1 ENS Live Breaking News

సీపీఎస్ రద్దుచేస్తేనే మా ఓటు..!

నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే.. ఇది ఏ సినిమాలో డైలాగో గుర్తింది కదా..రజనీకాంత్ నటించిన భాషా సినిమాలోనిది.. అ డైలాగ్ చాలా పాపులర్ అయ్యింది కూడా.. ఇపుడు అదే డైలాగ్ ను ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాజకీయపార్టీల దగ్గర వల్లెవేస్తున్నారు. అంతేకాదు మాకు ఏదీ రెండోసారి చెప్పే అలవాటూ లేదంటున్నారు. అవునండీ సీపీఎస్ రద్దు చేస్తేనే మా ఓటు మీకు వేస్తామని..లేదంటే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాదు చాపక్రింద నీరుగా రాష్ట్రప్రభు త్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు, వారి వారి సోషల్ మీడియాల్లో వీటిపైనే ప్రధానంగా చర్చలు పెడుతున్నారు. కొన్ని రాజకీయపార్టీలు వారికి అనుకూలంగా వున్న ఉద్యోగ సంఘాల నేతలతో రహస్య మంతనాలు, సిటింగ్ లు, సంప్రదింపులు చేస్తున్నా.. అంతా ఒకే మాట చెప్పంతో అధికార పార్టీ  నుంచి ప్రతిపక్ష పార్టీల వరకూ అందరూ తలలు పట్టుకుంటున్నారు. అదేంటీ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లు లేకపోయినా పక్కాగా మ్యాజిక్ ఫిగర్ తోనైనా గెలిచి జెండా ఎగురేస్తామనే రాజకీయపార్టీల ధీమా ఇపుడు కాస్త సన్నగిల్లినట్టే కనిపిస్తున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒకరే రకంగా సమాధానం చెప్పడం, ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం మిశ్రమంగా స్పందించడం చర్చనీయాంశం అవుతున్నది.

రాష్ట్రంలో గత నాగులు రోజుల వ్యవధిలో ప్రధాన రాజకీయపార్టీలకు చెందిన నేతలు, వారి అనుకూల ఉద్యోగ సంఘాలతో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఉద్యోగుల డిమాండ్లను వారి ముందు ఉంచడంతో నాయకులు తెల్లమొహం వేశారట. ఒకానొక దశలో మీరు ఎవరి అండ చూసుకొని ఇంత దైర్యంగా మాట్లాడుతున్నారు..? మీ ఓట్లు, మీ కుటుంబాల ఓట్లు పడకపోతే నష్టమా అని బెదిరించే పనిచేసినా.. మీరంతా ఏం చేసినా..విధి నిర్వహణ పేరుతో ఎలాంటి ఇబ్బందులు పెట్టినా..? ఈసారి ఎన్నికల్లో మాకు నమ్మకం కలిగించే పార్టీలు, పక్కాగా హామీ ఇచ్చి వాటిని అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అమలు చేసే పార్టీలకే మా ఓటు వేస్తామని చెప్పడంతో వారంతా ఈ విషయాన్ని మా పార్టీ అధిష్టానం వద్ద ఉంచుతామని..వాళ్లు ఒప్పుకుంటే మరోసారి మిమ్మల్ని కలుస్తామని..లేదంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చునని చెప్పేసి వెళ్లిపోయారని తెలిసింది. ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రథినిధుల ముందు ఉంచిన డిమాండ్లు ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే.. ప్రధానంగా సీపిఎస్ రద్దు చేయాలని, రివర్స్ పీఆర్సీ లాంటి తేడా వ్యవహారాలు చేసి ఉద్యోగులను మోసం చేయకూడదని, పక్కగా ప్రతీ ఐదేళ్లకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పీఆర్సీ ఇవ్వాలని, సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలు రద్దుచేసి..ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, సరెండర్ లీవులు, అరెయర్ బిల్స్ ఒకేసారి విడుదల చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయాలని, ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, అటెండర్ దగ్గర నుంచి గ్రూప్-1 అధికారి వరకూ అన్ని కేటగిరీల్లోనూ ఉద్యోగులకు పక్కాగా పదోన్నతులు కల్పించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగా వారికి కూడా అన్ని ప్రయోజనాలు కల్పించాలని, కోర్టు కేసులతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వ సెలవులు, రెండవ ఆదివారాల్లో ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చే విధంగా అధనపు పనులు పురమాయించకూడదని, పెన్షనర్లకు ఒకటోతేదీ నాటికే పెన్షన్లు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులందరికీ సర్వీసు చివరి రోజే అన్ని ప్రయోజనాలు ఒకేసారి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఉపాధ్యాయులతో విద్య తప్పా, కార్యాలయ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాలల్లో ప్రత్యేకంగా పనులు చేసేందేకు గ్రూప్-4 ఉద్యోగులను నియమించాలని, సర్వీసు నిబంధనల ఆధారంగానే విధులు, పనులు చేయించాలి తప్పితే 
ఉద్యోగులకు ఖాళీ అనేది లేకుండా అదనపు పనిభారం మోపకూడదని, ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బ్యారర్లకు ప్రాధాన్య ఇస్తూ బదిలీల్లో వారికున్న ప్రయోజనాలు అమలు చేయాలని, ఉద్యోగులపై ఐటీ దాడులు వంటి వేధింపులు నిలుపుదల చేయాలనే డిమాండ్లు రాజకీయపార్టీల ప్రతినిధుల వద్ద పెట్టడంతో తెల్ల మొహం వేయడం వారి వంతైందని కూడా చెబుతున్నారు.

ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సేవకులుగా ఉండేవారిని గౌరవించి వారితో చక్కగా పనులు చేయించుకోవాలి తప్పితే కక్షసాధింపు చర్యల కు పాల్పడితే మాత్రం ఈసారి ఓటు రూటు మారుతుంది తప్పితే రుబాబు చేస్తే మాత్రం చెల్లదని కూడా బెరుకు లేకుండా అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒకే 
చెప్పడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వాస్తవానికి అన్ని ఉద్యోగ సంఘాల్లోనూ అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగు లు ఉంటారు. వారి ప్రయోజనాలకోసం ఉద్యోగులను బలిపశువులను చేసే వారూ ఉంటారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ కళ్లు తెరుచుకునే విధంగా రివర్స్ పీఆర్సీ ఇవ్వడం, పదోన్నతులు ఆలస్యంగా చేపట్టడం, డిఏలు ఏళ్లకు ఏళ్లు విడుదల చేయకుండా వదిలేయడం, ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం, పీఆర్సీ అంటే అంకెల గారడీలా చేసి చూపించడం, సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి..దానిని జిపిఎస్ గా మార్చి వారి పంతాన్ని నెగ్గించుకోవడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పంతానికి వారికి నెల నెలా ఇవ్వాల్సి జీతాలు 10, 15 తేదీలు దాటిన తరువాత విడుదల చేయడం వంటి చర్యలకి పాల్పడంతోనే ఉద్యోగులంతా ఒక నిర్ణయాణికి వచ్చి..రానున్న రోజుల్లో ఉద్యోగుల మనుగడే ప్రశ్నార్ధం ఉండబోతుందని భావించి ముందుగానే మేల్కోవడానికి రక్షణ చర్యలు  చేపట్టారనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి వైఎస్సార్సీపీకి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓట్లు వేసే పరిస్థితి లేదు. అలాగని అందరూ వ్యతిరేకంగా ఉన్నారా..? అదీకాదు.. మరీ అలాగని ప్రతిపక్ష టిడిపి కూటమికి ఓట్లు వేస్తారా అంటే అక్కడి నుంచి స్పష్టమైన హామీ కూడా రాలేదు. పైగా రెండు పార్టీలు వారి వారి మేనిఫెస్టోలు విడుదల కూడా చేయలేదు. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్లు ముందుగా చెబితే ప్రయోజనం ఉంటుందని భావించి తమ జాగ్రత్తో తాము ఉన్నారని సమాచారం అందుతుంది. అంతేకాదు ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు, వాయిస్ మెసేజులు చక్కర్లు కొడుతున్నాయి. శని, ఆదివారాల్లో ఓ ఐదుగురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎక్కడ కలిసినా వచ్చే ఎన్నికల్లో చేయాల్సిన, చేపట్టాల్సిన వ్యూహంపైనే చర్చిస్తున్నారట. ఉద్యోగులు, వారి కుటుంబాల ఓటు పవర్ ఏంటో ఈసారి ఎన్నికల్లో చూపించి వార్ వన్ సైడ్ అయితే ఎలా వుంటుందో తెలియజేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చే వారికి మాత్రం పక్కాగా ఓటు వేయాలని నిర్ణయానికి కూడా వచ్చారట. చూడాలి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓట్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో..వారి డిమాండ్లను ఏ పార్టీ ఓప్పుకుంటుందో..!

amaravathi

2024-04-07 19:29:02

గ్రామ సచివాలయాలకు దిక్కెవరు..?!

గ్రామ, వార్డు సచివాలయ శాఖ దేశంలోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏర్పాటైన ఒక సరికొత్త ప్రభుత్వ శాఖ..ఈ శాఖ ఏర్పాటు చేయడంతోనే ఒకేసారి సుమారు 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీచేశారు. అప్పుడే దేశం మొత్తం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పేలా చేశారు సీఎం. వైఎస్.జగన్మోహనరెడ్డి. అయితే ఆ గౌరవం ఎంతో కాలం నిలువ లేదు. హడావిడిగా ఈ గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి ఉద్యోగాలనైతే భర్తీచేశారు తప్పితే ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ఈశాఖ ఉద్యోగులకు తమ ఉద్యోగాలపై నేటికీ గ్యారెంటీ లేదు. దానికి కారణం ప్రభుత్వం చేసిన తప్పిదం వలనే నేటికీ ఈ శాఖకు అధికారికంగా చట్టబద్ధత లేకుండా పోయింది. దీనితో ఈ శాఖ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోననే అనుమానం ఇతర 74 ప్రభుత్వ శాఖల్లోనూ ఉంది. అందులోనూ గ్రామస్థాయిలో మహిళలకు రక్షణగా ఉంటారని నియమించిన సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగాలు కోర్టులో పడ్డ కేసు వలన ఇపుడు వీరంతా ఏ శాఖకు చెందిన ఉద్యోగులుగా పరిగణించ బడుతున్నారో ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది.

