1 ENS Live Breaking News

సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లాల బదిలీలెప్పుడో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహిస్తున్న బదిలీల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తొలుత జిల్లా పరిధిలో బదిలీలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం అంతర్ జిల్లాల ఉద్యోగులకు, పరస్పర బదిలీలకు సంబంధించిన సమాచారం ఇంకా ఇవ్వలేదు. ఇటీవలే ఉమ్మడి 13 జిల్లా్లో జరిగిన బదిలీల ఉద్యోగులకు కౌన్సిలింగ్ తరువాత ఆర్డర్లు ఇచ్చారు. వారంతా ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ అవుతున్నారు. వాస్తవానికి జిల్లాల ప్రక్రియ పూర్త యిం ది కనుక అంతర్ జిల్లాల బదిలీలు కూడా చేపడితే ఈ అభ్యర్ధన బదిలీల విషయం పూర్తయిపోతుంది. కానీ అలా చేయకుండా జిల్లా పరిధిలోన బదిలీలను మాత్రమే ప్రభు త్వం పూర్తిచేసింది. తొలుత జూన్ 19న అంతర్ జిల్లా బదిలీలు జరుగుతాయని అధికార వర్గాలు ప్రకటించాయి. కానీ అది జరగకపోవడంతో దరఖాస్తు చేసుకు న్నవా రంతా ప్రభుత్వం ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. మిలిన వారికి కూడా బదిలీల ప్రక్రియ చేపడితే మొత్తం బదిలీల ప్రక్రియ శేషం లేకుండా ఉంటుంది. 

Tadepalli

2023-06-19 03:53:31

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్య ఒక్కటైనా తీర్చారా..?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక..ప్రజలకు తక్కువ సమయంలో అత్యధిక సేవల ద్వారా చేరువైన ఏకైక ప్రభుత్వశాఖ గ్రామ, వార్డు సచివాలయశాఖ. భారతదేశంలోనే ఏపీలో ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు ఎలాంటి సమస్యలూ ఉండవనుకున్నారు దీనిని ఏర్పాటుచేసినపుడు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా. అయితే వీరి సమస్యలు తప్పా..అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, అధికారుల సమస్యలు ఈ ప్రభుత్వంలో తీరుతున్నాయి తప్పితే ఈశాఖ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా తీరడం లేదు. కానీ ఈశాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం మీడియా ప్రచారాలతో మేమున్నాం మీకోసం, సమస్యలన్నీ తీర్చేస్తాం, 50 సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి పరిష్కరించామంటూ తెగ ఊదరగొడుతున్నారు. వాస్తవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఈ ఒక్కశాఖతో సుమారు 19 ప్రభుత్వశాఖలు ముడిపడి ఉండటంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య వారికే సరైన సమన్వయం లేక ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వశాఖల్లోని అతిపెద్ద రెండవ శాఖ ఉద్యోగులుగా ఉన్నవీరికి అసలు వీరి ఉద్యోగం ఏమిటి..? వీరికి ఏ సర్వీసు రూల్సు అమలు/వర్తింపజేచేస్తారు..? వీరి ఉద్యోగం నాల్గవ తరగతా..? ఐదవ తరగతా..? 6వ తరగతా..? అసలు వీరిది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమేనా..? అదే అయితే వీరికి ఎందుకు ఇతర ప్రభుత్వశాఖల మాదిరి ప్రయోజనాలు, గుర్తింపు లేకుండా పోయింది అనేది ఈశాఖ ఉద్యోగ సంఘాల నాయకులకే సరైన క్లారిటీ లేదనేది తేటతెల్లం అవుతుందంటున్నారు విశ్లేషకులు. వాటికి కారణాలను క్రమ సంఖ్యవారీగా ఒక్కసారి పరిశీలిస్తే..!

