వీస్ విధానాన్ని ఇతర శాఖల సచివాలయ ఉద్యోగులకు అమలు చేయకపోవడం
-ఒకే సారి వేల మంది ఏఎన్ఎంలను ఇన్ సర్వీసు జిఎన్ఎం శిక్షణకు సర్వీసు పూర్తయిన రెండేళ్లకే తీసేసుకోవడం
-ఇన్ సర్వీసులో శిక్షణ పొందిన ఏఎన్ఎంలకు జిఎన్ఎంలుగా ఏ సర్వీసు నిబంధనలతో పదోన్నతులు కల్పిస్తున్నారో చెప్పకపోడం
-సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వదిలేయడానికి డిపార్ట్ మెంటల్ టెస్టులు నిర్ధేశించకపోవడం.

కొసమెరుపు- 
2019 అక్టోబరు 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన తరువాత ఉద్యోగుల నియమాకాలు, చట్టబద్ధత, ప్రొబేషన్ డిక్లరేషన్, ప్రొభేషన్ అనంతరం ఇంక్రిమెంట్ల జోడింపు, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ఈ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రయోజనాలు, పీఆర్సీ అమలు,  సర్వీసు నిబంధనలు,  ప్రకారం  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ శాఖను నిసితంగా పరిశీలిస్తున్న టిడిపి కూటమిగా అధికారంలో వచ్చిన తరువాత ఈ శాఖపై పూర్తిగా అధ్యయనం చేయడం ప్రారంభించింది. పూర్తిగా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు ఈ సచివాలయ శాఖ ఉద్యోగులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తించింది. అంతేకాకుండా ఈ శాఖకు అన్నింటికంటే ముఖ్యంగా చట్టబద్ధత తీసుకు రాలేదని.. అలా చట్టబద్ధత తీసుకురాని ప్రభుత్వశాఖను కేబినెట్ లో చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఏ మాత్రు శాఖల సిబ్బంది అందరినీ కలిసి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసిన ఈ శాఖ ఉద్యోగులను మళ్లీ తిరిగి అదేశాఖకు బదలాయిస్తే ఎలావుంటుందని ఆలోచన చేయడం మొదలు పెట్టింది. అందునా గత ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు 60 నుంచి 62ఏళ్లకు పెంచడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనూహ్య రీతిలో వేల సంఖ్యలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు రిటైర్ అయిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిని బట్టి కొత్త ఉద్యోగాల కల్పన చేసే పరిస్థితి లేదు. 

ఉన్న వారితోనే  పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేర్పులు చేసుకొని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానితో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని సుమారు. 1.25 లక్షల మంది ఉద్యోగులను ఆయా మాతృ ప్రభుత్వశాఖలకు పంపితే రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో వీరు పనిచేస్తారు. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనికూడ ఉండదు. దానికోసం చేయాల్సిందల్లా ఒక్కటే గత ప్రభుత్వం చేసిన తప్పులను సాంకేతి కారణాలుగా చూపి ఉద్యోగలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖల్లో సర్ధుబాటు చేయడమే. ఇపుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు క్యాబినెట్ సమావేశం తరువాత వెల్లడైంది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ‘ఉంటుందా..ఊడుతుందా..’ శీర్షికన ఈఎన్ఎస్-ఈరోజు పరిశోధనాత్మక కథనం 3నెలల ముందే అందించింది. సరిగ్గా ఇపుడు దానిని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన అంశం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. చూడాలి. నిజంగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఊడ్చేస్తుందా..? లేదంటే సిబ్బందిని మాత్రమే మాతృశాఖల్లోకి ఖాళీలను బట్టీ భర్తీ చేసి విధులు యధావిధిగా ఇక్కడా ఉంచి పనిచేయిస్తుందా.. గత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పేస్కేలు అమలు చేసిన దగ్గర నుంచి పీఆర్సీ అమలు చేసేవరకూ కుదించేసిన ప్రయోజనాలను గుర్తించి ఇతర ప్రభుత్వశాఖల్లోకి విలీనం చేసిన తరువాతనైనా అమలు చేస్తుందా.. అని..?! 

visakhapatnam

2024-09-18 15:06:04

స్నేహపూర్వకంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని రాష్ట్రానికి రప్పిస్తాం