ఇతర ఉద్యోగులతోపాటుగా ఏదో ఒక పనిచేయిస్తూ జీతాలైతే ఇస్తుంది తప్పితే.. కోర్టుకి సమర్పించిన అఫడవిట్ కారణంగా వీరిని పోలీసుశాఖ ఉద్యోగులుగా మాత్రం అధికారిగా గుర్తించలేదు.. వీరికి ఆ శాఖ పనులు కూడా చెప్పడం లేదు. అలాగే ఇంజనీరింగ్, వెల్ఫేర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు నేటికీ సర్వీసు నిబంధనలను ప్రభుత్వం తయారు చేయలేదు. వీరికి రేపు అన్నరోజు పదోన్నతులు వస్తే ఏ శాఖలోకి వీరిని పంపుతారో ప్రభుత్వానికే క్లారిటీ లేకుండా పోయింది. మహిళా పోలీసులకు సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు అయినా వీరి ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుని విరుద్దంగా జరిగాయనే కారణంతో కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఫలితంగా వీరికి కూడా పదోన్నతులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో తమ ఉద్యోగాల విషయంలో ఏ పార్టీ అయితే స్పష్టమైన హామీ ఇస్తుందో వారికే తమ మద్దతు అనే విధంగా ఉద్యోగులు ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ వారి ఉద్యోగాల విషయంలో అన్ని అంశాల్లోనూ క్లియర్ గా ఉన్నవారు, పదోన్నతులు పొందిన వారు వైఎస్సార్సీపీకి విధేయులుగా ఉన్నట్టు కనిపించినా, మిగిలిన విభాగాల్లోని ఉద్యోగులు మాకు తీవ్రమైన అన్యాయం జరిగిందనే కోపంతో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నది. ఈ మేరకు ఏ పది మంది ఉద్యోగులు కలిసినా..ఇదే టాపిక్ పై చర్చలు నడుస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక అని భారీస్థాయిలో ప్రకటనలు చేసినా..ఈశాఖ విషయంలో ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తూనే వచ్చింది. నాలుగేళ్లలో ఈ శాఖకు అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకురాలేదంటేనే అర్ధం చేసుకోవచ్చు. కొన్ని శాఖల ఉద్యోగులకే ప్రయోజనాలు దక్కి.. మరికొన్ని శాఖల ఉద్యోగులు నష్టపోయే విధంగా తయారుచేసిన సర్వీసు రూల్సు, ప్రమోషనల్ ఛానల్ ఇపుడు ఉద్యోగులందరినీ తవ్రంగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో తమ ఉద్యోగాలు,పదోన్నతులు విషయంలో ఏ రాజకీయపార్టీ అయితే పక్కగా చెబుతుందో వారికే తమ మద్దతు, ఓటు వేస్తామని కొందరు సచివాలయ ఉద్యోగులు బాహాటంగానే చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టిడిపితో కూడిన కూటమి ఇంకా ఎవరూ తమ తమ మేనిఫెస్టోలను ప్రకటించలేదు. చూడాలి గ్రామవార్డు సచివాలయశాఖ ఆదుకునేలా, ఉద్యోగులకు ప్రయోజనాలు కలిగేలా ఏ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చేర్చుతారనేది..!?

amaravathi

2024-04-07 02:04:47

ఎదురు చూస్తున్న పండుటాకులు..!

అవును పండుటాకులు ఎదురు చూస్తున్నాయి.. గ్రామ వాలంటీరు వేకువ జామున తలుపు తట్టలేదు.. ఒకటో తేదీ దాటినా చేతికి పించను అందలేదు.. అవ్వా తాత మొహాల్లో చిరునవ్వు కనిపించలేదు.. కిరాణా కొట్టోడికి నెల బాకీ తీరలేదు..మనురాలికి ముసలమ్మ ఇచ్చే కిడ్డీ బ్యాంకు ఇవ్వలేదు.. వెరసీ ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన పించను సొమ్ముకి పించను దారులే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి అదీ 4వ తేదీ దాటిన తరువాత.. గత నాలుగన్నరేళ్లుగా ఇంటి వద్దనే తీసుకునే పించను సొమ్ము సుమారు మూడు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఆధార్ కార్డు పట్టుకొని తిరిగే పరిస్థితి ఆ వితంతువులది, ముసలోడిది, అవ్వా, తాతలది. ఎన్నికల వేల సమయానాకి డబ్బులొస్తాయనుకుంటే రాజకీయ చేసిన రచ్చ..పై ఎన్నికల సంఘం స్పందించాల్సి వచ్చింది. ఫలితంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 జిల్లా ల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడు లక్షలకు పైగా వాలంటీర్ల సేవలు నిలిచిపోయి..ఏ ఒక్కరికీ పించను అందలేదు సరికదా ప్రభుత్వం నియమిం చిన వాలంటీర్ల దగ్గర ఫోన్లు, బయో మెట్రిక్ డివైజ్ లు తిరిగి ప్రభుత్వానికే సమర్పించాల్సి వచ్చింది. ఇపుడు ఆ పించన్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంద 4వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. వీరు పంపిణీ చేస్తే సుమారు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులకి పైనే పట్టే అవకాశం వుంటుంది. దాని కోసం ఇప్పటికే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. అందులోనూ మార్చి నెల కావడంతో సచివాలయాల పరిధిలోని పించన్లు ఇవ్వడానికి డబ్బు కూడా చేరుకోలేదు.  సచివాలయాల్లో  సిబ్బందిని ఏర్పాటు చేసిన తరువాత, సమయానికి పించను దారులు సదరు కార్యాలయాలకు వెళితే అప్పుడు అవి చేతికి రానున్నాయి. మామూలుగా అయితే వాలంటీర్లు, సిబ్బంది ఒకటో తేదిన ఉదయం 5గంటలకు మొదలు పెట్టి మూడవ తేదీ సాయంత్రం 5గంటలకు పించన్ల పంపిణీని పూర్తిచేసేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సంఖ్యలో సగం కూడా లేకపోవడంతో పించన్ల పంపిణీ ఖచ్చితంగా ఆలస్యం అయ్యే పరిస్థితి వుంది. అదీ పించను దారులు సమయానికి సచివాలయాలకు వెళితే.

మాకాలడ్డిన ప్రతి పక్షాల ఫిర్యాదు..
పించను పథకం నేరుగా వాలంటీర్లు ఇళ్లకు పట్టుకొని వెళ్లి ఇస్తే పార్టీ ప్రచారం అయిపోతుందని భావించిన ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం రాష్ట్రంలో వాలంటీర్ల సేవలను నిలుపుదల చేసింది. అందేకాకుండా వారి వద్ద ఉన్న ఫోన్లు, డివైజులు వెనక్కి ఇచ్చేయిలని ఆదేశించడంతో వాలంటీర్లంతా సచివాలయాలకు వారి వారి ఫోన్లను సరెండర్ చేసేశారు. ఫిర్యాదుపై వాలంటీర్ల సేవలను అయితే నిలిపేసిన ప్రభత్వం తరువాత ప్రభుత్వం ద్వారా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయింది. ప్రస్తుతం తమకు రావాల్సిన పించన్లు ఎవరిద్వారా ఆగిపోయిందని పండుటాకులు ఉసూరు మంటున్నాయి. ఇన్నాళ్లైతే చక్కగా ఇంటి వద్దకే పించను వచ్చేదని, ఇపుడు కాళ్లీడీచ్చుకొని సచివాలయాలకు ఉదయం 10దాటిన తరువాత మండు టెండలో వెళితే తప్పా పించను వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. అందునా..వారి పించను పుస్తకాలను కూడా సచివాలయాలకు తీసుకెల్లకూడానే నిబంధన పెట్టడంతో ఎవరు పించను దారో, ఎవరో కాదో తెలుసునే ప్రయత్నం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ప్రశ్న ఉత్పన్న మవుతుంది.

ఎన్నికల సంఘం మానవాత దృక్పదంతో ఆలోచించాలి..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి ఈ ఎన్నికల సమయంలో అందించకపోయినా..ఒక్క పించన్లు మాత్రం అందించాలని ముసలివారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. అటు పతిపక్షాలు ఫిర్యాదుపై ప్రత్యేక ఆదేశాలతో నిలిపివేసిన పించన్ల పంపిణీ ఎన్నికల సమయం ఎంత కాలం ఉంటే అంతకాలం వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ ముసలి వయసులో తమను ఇబ్బందులకు గురిచేయొద్దని వేడుకుంటున్నారు. అయితే కేవలం ఎన్నికల ముందు వాలంటీర్లు ప్రబుత్వ పించను ఇచ్చినా ఎన్నికల ప్రచారం జరిగిపోతుందని భావించి తమను ఇబ్బందులు పాలు చేశారనే వ్యతిరేక కూడా పించను దారుల నుంచి వస్తోంది. ఇటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో పునరాలోచించాలని ఎన్నికల సంఘాన్ని వేడుకుంటున్నా ఫలితం అయితే రాలేదు. తప్పనిసరిస్థితి లోనే ఈ ఆదేశాలు అమలవుతున్నాయని కూడా ఎన్నికల సంఘం చెబుతోంది. చూడాలి 4వ తేదీ నుంచి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసే ఈ పించన్ల కార్యక్రమం ఎన్నిరోజులకు పూర్తవుతుందనేది..!

vizag

2024-04-02 05:12:52

మ్యాజిక్ ఫిగర్ పైనే ఆశలు..!

భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 68ఏళ్ల తరువాత 2024లాంటి విచిత్ర రాజకీయ పరిస్థితి మునుపెన్నడూ ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ ఆలోచన, చైతన్యం, ఉత్తేజం రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. తాజా రాజకీయ కీయ పరిస్థితులు, సమీకరణలు చూస్తుంటే ఏ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ ఆపైన గెలిచే ఐదో పదో సీట్లతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది రాష్ట్ర ప్రజల మాట. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయంపై రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ఓటు బ్యాంకు ప్రజల వద్ద ఈరోజు పేపర్-ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన గ్రౌండ్ లెవల్ సర్వేలో ఆశక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌళిక సదుపాయాలు, ఉద్యోగాలు, ఉపాది, సీపీఎస్ రద్దు, స్థానికత, సామాజిక వర్గం, ప్రభుత్వ సంక్షేమం, ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, రౌడీయిజం, దోపీడి, నూతన జిల్లాలు, ప్రత్యేక హోదా, పెరిగిన పన్నులు, విద్యుత్ చార్జీలు, ఇసుక, ప్రభుత్వ సేవలు, భూ ఆక్రమణలు, ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం, ప్రభుత్వ ఉద్యోగులపై పనిభారం-ఖాళీల భర్తీ చేయకపోవడం..23 అంశాల విషయంలో ప్రజల గుండె చప్పుడు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. సర్వే చేస్తున్న సమయంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ఓటర్లు దైర్యంగా వారి మనోభావాలను సర్వేలో వ్యక్తం చేశారు. 