1)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ శాఖకు నేటివరకూ చట్టబద్దత తీసుకురాలేదు. మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసినా దానిని అసెంబ్లీలో ఆమోదింప చేయలేదు. 2)ఇదే శాఖలో ఉన్న కొన్నిశాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. 3)వీరికి ఏ కేటగిరీ ఉద్యోగాల క్రింద సర్వీసు రూల్సు వర్తింపచేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఏపీ సబార్డినేట్ సర్వీసురూల్స్ ని సచివాలయ ఉద్యోగులకు అమలు చేస్తామని ప్రకటించినా ఈ శాఖలోని ఉద్యోగులు గ్రేడ్-6, గ్రేడ్-5 కేటగిరీ ఉద్యోగాలున్నాయి..4)చట్టబద్దత లేని ప్రభుత్వశాఖ క్రిందిస్థాయి ఉద్యోగులకు ఏ విధంగా పిఆర్సీ అమలు చేస్తారో నేటికీ క్లారిటీ ఇవ్వలేదు. గతంలో పీఆర్సీ ఇచ్చినట్టు చెప్పిన ప్రభుత్వం వీరికి ఐఆర్ వర్తింపచేయలేదు. ఇపుడూ అదే పరిస్థి ఉంటుందా..అనేది అనుమానమే. 5) సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారికి అదనంగా 9నెలలు తరువాత ఉద్యోగాలను రెగ్యులర్ చేశారు. ఆ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను వీరి పేస్కేలుకి కలపలేదు..అపుడే వీరు అదనపు కాలానికి పేస్కేలు కోల్పోయారు, అదే సమయంలో డిఏలను కూడా కోల్పోయారు. 6)ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి డిఏ వర్తిస్తుందా..లేదా అనేది ఇంకా డైలమాలోనే ఉన్నది. డిఏ వర్తిస్తే ఎప్పటి నుంచి లెక్కగట్టి ఇస్తారు..? ఇప్పటికే ఆలస్యంగా సర్వీసులు రెగ్యులర్ చేయడం వలన ఒకటిన్న డిఏ ఉద్యోగులు కోల్పోయారు. ఆ తరువాత నుంచి వీరి సర్వీసును ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా డిఏ వర్తిపంచేస్తారు..? లేదా అనేది అనుమానమే..7)మిగిలిన ప్రభుత్వశాఖల మాదిరిగా వీరికి ఏ తరహా డిపార్ట్ మెంటల్ టెస్టులు వర్తిస్తాయి.. ఉద్యోగులు ఏఏ పరీక్షలు రాయాలనే దానిపైనా స్పష్టత లేదు. అలా లేకపోతే వీరికి పదోన్నతులు రావు..ఎన్నేళ్లైనా పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగా ఉద్యోగులందరూ ఇదే సచివాలయాలకు పరిమితం అయి ఉండిపోతారు. 8)ఉద్యోగుల డిఏలు, పీఆర్సీలు, పెరిగిన పేస్కేలు అమలు సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలా..? ఇస్తే వీరికి డిఏలను కలపి రాయాలా..లేదంటే కలపకుండా రాయాలా అనేదానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.. 9)ప్రభుత్వం ఈశాఖ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డిఏలు వర్తిస్తాయని ఇచ్చిన జీఓల్లో ఎక్కడా గ్రామ,వార్డు సచివాలయశాఖ నుపేర్కొనలేదు. వీరికి అసలు డిఏలు వస్తాయా..రావా..? 10) అన్ని ప్రభుత్వశాఖలకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చినట్టుగా గ్రామ, వార్డు సచివాలయశాఖ యూనియన్ కు ప్రభుత్వ గుర్తింపు ఉందా..అలా ఉంటే జాల్లా యూనిట్ ఆఫీస్ బ్యారర్ లకు ఇతర ఉద్యోగ సంఘాల మాదిరిగా ప్రయోజనాలు సమకూరుతాయా లేదా అనేది కూడా తేలలేదు. ఇలాంటి సమస్యలు ఈశాఖ ఉద్యోగులకు చాలానే ఉన్నాయి. వాటిపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావన తేకుండా ప్రతీసారి ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్పితే వీరి సమస్యల పరిష్కారానికి మార్గం చూపించడం లేదు. 

