1 ENS Live Breaking News

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు సేఫేనా..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సార్వత్రిక ఎన్నికల విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకున్నాయి. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసిక పుత్రికగా ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అడుగడుగునా అన్యాయమే జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టే లేదు. దీనితో ఎన్నికల విధులు అప్పగించిన సమయంలో తేడాలు వస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందునే వాదన బలంగా వినిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన ప్రధాన తప్పిదాలు ఒక్కసారి తెలుసు కుంటే.. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సచివాలయశాఖను ఏర్పాటు చేసింది. పట్టణాల్లో వార్డు సచివాలయాలు 16 శాఖల సిబ్బం దితోనూ, గ్రామాల్లో గ్రామ సచివాలయాల 12 మంది సిబ్బందితోను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖలో ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖలతో సమానంగా సదుపాయాలు, ప్రయోజనాలు ఏర్పాటు చేయాలి. కానీ నాలుగేళ్లు దాటి పోతున్నా.. నేటికీ నాలు గైదు ప్రభుత్వశాఖల సిబ్బందికి సర్వీసు నిబంధనలు గానీ, ప్రమోషనల్ ఛానల్ గానీ ఏర్పాటు చేయలేదు.

 ఈ సిబ్బందిని రెండేళ్ల సర్వీసు తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేయాల్సి ఉండగా వీరితో 9నెలలు అధనంగా విధులు చేయించుకొని ఆ తరువాత సర్వీసు రెగ్యులర్ చేసింది. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.30లక్షల మంది ఉద్యోగులు వారి పేస్కేలు, రెండు డిఏలను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా సర్వీసు రెగ్యులర్ చేసే సమయంలో వీరికి చెల్లించాల్సిన రెండు ఇంక్రిమెంట్లు కూడా చెల్లించకుండానే వదిలేసింది. పైగా దానిపై నేటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అలా చేయడం వలన సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసే సమయంలో చాలా ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది. తద్వారా ఒక్కో ఉద్యోగి వీరి సర్వీసులో సుమారు రూ.3 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోయారు.  కరోనా సమయంలో కూడా సచివాలయ ఉద్యోగుల సేవలు లేకపోతే ఏపీలో అత్యధికంగా ప్రాణ నష్టం జరిగి ఉందేడి.. సేవలు చేస్తూ ఉద్యోగులు మృత్యువాత పడి ప్రజలకు సేవలు అందిం చారు. కానీ వీరిని కనీసం ప్రభుత్వం గుర్తించలేదు. వీరికి అమలు చేయాల్సిన ప్రయోజనాల విషయంలో నేటికీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. బయటకి చెబితే ఎక్కడ వేటు పడుతుందోనని వీరంతా లోలోనే మధన పడుతున్నారు. సమయం వచ్చినపుడు తమ సత్తా చూపించాలని కూడా ఇటీవల రాష్ట్ర రాజధానిలో జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నేటి వరకూ ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని ప్రభుత్వశాఖల సేవలు చేస్తున్నా తామ విషయంలో చాలా వివక్షకు గురవుతున్నామని మండి పడుతున్నారు. ఏప్రభుత్వ శాఖలో ఉద్యోగులైనా వారి శాఖ సేవలు మాత్రమే చేస్తారని..కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల సేవలు చేయడంతోపాటు, ఖాళీగా ఉన్న ఉద్యోగుల విధులు కూడా చేయాల్సి వస్తోందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులతో అయితే ప్రభుత్వానికి తీరని నష్టం ఏర్పడుతుందని.. ఈసారి ఎన్నికలకు సచివాలయశాఖ ఉద్యోగులను వినియోగించడం ద్వారా తమ ప్రభుత్వంలోనే వారికి ఉద్యోగాలొచ్చాయి గనుకు మం చి ఉద్దేశ్యంతో పనిచేస్తారని భావిస్తోంది. అయితే ప్రభుత్వం సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో చేసిన తప్పులను, ఎగ్గొట్టిన ప్రయోజ నాల విషయాని నిఘా సంస్థలు ఎప్పటి కప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నాయి. అయినప్పటికీ తమ ప్రభుత్వమే ఉద్యోగా లిచ్చిందని..పైగా ఉద్యోగులు తోక జాడిస్తే..చట్టబద్దత కల్పించని ఈశాఖ గాలిలో కలిసిపోతుందనే భయం కూడా వారికి ఉండాలనే ఆలోచ నతో ఉన్నట్టు కూడా సంకేతాలు అందుతున్నాయి. ఈ సచివాలయశాఖకు కేబినెట్ లో చట్టబద్దత ఆమోదం తెలియజేసినా..అసెంబ్లీలో మాత్రం బిల్లు రూపంలోకి తీసుకురాలేదు. అదే సమయంలో ఉద్యోగులను మభ్య పెట్టేందుకు కేవలం కొన్ని శాఖల ఉద్యోగులకే పదోన్న తులు కల్పించి మిగిలిన శాఖలను వదిలేసింది ప్రభుత్వం. దీనితో ఒకేసారి విధుల్లోకి చేరిన అందరు ఉద్యోగులకంటే కొన్ని శాఖల ఉద్యో గులకే పదోన్నతులు రావడం పట్ల కూడా మిగిలిన శాఖల ఉద్యోగులు తీవ్ర కోపంతో రగిలిపోతున్నారు. మరోవైపు మహిళాపోలీసుల ఉద్యోగాల విషయంలో ఇప్పటికే కోర్టులో కేసులు ఉండటం, ఇపుడు ఈ శాఖ ఉద్యోగులు ఏ ప్రభుత్వ శాఖకు చెందకుండా అన్నిశాఖల విధులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వెల్పేర్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితరశాఖల ఉద్యోగులకు ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో తమపరిస్థితి ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అందునా సచివా లయశాఖ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నింటినీ ఒకేసారి తీరుస్తామని ప్రత్యర్ధి రాజకీయపార్టీలు ప్రకటి స్తుండటంతో సచివాలయ ఉద్యోగులు వారి ఆలోచనలు మార్చుకొని, డిమాండ్లు, సమస్యలను ఇతర రాజరీయపార్టీకలు విన్నవిస్తు న్నారు.