అందజేసిన ప్రశ్నాల అంశాలవళిపై వారి మనసులో ఉన్న అభిప్రాయాలను టిక్ మార్క్ చేశారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా మ్యాజిక్ ఫిగర్ స్థానాలపై ఐదో, పదో సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి తప్పితే వైఎస్సార్సీపీ అంటున్నట్గు 175కి 175స్థానాలు, టిడిపి అంటున్నట్టుగా 130 స్థానాలకి పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రకటనలు ప్రజలకు చాలా దూరంగా ఉన్నాయని తెగేసి చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాది, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ యువత అత్యంత బాధలో ఉన్నామని పేర్కొన్నారు. 60శాతం సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాయని నిరుపేద కుటుంబాల్లోని ప్రజలు చెప్పుకొచ్చారు. వ్యాపారుల్లో కేవలం 40శాతం మంది మంది మాత్రమే ప్రస్తుత ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేస్తామని చెప్పగా 60శాతం మంది పూర్తిగా వ్యతిరేకత ప్రదర్శించారు. అలాగని కూటమికి అయినా సపోర్టు చేస్తున్నట్టు మాట్లాడారా అంటే అదీ లేదు ఇక్కడ కూడా కేవలం 50శాతం మంది మాత్రమే అనుకూలంగా మాట్లాడి, మరో 50శాతం మంది ఏమో చెప్పలేమని చేతులెత్తేశారు. నిరుపేద కుటుంబాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందిన వారు, సంక్షేమ పథకాలు పొందిన మహిళలు 40శాతం మద్దతు తెలియజేస్తే.. 60శాతం మంది సంక్షేమ పథకాలు ఇచ్చి మద్యంపై రేట్లు పెంచి, ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచేసి, నిత్యవసర సరుకుల ధరాలు కూడా పెరగడానికి కారణం అయ్యారని పెదవి విరిచారు. అటు కూటమి వైపు కూడా 35శాతం మంది మాత్రమే సముఖత చూపించారు. విద్య, ఆరోగ్యం, వైద్యం విషయంలో 60శాతం మంది మహిళలు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చినా ప్రస్తుత పథకాలే కొనసాగించాలి తప్పితే కొత్త పథకాలు ఇచ్చే ఆర్ధిక పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పేశారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, 60 శాతం,  రిటైర్డ్ ఉద్యోగుల్లో 90శాతం మంది ప్రస్తుత ప్రభుత్వ విషయంలో పూర్తి వ్యతిరేకతతో ఉన్నామని కరాఖండీగా చెప్పేశారు. సీపిఎస్ ఉద్యోగులు అయితే ఏ రాజకీయ పార్టీ అయితే సీపిఎస్ రద్దు చేస్తుందో వారికే తమ ఓటు వేటు వేస్తామని నిర్మొహమాటం చెప్పేశారు. రిటైర్డ్ ఉద్యోగులైతే ఇలాంటి ప్రభుత్వాన్ని తమ జీవితంలో చూడలేదని..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్వాంటమ్ పెన్సన్ 100ఏళ్లకు పెంచేసిన ప్రభుత్వాన్ని, ప్రతీనెలా 10వ తేదీ దాటిన తరువాత మాత్రమే పెన్షన్లు వేసే ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదని..తమ మద్దతు అయితే కనీసం అంటే కనీసం కూడా ఉండదని చెప్పారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు 100శాతం వ్యతిరేకతోనే ఉన్నారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం 1.30లక్షల మంది ఉద్యోగుల్లో 50శాతం మంది ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూలతతో ఉన్నారు. అందులోనూ 50శాతం ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయంలో డిఏ, హెచ్ఆర్ఏ తగ్గించేశారని, రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, ఇంకా చాలా విభాగాల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదని, సచివాలయశాఖకు చట్టబద్దత చేయలేదని పెదవి విరిచారు. సుముఖతతో ఉన్న ఉద్యోగులైతే ప్రస్తుత ప్రభుత్వం కారణంగానే తమ జీవితాల్లో ప్రభుత్వ ఉద్యోగమనే వెలుగులు నిండాయనే మంచి మనసుతో ఉన్నారు.  కూటమి విషయంలో 40 నుంచి 50శాతం మంది మాత్రమే వివిధ అంశాల్లోని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగని కూటమికే మద్దతు ఇస్తామని కూడా చెప్పలేమని, ఒకరకంగా కూటమిలో ఉండే ప్రధాన పార్టీ టిడిపి వలనే తమకు ఈ పరిస్థితి దాపురించిందని..ఆరోజు ప్రభుత్వమే సక్రమంగా ఉండి ఉంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా అనికూడా పొలిటకల్ సర్వే చేస్తున్న ప్రతినిధులపై ప్రశ్నల వర్ష్షం కురిపించారు ఓటర్లు.

ఇక సామాజిక వర్గాలు(కులాలు), మద్యం, భూ ఆక్రమణలు, విశ్వ విద్యాలయాలను నిర్వీర్యం చేయడం, ఉద్యోగాల భర్తీచేపట్టకపోవడం, విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను రేషనలైజేషన్ పేరుతోనూ, పాఠశాలల విలీనం పేరుతోనూ ఉద్యోగాలను కుదించేస్తున్న అంశం, ఇసుక, భారీగా పెంచేసిన ఇంటిపన్నులు, రాష్ట్రంలో ఎక్కడా కానరాని అభివృద్ధిపైన కూడా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 23 అంశాల ప్రశ్నావళిలో అందరూ ప్రధాన అంశాలను వ్యతిరేకిస్తూనే వచ్చారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఒకటేనని..కాకపోతే కొత్త పథకాలు, ఉద్యోగాల కల్పన, ఉపాది అవకాశాలు అయితే ఎవరూ చూపించే పరిస్థితి లేదని నిరుద్యోగ యువత నిరసనతో తమ మనో బావాలను వ్యక్తం చేశారు. దానికితోడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఇపుడు ప్రతీ ఓటరుపైనా పక్కాగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. 23 అంశాల సర్వేలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ(కూటమి)కి ఒక్క 20శాతం మాత్రమే వ్యత్యాసం కనిపించడం విశేషం. పైగా ఇపుడు అధికార పార్టీ 80చోట్ల అభ్యర్ధులను మార్పు చేయడం, మరో 40 మందికి పూర్తిగా సీట్లు ఇవ్వడం మానేయడం, కూటమి మూకుమ్మడిగా మూడు పార్టీలు కలిసి రావడం, వంటి అంశాలనూ కూడా ప్రజలు సర్వే సమయంలో ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఈ దఫా మాత్రం స్థానిక నేతలకు తప్పా, స్థానికేతరులను ప్రోత్సహించేది లేదని మాత్రం తెగేసి చెప్పారు. 

ఈ సారి ఎన్నికల్లో డబ్బు, మద్యం, చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని.. ప్రతీ ఒక్క ఓటరు చైతన్యం కావడానికి సోషల్ మీడియా మాత్రం బాగా ఉపకరిస్తుందని కూడా తేటతెల్లమైంది. అధికార పార్టీకి సంక్షేమ పథకాలు కలిసి వస్తుంటే.. ప్రతిపక్షపార్టీకి మాత్రం అధికారపార్టీ చేసిన తప్పులు, దారుణాలు, మద్యం రేట్లు, కరెంటు బిల్లులు, ఇంటిపన్నులపెంపు వంటి అంశాలు కలిసొస్తున్నట్టుగా కనిపించింది. సుమారు 3.50 కోట్ల ఓటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్యులు, సీపీఎస్ ఉద్యోగులు వారి కుటుంబాల ఓటు బ్యాంకు వలన సరాసరి 20 నుంచి 30 సీట్లు అధికార పార్టీ కోల్పోవాల్సి వస్తుందని కూడా వారే చెప్పడం గమనార్హం. మిగిలిన వర్గాలకు సదరు ప్రభుత్వం వలన జరిగిన మేలు అధారంగా ఓట్లు పడతాయని, లేదంటే కూటమి మిగిలిన సీట్లను కొట్టుకెళ్లి పోతుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా అది మ్యాజిక్ ఫిగర్.. ఆ పై వచ్చే ఐద నుంచి పది సీట్ల తేడాలో మాత్రమే ఆధార పడి వుంటుందని వారి వారి విశ్లేషణలు వ్యక్తం చేయడం కొరసమెరుపు. చూడాలి 2024 సార్వత్రిక ఎన్నికలల్లో ఏ రాజకీయపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది..! (ఓటర్ల దగ్గర నుంచి స్వయంగా మా నెట్వర్క్ చేపట్టిన సర్వేలో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఇందులో సీట్ల గెలుపు, పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వారు వారు గెలిచే సీట్లను బట్టి ఆధారపడి ఉంటుందని, ఈ సర్వే కూడా ప్రజా ప్రయోజనార్ధం మాత్రమే నిర్వహించాం తప్పితే ఏ పార్టీకీ అనుకూలమో, లేదా ప్రతికూలమో కాదని..ఇక్కడ ప్రజల నాడి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేశామనే విషయం కూడా లిఖిత పూర్వకంగ తెలియజేస్తున్నాం.

vizag

2024-03-29 19:03:00

ఆయుష్ లో అణగ దొక్కుతున్నారు..!

ఆయుష్ లోని అణచివేత చర్యలు ప్రారంభం అయ్యాయి. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా జరుగుతున్న తేడా వ్యవహారాలను ప్రశ్నిస్తున్నందుకు సీనియర్ వైద్యులు, దళిత వైద్యులు, ఉద్యోగుల పట్ల కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్రకుమార్ దుందుడుకు వైఖరిని అవలంభిస్తున్నట్టు జిఓఎంఎస్ నెంబరు 61 సాక్ష్యంగా నిలుస్తుంది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా 599 డిస్పెన్సరీలు, 4 మినీ ఆసుపత్రులకు చెందిన వైద్యుల డిడిఓ పవర్స్ ను రద్దు చేస్తూ కమిషనరేట్ లోని అకౌంట్స్ ఆఫీసర్ కి బదిలీచేశారు. ఇటీవల కాలంలో కమిషనర్ ఆయుష్ శాఖను, ఇక్కడి వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పరిపాలన పేరుతో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ తేడా వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు వైద్యులపై ప్రతీకారం తీర్చుకునేలా వ్యవహరిస్తూ..ఏకంగా డిస్పెన్సిరీల్లోని వైద్యాధికారుల డిడిఓ పవర్స్ ను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఫైలుకి వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. క్రిష్ణబాబు ఆమోదం తెలపడంతో జీఓ కూడా విడుదల అయిపోయింది. అసలు డిస్పెన్సీరీల్లో ఆర్దిక పరమైన ఇబ్బందులు ఏమొస్తాయో కూడా సదరు జీఓలో ఎక్కడా వివరించలేదు. డిస్పెన్సరీల్లో వైద్యుడు, కాంపౌండర్, స్వీపర్ లేదా అటెండర్ మాత్రమే ఉంటారని, అలాంటి చోట వైద్యాధికారులకు డిడిఓ అధికారాలుంటే నిధుల గోల్ మాల్ జరుగుతుందని మాత్రం జీఓలో పొందు పరిచారు. దీనితో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వైద్యాధికారులపై తొలివేటుగా డిడిఓ పవర్స్ ను రద్దు చేసి కమిషనర్ పై చేయి సాధించారని వైద్యాధికారులంతా ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన తమకు పోయిందేమీ లేదని, కాకపోతే ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక్క ఆయుష్ లోనే కమిషనర్ ఈ విధంగా డిడిఓ పవర్స్ తొలగించి ఆయుష్ పరువు తీశారని మండి పడుతున్నారు.