ఇప్పటికీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు తమ ఉద్యోగాలు అసలు రెగ్యులర్ ఉద్యోగాలేనా..? అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రభుత్వం కాకుండా మరేదైనా ప్రభుత్వం వస్త ఈ ఉద్యోగాలన్నీ తీసేస్తారని..లేదంటే వేరే శాఖలు పంపేస్తారనే ప్రచారం కూడా రాష్ట్రంలో చాలా గట్టిగా జరుగుతుంది. కారణం వీరికి ప్రభుత్వ ఉద్యోగంలోని కేటగిరీలు తెలియకపోవడం, ఏ కేట గిరీకి ఏ సర్వీసు నిబంధనలు, ప్రమోషనల్ ఛానల్, ఇన్ సర్వీసు విధానాలు అమలు అవుతాయో తెలియకపోవడం, వాటి కోసం ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియకపోవడమే. ఈ విషయంలో ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఉద్యోగులను చైతన్యం చేస్తూ వస్తున్నది. ఈ శాఖకు సంబంధించిన ఏ ప్రభత్వ ఉత్తర్వు సారాంశం అయినా క్షణాల్లో ఉద్యోగుల ముందుకి తీసుకు వస్తున్నది.  ఒక్కఈ ప్రభుత్వశాఖ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత వేగంగా ఉద్యోగులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు వారధులు లాంటి వారు. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు రాకపోయినా, వాటిని ప్రభుత్వం అమలు చేయకపోయినా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తారు. అలాంటి ఉద్యమాలు జరగకుండా ఉండాలన్నా, ఉద్యోగుల సేవలు నిరంతరం 
ప్రజలకు చేరాలన్నా ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సిన, కల్పించాల్సిన ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించాలి. లేదంటే ఉద్యోగులంతా వన్ సైడ్ అయిపోతే ప్రభుత్వంలో భారీ మార్పులు రావడం కష్టం. ఆ విషయం గత ఎన్నికలో రుజువైందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. చూడాలి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నాయకు ఎంతమేర పరిష్కరిస్తారనేది..!

Amaravati

2023-06-18 03:49:14

ఏపీప్రభుత్వం దెబ్బతో ట్రెండ్ మార్చిన ప్రైవేటు పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు మీడియం విద్యతో ఏం చేయాలో తోచక కార్పోరేట్ పాఠశాలలు నిలదొక్కుకోవడానికి అష్ట కష్టాలూ పడుతున్నాయి. ప్రభు త్వపాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలల్లో 90శాతం ఇంగ్లీషు మీడియం విద్య పక్కాగా వస్తుందనే విషయాన్ని తల్లిదండ్రుల మనసు మార్చేందుకు ట్రెండ్ ను మారుస్తున్నాయి. ఇపుడు ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజి, యూకేజిలో చేర్పించే సమయంలోనే పిల్లలు ఏవిధంగా చదువులో రాణించగలుగుతున్నారు..వారికి ప్రత్యేకంగా పాఠశాలల్లోనే ట్యూషన్ పెట్టించి ప్రభుత్వపాఠశాలలు ప్రైవేటు విద్యను చేరుకోలేవనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంలో పై చేయి సాధిస్తున్నారు. ఒకప్పుడు సాధారణ డిగ్రీ చదివిన వారిని ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించేవారు. కానీ ఇపుడు ఆయా సబ్జెక్టులను బోధించేందుకు, కనీసం డిఎడ్, బిఈడి, హిందీ పండిట్ ట్రైనింగ్ అయిన వారిని మాత్రమే నియమిస్తున్నారు. అదీ 25 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. ఏస్థాయిలో పిల్లలకు పాఠాలు ఇంగ్లీషులో చెప్పగలుగుతున్నారో చూసి మరీ వారికి ఉద్యోగాలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యమ విద్యాబోధనను తమ ప్రైవేటు పాఠశాలల్లో మెప్పించాలంటే అక్కడ ఉండే ఉపాధ్యాయుల కంటే మెరుగైన మెరికాల్లాంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే యాజమాన్యాలు నియమిస్తున్నాయి.