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని స్నేహ పూర్వక వాతావారణంలో తెలంగాణ నుంచి రప్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావుకి హామీ ఇచ్చారు. విశాఖలో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డా.కంచర్ల రాష్ట్రంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యాచారణను, సినిమా వాతావరణానికి విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీయ, గోదావరి ప్రదేశాలు ఏ విధంగా ఉపయోగపడతాయో  మంత్రికి వివరించారు. అంతేకాకుంగా ఇండస్ట్రీ విశాఖకు తరలి రావడం ద్వారా . ఎన్నో వందల కుటుంబాలకు ప్రత్యేక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాది కలుతుందని చెప్పారు. దానికిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ రాష్ట్రానికి రావడం ద్వారా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కూడా రాష్ట్రానికి రావడానికి అవకాశం వుంటుందన్నారు. తద్వారా రాష్ట్రంలోని సినిమాలు నిర్మించేవారు తెలంగాణ వెళ్లే శ్రమ తగ్గుతుందన్నారు. 24 క్రాప్ట్స్ కి సంబంధించిన సిబ్బంది, 64 కళలకు సంబంధించిన కళాకారులకు కూడా నిత్యం ఉపాది లభించడానికి ఆస్కారం వుంటుందన్నారు.

 ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రతో చర్చించి సినిమా పరిశ్రమకు సంబధించిన కేంద్ర కార్యాలయాలను విభజన చేయాల్సిందిగా కోరడంతోపాటు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తనవంతు సహకారం అందింమామని చెప్పారు.అనంతరం రాష్ట్ర చాత్తాద శ్రీ వైష్టవ సంఘం వన సమారాధన కరపత్రాన్ని స్టేట్ కమిటి ఆధ్వర్యంలో మంత్రి ఆవిష్కరించారు. అలాగే బాలభాను అర్చక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతికోసం ఐదురోజుల పాటు ఆరిలోవన ఎర్ని దుర్గమాంబ ఆలయ ప్రాంగణంలో యజ్ఞం, యాగాలదులు, ప్రత్యేక పూజాకార్యక్రమాలకి సంబంధించిన కరపత్రాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమానికి మంత్రి రామ్మోహన్ నాయుడుని డా. కంచర్ల ఈ సందర్భంగా ఆహ్వానించారు. ప్రపంచ శాంతి కోసం తలపెట్టే ఈ మంచి కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని డా.కంచర్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఎంపికై డా.కంచర్ల అచ్యుతరావుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కంచర్లను  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చాత్తాద శ్రీ వైష్టవ సంఘం ప్రతినిధులు, అర్చరక సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


visakhapatnam

2024-09-16 05:58:12

కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల జీవితాల్లో మట్టి..!

వైద్య ఆరోగ్యశాఖలో జీఓనెంబరు 115 రగడ తీవ్రతరం అవుతున్నది. వైఎస్సార్సీపీ చేసిన తప్పుడు విధానాలతో వైద్యఆరోగ్యశాఖలో పారా మెడికల్ ఉద్యోగాలకు రెగ్యులర్ నోటిఫికేషన్లు రాలేదు సరికదా.. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్శుల మనుగడకూడా ప్రశ్నార్ధకం అవు తున్నది. గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలను ఆర్ధిక భారంతో కూటమి ప్రభుత్వం అదే తప్పును కొనసాగించాల్సి వస్తోంది. అసలు వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను తేడాగా ఏవిధంగా భర్తీచేశారో తెలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలో పడుతుంది. తద్వా రా ఏళ్ల తరబడి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల కోసం ప్రభుత్వం కూడా ఒక సముచిత ఆలోచన చేయడానికి ఆస్కారం వుంటుంది. గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు క్రింద జిఎన్ఎం శిక్షణ ఇచ్చి పదోన్నతులు కల్పిస్తున్నట్టు వారికి ప్రయో జనం చేకూర్చినా..ఎన్నో ఏళ్ల నుంచి కాంట్రాక్టు బేస్ ఉద్యోగాల్లో పనిచే స్టాఫ్ నర్సుల జీవితాలు మట్టి కొట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నా యి.. గత ప్రభుత్వం తేడా విధానంలోని లోపాలను, తప్పని సరిపరిస్థితుల్లు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను  ఒక్కసారి తెలుసుకుంటే..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసింది. తద్వారా 1.35 లక్షల ఉద్యో గాలను భర్తీచేసి నిరుద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగాలను కల్పించాలని సంకల్పించింది. అయితే అందులో చాలా పెద్ద కుట్రకోణం దాగివుం దని ఉద్యోగ సంఘాలు గొల్లు మన్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూగా తమ సేవలను పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తే కొందరి సేవలను కూడా వారికొచ్చిన మార్కులు ఆధారంగా తీసుకొని అందరినీ కలిపి ఏఎన్ఎం ఉద్యోగాల్లోకి సుమారు 15వేల మందిని భర్తీచేసింది. అంతవరకూ బాగానే ఉన్నా.. ఆ తరువాతే పరిపాలనా సౌలభ్యం కోసం, ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడం కోసం గత ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. కోవిడ్ తరువాత వేల సంఖ్యలో స్టాఫ్ నర్స్ లు ఉద్యోగ విరమణలు చేస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం..  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీస్ పేరిట జిఎన్ఎం(స్టాఫ్ నర్సు) శిక్షణ ఇచ్చింది. అలా శిక్షణ ఇచ్చి ఊరుకున్న ప్రభుత్వం వారిని మళ్లీ సచివాలయాల్లోనే విధులు నిర్వహించాలని, వారికి జిఎన్ఎం పేస్కేలు కూడా వర్తింపచేయకుండా ఇక్కడే విధులు నిర్వహించుకుంటూ వచ్చింది. ఇక్కడ మీకు ఒక అనుమానం రావొచ్చు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వడం మంచిదే కదా అని.. నిజమే మంచిదే.. అది ఎలా అంటే..? ఇన్ సర్వీసులోని ఉద్యోగులకు అదనపు శిక్షణ ఇస్తే.. సదరు ప్రభుత్వ శాఖలోని ఖాళీలను బట్టి పోస్టుల్లోకి వీరికి పదోన్నతి కల్పించాలి. 