పరిపాలనలో వెనుక..స్వపరిపాలన తిట్ల దండకంలో ముందు
ఏ ప్రభుత్వ శాఖలోనైనా కమిషనర్లు సదరు శాఖలోని తాము పనిచేసిన కాలంలో తీసుకొచ్చిన అభివృద్ధిని కొలమానంగా చూపించుకుంటారు. అదేందో ఆయుష్ లో మాత్రం అన్నింటికంటే భిన్నంగా జరుగుతోంది. ఏ శాఖలోనూ లేనివిధంగా వైద్యాధికారులను జూమ్ సమావేశాలు పెట్టి అమ్మనా బూతులు తిట్టడం..అరేయ్ తురేయ్ లాంటి పద సంభాషణ, రాస్కెల్, యూజ్ లెస్ ఫెలో లాంటి మంచి మాటలతో తిట్ల దండకం కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్రకుమార్ కే చెల్లింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 599 డిస్పెన్సరీలు, 4 మినీ ఆసుపత్రులను ఏ కోణంలో అభవృద్ధి చేశారని తిరిగి చూస్తే..ఏ ఒక్కటీ లేదు సరికదా..ఉన్న ఉద్యోగాల్లో నుంచి కోత విధించడం, వైద్యాధికారులకు పదోన్నతులు రాకుండా, రోస్టర్ పాయింట్లు అమలు కాకుండా మోకాళ్లు అడ్డుపెట్టేటువంటి తేడా జీఓలో ఈ కమిషనర్ హయాంలో వచ్చాయని వైద్యాధికారులు ఈయన చేసిన ఘనకార్యాలయాలను సీఎంఓకి చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదాహరణకు తీసుకుంటే కమిషనర్ గా ఈయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏ ఒక్క ఆయుష్ ఉద్యోగి ఎఫ్ఆర్ఎస్ ను ఆన్ లైన్ లో పరిశీలించినది లేదు. పైగా జోన్-1లోని ఒక జిల్లా కార్యాలయంలో డ్రైవర్ విధులకు గైర్హాజరవుతూ, ఎఫ్ఆర్ఎస్ వేయకుండా ఉన్నా కూడా సదరు డ్రైవర్ పనిచేసే చోట తనకు అనుకూలంగా ఉన్న ఆర్డీడికి బంటు కావడంతో డ్రైవర్ విషయంలో కనీసం ఒక్క మాటల కూడా అనకుండా వదిలేశారు. దీనితో ఆ డ్రైవర్ తనకి నచ్చిపుడు కార్యాలయానికి వచ్చి, ఇష్టం లేనపుడు రావడం మానేస్తున్నాడు. వచ్చినపుడే కార్యాలయంలోని సూపరింటెండెంట్ సహకారంతో అన్ని రోజులకీ కలిపి ఒకేసారి రిజిస్టర్ లో ఆప్సెంట్ లు కూడా వేసేస్తున్నాడు.. ఒక రెగ్యులర్ డ్రైవర్ విధులకు సక్రమంగా రాని వ్యక్తిపై చర్యలు తీసుకోలేని కమిషనర్, ప్రజలకు వైద్యసేవలు చేస్తూ..ఎంతో విలువైన సమయాన్ని వైద్యం కోసం వెచ్చిస్తుంటే తమను కించపరిచేవిధంగా కమిషనర్ డిడిఓ పవర్స్ ను రద్దు చేయడాన్ని వైద్యులంతా జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతా నాయిష్టం..నన్నే ప్రశ్నిస్తారా..చూడు వారందరినీ ఏం చేస్తానో..?
ఆయుష్ డిపార్ట్ మెంట్ కి నేను కమిషనర్ ని..అలాంటి నా నిర్ణయాలే తప్పుబడతారా..? నన్నే ప్రశ్నిస్తారా..? నేను అనుకుంటే ఈ డిపార్ట్ మెంటే లేకుండా చేయగలను..నేను పెట్టే ఏ ప్రపోజల్ ఫైలుకైనా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఇట్టే సంతకం చేసేస్తారు..అందుకే వైద్యాధికారులకు వ్యతిరేకంగా ఇన్ని జీఓలు తే గలిగానని తనకు అనుకూలంగా వున్న ఆర్డీడీల వద్ద కమిషనర్ ప్రస్తావించినట్టు కమిషనరేట్ నుంచే వైద్యాధికారులకు ఉప్పందినట్టు చెబుతున్నారు. ఇప్పటికే తమను చాలా దారుణంగా వేధిస్తున్న కమిషనర్ ఇంకా తమపై కక్షగట్టి మరీ ఇలాంటి తేడా వ్యవహరాలకు పూనుకుంటున్నాడని వైద్యాధికారులు ఆవేదన చెందుతున్నారు. అయితే తాను కొందరు వైద్యాధికారుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్న విషయంలో బ్యాంకు రిసిప్టులు కూడా మీడియా ద్వారా బయటపెట్టిన వైద్యులను ఏం చేసినా తప్పులేదని, మీరు చేసే పనులకు తమవంతు సహకారం వుంటుందని కొందరు ఆర్డీడీలు కమిషనర్ కి వత్తాసు పలికినట్టు తెలిసింది. డిపార్ట్ మెంట్ లో ఏం జరిగినా వెంటనే మీడియాకి మన వైద్యాధికారులే ఉప్పందించేస్తున్నారని అలాంటి వాళ్ల కొమ్ములు విరగ్గొట్టాలంటే మీరు చేసిన డిడిఓ పవర్స్ రద్దుతో వాళ్లంతా మనదారికి వస్తారని ఆర్డీడీ కమిషనర్ కి చెప్పారని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిధంగా వ్యవహరిస్తున్న కమిషనర్ చర్యలకు కొందరు ఆర్డీడీలు, వైద్యులు తానా తందానా అంటూ భజన చేస్తున్న కారణంగా వైద్యాధికారులు, సిబ్బందిపై ఇష్టం వచ్చినట్టు జీఓల రూపంలో తన కక్షతీర్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక ప్రభుత్వశాఖలో కమిషనర్ చేస్తున్న తేడా వ్యవహారాలకు జీఓ ల రూపంలో ప్రభుత్వ చర్యలు కూడా రావడం ఇతర ప్రభుత్వశాఖల్లో చర్చనీయాంశం అవుతుంది. చూడాలి వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిపై కమిషనర్ చర్యలు ఇంకా ఎన్ని తేడా జీఓలు రావడానికి కారణమవుతుందోనని టాక్ రాష్ట్రమంతా దావానంలా వ్యాపిస్తుంది.

amaravathi

2024-03-28 05:29:07

ఆయుష్ లో పుచ్చకాయ దొంగలు..!

ఆయుష్ లో పుచ్చకాయల దొంగలు బుజాలు తడుముకోవడం మొదలెట్టారు.. చేసిన, చేస్తున్న తేడా పనులపై ప్రధాన మీడియాలో వరుస కథనాలు వచ్చేస్తుంటే..  తట్టు కోలేని అధికారులు తమ ఉనికిని, మంచి అనే ముసుగు కప్పుకోవడానికి తెరచాటు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయుష్ విభాగాన్ని గాడిలో పెట్టాలని ప్రయత్ని స్తుంటే..అదేదో బ్రహ్మకపాలం పగిలిపోయినట్టుగా మీడియాలో వాస్తవాలు బయట పెట్టేస్తున్నారని.. మందలిస్తే మండిపడిపోతున్నారని.. బుద్ధి చెబితే కక్షగట్టినట్టుగా కథనాలు రాస్తున్నారని.. జూమ్ మీటింగ్ లో ఏదో ఓ మాటంటే.. అమ్మనా బూతులు తిట్టారని.. అవసరానికి డబ్బులు తీసుకుంటే మామూళ్ల రంగు పులిమారని.. డ్రైవర్ ఉద్యోగం పోకుండా కాపాడితే.. తేడాగా వ్యవహరించామని తెగ వ్యతిరేక వార్తలు రాసేస్తున్నార్రా బాబూ.. ఇలాగైతే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అక్షింతలు తప్పవని భావించిన అధికారలు తమకు అనుకూలంగా ఉన్న భజన పరులతో భజన చేయించుకునే ఘట్టానికి తెరలేపారు. ఆయనొచ్చిన తరువాత ఆయుష్ విభాగం గాడిలో పడిపోయిందని..ఆహా ఓహో అంటూ  భజన వార్తల వంటకాలు మొదలెట్టారు.. ఒక్కసారి ఆయుష్ కమిషనర్, అయనకి అనుకూలంగా ఉన్న ఆర్డీడీలు చేసిన తేడా వ్యవహారాలు.. ఇదేశాఖలోని తేడా పనులు, ఘనకార్యాల కోసం.. భజన మొదలెట్టిన భజన బృందాల కోసం వాస్తవాలు మళ్లీ ఒక్కసారి గుర్తుచేసే ప్రయత్నం చేద్దాం..!
 
పుచ్చకాయ దొంగలెవరంటే నేను కాదని బుజాలు తడుముకున్నారట వెనకటికి.. చేసిన తప్పులను..వేధింపులను మీడియా బట్టబయలు చేస్తే.. నేను అలా చేయలేదని.. విధులకు రాని వైద్యులతో పనిచేయించే ప్రయత్నం చేస్తున్నానని ప్రచారం చేయించుకునే మొదలు పెట్టారని వేధింపులకు గురవుతున్న వైద్యులు తీవ్రంగా ఆరోపిస్తు న్నారు. ఆయుష్ లో మోనార్క్ గా.. తన మాటే చెల్లాలన్నట్టుగా వ్యవహరించే కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్రకుమార్ లంగిశెట్టితో పెద్ద లంపటమే వచ్చి పడిందని గగ్గోలు పెడుతున్నారు వైద్యులు. కొందరైతే ఏం జరిగితే జరిగిందని తమ పేర్లతో నేరుగా సీఎంఓకి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదులు కూడా చేశారు. ఆయుష్ కమిషనర్ సారు చేసే ఘనకార్యాలు ఏంటో ఒక్కతెలుసుకుంటే.. వేళా పాలాల లేకుండా జూమ్ మీటింగ్లు పెట్టి.. వైద్యులనే కనీసం గౌరవం కూడా లేకుండా ఏరా.. రాస్కెల్స్.. పనిచేయడం చేతకాదా అని తిట్ల దండకం చేయడం(సదరు జూమ్ మీటింగ్ వీడియోలు, తిట్ల పురాణాలు వినాలని, చూడాలని ఉంటే అవీ అందిస్తాం తీసుకొని భజవార్తల రూపంలో వేసే దమ్ముందా..?).. డిస్పెన్సరీలో మొక్కలు ఎదగకపోతే దానికి అక్కడి వైద్యులను బాధ్యులను చేసి పనిష్మెంటుగా విజయవాడ కమిషనర్ కార్యాలయానికి వివరణ ఇవ్వడానికి రమ్మనడం, అక్కడాకూడా అఖితభారతస్థాయి అధికారిననే హోదా మరిచిపోయి చాలా చీఫ్ గా మాట్లాడటం.. 

ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాల్సిన డిస్పెన్సీరీ ఫర్నిచర్ కు వైద్యాధికారులను ఆ బిల్లులు చెల్లించమనడం, ఏకపక్షంగా ఆలోచిస్తూ ఏకంగా పదుల సంఖ్యలో ఉద్యోగాల ను రద్దు చేయడం.. ఎస్సీ ఎస్టీ సీనియర్ వైద్యాధికారులకు దక్కాల్సిన పదోన్నతులు దక్కకుండా రోస్టర్ పాయింట్లను చేరకుండా సదరు పోస్టులను రద్దు చేయడం (అడ్డదారి జీఓలు చేయించడం..ఈ కాపీ మేము ఇవ్వాల్సిన పనిలేదు చెమ్చాలుగా పనిచేసే అధికారులు వద్దనే ఉన్నాయి.. కాదూ కూడదు..కావాలంటే అవీ ఇస్తాం), తన చెప్పుచేతల్లో ఉండే ఆర్డీడీలతో సమాచారం తెప్పించుకుని మరీ వైద్యాధికారులను మానసికంగా వేధించం ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఇవేవో ‘ఈరోజు’ చెబుతున్న మాటలు కాదు..ఆయుష్ లోని వైద్యులంతా తమను ఏవిధంగా కమిషనర్ చిత్ర హింసలకు గురిచేస్తున్నారో వివరిస్తూ వైద్యాధికారులే సీఎంఓ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి చేసిన ఫిర్యాదు వివరాలు(కావాలనుకుంటే..సదరు కాపీ భజనపరులకు అందజేస్తాం..ఇపుడు చేస్తున్న భజనలానే..దానిని కూడా ముద్రించి భజన చేయగలరా..?)..అన్నింటి కంటే ముఖ్యంగా ఐదేళ్ల పాటు సక్రమంగా విధులకు హాజరు ఇదేశాఖలోని ఒక డ్రైవర్ కి ఉద్యోగం పోకుండా  చేసినందకు తీసుకున్న లంచాలు(సదరు వైద్యుడి బ్యాంకు ఖాతాల నుంచి ఏ రోజు ఎంతెంత మొత్తం పంపారో లెక్కలు, బ్యాంకు స్టేట్ మెంట్లు కావాలంటే ఇస్తాం..లేదంటే మీరు విచారణ చేసినా వాస్తవాలు కండబద్దలు కొట్టుకొని మరీ బయటకు వచ్చేస్తాయి),

 ఇదే కేసు విషయంలో ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ ను విధుల నుంచి తప్పించడానికి.. ఓ కుటుంబం వీధినిన పడటానికి జాబ్ రిమూవ్ ప్రపోజల్ ఫైలు ఏ విధంగా పెట్టారనే విషయానికి సంబంధించిన సమాచారం..ప్రస్తుతం నడుస్తున్న తంతుకి సంబంధించిన సమాచారం అన్ని ఆధారాలూ ఉన్నాయి..అంతేకాకుండా వైద్యాధికారుల వద్ద నుంచి జోన్-1లో పనిచేసిన ఆర్డీడీ డా..శేఖర్ వైద్యాధికారుల నుంచి ఎన్ని లక్షలు అప్పులు చేసి ఎగ్గొట్టారో వాటి బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఫోన్ పే రిసిప్ట్ లు ఇలా చాలాపెద్ద రికార్డే ఉంది కావాలంటే అవీ ఇవ్వగలం(వాటిపై భజన చేసే తెగువ చూపించగలరా?).. ఈ విషయాలన్నింటిపై మీడియాలో ఆధారాలతో వార్తల వస్తే..ఆయనొ చ్చిన తరువాత ఆయుష్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారనే భజన ఎలా చేయాలనిపిస్తున్నదో వారికే తెలియాల్సి వుంది. వైద్యులను తిట్టడం వాస్తవం కాదా.. కమిషనర్ పేరుతోనూ, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి హెచ్చరికలను అడ్డుపెట్టుకొని తన చెల్లికి పెళ్లి, అమ్మకు వైద్యం అంటూ మెడికల్ ఆఫీసర్ల దగ్గర జోన్-1 ఆర్డీడీ అప్పులు చేసి నేటికీ తీర్చకుండా వైద్యాధికారులును పరిపాలనా పరమైన అంశాలను జోడించి ముప్పు తిప్పలు పెట్టడం వాస్తవం కాదా..? రాష్ట్రప్రభుత్వం పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉత్తర్వులు ఇస్తే ఏకంగా 12 మందిని గాల్లో పెట్టి వారి ఉద్యోగాలు రెగ్యులర్ కానీయకుండా చేయడం నిజం కాదా..? దానిపై ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు ప్రపోజల్ ఫైల్ పెట్టాలని ఆదేశించినా కొర్రీలు వేసి.. ప్రభుత్వ ఉత్తర్వులను అపహాస్యం చేస్తూ.. దానిని పక్కన పెట్టేయడం నిజం కాదా..?  

ఏది నిజమో.. ఏది అబద్దమో భజన చేసేవారు రంగంలోకి దిగి విచారణ చేస్తే వాస్తవాలన్నీ ఆధారాలతో బయటకి వచ్చేస్తాయి. ప్రశ్నించిన వారిపై కక్ష గట్టడం కాదు..చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు తేడా ప్రచారం మొదలెట్టడం అంతకంటే కాదు.. వాస్తవాలను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే ఏ మీడియాకైనా గౌరవం వుంటుంది. అలాని మీకుండే అవసరాలు, కారణాలు, అధికారుల తప్పులను కప్పిపుచ్చడానికి వాడితే.. ఆధారాలు బయటపడిన రోజున తెల్లమొహం వేయాల్సి వస్తుంది.. మీ ముందుంచిన అంశాలపై నిష్పక్షపాతం విచారణ చేసే దమ్ముందా..? ఆధారాలిస్తాం.. వాస్తవాలు నిర్భయంగా రాయగలరా..?తేడా అధికారులకు తెలిసీ తెలియని ప్రచారం చేస్తే ఉన్న పరువు.. ఉంచుకున్న పరువూ రెండూ పోతాయ్.. మళ్లీ చెబుతున్నాం.. చేసిన తప్పులను మాత్రం ఇప్పటి వరకూ బయట పెట్టాం.. చేసిన తప్పులను సరిదిద్దుకున్నా.. నిష్పక్షపాతం వ్యవహరించి అన్యాయం జరిగిన వారికి న్యాయం చేసినా..ఇంతకంటే కీర్తిస్తూ కూడా వార్తలను అందిస్తాం. శభాష్ అంటూ గౌరవిస్తాం.. ఉన్నతాధికారులంటే ఎంతో ఉన్నతంగా వ్యవహరించాలి.. అంతే తప్పా ఫాల్స్ ప్రెస్టేజికి పోయి కక్షపూరితంగా వ్యవహరించకూడదని కోరుతున్నాం...సత్యమేవ జయతే..!

amaravathi

2024-03-22 13:40:05

ఆయుష్ రద్దుకి భారీ కుట్ర..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా ఉన్న వైద్యఆరోగ్యశాఖలో అనుబంధ విభాగం ఆయుష్  పూర్తిగా రద్దు చేయడానికి భారీ కుట్ర జరుగుతు న్నట్టుగా కనిపిస్తోంది.. వినడానికి కాస్త కంగారుగా వున్నా..వాస్తవరూపంలోకి వెంటనే తేకుండా ఈ విభాగంలోని కొన్ని రకాల ఉద్యోగాలను కుదిస్తూ.. ఇటీవలే వైద్యఆ రోగ్యశాఖ జారీచేసిన జీఓ నెంబరు-53 తీవ్ర దుమారం రేపుతోంది. అవును ఒకేసారి వైద్యవిభాగంలో ఉన్న అనుబంధ శాఖను రద్దు చేస్తే పెద్ద ఎత్తున గొడవలు జరుగు తాయని బావించిన కమిషనర్ అదనంగా ఉన్న ఉద్యోగాలను కుదింపు చేస్తున్నట్టుగా చూపించి..ఆయుష్ వినాశనానికి తెరలేపారన్నఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయి. సప్రషన్ ఆఫ్ పోస్ట్స్ పేరుతో ఆయుష్ లోని 12 రకాల ఉద్యోగాల్లో మొత్తం 28 పోస్టులను కుదిస్తూ కమిషనర్ డా.ఎస్.బి.రాజేంద్రకుమార్ పెట్టిన ప్రపోజల్ ను అంగీకరిస్తూ..వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు పేరుతో మార్చి 16-2024న జీఓ కూడా జారీ అయిపోయింది. ప్రభుత్వం దృష్టిలో ఆయుష్ కమిషనర్ ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా..ప్రభుత్వ ఉద్యోగాలను కుదించిన తెలివైన అధికారి..కానీ ఈ ముసుగులో ఏకంగా ఆయుష్ విభాగాన్నే రద్దు చేయడానికి పన్నాగం పన్నుతున్నారని..త్వరలోనే ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని నేడు ఉద్యోగులు, వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ సీనియర్ మెడిల్ ఆఫీసర్లకు పదోన్నతులు రాకుండా, వారికి రోస్టర్ పాయింట్లు పనిచేయకుండా ఉండేందుకు వీలుగానే ఈ సప్రషన్ ఆఫ్ పోస్ట్స్ పేరుతో ఉద్యోగాలను కుదించేశారని సీనియర్ వైద్యాధికారులు వాపోతున్నారు. దీనికారణంగా ఎస్సీ, ఎస్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు ఆర్డీడీలుగా పదోన్నతులు రావు. ఇదే విషయాన్ని సీనియర్ మెడికల్ ఆఫీసర్లు సీఎంఓకి ఫిర్యాదు రూపంలో కమిషనర్ చేసిన వ్యవహారాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేసినా ఫలితం లేకపోయింది. 

ఏ ప్రభుత్వ శాఖలోనైనా కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు సదరు ప్రభుత్వశాఖను అభివృద్ధి చేయాలని..ఉద్యోగుల సమస్యలు తీర్చాలని, వారికి సకాలంలో పదోన్నతులు కల్పించాలని, అవసరాన్ని బట్టి ప్రభుత్వంతో చర్చించి కొత్త ఉద్యోగాల కల్పన చేపట్టి.. ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా ఆయుష్ విభాగంలో మాత్రం ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా అవసరమైన మేరకు.. అనవసర కొర్రీలు వేస్తూ.. ముఖ్యంగా దళితులకు పదోన్నతులు రాకుండా.. వారికి రోస్టర్ విధానం అమలు కాకుండా ఏకంగా ఉన్న పోస్టులనే కుదించేస్తున్నారంటే దళిత వైద్యులంటే ఈశాఖలోని అధికారులకు ఎలాంటి గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఎస్సీ, ఎస్టీ వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ ను సంప్రదిస్తారని..కానీ ఆయుష్ లో మాత్రం సమస్యే కమిషనర్ అయిపోయారని వైద్యాధికారులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా నేరుగా సీఎంఓకే మొరపెట్టుకున్నారంటే ఎలాంటి పరిస్థితి ఆయుష్ విభాగంలో నడుస్తోందో తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. విధి నిర్వహణ పేరిట వైద్యాధికారులను అందరి ముందూ జూమ్ మీటింగ్లు, టెలీకాన్ఫరెన్సులు, డిస్పెన్సరీల సందర్శన సమయంలో నోటికొచ్చినట్టు తిడితే..వైద్యులు వారంతట వారే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోతారని..దానికోసం మానసికంగా వేధించడం మొదలు పెడుతున్నారని ఆయుష్ వైద్యులు ఆరోపిస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వైద్యులు స్వచ్చంద రాజీనామాలకు కూడా సిద్దపడుతున్నారు. మరికొందరు మూకుమ్మడి సెలవులకు ఉపక్రమిస్తున్నారని తెలిసింది.