ఒకప్పుడు సాధారణ ఇంగ్లీషు మాద్యమ విద్య మాత్రమే చెప్పే ఈ కార్పోరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నింటిలో నిర్వహిస్తు్న్నట్టు ప్రత్యేక ఇంగ్లీషు క్లాసులు పెడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పాఠశాలలు, యూనివర్శిటీల విద్యార్ధులు, అధ్యాపకులు, ఇతరులతో ఆన్ లైన్ లో ఇంట్రాక్షన్ లు కూడా పెడుతున్నారు. వాటికి అయ్యే ఖర్చును కూడా స్పెషల్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ క్రింద అదనంగా ఫీజులు తీసుకొని భోధిస్తున్నారు. నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చేలోపుగా పిల్లలకు సాధారణ ఇంగ్లీషు వచ్చేవిధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే ఇంగ్లీషు మాద్యమ విద్య అందుబాటులో ఉండేది. కానీ ఇపుడు ప్రైవేటు పాఠశాలల కంటే అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన విద్య అందుబాటులోకి రావడం, సెంట్రల్ సిలబస్ ను కూడా చెప్పిస్తుండటంతో ప్రైవేటు కార్పోరేట్ స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాలలు పెద్ద పోటీని ఇస్తున్నాయి. దానితో కొత్త కొత్త విధానాలను తెరపైకి తీసుకొచ్చి మాతో పోటీకి రాలేరు అన్నట్టుగా తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గట్టి ప్రచారాలను సైతం చేస్తున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ స్థాయి విద్యఅందుబాటులోకి రావడంతో ఇపుడు చాలా పాఠశాలల్లో అడ్మిషన్లకు ప్రైవేటు పాఠశాలలు మాదిరిగా ముందుగానే సీటు రిజర్వు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయితే కొన్ని పాఠశాలల్లో నేటికీ తెలుగు మీడియం ఉపాధ్యాయులు ఉండటంతో వారు ఆంగ్లబోధన చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాధమిక స్థాయిలోనూ ఇంగ్లీషును అమలుచేస్తే ఇక ప్రైవేటు పాఠశాలలు మూత దిశగా పయనిస్తా యని విద్యార్ధుల తల్లిదండ్రులే ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. అందులోనూ సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఎక్కడ ఏం జరుగుతుందో విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా ఇట్టే తెలిసిపోతున్నది. వాటికి అనుగుణంగా ఏ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆంగ్లమాద్యమ విద్య అందుబాటులోకి వస్తుందో అక్కడికే తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు పరుగులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవనే బోర్డులు దర్శనమివ్వడం కార్పోరేట్ పాఠశాలలకు మింగుడు పడకుండా ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఆంగ్లమాద్యమ విద్య ప్రాధమిక స్థాయి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తే మరో ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలు మరో 50శాతం కనుమరుగు కావడం ఖాయం.

Amaravati

2023-06-17 04:42:09

గోవింధరాజస్వామి రథానికి ఏమీ కాలేదు.. టిటిడి

"తిరుపతి గోవిందరాజస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అయినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఏమీకాకుండా నిక్షేపంగా ఉన్న రథం ఫోటోను కూడా శుక్రవారం మీడియాకి ఫ్యాక్ట్ చెక్ పేరుతో విడుదల చేశారు."తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని..ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియజేశారు. కాగా సోషల్ మీడియాలోనూ, కొన్ని మీడియా సంస్థల్లోనూ వస్తున్నట్టు ఏమీ జరగలేదన్నారు. రథానికి బధ్రత ఉందని తెలియజేసిన టిటిడి తప్పుడు వార్తలు ప్రచారం చేసి భక్తులను ఆందోళనకు గురిచేయొద్దని కోరింది.

Tirupati

2023-06-16 09:15:32

98డిఎస్సీ టీచర్లకి ఉద్యోగాలిచ్చారు..జీతాల మరిచారు..!

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులుకి ఉద్యోగాలిచ్చి పేరు తెచ్చుకుంటే.. పాఠశాల విద్యాశాఖ వారికి జీతాలు ఇవ్వకుండా పస్తులుంచి వచ్చిన పేరుకి గాలి తీసేస్తున్నది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం రాష్ట్రవ్యాప్తం సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకి నేటికీ జీతాలు చేతికి అందలేదు. దానికి సాంకేతిక కారణం కూడా లేకపోలేదు. ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగికైనా హెచ్ఆర్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసి ఆ వివరాలను ట్రజరీలకు పంపాల్సి వుంటుంది. అలా పంపిన తరువాత మాత్రమే ఉద్యోగులకు సమయానికి జీతాలు పడతాయి. ఆ అకౌంట్ లేకపోయినా, తయారు కాకపోయినా మేస్టార్లంతా చక్కగా జీతాలు రాక పస్తులుండాల్సిందే. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనే అదే జరుగుతోంది. నేటికీ ఉద్యోగాలు పొందిన కాంట్రాక్టు 98 డిఎస్సీ ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఎంఎస్ ఐడి లు రాలేదు. ఆ విషయాన్ని అన్ని మండలాల ఎంఈఓలు నానుస్తున్నారు. కొన్నిచోట్ల డబ్బులిస్తేగానీ ఈ అకౌంట్లు క్రియేట్ చేయడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగాలొచ్చినా..జీతాలు రాకపోవడంలో ఉద్యోగాల్లోకి చేరిన ఉపాధ్యాయులంతా అప్పులు చేసుకొని విధులు నిర్వహిస్తూ కుటుంబ పోషణ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు గానీ ఎంఈఓలకు నిర్ధిష్టమైన ఉత్తర్వులు జారీచేయకపోవడంతో ఈ హెచ్ఆర్ఎంఎస్ ప్రక్రియ 
రాష్ట్రవ్యాప్తంగా సా...గుతోంది. దానితో ఉద్యోగాలొచ్చాయని ఆనందపడాలో..వచ్చిన తరువాత జీతాలు రాలేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