 ప్రస్తుత గ్రామస్థాయిలో ప్రజలకి బాగా దగ్గర ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులే కావడంతో వీరి ద్వారా ఎన్నికల్లో బాగా నెట్వర్క్ చేసుకోవచ్చునని భావిస్తున్నాయి. అన్ని రాజకీయపార్టీలు వీరి సమస్యలు, డిమాండ్ లు తీర్చేందుకు హామీలు కూడా ఇస్తున్నాయి. ఈ తరుణంలో ఏ రాజకీయపార్టీ అయితే వీరికి పక్కాగా హామీలిస్తే వారికి ఉద్యోగులంతా మద్దతు కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఎన్నికల విధులు కట్టబెట్టినా తేడాలొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా అధికారపార్టీలోని కొందరు సీనియర్ నేతలు కూడా సచివాలయ ఉద్యోగులను పెద్దగా నమ్మే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఇప్పటికే చాలా ప్రయోజనాలు ప్రభుత్వ ద్వారా కోల్పోయిన ఉద్యోగులు మనస్పూర్తిగా ప్రభుత్వానికి ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తారా అంటే ప్రశ్నార్ధకమే. కానీ ఈ ఎన్నికల్లో ప్రభావం అంటూ చూపిస్తే 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, సిబ్బంది కంటే సచివాలయశాఖ ఉద్యోగుల వలన మాత్రమే ప్రతీకూలత కనిపించడానికి ప్రభుత్వ తప్పిదాలు కనిపిస్తున్నాయనేది సుస్పష్టంగా తెలుసున్నది. చూడాలి 2024 ఎన్నికల్లో ఏం జరగనుందనేది..1?

 

Amaravathi

2024-02-19 02:24:55

ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. గ్రేడ్-5 కార్యదర్శిలకు పంచాయతీలు కేటాయింపు..!

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలను తక్షణమే నియమించాలని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జిఓనెంబరు-11 జారీ చేశారు. ఇటీవలే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net లో గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలు తప్పనిసరి..త్వరలోనే ఉత్తర్వులు అనే ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. దానిని నిజం చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విశేషం. దీనితో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ప్రచురించే ముఖ్యమైన వార్తలకు వాస్తవికత ఉంటుందనేది మరోసారి రుజువైంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని మేజర్ పంచాయతీల్లో ఒక్కోచోట గ్రేడ్-5 కార్యదర్శిలు ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాంటి వారందరికీ ఇపుడు ఇండివిడ్యువల్ పంచాయతీలు అప్పగిస్తారు. తద్వారా ఇన్చార్జి కార్యదర్శిదర్శి వ్యవస్థకు మంగళం పాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శిలు ఒక్కొక్కరూ మూడు నుంచి ఐదు పంచాయతీలకి ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఇలాంటి ఇబ్బందులు తొలగి దాదాపుగా అన్ని పంచాయతీలకు కార్యదర్శిలు రానున్నారు. 500 జనాబా దాటిన పంచాయతీల్లో నియమించే వారికి డిడిఓ పవర్స్ తోనే వీరిని నియమించాలనే నిబంధనను కూడా జీఓలో ప్రధానంగా పొందుపరచడం విశేషం. త్వరలో సాధారణ ఎన్నికలు వస్తుండటం, ఆ తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందాలంటే ప్రతీ పంచాయతీకి కార్యదర్శి తప్పని సరి అని ప్రభుత్వం భావించి తక్కు సమయంలోనే ఈ నిర్ణయం తీసుకొని అమలు దిశగా చర్యలు తీసుకుంటోంది.

Amaravati

2024-02-15 08:54:08

టిడిపి-జనసేన దృష్టికి గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు..!?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయపార్టీలు వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుం బాల సాలిడ్ ఓట్లను వారిపైపునకు తిప్పుకోవడానికి అన్ని దారులూ వెతుకుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చేసిన రివర్స్ హామీలను ఓట్ బ్యాంకుగా మార్చుకునేందుకు పక్కాగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో 74 ప్రభుత్వశాఖల్లోని ఏ శాఖలోనూ జరిగి ఉండదనే కోణంలో ఆలోచిస్తున్నాయట. దానికోసం ప్రధాన ప్రభుత్వశాఖల ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై టిడిపి-జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకొని మరీ అధ్యయనం చేస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులు చేస్తూ.. సమస్యల పరిస్కారానికి కూడా హామీలిస్తున్నారని తెలిసింది. అసలే అధికార పార్టీపై ఆంధ్రప్రదేశ్ లోని 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులు, ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారు. వారితోపాటు నాలుగేళ్ల క్రితం వీరితోపాటు చేరిన 1.30లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా వారి ప్రధాన సమస్యలను కూడా ఏ రాజకీయపార్టీ ముఖ్య నాయకులు వారిని సంప్రదిస్తుంటే వారి ముందు వల్లెవేస్తున్నారనే ప్రచారం ఇపుడు తాజాగా బయటకొచ్చింది. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా తమ సర్వీసులు రెగ్యులర్ అయినా తమశాఖకు చట్టబద్దత కూడా కల్పించని విషయాన్ని రాజకీయపార్టీ ముందు ఉద్యోగ సంఘాల నాయకులు వల్లె వేస్తున్నారని సమాచారం. పేరుకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్పప్పటికీ..తమ ప్రధాన సమస్యల పరిస్కారం కావడం లేదనే బాధ సచివాలయ ఉద్యోగులను వెంటాడుతున్నది. దానితో తమ సమస్యల పరిష్కారం కోసం ఏ పార్టీ అయితే పక్కాగా హామీ ఇస్తే వారికే తమ ఉద్యోగు ఓట్లన్నీ వేస్తామనే అభయం కూడా సచివాలయ ఉద్యోగులు కూడా ఇస్తున్నారని..దానికోసం పది ప్రధాన సమస్యలును రాజకీయ పార్టీల ముందు ఉంచుతున్నారట.