ప్రభుత్వం ఆయుష్ విభాగంలో పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిస్తే.. కేవలం 22 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేసి.. 12 మంది ఉద్యోగు లను రెగ్యులర్ చేయకుండా వారంతా సర్వీసుల్లోకి వచ్చే సమయంలో కులం నమోదులో బయటపడిన చిన్న చిన్న తప్పులను పెద్ద కారణాలు చూపి వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేయకుండా..సదరు ఫైల్ ని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు కి పంపకుండా కమిషనర్ వద్దే అట్టే పెట్టుకున్నారు. ఈ ఉద్యోగుల విషయంలో కూడా సాంకేతిక కారణాలు చూపించడం ద్వారా ప్రభుత్వానికి మరో 12 ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాలుగానే ఉంచేస్తే..కొత్తగా పోస్టులను తీసే పనిలేకుండా..ఉన్న ఉద్యోగులతోనే  ప్రభుత్వంపై భారం పడకుండా చేసి..ప్రభుత్వంలో మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు తప్పా.. ఉద్యోగుల కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారని కనీసం ఆలోచించడం లేదని కూడా సిబ్బంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విషయంలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మిగిలిన సిబ్బందికి సంబంధించిన ఫైలు పెట్టమన్నా కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. కమిషనర్ చర్యలన్నీ ఆయుష్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి..వైద్యులను విధి నిర్వహణ పేరిట వేధించి, ఫేస్ రికగ్నైజేషన్ నెపంతో ఇబ్బందులు పెట్టి.. ఆసుపత్రి నిర్వహణ పేరుతో బండబూతులు తిడుతూ.. పరువు తీసేసే విధంగా అమ్మా..ఆలీ..ఒరేయ్..ఏరా లాంటి తిట్లు తిడితే ఆత్మాభిమానం అడ్డొచ్చిన వైద్యులు విధులకు వారంతట వారే రాజీనామాలు చేస్తారని మాస్టర్ ప్లాన్ వేశారని కూడా చెబుతున్నారు.

 ప్రస్తుతం ప్రభుత్వంపై ఆర్దిక భారం పడుతుందని..అఖిలభారతస్థాయి అధికారిగా తన ద్వారా ప్రభుత్వానికి మేలు ఉద్యోగాలను కుదించేసి..పదోన్నతులు రాకుండా చేసేసి..వైద్యులను వేధించి వారంత వారే ఉద్యోగాలు మానేసినా..ప్రభుత్వానికి ఎంతో కొంత ఆర్ధిక భారం తగ్గించినట్టు అవుతుందని, కొందరు ఆర్డీడీల మాటలు విని  ఇదంతా చేస్తున్నారని వైద్యులు ఆరోపిస్తున్నారు. తమకు అన్యాయం జరిగితే మాత్రం న్యాయపరమైన పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగాల కుదింపు జీఓ ఇపుడు 75ప్రభుత్వశాఖల్లోనూ చర్చనీయాంశం అవుతుంది. ఆయుష్ కమిషనర్ ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన ప్రభుత్వశాఖల కమిషనర్లు కూడా ఈ విధంగా చేస్తే చాలా ప్రభుత్వ ఉద్యోగాలు రద్ద అయ్యే అవకాశం కూడా లేకపోలేదని ఉద్యోగ సంఘాలు కంగారు పడుతున్నాయి. ఈవిషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని కూడా హెచ్చరిస్తున్నాయి. చూడాలి ఆయుష్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలు ఇంకా ఎన్ని ప్రభుత్వశాఖలను నాశనం చేస్తాయో లేదంటే..లేదంటే ఇలాంటి తేడా పనులకు పూనుకున్న కమిషనర్ పై చర్యలకు ఉపక్రమిస్తారోననేది..?!

vizag

2024-03-19 19:06:31

ఆయుష్ లో రెగ్యులర్ రచ్చ..!

ఆయుష్ లోని ఉన్నతాధికారులు ఏక పక్ష నిర్ణయాలు ఏకంగా 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులు గాల్లోనే ఉండిపోయాయి. ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసిన నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖలో భాగంగా ఉన్న ఆయుష్ శాఖలో 34 మంది పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కమిషనర్ ఎస్.బి.రాజేంద్రప్రసాద్ అందులో కేవలం 22 మంది ఉద్యోగులనే రెగ్యులర్ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబుకి ఫైలు పంపారు. ప్రభుత్వం ఇచ్చింది కేవలం వీరికే అనుకొని ముఖ్యకార్యదర్శి కూడా ఫైలుపై సంతకం చేసేశారు. తీరా ఇంకా 12 మంది ఉద్యోగులం మిగిలిపోయాని ఉద్యోగులంతా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వెంటనే కమిషనర్ ను మిగిలిన ఉద్యోగుల ఫైల్ కూడా పెట్టాలని ఆదేశించినా..వారి నియామక సమయంలో రోస్టర్ పాయింట్లు తేడాలున్నాయని..వాటిని రిజిస్టర్ చేయడంలో తప్పులున్న కారణంగానే వాటిని పెట్టడం కుదరలేదంటూ ముఖ్యకార్యదర్శికి సమాధనం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వమే జాబితా సిద్దం చేసి ఆయుష్ శాఖకు పంపితే కేవలం 22 మందికి మాత్రమే ఎలా పెడతారని కమిషనర్ పై ఆరోగ్యశాఖ కార్యదర్శి సీరియస్ అయినా ఫలితం రాలేదు.

 అలా అని వారి ఫైల్ ని రిజక్ట్ కూడా చేయకుండా కమిషనర్ వద్దనే ఉంచుకోవడంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశతో విధులు నిర్వహిస్తుంటే..ఇపుడు ఉన్నతాధికారులు చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి తమ భవిష్యత్తుని గాల్లో పెడుతున్నారని రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయాన్ని కమిషనర్ కి బాగా అనుకూలంగా ఉన్న ఓ ఇద్దరు ఆర్డీడిలు మీడియాకి లీకులిచ్చినట్టు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కమిషనర్ తమను ఇబ్బందులు పెట్టారని..ఇపుడు ప్రభుత్వం ఆదేశాలిస్తే కావాలనే కమిషనర్ 12 మంది పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయడానికి ప్రపోజల్ ఫైల్ పెట్టకుండా కేవలం 22 మంది ఉద్యోగులవి మాత్రమే పట్టారని విషయం బయటకి బొంకినట్టు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ అయిన వారికి ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా కమిషనర్ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది విషయాలు తెలుసుకునే అనకూలితులే బయటకు పంపారని చెబుతున్నారు. ఇపుడు ఆ ఉత్తర్వులుకాస్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఆయుష్ శాఖలో ఆది నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న కమిషనర్ ఇపుడు 12 మంది పారామెడికల్ ఉద్యోగుల విషయంలో ఏకంగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలను కూడా పక్కనపెట్టి ఉద్యోగు రెగ్యులర్ ఫైల్ ప్రపోజల్ పెట్టకపోవడం చర్చనీయాంశం అవుతుంది. 

విషయం కోర్టుకెక్కితే ముఖ్యకార్యదర్శి సమాధానం చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖలోని ఆయుష్ విభాగంలో 34 మంది పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆర్డరు వేస్తే దానిని అమలుచేయని కారణంగా ఉద్యోగులు కోర్టుకి వెళ్లినా..సర్వీసు నిబంధనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా..దానికి ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సమాధానం చెప్పాల్సి వుంటుంది. అయితే ఈ విషయంలో ఆయుష్ కమిషనర్ ఎస్.బి.రాజేంద్రప్రసాద్ నిర్ణయాల కారణంగా ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తున్నది. ఒకవేళ విషయం కోర్టుకెక్కితే ముఖ్యకార్యదర్శి తప్పులేకుండా ఉన్నది ఉన్నట్టు లిఖిత పూర్వగా కోర్టుకి నివేదించినా కమిషనర్ మీద చర్యలు పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇస్తే.. చిన్న చిన్న కారణాలు, రోస్టర్ పాయింట్లలో నమోదులను సాకుగా చూపి ఏకంగా ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను ఆపేసిన కమిషనర్ చర్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే పలుప్రభుత్వ శాఖల్లోని అఖిల భారతస్థాయి అధికారుల నిర్ణయాల వలన ప్రభుత్వం కోర్టులకి సమాధా నాలు చెబుతూ వస్తుంది. ఈ రెగ్యులరైజేషన్ విషయంలో కోర్టు మెట్లెక్కితే ఆయుష్ శాఖ నుంచి సమాధానం చెప్పాల్సిందే నంటున్నారు అధికారులు కూడా. కాగా ఈ విషయంలో కొందరు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మార్చడానికే ఈ విధంగా కావాలనే ఉద్యోగుల ఫైలుని ఆపించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినందున..ప్రస్తుతం 12మంది పారామెడికల్ ఉద్యోగాలను ఆయుష్ కమిషనర్ ప్రపోజల్ ఫైల్ ద్వారా రెగ్యులర్ చేస్తుందా..లేదంటే కమిషనర్ నిర్ణయానికి ప్రభుత్వం సహకరించి ఉద్యోగులను గాల్లోనే ఉంచుతుందా అనేది వేచి చూడాలి. సర్వీసులు రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన 12మంది పారామెడికల్ ఫైలు మాత్రం కమిషనర్ ప్రపోజల్ కోసం ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు వద్ద ఉన్నట్టు తెలిసింది. నేడు ఈ ఫైలు విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..?!

amaravathi

2024-03-18 03:57:08

ఆయుష్ లో అడ్డదారి ఆగడాలు..!