మొదటి నెలలో పనిచేసిన 14 రోజులకి జీతాల బిల్లలు పెట్టాంటే కొత్తగా విధుల్లోకి చేరిన వారందరికీ సాలరీ అకౌంట్ల జాబితా ట్రజరీలకు సమర్పించాల్సి వుంటుంది. ఆ పైన సాలరీ బిల్లలు అప్లోడ్ చేస్తే అందరు ఉపాధ్యాయులతోపాటుగా వీరికి కూడా జీతాలొస్తాయి. లేదంటే ఎప్పటికీ జీతాలు వచ్చే పరిస్థితి ఉండదు. అలా చేయాలంటే ముందు హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు తయారు చేయాల్సి వుంటుంది.ఈ విషయంలో ఉపాధ్యాయులు ఎంఈఓలను ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వేసవి సెలవులు అనంతరం విధులకు వెళ్లాలంటే ముందునెలలో చేసిన విధులకు కాస్తయినా జీతాలు పడితే జూన్ నెల కాస్త వెసులుబాటు కలుగుతుందని.. పోయిన నెలా అప్పులు చేసుకొని.. ఇప్పుడు కూడా అప్పులు చేసుకునే విధులకు వెళ్లాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చిత్తూరు, లాంటి జిల్లాల్లో ఇటీవల ఉద్యోగాలకు ఎంపికైన వారందరినీ మారుమూల ఏజెన్సీలోని పాఠశాలల్లోనే నియమించారు. అక్కడ ఉపాధ్యాయులు నివాసం ఉండాలన్నా.. ఇళ్లకు అద్దెలు కట్టుకొని కుటుంబాలను పోషించుకోవాలన్నా కనీసం నెలకు 10 నుంచి 15వేల రూపాయల ఖర్చు..పాఠశాలలకు వెళ్లిరావడానికి నెలకు మరో రూ.5వేలు పెట్రోలుకి ఖర్చు వెరసి రూ.20 వేల వరకూ ఖర్చులు అవుతాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా ఎంఈఓలు ఈ ఉపాధ్యాయుల ఇబ్బందులపై కనికరించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విధుల్లోకి చేరిన ఉపాధ్యాయుల 
హెచ్ఆర్ఎంఎస్ ఐడీలు సత్వరమే ఆన్ లైన్ లో నమోదు చేసి బకాయి జీతాలు ఇప్పించాలని ఉపాధ్యాయులు ముక్తకంఠంతో కోరుతున్నారు..!

Tadepalli

2023-06-15 09:55:32

ఉసూరు మంటూ వెనుతిరిగిన సచివాలయ ఉద్యోగులు..!

గ్రామ, వార్డు సచివాలయశాఖ రాష్ట్ర అధికారుల ముందుచూపు లేమి..అప్పటికప్పుడే తీసుకున్న అత్యవసర నిర్ణయాలు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. అంతర్ జిల్లాల మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్ లు దరఖాస్తు చేసుకున్నవారిని 15 తేదినాటికి పాత ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లకు, జిల్లా ఎస్పీ కార్యాలయాలకు రావాలంటూ జిల్లా కలెక్టర్ల నుంచి సర్క్యులర్ లు 13న జారీ అయ్యాయి. దీనితో 14వ తేదీ సాయంత్రానికే ఉద్యోగులు మ్యూచవల్ ట్రాన్స్ ఫర్లు పెట్టు కున్న జిల్లాలకు వెళ్లిపోయారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్సులో 15వ తేదిన ఒక్క స్థానిక జిల్లాల ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేపట్టాలని.. అంతర్ జిల్లాల బదిలీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టేది త్వరలోనే తెలియజేస్తామరని చెప్పడంతో. జిల్లాలకు చేరుకున్నవారంతా చచ్చినట్టు ఉసూరు మంటూ వెనుతిరగాల్సి వచ్చింది. వాస్తవానికి నాలుగు కేటగిరీల్లో బదిలీలకు ఒకేరోజు చేస్తామని జిల్లా కలెక్టర్లు జారీచేసిన సర్క్యులర్ లలో పేర్కొనడం విశేషం.