ఆ సమస్యల చిట్టా ఏంటో ఒక్కసారి తెలుసుకుని..వారి ఆలోచన.. సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న వారి డిమాండ్లు తెలుసుకుంటే.. ఏపీలో  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారనే సందేశంలోని ప్రధాన డిమాండ్లు..1)సర్వీస్ రెగ్యులర్ సమయంలో కల్పోయిన 9నెలల పేస్కేల్.. 2)సర్వీస్ రెగ్యులర్ అయిన తర్వాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు.. 3)కోల్పోయిన రెండు డిఏలు..4)పీర్సీ ఇచ్చామని చెప్పి ఎగ్గొట్టిన అరియర్స్.. 5) తేల్చని కోర్టుకేసులు..6)19 ప్రభత్వశాఖల్లో నేటికీ 5శాఖలకు పైగా సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం..7)కేవలం కొన్నిశాఖల్లోనే ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి..మిగిలిన శాఖలను వదిలేయడం..8)ప్రమోషన్లు కూడా రెండు మూడు డిపార్ట్ మెంట్లకే ఇచ్చి మిగిలిన వారి కోసం పట్టించుకోకపోవడం..9) మిగులు ఖాళీలను భర్తీచేయకుండా రేషనలైజేషన్ పేరుతో సిబ్బందిని మదించేయడం..10)పంచాయతీ కార్యదర్శిలకి అధికారాలు ఇవ్వకపోవడం..ఇలా చెప్పుకుంటూ పోతే ఇబ్బందుల జాబితా గట్టిగానే ఉందట. ఏపార్టీ వీరి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తుందో వారికే ఈసారి గుద్దాలని నిర్ణయించుకున్నారట. 1.30 లక్షల ఉద్యోగుల కుటుంబాలంటే ఎన్ని ఓట్లు తేడా వచ్చేస్తాయో ఒక్కసారి అర్ధం చేసుకోవాలి. ఒక్కో కుటుంబంలో సరాసరి నాలుగు ఓట్లు వేసుకున్నా.. 5.20లక్షల ఓట్లు ప్రభావితం చూపిస్తాయి. అంతేకాదు సచివాలయా లకు వచ్చిన ప్రజలతో ఉద్యోగులంతా ఏకమై తమ సమస్యలే పరిష్కరించని ప్రభుత్వం ఇక ప్రజల సమస్యలు ఏం పరిష్కరిస్తుందని ఏ మాత్రం చెప్పినా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఒక్కశాఖ కారణంగా సుమారు కోటి ఓట్లు ప్రభావితం అయినా అయ్యే అవకాశాలు లేకపోలేదని సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్న వీరి డిమాం డ్లపై అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు..! 

Visakhapatnam

2024-02-11 03:44:04

గ్రామ, వార్డు సచివాలయాలను తాకిన రేషనలైజేషన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖను కూడా రేషనలైజేషన్ తాకేసింది. దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జిఓనెం బరు-1ని కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కనీసం ఎనిమిది సిబ్బంది ఉండేలా చేయాలని గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో అభ్యర్ధనపై స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ కూడా చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో సుమారు 1.30లక్షలకు పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే కొన్ని సచివాలయాల్లో పూర్తి సిబ్బంది, కొన్నింటిలో కనీసం పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. దీనితో ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శికి అదనంగా రెండు నుంచి నాలుగు పంచాయతీలను అప్పగించింది పంచాయతీరాజ్ శాఖ. ఈ అదనపు పనుల వలన సిబ్బంది లేని చోట ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం సచివాలయశాఖలో రేషనలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి సిబ్బందిని మదింపు చర్యలు చేపడుతున్నది. ఈ చర్య వలన అన్ని సచివాలయాల్లో కనీసం 8మంది ఉద్యోగుల రానున్నారు. లేని చోట సిబ్బంది భర్తీ జరిగి ఉన్నచోట కుదింపు చేపడతారు.

ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్పేర్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీసులను ఖచ్చితంగా ఉండేలా చేయనున్నారు. సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులతో సిబ్బందిని మదింపు చేయడానికి జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టారు. ప్రతీ సచివాలయానికి కనీస సిబ్బందిని నియమించడం ద్వారా తరువాత మిగులు సిబ్బంది, ఖాళీల భర్తీ చేపట్టే అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు చేపడుతున్న పంచాయతీ కార్యదర్శిల ఆ విధులను నుంచి తప్పించనున్నారు. అదే సమయంలో మేజర్ పంచాయతీల్లోని సచివాలయాల్లో నియమితులైన కార్యదర్శిలను, ఇతర సిబ్బందిని ప్రాధాన పోస్టులు ఖాళీగా ఉన్న సచివాలయాలకు పంపనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సచివాలయ సిబ్బంది ఖాళీల వివరాలు, శాఖల వారీగా డిఎల్డీఓలు సమాచారాన్ని కలెక్టర్లకు నివేదించారు. దీనిపై తదుపరి చర్యలు ఒకటి రెండు రోజుల్లో చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల కోడ్ రావడానికి ముందే ఈ రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే అన్ని చర్యలు చేపడుతున్నది. సిబ్బంది మదింపులో ఇపుడు స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు కూడా ప్రభావం చూపించనున్నాయి. అన్ని సచివాలయాలకు సిబ్బందిని సమానంగా నియమించడం ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు, ప్రభుత్వ పథకాలు అందించవచ్చుననేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది.

Amaravati

2024-02-10 05:36:59

గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలు తప్పనిసరి..త్వరలో ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 11, 252 గ్రామ పంచాయతీల్లో ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శిని నియమించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఏప్రిల్ తరువాత సుమారు 2300లకి పైచిలుకు  పంచాయతీ కార్యదర్శిలు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతకంటే ముందుగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3వేల పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఒక్కో కార్యదర్శి రెండు నుంచి నాలుగు పంచాయతీలు ఇన్చార్జిలుగా అదనపు బాద్యతలు చూడాల్సి వస్తోంది. చాలా గ్రామపంచాయతీల్లో సిబ్బంది సమస్య అధికంగా ఉండటంతో గ్రామ సచివాలయాల్లోని మేజర్ పంచాయతీల్లో సచివాలయాల వారీగా నియమితులైన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను సింగిల్ పంచాయతీలకు నియమించాలని యోచిస్తున్నది. తొలుత ఆ విధంగా నియామకాలు చేపట్టిన తరువాత, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల 4 గ్రామ వార్డు సచివాలయాల్లోని కార్యదర్శిల ఖాళీలను గుర్తించి వాటిని ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. 

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19శాఖల సిబ్బంది సీనియారిటీ జాబితాలను సిద్దం చేస్తున్న ప్రభుత్వం పనిలో పనిగా కార్యదర్శిల జాబితాలను కూడా తయారు చేస్తున్నది. వాటి ఆదారంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి వారిని గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా ఒక కార్యదర్శి ఉండే విధంగా భర్తీచేయనున్నది. అయితే ఇక్కడ మిగులు ఉద్యోగాలను కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలా..లేదంటే రాష్ట్ర ప్రభుత్వంలోని 75ప్రభుత్వశాఖల్లో విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుంటుంబాల్లోని పిల్లలకు ఇచ్చే కారుణ్య నియామకాల ద్వారా భర్తీచేయాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నది. ప్రస్తుతం సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాలన్నింటినీ  ఆ విధంగానే ప్రభుత్వం భర్తీచేస్తున్నది. గత నాలుగేళ్లలో పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్య కార్యదర్శిలు గానీ, కమిషనర్ లు గానీ గ్రామ పంచాయతీల్లోని ఖాళీల భర్తీ విషయంలో పెద్దగా దృష్టిసారించలేదు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడి పోయింది. ఇన్చార్జిల పాలతో కార్యదర్శిలు కూడా వారి సొంత పంచాయతీలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా చాలా అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలు పరిష్కారం కష్టతరంగా మారింది. అదే సమయంలో ఏప్రిల్ లో భారీగా ఖాళీలు 
ఏర్పడుతుండటంతో ప్రభుత్వం ముందుగానే మేల్కొని సర్దుభాటు చర్యలు చేపడుతోంది.