ఆయుష్ లో అడ్డదారిలో ఉత్తర్వులిచ్చి స్టేట్ లెవల్ పోస్టులను కుదించేయడానికి ఇదేశాఖలోని కమిషనర్  తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదేదో ప్రభుత్వానికి మేలు చేయ డానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎస్సీ, ఎస్టీ వైద్యాధికారులకు పదోన్నతులు రాకుండా అడ్డుకోవడానికి తన పరిధిలోని విచక్షణాధికారాలను అడ్డుపెట్టి మరీ ఫైల్ సిద్దం చేశారు. విషయం తెలుసుకున్న ఆయుష్ శాఖలోని దళిత వైద్యులు ఏకమై విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం, మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈవిషయం రాష్ట్రంలో సంచలనం అవుతోంది. ఈ తంతు నడిపించానికి ఇదే శాఖలో ఆర్డీడి గా పనిచేస్తున్న ఒక అధికారి సహాయ సహకారాలు అందిస్తున్నారని సమా చారం. తమకు జరుగుతున్న అన్యాయంపై మాతృశాఖలోని అధికారుల ద్వారా పనిజరగదని బావించిన సీనియర్ మెడికల్ ఆఫీసర్లు విషయాన్ని మీడియాకి లీక్ చేయ డంతో వ్యవహారం మొత్తం బట్టబయలైపోయింది. రాష్ట్రస్థాయిలో ఆరుగురు ఉండాల్సిన ఆఫీసర్ స్ట్రెంగ్త్ ను ఆగమేఘాలపై ఐదుగురికి కుదించి ఫైలును సిద్దం చేసి వైద్యఆరో గ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ.క్రిష్ణబాబుకి పంపారు ఇదేశాఖలోని కమిషనర్. ఇది జరిగితే ఖచ్చితంగా రోస్టర్ విధానంలో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతి అవకాశం కోల్పోతా మని భావించిన ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలంటూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 

అదే సమయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈరోజు ద్వారా కూడా ఫిర్యాదుని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి చేర్చింది. వెంటనే అప్రమత్తం అయిన ఆరోగ్యశా ఖముఖ్యకార్యదర్శి ఈ విషయంపై కమిషనర్ ను పిలచి మాట్లాడారట. అయితే వెంటనే ఫైల్ ని తిరిగి సరవరణలు చేసి పంపాలని ఆదేశించినప్పటికీ కమిషనర్ ఆ ఫైలుని పోస్టులని కుదించాలనే తలపుంతోనే ఉన్నారని చెబుతున్నారు. ఏ అధికారినైతే గుడ్డిగా నమ్మి సహాయ సహకారాలు తీసుకుంటున్నారో సదరు ఆర్డీడీ కూడా తనకు తెలి సిన మీడియాకి మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినట్టుగా లీక్ చేసేశారని కూడా చెబుతున్నారు. ఇలా చేస్తే తనపై ఉన్న అవినీతి ఆరోపణల విషయం పక్కదారి పట్టి..కేడ ర్ స్ట్రెంగ్త్ విషయంపైకే మీడియా దృష్టి వెళ్లిపోతుందని సదరు అధికారి బావించారని సమాచారం అందుతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఎలాంటి పరిపాలన పరమైన పదోన్నతులు, ఉన్నపోస్టుల కుదింపు చేయడానికి అవకాశం లేదు. కానీ పాత తేదీలతో ఫైలుని నడపాలని చూసినా..విషయం ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి దృష్టికి వెళ్లడంతో మొత్తానికి అడ్డుకట్ట పడినట్టుగా సమాచారం అందుతుంది. ఆయుష్ లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఇదేశాఖకు చెందిన వైద్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. 

ఏదైనా ప్రభుత్వశాఖలో అన్యాయం జరిగితే తమ బాధలను కమిషనర్ దృష్టికి తీసుకెళారని..కానీ ఏకంగా కమిషనరే తమ దళితులకు దక్కాల్సిన పదోన్నతులను ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కుదించేయాలని చూడటంతోనే తమన బాధను ముఖ్యమంత్రికి ఫిర్యాదు ద్వారా విన్నవించుకున్నామని సీనియర్ వైద్యాధికారులు వాపోతున్నారు. సర్వీసు నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న క్యాడర్ స్ట్రెంత్ కుదింపు విషయంలో తక్షణమే విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు వచ్చే పదోన్న తులు నష్టపోకుండా చూడాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరజేషన్ విషయంతో ఏక పక్షంగా వ్యవహరించి కొందరికి పారామెడి కల్ సిబ్బందికి పోస్టులు రెగ్యులర్ చేయకుండా చేసిన విషయంలో అటు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కూడా గుర్రుగా ఉన్నారు. అందులోనూ ఇపుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినందు..పోస్టులు రెగ్యులర్ కాని వారి అభ్యర్ధనలు ఇపుడు కమిషనరేట్ గాల్లో ఉన్నాయి. వీరు కూడా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని కలిసిన సందర్భంలో కమిషనర్ ని సదరు ఫైల్ విషయమై ముఖ్యకార్యదర్శి ప్రశ్నించినా రెగ్యులర్ ఉత్తర్వులు ఇవ్వకుండా 12మంది ఉద్యోగుల విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కమిషనర్ ఉండిపోయారన చెబుతున్నారు. 

అయితే దళితులను చిన్నచూపు చూస్తూ..వారికి రావాల్సిన పదోన్నతులు శాస్వతంగా తొక్కిపెట్టడానికి కమిషనర్ ఈ తరహా చర్యలు చేపడుతున్నారని దళిత వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి న్యాయం చేయాలంటూ సీఎంఓకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో రంగంలోకి దిగిన ముఖ్యకార్యదర్శి ఎంటి క్రిష్ణబాబు వద్ద రెండు వ్యవహారాలు హాట్ హాట్ గా నలుగుతున్నాయి. చూడాలి కమిషనర్ చర్యలను ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సమర్ధిస్తారా..? లేదంటే దళత వైద్యులకు న్యాయం చేయడానికి సర్వీసు నిబంధనల ప్రకారం అనుసరిస్తారా..? అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్నిక కోడ్ కూసిన వేళ ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు..!

Amaravathi

2024-03-17 12:32:33

2024 ఎన్నికల్లో నాన్ లోకల్ అభ్యర్ధి అయితే నోటాకే వేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలు, వచ్చే ఫలితాలు రాజకీయ పార్టీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా కనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ చేయించిన సర్వే అయినా లోకల్‌ అభ్యర్ధి కాకపోతే.. ఆ ఓటు నోటాకి వేస్తామనే వాదనను ఓటర్లు బలంగా తెరమీదకి తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా అధికార వైఎ స్సార్సీపి నుంచి ప్రతిపక్ష టిడిపి వరకూ చాలాస్థానాల్లో నాన్‌ లోకల్‌ అభ్యర్ధులనే తెరమీదకు తీసుకు రావడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈఎన్‌ఎస్‌ నేషనల్‌ నేషనల్‌ న్యూస్‌ ఏజెన్సీ, ఈరోజు సంయుక్తంగా నిర్వహించిన గ్రౌండ్‌ లెవల్‌ సర్వేలోనూ ఇదే విషయం బయటకు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ లోని 26 జిల్లాల్లో  నిర్వహించిన సర్వేలో సంచలన వాస్తవాలు బయటకి వచ్చాయి. ము ఖ్యంగా తమ ప్రాంతాలు అభివ్రుద్ధి చెందాలంటే స్థానిక నాయకులు ద్వారా మాత్రమే అది సాధ్య పడుతుందనే విషయాన్ని 70శాతం మంది ఓటర్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాజకీయం అంతా నాన్‌ లోకల్‌ అయిపోయిందని, దాని వలన స్థానిక నాయకత్వం పరిస్థితి ఆగం అవుతుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలా వరకూ అంతా నాన్‌ లోకల్‌ వాల్లే వచ్చి జిల్లాల్లో వారి వ్యాపారాలు చేసు కుంటున్నారని.. ఎక్కడా అభివ్రుద్ధి అనేది కనిపిం చడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో నాన్‌ లోకల్‌ అభ్యర్ధికి వేసే ఓటు నోటాకి వేస్తే కనీసం ఓటు హక్కు వినియోగిం చుకున్నా మనే సంత్రుప్తి అయినా మిగులుతుందనే మాట వాడు తున్నారంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు.

దానిక ితోడు నాన్‌ లోకల్‌ నాయక త్వాన్ని రాజకీ యపార్టీ లు అభ్యర్ధులు పెట్టే ఆర్ధిక మొత్తాలను చూసి ప్రోత్సహిస్తున్న తీరుపై విద్యావం తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎంతకాలం నాన్‌ లోకల్‌ అభ్యర్ధుల నాయత్వంలో స్థానిక నాయకత్వం పనిచేయాలని పెదవి విరుస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన రాజకీయ నాయకులకి స్థానిక సమస్యలు, అభివ్రుద్ధి ఏం తలకెక్కుతుందని..మరే విధంగా ద్రుష్టి సారిస్తారో చెప్పాలంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంద్రా, ఉబయ గోదావరి జిల్లాల్లో అయితే నాన్‌ లోకల్‌ పాలిటిక్స్‌ని ఈసారి తిప్పి కొడతామని బల్లగుద్ది మరి చెబుతుండటం విశేషం. ప్రస్తుతం రాష్ట్రమంతా రాజకీయ వ్యాపారం జరుగు తుందని..ఆదిలోనే దానిని తిప్పికొట్టకపోతే దాని ప్రభావం అన్ని జిల్లాల కు పాకి స్థానిక నాయకత్వం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా రావొచ్చునని..ఇప్పటికే నాన్‌ లోకల్‌ డామినేషన్‌ అన్ని రంగాల్లో పెరగిపోతున్నందున ఓటర్లు మేలుకోకపోతే నాన్‌ లోకల్‌ లీడర్లు చేసే రాజకీయ వ్యాపారంలో ఓటర్లు వస్తువులైపోతారనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. లోకల్‌ ఫీలింగ్‌ తెలియడం కోసం సామాజిక మాద్యమాలు, ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకునే సమయంలో లోకల్‌ నాయకులు ముద్దు..నాన్‌ లోకల్‌ నాయకత్వం వద్దు అనే స్లోగన్‌ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న విషయం కూడా బయటకు వచ్చింది.ప్రజల నాడి సర్వేల ద్వారా రాజకీయపార్టీలకు చేరకపోతే తమ ప్రాంతాల ఉనికి కూడా ప్రశ్నార్ధకం అయిపోతుందని..దానిని తిప్పికొట్టడం కోసమే లోకల్‌ పాలిటిక్స్‌కి మాత్రమే మద్దతు చెబుతున్నామని, తమకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని 65శాతం మంది చెప్పారు. 23 అంశాల్లో చేసిన సర్వేలో ప్రజలు బలంగా తమ వాణిని బెరుకు లేకుండా వినిపిచారు. ఈఎన్‌ఎస్‌`ఈరోజు నిర్వహించిన 23 అంశాలను, ప్రజాభిప్రాయాన్ని వచ్చే కథనంలో తెలియజేయనున్నాం.

Visakhapatnam

2024-03-03 03:34:01

ఈఎన్ఎస్ కథనాలపై స్పందిచిన ప్రభుత్వం.. పీఆర్సీ అరియర్స్ విడుదల..!