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, శ్రీకాకుళం నుంచి రాజమండ్రి, కాకినాడ నుంచి విజయనగరం, కడప నుంచి తిరుపతి, చిత్తూరు నుంచి గుంటూరు, విశాఖపట్నం నుంచి కాకినాడ తదితర జిల్లాలకు మ్యూచవల్ ట్రాన్స్ ఫర్లు పెట్టుకున్నవారంతా మళ్లీ వ్యవయప్రయాలకోర్చి వెనుతిరిగారు. మరికొంత మంది ఉద్యోగులు వెనక్కి వెళ్లలేక మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వచ్చిన జిల్లాల్లోనే ఉండిపోయారు. 15వ తేదిన కేటగిరీల వారీగా సమయం, ప్రదేశం ఇచ్చి సంబంధిత పత్రాలకు రావాలని ఉత్తర్వుల్లో పేర్కొని అప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయం మార్చేస్తే ఎలా అంటూ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయశాఖ విభాగానికి చెందిన డిఎల్ డిఓల ద్రుష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం చెప్పినట్టు తాము చేయాలి తప్పితే ఉద్యోగు పక్షాన తాము ఏమీ చేయలేమంటూ సెలవిచ్చారు.

Tadepalli

2023-06-15 06:03:34

డిఎస్సీ 98కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసు రెవిన్యువల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నియమించిన డిఎస్సీ 98 కాంట్రాక్టు ఉపాధ్యాయుల సర్వీసు మరో 11 నెలలు రెవిన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరికి ఒక నెల నో వర్క్..నోపే విధానం అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రెవెన్యువల్ చేసిన ఉత్తర్వులు జూన్1 నుంచి 2024 ఏప్రిల్ 30 అమలులో ఉంటాయి. కాగా ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో అయితే చేరారు తప్పితే వారికి జీతాలు ఇవ్వడానికి వీలుగా వారి ఐడెంటిటీ, మరియు సేలరీలు మంజూరు చేసేందుకు వారికి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ లు, ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపుకార్డులు తయారు చేయలేదు. వాటి బాధ్యత రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ఎంఈఓలకు ప్రభుత్వం అప్పగించినా నేటి వరకూ ఆపని పూర్తికాలేదు. దానితో విదుల్లోకి చేరిన ఉపాధ్యాయులందరికీ నేటికీ జీతాలు అందలేదు. రాష్ట్రస్థాయిలో కొందరు ఉపాధ్యాయులకు మాత్రం ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడీలను పాఠశాల విద్యాశాఖ అధికారులు క్రియేట్ చేశారు.

Tadepalli

2023-06-14 09:33:15

ఆంధ్రప్రదేశ్ లో చాపక్రింద నీరులా సామాజిక కుల గణన..?!