 బహుసా ఎన్నికలకు ముందే అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలను నియమించే ఉత్తర్వులు వెలువనున్నాయి. అపుడు మేజర్ పంచాయతీల పరిధిలోని సచివాలయాల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలను సదరు ఖాళీల్లో నియమించే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ ఎన్నికల ముందు చేయడం ద్వారా ఎన్నికల్లో పంచాయతీల డేటా ప్రభుత్వానికి సకాలంలో అందించడానికి వీలుపడుతుందని, పంచాయతీల నుంచి కార్యదర్శిలు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం భావిస్తున్నది. అటు చాలా కాలంగా పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రెగ్యులర్ ఉత్తర్వుల ద్వారా రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకుంది. వారిని సచివాలయాల్లో బిల్ కలెక్టర్లు, గుమస్తాలు లేదా డిజిటల్ అసిస్టెంట్లుగా, గ్రేడ్-5 కార్యదర్శిలుగా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ విషయంలో ఏమైనా స్పష్టత వచ్చి గ్రేడ్-5 కార్యదర్శిలుగా తీసుకుంటే మాత్రం కొత్తనియామకాల భారం ప్రభుత్వంపై తగ్గుతుంది. ఇటీవలే పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో చాలా అంశాలను ప్రభుత్వం పరిశీలించినట్టు తెలిసింది. ప్రస్తుతం సచివాలయ కార్యదర్శిలుగా ఉన్నవారిని, ఇటీవలే రెగ్యులర్ చేసిన పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్ధుబాటు చేస్తే ఏప్రిల్ లో జరగనున్న భారీ ఖాళీలు చాలా వరకూ భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. చూడాలి ప్రభుత్వం 
అన్ని గ్రామపంచాయతీలకు ఖచ్చితంగా కార్యదర్శిలను నియమించే తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

Amaravati

2024-02-09 15:28:40

పదోన్నతులకు శాస్వతంగా దూరమైన సచివాలయ మహిళాపోలీసులు

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు శాస్వతంగా పదోన్నతులకు దూరమయ్యే పరిస్థితి ఎదురైంది. ఏపీ హైకోర్టులో తేలని కేసులే వీరి పదోన్నతులకు శాపంగా పరిణమించాయి. ప్రభుత్వం కూడా వీరి విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే మహిళా పోలీసులకు అప్పగించే రకరకాలవిధులు(మల్టీటాస్కింగ్) భారంగా ఉన్నప్పటికీ గ్రామ, వార్డు స్థాయిలో వీరు సేవలందిస్తున్నారు. సచివాలయశాఖలోని 19ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్న వేళ వీరి పరిస్థితి మాత్రమే అగమ్య గోచరంగా మారింది. కోర్టులో కేసులు పడిన దగ్గర నుంచి మహిళా పోలీసులు ఏశాఖ ఉద్యోగులో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అన్ని శాఖల ఉద్యోగులు వీరితోనే చేయిస్తోంది ప్రభుత్వం. మిగిలిన ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే కాస్త అధికంగా ఉన్నఉద్యోగులు మహిళా పోలీసులు మాత్రమే. ఆ కారణంతోనే వీరిని ప్రభుత్వం అన్ని శాఖల పనులకూ వినియోగించేస్తున్నది. హైకోర్టులో పోలీసుశాఖ నుంచి అఫడివిట్ దాఖలుచేయడంతో వీరిని అధికారికంగా పోలీసు విధులకు వినియోగించడం లేదు. ఆయా సచివాలయాల్లో ఖాళీలనను బట్టి ఆయా ఖాళీలలోని ఉద్యోగుల స్థానంలో వీరిసేవలను వినియోగిస్తున్నది ప్రభుత్వం. 

ఇప్పటి వరకూ బాగానే ఉన్నా ఏప్రిల్ నెల నుంచి పంచాయతీరాజ్ శాఖలో వేల సంఖ్యలో కార్యదర్శిలు రిటైర్ కానున్నారు. అప్పుడు వీరిపై మరింత భారం పడనుంది. మొద టి బ్యాచ్ లో మెరిట్ లో వచ్చిన మహిళాపోలీసులతోపాటు, రెండవసారి గ్రేస్ మార్కులు కలిపిన మహిళా పోలీసుల విషయంలో కూడా కలిపిన మార్కులు ఆన్ కాలేదు. ఆ కారణంగా కూడా వీరి సీనియారిటి జాబితా మొదట నియమితులైన వారితోనే చేపట్టే అవకాశాలున్నా..కోర్టు కేసుల కారణంగా పోలీసుశాఖలో వీరిని ఉంచుతారా..? లేదంటే త్వరలో అత్యధిక సంఖ్యలో ఖాళీ అవుతున్న ఇతర ప్రభుత్వ శాఖల్లోనికి స్లైడింగ్ పద్దతి ద్వారా వీరికి ఆప్షన్లు ఇస్తారా అని జరుగుతున్న ప్రచారంలో కూడా క్లారిటీ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం, వీరి సీనియారిటీ జాబితాని రూపొందించాల్సి వుంటుంది. అందునా వీరికి ప్రమోషనల్ ఛానల్ కూడా ఏర్పాటు చేసినందున. కానీ పోలీసుశాఖలో వీరి నియామకాలు అన్నీ బోర్డు ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా డిఎస్సీ విధానంలో భర్తీచేసినవిధానంలో ఈ శాఖపై కోర్టులో కేసులు దాఖలు అయ్యాయి.

ఇప్పటికే రెండేళ్ల తరువాత సర్వీసులు రెగ్యులర్ పేస్కేలు పొందాల్సిన సచివాలయ ఉద్యోగులంతా అదనంగా ఆరు నెలలు పూర్తిపేస్కేలుకి నోచుకోలేదు. ఆ సమయంలో రెండు డిఏలు కూడా కోల్పోయారు. ఆతరువాత సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత కూడా రెండు ఇంక్రిమెంట్లవిషయంలో ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అంతేకాదు పీఆర్సీ ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన అరియర్స్ ను కూడా ఇవ్వలేదు. విధుల్లో చేరిన దగ్గర నుంచి అన్ని రకాలుగా నష్టపోయిన ఉద్యోగుల్లోని మహిళా పోలీసులు ఇపుడు అన్నిశాఖలకు సీనియారిటీ జాబితాలు సిద్దమవుతున్న తరుణంలో కోర్టు ఆఫడివిట్ మోకాలు అడ్డిశాస్వతంగా వీరికి పదోన్నతి కల్పించే విషయంలో ప్రతిబంధకం అయ్యింది. ప్రభుత్వం కూడా వీరి విషయాన్ని లైట్ తీసుకోవడంతో వీరి పని సచివాలయాల్లోని ఖాళీ ప్రభుత్వ శాఖల ఉద్యోగ బాధ్యతలు అధనంగా నిర్వహించ డానికి, బిఎల్వో విధులకు(అన్ని ఖర్చులూ వీరే భరించి..ఆఖరికి స్టేషనరీ,టిఏ ఖర్చులతో సహా) ఉపయోగపడుతున్నది. వాస్తవానికి అన్ని ప్రభుత్వశాఖల కంటే త్వరగా మహిళా పోలీసులకే సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