పదోన్నతి కల్పిస్తే ఏఎన్ఎం ప్కే స్కేలు సహా అపుడు జిఎన్ఎం పేస్కేలులోకి వెళుతుంది. కానీ గత ప్రభుత్వం ఆ విధంగా చేయలేదు. శిక్షణ ఇచ్చి మళ్లీ వారిని సచివాలయాల్లోనే ఉంచేసింది.  ఓ ప్రక్క అప్పటికే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో సుమారు 15వేల మంది ఉద్యోగు లు పనిచేస్తుండగా వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇపుడు ఇపుడు మళ్లీ అలా శిక్షణ పొందిన జిఎన్ఎస్ స్టాఫ్ నర్సులను భారీగా ఖాళీలు అవుతున్న రెగ్యులర్ స్టాఫ్ నర్సు ఖాళీల్లో భర్తీచేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. ఇలా చేయడం వలన ఇప్పటి వరకూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు రెగ్యులర్ కాకుండా మరికొన్నేళ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనితో రాష్ట్రవ్యాప్తం ఉన్న కాంట్రాక్టు బేస్డ్ స్టాఫ్ నర్సులంత ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది కాలంలో సుమారు మూడువేలకు పైగా రెగ్యులర్ స్టాఫ్ నర్సులు రిటైర్ కానున్నారు. ఒకేసారి అన్ని పోస్టు భర్తీచేయాలంటే ప్రభుత్వం అంత త్వరగా చేపట్టదు. దానితో సచివాలయాల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ఖాళ్లీల్లో సర్ధుబాటు చేయాలని యోచిస్తున్నది. అలా చేయడం ద్వారా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికే సుమారు 15ఏళ్లుగా పనిచేస్తున్న వీరంతా ఉద్యోగాలు రెగ్యులర్ కావాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగిన స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేసిన తరువాత మాత్రమే మిగిలిన కార్యక్రమాలు చేపట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. వీళ్లంతా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించారు. కనీసం వారి సేవలను గత ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి త్వరలో భారీ సంఖ్యలో స్టాఫ్ నర్సులు(గత ప్రభుత్వం పెంచేసిన 2 రెండేళ్ల అదనపు సర్వీసు ఉద్యోగ విరమణతో) కొరత ఏర్పడనుండటంతో.. ఇప్పటికే శిక్షణ పొందిన సచివాలయ స్టాఫ్ నర్సులను కౌన్సిలింగ్ చేసి పదోన్నతుల పేరుతో భర్తీచేస్తున్నారు. అలా చేసినా ఇంకా చాలా ఖాళీలు భర్తీచేయాల్సి వుంటుంది. అందులోనూ.. చాలా మంది ఏఎన్ఎం లు జిఎన్ఎంగా శిక్షణ పొందలేదు కూడా. అదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు తమను రెగ్యులర్ చేసిన తరువాత ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల కోసం ఆలోచించాలని.. దానికోసం ఇచ్చిన జీఓనెంబరు 115 రద్దు చేయాలని ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు.