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ పడ్డాయి.. ఏంటి నమ్మసక్యంగా లేదా కావాలనుకుంటే సచివాలయ ఉద్యోగులనే అడగండి. ఈఎ న్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా  సచివాలయ ఉద్యోగుల పీఆర్సీ ఇబ్బం దులపై ప్రచురించిన కథనాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పందించింది. సర్వీసు రెగ్యులర్ అయి, ఇంక్రిమెంటు తీసుకున్న రెగ్యులర్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు పీఆర్సీ అరియర్స్ మొత్తాలను సిబ్బంది బ్యాంకు ఖాతాలకు జమచేస్తోంది ప్రభుత్వం. వాస్తవానికి 75 ప్రభుత్వశాఖల ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే సచివాలయ ఉద్యోగులకు కూడా వెంటనే పీఆర్సీ అరియర్స్ మంజూరు చేయాల్సి వుంది. కానీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. నాటి నుంచి నేటి వరకూ వివిధ రూపాల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యలను, ఆర్ధిక ఇబ్బందులను వివిధ వార్తా కథనాల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో స్పందించిన ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్ మొత్తాలను జమచేస్తున్నది. ప్రభుత్వం ఇపుడు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ ను జమచేయకపోతే..వచ్చే పీఆర్సీ ప్రయోజనాలు సచివాలయ ఉద్యోగులు పొందే వీలుండదు. ఆ సాంకేతిక కారణాన్ని ఉటంకిస్తూ వార్తా కథనాలను అందించింది  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. దీనతో ఉద్యోగులకు విడతల వారీగా బకాయిలను ప్రభుత్వం జమచేస్తున్నది.

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం పెంచిన సేవలు, ఉద్యోగుల ఆనందం తోపాటు ఇబ్బం దులను కూడా ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే ప్రత్యేకంగా ప్రత్యేక కథనాల ద్వారా ప్రస్తావిస్తూ వస్తోంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 1.34లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారాన్ని కూడా ఎప్పటి కప్పుడు అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తమ సమస్య పరిష్కారం అయి పీఆర్సీ అరియర్స్ బ్యాంకు ఖాతాలకు జమకావడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారి ఆనందాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేసి మరీ పంచుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఆంధ్రప్రదేశ్ లో2019లో ఏర్పాటైన దగ్గర నుంచి ప్రతీ తాజా సమాచారాన్ని ప్రముఖంగా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రమే అందిస్తూ వస్తున్నది.  ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ మంజూరు కాకపోతే వచ్చే పీఆర్సీలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనితో స్పందించిన ప్రభుత్వం ఆఖరి క్యాబినెట్ సమావేశం పూర్తయి ప్రభుత్వం టైమ్ పూర్తయ్యేలోపు ఉద్యోగులందరికీ పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని నిర్ణయించుకొని వడి వడిగా ఆ మొత్తాలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమం చేపట్టింది.

ఇదే సమయంలో ఉద్యోగులకు సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తే వచ్చే పీఆర్సీలో తమకు ప్రయోజనం చక్కగా కనిపిస్తుందని ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయాన్ని తమ ఆనందం పంచుకోవడానికి ఫోన్లు చేసే సమయంలోనూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ముఖ్య ప్రతినిధి దృష్టికి తీసుకు వస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని పలుమార్లు ప్రత్యేక కథనాల్లో రాశామని, మళ్లీ ఈ విషయాన్ని మరో కథనం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని సచివాలయ ఉద్యోగుల ఫోన్ కాల్స్ కి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ముఖ్య ప్రతినిధి సమాధానం ఇస్తున్నారు. అందులోనూ సచివాలయ ఉద్యోగులు, అసోసియేషన్లు తమ డిమాండ్ లను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి కాకుండా ప్రత్యర్థి పార్టీల దృష్టికి తీసుకెళుతున్న విషయాన్ని కూడా బహిర్గతం చేయడంతో ప్రభుత్వం కూడా ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు అందించాలని చక చకా ఫైళ్లను ముందుకి కదుపుతున్నది. ఆఖరి క్యాబినెట్ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చట్టబద్దత, మిగిలిపోయిన శాఖలకు సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్ విషయం కూడా క్లియర్ చేయాలనే యోచనతో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదే జరిగితే 74 ప్రభుత్వశాఖల మాదిరిగా 75వ ప్రభుత్వశాఖగా జతైన గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు కూడా అన్ని ప్రయోజనాలు రావడానికి మార్గం సుగమం అవుతుంది. 

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రచురించిన కథనాలపై గతంలో ఎన్నో విషయాలపై స్పందించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి స్పందించి ఉద్యోగులకు మేలు చేయడం అభినందనీయం. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కథనం అంటే అక్షర సత్యమని, అందులో ఎలాంటి స్వప్రయోజనమూ ఉండదని..మంచి చేసే ప్రభుత్వ సేవలను కీర్తిస్తూ..అదే సమయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడితే ఆ వాస్తవాలను బయట పెట్టడంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎల్లప్పుడూ ముందే వుంటుందని మరోసారి తెలియజేస్తున్నాం. ఏపీలో ప్రభుత్వశాఖల్లోని సమస్యలే కాకండా ప్రభుత్వం అందించే ప్రయోజనాల విషయంలోనూ ప్రత్యేక కథనాలు త్వరలోనే ప్రారంభిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అదే సమయంలో కొందరు రాజకీయనేతలు, తేడాగాళ్లు చేసే బెదిరింపులకు, ఫోన్ కాల్స్ కి కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎక్కడా భయపడదని కూడా హెచ్చరిస్తున్నాం. వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక కథనం ద్వారా తీసుకెళ్లడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే మంచి కోణాన్ని మాత్రమే చూడాలని..అంతే తప్పా ఏ మీడియాకి అందని సమాచారం ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి మాత్రమే ప్రత్యేకంగా వస్తుందని, దానిపై ప్రభుత్వం స్పందిస్తుందని.. ఒక్కోసారి జీఓలు కూడా విడుల చేసేస్తున్నదని ఏడ్చే వారి వలన ఉద్యోగులకు,  కడుపుమంటతో ఉండే మీడియాలకు, వాటి ప్రతినిధులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ప్రజల నాడి మాత్రమే ప్రభుత్వం దృష్టికి వార్తల రూపంలో తీసుకెళతాం తప్పా మరేఇతర స్వప్రయోజనం ఉండదని సవినయంగా తెలియజేస్తున్నాం..!





Amaravati

2024-02-23 13:21:53

ప్రభుత్వంతో చర్చలకి సచివాలయ ఉద్యోగ సంఘానికి దక్కని చోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిర్వహిస్తున్న ప్రత్యేక చర్చలకు గ్రామ, వార్డు సచివాలయశాఖ సంఘానికి చోటు దక్కలేదు. ప్రభుత్వం జిఏడి నుంచి ఉద్యోగ సంఘాలకు చర్చలకు రావాలని సుమారు 13 సంఘాలకు పిలుపునివ్వగా, సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక శాఖ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగు ల సంఘం పేరు అందులో లేదు. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. ఏపీలోని 75 ప్రభుత్వశాఖల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేకంగా వుంటుందని, సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ముందుచూపుతో ఏర్పాటైన ఈ శాఖకు అన్ని విధాలా గుర్తింపు వుంటుందని అంతా భావించారు. ఆది నుంచి ఈశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రాతినిత్యం పూర్తిస్థాయిలో లేకపోవడం విశేషం. పైగా అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులతోపాటు సమానంగా ప్రయోజ నాలు రాకపోయినా, ప్రశ్నించడానికి ముందుకి వెళ్లలేని పలు యూనియన్ల నాయకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తూనే ఉంటారు. కాగా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుగుతున్న వేళ  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘానికి వర్తమానం లేకపోయిన విషయం హాట్ టాపిక్ అవుతోంది.

Amaravati

2024-02-22 12:45:07

పది, ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు ..మంత్రి బొత్స

ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ త‌దిత‌ర‌ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేసి, ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఆదేశించారు. తాడేపల్లిలోని విద్యా శాఖ కార్యాలయం నుంచి ఇంటర్మీడియట్, 10వ తరగతి, డీఎస్సి, టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ లతో, స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ సౌరబ్ గౌర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సమీక్షా స‌మావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి బొత్స మాట్లాడుతూ రానున్న‌ది ప‌రీక్ష‌ల కాల‌మ‌ని, అధికారులంతా అప్ర‌మ‌త్తంగా విధుల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.  మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు, మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించే పదవ తరగతి పరీక్షల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఈ నెల 27 నుంచి టెట్‌, మార్చి 15 నుంచి డిఎస్‌సి జ‌రుగుతాయ‌ని చెప్పారు. విద్యార్ధుల భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఈ ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. మ‌రోవైపు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కాబోతుంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాల‌న్నారు. 

ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డంతోపాటు, స్పాట్ వేల్యూయేష‌న్‌కు కూడా క‌లెక్ట‌ర్లు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. ముఖ్యంగా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌ యంతో వ్య‌వ‌హ‌రిస్తూ, నిరంత‌రం ఈ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి కోరారు. వివిధ శాఖ‌ల రాష్ట్ర ఉన్న‌తాధికారులు మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పరీక్షలను తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు 100 మీటర్లలోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఒక నర్సును ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

పరీక్ష కేంద్రాలను సెల్ ఫోన్ ఫ్రీ జోన్ గా ప్రకటించడం జరిగిందని,  సిబ్బంది కూడా సెల్ ఫోన్ లను ఉపయోగించరాదని స్ప‌ష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు అమ్మాయిలను మహిళా పోలీసులు తనిఖీ చేయాలన్నారు. విద్యార్ధులు ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకొనే విధంగా బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని, హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత ప్ర‌యాణానికి అనుమ‌తించాల‌ని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ల‌ను, ఇత‌ర‌ అధికారులను ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్స్లో  జిల్లా నుంచి  కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి, డిఇఓ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌,  డివిఇఓ భీమ‌శంక‌ర్‌, ఆర్ఐఓ మ‌జ్జి ఆదినారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2024-02-22 11:03:03

టీటీడీ ట్రస్టులకు రూ.43 లక్షల విరాళం

 బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీలోని  పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు.  తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం డీడీలను టీటీడీ ఈవో  ఏవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 33 లక్షలా 33 వేల రూపాయలు, ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షలా 11 వేల రూపాయలు  అందించారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2024-02-20 12:20:34

జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలు

 హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ను మంగ‌ళ‌వారం టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆవిష్క‌రించారు. తిరుప‌ తిలోని ప‌ద్మావ‌తి పురంలో గ‌ల ఛైర్మ‌న్ నివాసంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.  ఈ ఆల‌యంలో మార్చి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నా యి. మార్చి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సే వ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 17న సాయంత్రం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.   ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో ఎం.ర‌మేష్‌బాబు పాల్గొన్నా రు.

Tirupati

2024-02-20 11:58:33