అలాంటి ఉద్యోగుల పరిస్థితి నేడు గాల్లో ఉంది. అసలు తాము ఏప్రభుత్వశాఖకు చెందిన ఉద్యోగులమో మాకే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుమహి ళా పోలీసు లు. కోర్టుకేసుల తరువాత వీరిని అధికారికంగా పోలీసు సేవలకు వినియోగించకపోవడం,అనధికారికంగా అన్నిశాఖల విధులకు వినియోగించేయడమే దానికి కారణం. ఈతరుణంలో సచివాలయ మహిళా పోలీసుల పదోన్నతుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇంత జరుగుతున్న ఏ ఉన్న ఎన్జీఓ సంఘ నేత కూడా వీరి విషయంలో ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లే దైర్యంచేయకపోవడం విశేషం..!

Mangalagiri

2024-02-05 13:35:46

తీవ్ర అన్యాయానికి గురైన సచివాలయ గ్రామీణ మత్స్య సహాయకులు

గ్రామ, వార్డు సచివాలయశాఖలో జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు చేసిన గుడ్డి తప్పుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి గ్రామీణ మత్స్యశాఖ సహాయకుల వంతు వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 మందికి పైనే ప్రమోషన్లకు సీనియారిటీ కల్పోయి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామీణ మత్స్య హాయకులకు కలుపుతామన్న గ్రేస్ మార్కులు కలపకుండా పదోన్నతులకు సీనియారిటీ లిస్టు తయారు చేస్తోంది. దీనితో ఒక్కో జిల్లాలో టాప్ ఫైవ్ లో ఉండాల్సిన సీనియర్ అభ్యర్ధులంతా అట్టడుగుకి చేరారు.  ఏపీ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసే సమయంలో అప్పటికే మత్స్యశాఖలో పనిచేస్తున్న సహాయకులకు వారి సీనియారిటీని బట్టి పది మార్కులు చొప్పున కలిపి వారిని నియమించింది. అయితే ఆ పది మార్కుల లెక్క కాగితాలపైకి ఎక్కలేదు. ఆవిషయమై జిల్లా మత్స్యశాఖ అధికారులను గ్రామీణ మత్స్యశాఖ సహాయకులు ఎన్నిసార్లు అడిగినా ఆ విషయాన్ని పెడచెవిన పెట్టారు. ఇపుడు తాజాగా ప్రభుత్వం మత్స్యశాఖలోని అసిస్టెంట్ ఫిషరీష్ ఇనెస్పెక్టర్ పదోన్నతులకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని గ్రామీణ మత్స్యశాఖ సహాయకుల సీనియారిటీ లిస్టు తయారు చేయాలని కమిషర్ కన్నబాబు ఆదేశాలు జారీచేశారు. 

అప్పుడు కలుపుతామన్న గ్రేస్ మార్కులు కల్పకపోవడంతో ఇపుడు ఒక్కోజిల్లాకి మూడు నుంచి ఐదుగురు సిబ్బంది సీనియారిటీ చేజారి పోయింది. జాబితాలు సిద్దం చేసే సమయంలో వివరాలు సేకరించినపుడు ఆ విషయం కాస్త బయటకు రావడంతో గ్రామ, వార్డు సచివాలయశాఖ  గ్రామీణ మత్స్యసహాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. సీనియారిటీ లిస్టు తయారుచేసే సమయంలో ఫిర్యాదులు చేయడం సరికాదని, జిల్లా మత్స్యశాఖ అధికారులు బెదిరింపులకు, సిబ్బందిపై వేధింపులకు దిగుతున్నారు. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే ముందుగానే పరిష్కరించుకోవాలని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం సచివాలయశాఖలో వీరి నియామకాలు జరిపినపుడే జిల్లా మత్స్యశాఖ అధికారులు అభ్యర్ధులకు వచ్చిన మార్కులు, ప్రభుత్వం కలిపిన మార్కులను ఆన్ లైన్ చేయాల్సి ఉంది. అపుడు నియామకాలు పూర్తయిపోయాయని చేతులు దులిపేసుకున్న అధికారులు ఇపుడు..వారు చేసిన తేడా పనిపై సీనియారిటీ కోల్పోవడంతో తెరపైకి వచ్చింది. 

పదోన్నతుల విషయంలో తమ సీనియారిటీ కోల్పుతున్నామని ఉద్యోగులు జిల్లాశాఖల అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా అధికారులు, రాష్ట్ర కార్యాలయంలోని అధికారులు చేసిన తప్పుకి తమ సీనియారిటీని కోల్పోవాలా అని గ్రామీణ మత్స్యశాఖ సహాయకులు ప్రశ్నిస్తున్నారు. తమకు పదోన్నతుల్లో అన్యాయం జరిగితే, ఆతప్పుకి బాధ్యత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ మాత్రం అన్యాయం జరిగినా న్యాయపోరాటానికి దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖలో నాడు మత్స్యశాఖ జిల్లా అధికారులు చేసిన తప్పు నేడు అదే అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ సీనియారిటీ లిస్టులో ఏ ఒక్కరు కోర్టుని ఆశ్రయించినా జిల్లా అధికారులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. పైగా పదోన్నతులు కూడా నిలిచిపోయే ప్రమాదముంది. జిల్లా, రాష్ట్ర అధికారులు చేసిన తప్పుకి ఎవరు బాధ్యత వహిస్తారన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..!