ఇప్పటికే కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యసేవల్లో అంతరాయం ఏర్పడుతున్నది. అదే వీరు పూర్తిస్థాయిలో సేవల ను నిలుపుదల చేయడం మొదలు పెడితే పరిస్థితి మరింత జటిలం కానున్నది. ఇప్పటికిప్పుడు 15వేల మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన ఈ తేడా నియామకాలు, అడ్డగోలు ఇన్ సర్వీసు శిక్షణ కారణంగా ఇప్పుడు కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు నష్టపోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఒక బ్యాచ్ స్టాఫ్ నర్సులకు పదోన్నతులు కల్పించే సమయంలో కనీసం కొంత శాతం మేరకైనా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాల్సి ఉంది. ఎన్నోఏళ్లుగా రెగ్యులర్ నియామకాల్లో కూడా వీరికి తీరని అన్యా యమే జరుగుతున్నది. కనీసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఏఎన్ఎంలకు జిఎన్ఎంలుగా ఇన్ సర్వీసు శిక్షణ ఇచ్చే సమయంలో నైనా అప్పటికే పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్లో కొందరినైనా రెగ్యులర్ చేసి ఉంటే మిగిలిన వారికి వారి సర్వీసులు కూడా రెగ్యులర్ అవుతాయని నమ్మకం వచ్చేది. కానీ గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వాలు అలా చేయలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 15ఏళ్లుగా కాం ట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను ప్రభుత్వం ఆదుకోవాల్సి వుంది. చూడాలి కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల విషయంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనేది..!


visakhapatnam

2024-09-11 12:55:23

ఏపీ కేబినెట్ లో సచివాలయాల కోసం జాన్తానయ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో గ్రామ, వార్డు సచివాలయాల కోసం చర్చించి మార్పుల దిశగా చర్యలు తీసుకుంటారని రాష్ట్రప్రభుత్వంలోని అతిపెద్ద మూడవ ప్రభుత్వశాఖగా ఉన్న సచివాలయ ఉద్యోగులు భావించారు. ఇపుడు ఈ శాఖను టచ్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం అనుకున్నారో ఏమో తెలీదు గానీ. కనీసం ఒక్క అంశాన్ని కూడా చర్చించలేదు సరిగదా భవిష్యత్తులోనైనా చర్చించాలనే నిర్ణయం  కూడా తీసుకోలేదు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఒక దిశ, నిర్ధేశం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కూటమి ప్రభుత్వంలోనైనా తీరుతుందని భావించిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. కేబినెట్ భేటీలో కనీసం ఈశాఖకు చట్టబద్ధత తీసుకువచ్చే విషయమైనా చర్చిస్తారనుకుంటే.. కేవలం ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలైన సెబ్, రెవిన్యూ, సివిల్ సప్లైస్ వంటి శాఖల్లో కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకొని మమ అనిపించేశారని ఉద్యోగ వర్గాలు పెదవి విరిచాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమల కోసమైనా కనీసం ఏ ఒక్కప్రభుత్వశాఖ కోసం చర్చించకపోవడం 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక క్యాబినెట్ భేటీలో చర్చించిన అంశాలు, నిర్ణయాలు ఒక్కసారి తెలుసుకుంటే..

    సీఎం పేషీ, సీఎంవో అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం.. మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులను భర్తీచేయడానికి నిర్ణయం..     కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్‌ దుకాణాల్లో ఈ- పాస్‌ మిషన్ల కొనుగోలుకు రూ.11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం..   సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం..   రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం.. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం.     పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు కేబినెట్‌ ఆమోదం.. గతంలోని గుత్తేదారుకే మళ్లీ పనులు చేసేలా నిర్ణయం,  ఎక్సైజ్ శాఖను
  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో  గా మార్చిన గత ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. మళ్లీ సదరు శాఖకు ఎక్సైజ్ శాఖగానే ఉంచాలని  కేబినెట్‌ తీర్మానం..    పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫొటో, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు ఆమోదం.. తద్వారా 21.86లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని ముద్రించి ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయించారు. తొలిసారిగా ఈ-కేబినెట్ నిర్వహించడంతో కొన్ని అంశాలకే ఈ భేటీని పరిమితం చేశారు. 

visakhapatnam

2024-08-28 18:22:15