Visakhapatnam

2024-02-04 16:01:47

ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా..ఎలక్ట్రోలర్ రోల్ అబ్జర్వర్

ఈ నెల 22న ఓట‌ర్ల తుదిజాబితా ప్ర‌క‌ట‌న‌కు సిద్దం కావాల‌ని  అధికారుల‌ను, జిల్లా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ ప‌రిశీల‌కులు, ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జె.శ్యామ‌ల‌రావు ఆదేశించారు. ఆయ‌న గురువారం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో సంబంధిత అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలో జ‌రుగుతున్న‌ స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌ను క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి ముందుగా వివ‌రించారు. వివిధ అంశాల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ చేశారు.  ఈ సంద‌ర్భంగా ప‌రిశీల‌కులు శ్యామ‌ల‌రావు మాట్ల‌డుతూ, స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆరా తీశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి, రాజ‌కీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చ‌ర్య‌ల‌ను తెలుసుకున్నారు. వ‌చ్చిన అన్ని ఫిర్యాదుల‌ను ప‌రిశీలించి, త‌గిన చ‌ర్య‌లు చేపట్టాల‌ని ఆదేశించారు. ఓట‌ర్ల జాబితాల తుది ప్ర‌చుర‌ణ‌కు చేసిన ఏర్పాట్ల‌ను తెలుసుకున్నారు. నాలుగు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్ర‌దేశాలు, అక్క‌డి మౌలిక స‌దుపాయాల‌పై ప్ర‌త్యేకంగా ఆరా తీశారు. 22న తుది జాబితాను ప్ర‌చురించి, అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాబితాల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని ఆదేశించారు. జాబితాల‌ను గుర్తింపు ఉన్న రాజ‌కీయ పార్టీల‌కు ఇవ్వ‌డంతోపాటుగా, డిజిట‌ల్ కాపీల‌ను కూడా ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ప్ర‌తీ బిఎల్ఓ వ‌ద్దా ఓట‌ర్ల జాబితా  ఉండాల‌ని, ప‌బ్లికేష‌న్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని శ్యామ‌ల‌రావు స్ప‌ష్టం చేశారు.  ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ వెంక‌ట త్రివినాగ్‌, డిఆర్ఓ ఎస్‌డి అనిత‌, నియోజ‌క‌వ‌ర్గాల‌ ఇఆర్ఓలు, ఎఇఆర్ఓలు, డిటిలు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2024-01-18 15:24:08

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి సేవలు ఇకపై ఆన్లైన్లో

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిల ద్వారా అందుతున్న సేవలన్నింటిని  భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ ( ఎన్సీఎస్) పోర్టల్ తో ఆన్లైన్ లో అనుసంధానించారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు సులభ రీతిన http://employment.ap.gov.in  ద్వారా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.  అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన యెడల వారికి లాగిన్ వివరాలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే ఎస్సెమ్మెస్ ద్వారా పండం  జరుగుతుందని, సంబంధిత జిల్లా అధికారి వారి అభ్యర్థనను ఆమోదించిన తర్వాత వారికి ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియజేయడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ కార్డ్ ను లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.  సందేహాలకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఫోన్ 96407 60352 నెంబర్ కు సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి  అరుణ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2024-01-18 15:17:43

అనకాపల్లిలో సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగి ఉసురు తీసిన ఉద్యమం

అనకాపల్లిలో సర్వశిక్ష కాంట్రాక్టు ఉద్యోగి ఉసురు తీసింది ఉద్యమం. 21రోజుల పాటు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తూ అకస్మాత్తుగా మూగబోయింది జడ్డు వాసుదేవరావు గొంతు. జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తూ.. తమను ఎంటీఎస్ పరిధిలోకి తీసుకు రావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు ఇందులో భాగంగా తీవ్ర అస్వస్థకు గురున వాసుదేవరావు మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీనితో కుటుం సభ్యులు ఇతర ఉద్యోగులు మృతదేహంతోనే డిఈఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. డిమాండ్ల సాధనకోసం ఉద్యమిస్తే.. మాకు దక్కేది మా సహచర ఉద్యోగి ప్రాణాలు కోల్పోవడమా అంటూ ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్యోగుల ఆందోళన ఒకవైపు, మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మరోవైపు అక్కడి దశ్యాలు గుండెలను పిండేసే విధంగా కనిపించాయి. వాసుదేవరావు ఉద్యోగల ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించేవాడు. ఉద్యోగల డిమాండ్లసాధనకోసం ఏం చేయడానికైనా సిద్దమేనని ప్రకటించి ఉద్యమానికి ఊపిరి పోశాడు. అలాంటి ఉద్యమనేత ఉద్యమం చేస్తూనే ప్రాణాలు వదిలి తమను విడిచి వెళ్లిపోయాడంటూ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు బరువైన గుండెలతో రోధించిన తీరు అందరినీ ఆలోచింప చేస్తున్నది. ఉద్యోగులు ఉద్యమిస్తే డిమాండ్లు పరిష్కారం అవుతాయని..కానీ సర్వశిక్ష ఉద్యోగుల విషయంలో సహచర ఉద్యోగిని కోల్పోవాల్సి వచ్చిందని ఉద్యోగులంతా గుండెలు బాదుకుంటున్నారు. ఇన్ని రోజులుగా రక రకాల విధానాల్లో తమ నిరసనచేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తరపున పోరాడి ప్రాణాలు త్యధించిన వాసుదేవరావు మృతిసాక్షిగా తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామనిహెచ్చరించారు.తక్షణమే మృతుని కుటుంబానికి ఆసుపత్రికి అయినఖర్చు, ఇంటిలో ప్రభుత్వ ఉద్యోగం, నష్టపరిహారం కూడా చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అనకాపల్లి డిఈఓకి కూడా వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సర్వశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.  

Anakapalle

2024-01-09 09:22:43

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి 70 స్థానాలకు పైగా పోటీ?!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకుంటుందా..? పార్టీకి పూర్వ వైభవం వస్తుందా..? ఈ పార్టీలోకి చేరికలు భారీగా వస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితిలు..అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు రాకుండా భంగపడిన వారంతా ఇపుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చూస్తున్నారు. జాతీయ పార్టీ కావడం, 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆశావాహులంతా క్యూ కడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి దాటిన తరువాత ముహూర్తాలు చూసుకొని మరీ జంపింగ్ లు చేయడానికి కార్యాచరణ కూడా సిద్దమైందని చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70 స్థానాలకు పై చిలుకే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్ధులు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ వైఎస్ షర్మిల పార్టీలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసి అవకాశాలు రానివారంతా కాంగ్రెస్ లోకి చేరి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందుతుంది. సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్టింగ్ లోకి వచ్చేయడం ఇపుడు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అటు జనసేన-బీజేపీ మధ్య పొత్తు, జనసేతో టిడిపి పొత్తు ఉండటంతో చాలా సీట్లు ఇటు టిడిపిలో కూడా సీనియర్లుకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి వారు కూడా ఇపుడు కాంగ్రెస్ లోకే వెళ్లే అవకాశాలు కినిపిస్తున్నాయి. 

175 నియోజకవర్గాల్లో 70కి పైగా పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్ధుల్లో సుమారు 45 మంది బడా బడా  నేతలే రంగంలోకి దిగుతున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమా చారం. గత కొద్ది రోజులుగా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తున్న ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే, గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా అత్యంత కీలక వ్యక్తులే ఈసారి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి సుమారు ఏడు నుంచి 10 మంది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మరో 12 మంది, రాయలసీమం నుంచి 15, ఇప్పటి వరకూ తమ తమ సీట్లను ఖరారు చేసుకు న్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఒకేసారి కాంగ్రెస్ నుంచి ఇంత మంది పోటీచేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోయే అవకాశాలు కనిపిస్తు న్నాయి. వైఎస్సార్సీపి, టిడిపి, జనసేన వారి వారి పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు ఉన్నా, అభ్యర్ధులు ఎక్కువ కావడంతో ఓట్లు చీలిపోయే పరిస్థితి నెలకొం ది. ఇప్పటికే అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుమారు 40మందికి సీట్లులేవు..మరోజాబితా వస్తే ఆ సంఖ్య పెరిగే అవకాశాలూ ఉన్నాయి. 

దీనితో సీట్లు రానివారంతా ఇపుడు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ గూటికే చేరుతారన్నది స్పష్టం అవుతోంది. మరోవైపు అధికార పార్టీ కాకుండా మరే మారేపార్టీ నుంచి అభ్యర్ధులు నిలబడినా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, యువత ఓట్లు పడే అవకాశాలూ ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ విషయంలో స్పష్టమైంది. ఎక్కువమంది ఎంపీస్థానాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీలు, సర్వశిక్షా ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ ప్రభుత్వం వారి డిమాండ్లను తీర్చకుండా బింకపట్టు పట్టుకొని కూర్చుంది. అదేసమయంలో షర్మిల కాంగ్రెస్ లోకి చేరడటం, ఆమె అనుచరులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కూడా క్యూలు కడుతున్నారు. ఈరోజు పేపర్ లెక్క నిజమైతే ఫిబ్రరి మొదటి వారంలోనే కాంగ్రెస్ తొలిజాబితా వెలువడే అవకాశాలున్నాయి. ఈ 2024 సాధారణ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, మూడు సామాజిక వర్గాల బలాబలాలు, ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ సమీకరణలు, జంపింగ్ జపాంగ్ లు వారి వారి బలాన్ని ఎంతలా ప్రదర్శించనున్నారనేది..!




Visakhapatnam

2024-01-05 08:58:37

ఉద్యోగులకు జీతాలు పడలేదు.. రిటైర్ అయినవారికి పెన్షన్లు రాలేదు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు..రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లూ పడలేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాల నగదు బదిలీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగులకు ఒకటోతేదీన జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఎందకనో కాస్త ఆశ్రద్ధ చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. సమయానికి జీతాలు రాకపోవడం వలన ఉద్యోగులు ప్రతీనెలా 2వ తేదికి కట్టాల్సిన హౌసింగ్ లోన్, పర్శనల్ లోన్, ఇతరత్రా ఈఎంఐలకు పెనాల్టీలు కట్టాల్సి వస్తున్నది. అలాగని తేదీలు కాస్త వెనక్కి మార్చుకున్నా అదే సమయానికి జీతాలుగానీ పెన్షన్లు గానీ పడతాయనే గ్యారంటీ లేదంటున్నారు ఉద్యోగులు. ఇక రిటైర్ అయిన ఉద్యోగులైతే ఈ వయసులో కూడా తమ పెన్షన్ ఎప్పుడు అకౌంట్లలోకి పడుతుందాని ఎదురుచూసి..ఆ నెల నిత్యవసరాలకు అప్పులు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రతీనెలా ట్రజరీలో ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఉద్యోగుల జీతాల బిల్లలు ఆలస్యం చేస్తున్నారు. అవి ప్రభుత్వ ఆదేశాలో లేదంటే, నిజంగానే సాంకేతిక సమస్య తలెత్తుందో అర్ధం కావడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సాంకేతిక కారణమే అయితే నగదు బదిలీ పథకాలకు, వాలంటీర్ల గౌరవ వేతనాలకు మాత్రం టంచనుగా ఒకటో తేదీనే ఎలా వారి అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకటోతేదిన జీతం, పెన్షను అందుకోడం పట్టుపమని రెండు మూడు నెలలు కూడా చూడలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జీతాలమీదే ఆధారపడే ఉద్యోగులు, పెన్షన్ల సమస్యలు వారి బ్యాంకుల ఈఎంఐల ఇబ్బందులూ దృష్టిలో ఉంచుకొనైనా సమయానికి అకౌంట్లోకి జీతాలు సమచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆది నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న తీరు వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత ఆలస్యం చూడలేదని చెబుతున్నారు. కావాలని చేస్తున్నారో..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చేస్తున్నారో అర్ధం కావడంలేదని, కానీ ప్రతీనెలా జీతాలు, పెన్షన్లు మాత్రం ఆలస్యంగానే వస్తున్నాయని చెబుతున్నారు. ప్రజల్లో భాగమే ఉద్యోగులని, అలాంటి వారిని పెడచెవిన పెట్టడం వలన రానున్న రోజుల్లో మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, కొద్దో గొప్పో వచ్చే సహకారం కూడా రాకుండాపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వాదన బలంగా వినిపిస్తున్నది. రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగరోజుల్లో కూడా ప్రత్యేక జూమ్ మీటింగులు, శిక్షణా కార్యక్రమాలు, అవేమీ లేకపోతే టెలీ కాన్ఫరెన్సులు, అవీ కుదరకపోతే యాప్స్ లో డేటా అప్లోడ్ పనులు అప్పగించే ప్రభుత్వం సమయానికి ఎందుకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదో చెప్పగలదా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. చూడాలి ఎన్నికల వేల ఉద్యోగులు, పెన్షనర్లు ఈ మూడు నెలలైనా సమయానికి జీతాలు అకౌంట్లోకి సమయానికి ప్రభుత్వం వేస్తుందా అనేది..?!

Visakhapatnam

2024-01-04 04:48:40

విశాఖ వైఎస్సార్సీపీలో రెండో వికెట్ అవుట్..సీతంరాజు రాజీనామా

విశాఖ వైఎస్సార్సీపీలో ఒక్కో నాయకుడూ పార్టీకి రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయగా..ఈరోజు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కూడా పార్టీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, కార్పోరేషన్ చైర్మన్ రెండిటికీ రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి పంపినట్టు తెలిసింది. ఈయన రాజీనామాను విరమించే విషయంలో బుజ్జగింపులు చేపట్టినా ఫలితం లేకపోయింది. సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా వున్న సీతంరాజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. అయితే ఆ సమయంలో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు తన గెలుపుకోసం కనీసం పనిచేయలేకపోవడం వలనే తాను ఓడిపోయానని ఆయన పలు మార్లు తమ కార్యకర్తల ముందు ఆవేదన వెల్లగక్కారు. రాజకీయాల్లోలకి వచ్చిన తరువాత పార్టీకోసం చాలా పెద్దమొత్తంలో ఖర్చుచేసినా ఫలితం లేకుండాపోయిందని..దానిని ఎక్కడ పెట్టుబడిగా పెట్టినా ఫలితాలు వేరేలా ఉండేవని ఆయన సన్నిహితులు కూడా అప్పట్లో ఆయన ముందే కుండబద్దలుగొట్టినట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంతోనే విశాఖ దక్షిణం ఎమ్మెల్యే సీటు ఆశించినా ఈయనకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి, ఆయన పదవికి రాజీనామా చేశారు. దీనితో రెండు రోజుల తేడాలో ఇద్దరు నియోజవర్గస్థాయి నాయకులు అధికార వైఎస్సార్సీపి పార్టీకి రాజీనామా చేయడం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. వైఎస్సార్సీపికి రాజీనామా చేసిన వంశీక్రిష్ణ శ్రీనివాస్, జనసేనలోకి చేరన రోజే ప్రకటించారు. ఇంకా నాతోపాటు చాలామందే పార్టీని వీడుతున్నారని, వారిని జనసేనలో చేర్చుతానని చెప్పారు. అన్నట్టుగా రెండో రాజీనామా ప్రకటన సీతంరాజు సుధాకర్ చేశారు. ఈయన జనసేనపార్టీలో చేరుతారా..? మరేదైనా పార్టీలో చేరుతారా అనేవిషయంలో మాత్రం క్లారిటీ రావాల్సివుంది. ఈయనకు బీజేపి నుంచి ఎమ్మెల్యే సీటు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సెంటిమెంటుగా, బ్రాహ్మణులు, యాదవుల మనస్థాపాలు, ఆందోళనలు చాలా విషయాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. విశాఖ వైఎస్సార్సీపీలో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులే రాజీనామాలు చేయడంతో ఈవిషయం రాష్ట్రవ్యాప్తం హాట్ టాపిక్ అయ్యింది.

Visakhapatnam

2023-12-29 11:46:00

జనసేనలోకి చేరేందకు చాలా మందే వస్తారు..ఎమ్మెల్సీ వంశీ

వైఎస్సార్సీపి నుంచి జనసేనపార్టీలో చేరేందుకు చాలా మందే సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన తీర్ధం పుచ్చుకున్న ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో తనకు ఎలాంటి లోటూ రాలేదని, తానుకోరుకున్న స్థానం నుంచి ఎమ్మెల్యే పోటీచేసే అవకాశం లేకపోవడం వలన తాను పార్టీ మారాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తనతోపాటు, నాయకులు, క్యాడర్, కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారందరినీ పార్టీలోకి తానే చేర్చుతానని కూడా చెప్పారు. వైఎస్సార్సీపి ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా సమర్పించినట్టు ఆయన తెలియజేశారు. తన అనుచరులు, అభిమానులు, కుటుంబ సభ్యుల కోరిక ఎమ్మేల్యే కావడమని..దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నానని చెప్పారు. పార్టీలో తనను కాదని దద్దమ్మలాంటి వ్యక్తులకు ప్రత్యేక స్థానం కల్పించారనే మాటకు తాను కట్టుబడే ఉన్నానని, వాళ్లెవరో 2024 ఎన్నికల తరువాత తెలుస్తుందని అన్నారు. విశాఖ నగరంలో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని చెప్పారు. అంతకు ముందు పార్టీలో చేరిన తరువాత ఆయన మాట్లాడుతూ, తాను తన సొంతింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని..తనకు పవన్ కళ్యాణ్ కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి తాను ఆయన అభిమానని, ఏ సినిమా వచ్చినా తొలిరోజే సినిమా చూస్తానని కూడా చెప్పారు. వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేసిన ప్రకటన ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. దీనితో ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపి పార్టీలో అసంతృప్తులు ఎవరున్నారనే విషయమై పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తుందనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ చాలా మంది నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకరంగా విశాఖతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా యాదవుల్లో మంచి పట్టున్న నాయకుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ గుర్తింపు పొందారు.

Amaravati

2023-12-27 16:40:12

సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్సీ వంశీ రాజీనామా వ్యవహారం..

విశాఖలోని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ వైఎస్సార్సీపికి రాజీనామా చేసిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి  ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. విశాఖ నుంచే అసంతృప్తులు ఎక్కువవతున్నారని, దానికి గల కారణాలను కూడా సీఎం జగన్ ప్రశ్నించినట్టు సమాచారం అందుతోంది. విశాఖ తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే సీటు విషయంలోనే నిరసన వ్యక్తం చేస్తూ వంశీ పార్టీ రాజీనామాచేశారని, దాని ప్రభావం పార్టీపై పెద్దగా పడే అవకాశం కూడా ఉండదని సజ్జల ముఖ్యమంత్రికి తెలియజేసినట్టుగా చెబుతున్నారు. అయితే వంశీ విషయం ముందుగా తెలుసుకొని మాట్లాడి ఉండాల్సిందని..విశాఖ తూర్పుతోపాటు, అక్కడ నగరంలో యాదవుల ఓటు బ్యాంకు అధికంగా ఉన్నందున దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడే అవకాశం ఉండే అవకాశాలున్నాయనే కోణంలోనూ సమాలోచనలు చేసినట్టు చెబుతున్నారు. అయితే అక్కడ ప్రస్తుస్తం వీఎంఆర్డీఏ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలు ఆ లోటుని భర్తీచేస్తారని దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని, ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో మనపార్టీ తరపున సమన్వయకర్తగా ఉన్న ఎంవివి సత్యన్నారాయణ పూర్తిస్థాయిలో పట్టు పెంచుకుంటున్న విషయాన్ని ఇంటెలి జెన్స్ నివేదికలపైనా చర్చజరిగినట్టు సమాచారం అందుతుంది. కాగా పార్టీలో అసంతృప్తులు లేకపోతే ఆ పార్టీకి గుర్తింపు ఉండదనే విషయాన్ని మీడియా ముందు కూడా సజ్జల ప్రకటించడం కూడా సీఎం జరిగిన చర్చల నేపథ్యంలోనే చేసినట్టుగా చెబున్నారు. అయితే ఎమ్మెల్సీ వంశీ రాజీనామ తరువాత చాలా మంది నాయకులు క్యూ కట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా సీఎం కాస్త సీరియస్ గానే చర్చించినట్టు తెలుస్తోంది.

Amaravati

2023-12-27 16:38:05