ఆంధ్రప్రదేశ్ లోచాపక్రింద నీరులా సామాజక కుల గణన జరుగుతుందా.. అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏటెల్లకాలం ఒక్క ఆరెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారంలో చేపడుతున్నా..బలమైన సామాజిక వర్గాలు ఉన్నవారు అధికారం చేపేట్టేవారిని చూస్తూనే ఉండాల్సి వస్తుందే తప్పా.. మరేమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా ప్రపంచాని ఒక్కసారిగా ఒణికించిన తరువాత..ఉన్నంతకాలమైనా అనుభవించి ఆ తరువాత తరం చెప్పుకునేలా ఉండాలనే నిర్ణయానికి చాలా సామాజిక వర్గాలు వచ్చినట్టుగానే కనిపిస్తున్నది. కాస్త కాసులుండి..పలుకుబడి ఉన్నవారంతా ఈసారి 2024 ఎన్నికల్లో సామాజికవర్గాల బలాన్ని..బలగాన్ని బట్టి చట్టసభలకు వెళ్లి ఆయా సామాజిక వర్గం కూడా అధికారం చేపట్టగలదు అనే విషయాన్ని రుజువుచేయాలని చూస్తున్నారట. దానికోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ..నిరుపేద నుంచి అత్యంత సంపన్నుల వరకూ సామాజికవర్గాల్లోని బలాన్ని నమోదు చేస్తే తప్పా మనమేంటో రాజకీయపార్టీలకు తెలియజెప్పే పరిస్థితులు లేవని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. దానికోసం ప్రభుత్వంలో పనిలేకుండా సామాజిక వర్గాలు వారీగా కులగణన చేపడితే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందని..బలం ఆధారంగానే ఆ అధికారం కూడా మనదగ్గరకే రావాలి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారనే విషయం గుప్పుమంటుంది.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ రెండు సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కుతూ వస్తుంది. కానీ ఈసారి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలో కీలకమైన పదవులు దక్కించుకోవాలంటే కులం బలమే వాటిని తీసుకొస్తుంది తప్పితే మరెవరి వలనా జరిగే పనికాదని అంటున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రాలో ఒక సామాజిక వర్గ నేతకు పదవి తీసేయాలని భావిస్తే..పార్టీ అధిష్టానమే కంగారు పడేలా తన సామాజిక వర్గం బలం చూపించి సదరు నేత తన పదవిని తిరిగి తెచ్చుకున్నారని..కాదు కాదు పార్టీయే చచ్చినట్టు పదవి కట్టబెట్టిందనే విషయం మిగిలిన సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపింది. అయితే అత్యధిక కాలం రెండు మూడు సామాజిక వర్గాలు తప్పితే మరే ఇతర సామాజిక వర్గాలకు ప్రభుత్వాల్లోగానీ, రాజకీయపార్టీల్లోగానీ మంచి పదవులు దక్కడండ లేదనే విషయాన్ని అన్ని కులసంఘాలు గట్టిగానే ఆలోచిస్తున్నాయి. దానికోసం ఎవరి సామాజిక వర్గం వారీగా వారి బలగం, ఓట్లు, మదుపరులు, వ్యాపారులు, ఉద్యోగులు, ధనికులు, సంపన్నులు, రాజకీయనేతలు, పెట్టుబది దారులు తదితర విభాగాల వారీగా కులగణన చేయడం ప్రారంభించారట.

వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం కూడా ఇంటింటి సర్వే చేపట్టిన సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివిధ ప్రభుత్వ పథకాల పేరుతో గణన చేపట్టింది. ఆ సమయంలో సామాజిక వర్గం వారీగా వివరాలు నమోదు అయ్యాయి. అయితే ఆ సర్వే కేవలం 70శాతం మాత్రమే జరిగిందని తెలుస్తుంది. మిగిలిన 30శాతంలో సంపన్నులు, ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, పెట్టుబడి దారులు, రాష్ట్రం విడిచి పక్కరాష్ట్రాలకు వ్యాపారం నిమిత్తం వెళ్లిన వారు ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా సామాజిక గణన చేపట్టాలని నిర్ణయించింది. కానీ కాగితాలకే పరిమితం అయ్యింది తప్పితే గణన మాత్రం జరగలేదు. ప్రభుత్వం చేపట్టే వరకూ వేచి ఉండాలా అనుకున్న వారు..వారి వారి పరిధిలో సామాజిక గణన మొదలు పెట్టారు. కొందరు వెబ్ సైట్ల ద్వారా, మరికొందరు యాప్ ల ద్వారా, ఇంకొందరు ఉద్యోగ సంఘాల ద్వారా, మిగిలిన వారు వ్యాపారా వేత్తలు, రాజకీయపార్టీల వారీగా లెక్కలు గట్టారు. అయితే ఇపుడు ఆ వర్గాలన్నింటిని ఏకతాటిపైకి తేవడానికి ఆయా రాజకీయపార్టీల్లో కీలకంగా వున్నవారు ప్రయత్నిస్తున్నారని సమాచారం దానికోం ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి.. మన సామాజిక వర్గంలో 
ఉన్నవారందరూ సంఘంలో సభ్యులుగా ఉండాలని పక్క సామాజిక వర్గం పలానా విధంగా నమోదు చేస్తుందని..మనమేమి తక్కువ అన్నట్టుగా వ్యవరిస్తూ..గల్లీ నుంచి డిల్లీ వరకూ వున్న వారందరితోనూ తమ వారి లెక్కలను కాగితాలపైకి ఎక్కిస్తున్నారట.

ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వారి దగ్గర నుంచి విద్యావంతులు ఉండటంతో అందరూ ఒకతాటిపైకి వచ్చి సామాజిక బలం ప్రదర్శించడానికి చక్కని వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు కూడా వీరిని సంప్రదించిన తరువాత మాత్రమే వారి వారి సామాజిక వర్గాల్లో ఉన్న జనాభాను ద్రుష్టిలో పెట్టుకొని పదవులను కట్టబెడుతున్నాయి. ఒకే సామాజిక వర్గంలోని వర్గాలు ఉండటంతో అన్ని వర్గాలు ఇపుడు ఒకే వేదికపైకి రావడానికి ప్రత్యేక కార్యాచరణ జరుగుతోంది. అదేజరిగితే బలం, బలగం సత్తా ఏంటో కూడా రాజకీయపార్టీలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇకపై సామాజికవర్గం వారీగా రాజకీయపార్టీలు, మీడియా, వ్యాపారాలు, వ్యవహారాలు కూడా చేపట్టాలనే నిర్ణయానికి కూడా వస్తున్నారు. మీడియాలోనూ రెండు మూడు సామాజిక వర్గాలకే పెద్ద సంస్థలు ఉండటం..వారి సహకారంతోనే ప్రభుత్వాలు రాజకీయపార్టీల నిర్వహణ జరగడంతో..మీడియా సపోర్టు కూడా సామాజికవర్గాల్లో ఉంటే బావుంటుందని నిర్ణయానికి వచ్చిన వారి బలంతోనే ఏర్పాటుకి పునాధులు వేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలనుకుంటున్న  కులగణన ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలు పూర్తిచేశాయని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న డేటా..సంఘాల వద్ద ఉన్న డేటాతో ఎవరి బలం ఏంటో ఈసారి 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా తేలిపోయే అవకాశాలున్నాయి..!!

Amaravati

2023-06-14 06:34:07

జనసేన యాత్రకు సత్యదేవుని సెంటిమెంట్ బలమే..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. దానికి న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) కూడా బలంగానే తోడైంది. ఈ విషయాన్ని ఇటీవలే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ అధికారిక న్యూస్ యాప్ Ens Live లో తెలియజేసింది. 5వ సంఖ్య వచ్చే రోజు కార్యక్రమాలు చేపడితే ఆ కార్యక్రమాలకు ఎలాంటి అడ్డంకులూ రావు. అదే వారాహి యాత్రలో కూడా నిజమైంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవాంతరాలు ఎదు రైతే రెండు రోజులు ముందుగానే యాత్ర చేస్తారని ప్రచారం జరిగింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపికచేసిన తేదీ యాత్రకు ఎంతో బలం చేకూర్చిందని చెబు తున్నారు. వారాహి యాత్రకు లైన్ క్లియర్ కావడంతో జనసైనికుల్లో ఉత్సాహం పెల్లుభుకుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ ఆనందం వ్యక్తం చేస్తూ రేపటి యాత్రకు అంతా సన్న ద్ధమవుతున్నారు. వారాహి వాహనం 13వ తేది సాయంత్రానికే అన్నవరం చేరుకోనుంది. తొలిపావంచ నుంచే యాత్ర ప్రారంభం కానుంది..!

annavaram

2023-06-13 10:09:24

ఆంధ్రప్రదేశ్ లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లకు బీజం పడేనా?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాస్తామని చెప్పిన ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్లకు 2024 ఎన్నికల ముందైనా బీజం పడే అవకాశాలున్నాయా..? అంటే అవి కనుచూపు మేరలో కనిపించడంలేదనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం తరహాలో 75 ప్రభుత్వశాఖలన్నింటికీ కలిపి ఒకేచోట ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మిస్తామని జిల్లాల పునర్విభజన చేసే సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొత్తజిల్లాలు, పాత ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలా గుర్తింపు కూడా చేపట్టారు. ఏమైందో ఏమో తెలీదుగానీ ఆ నూతన విధాన కలెక్టరేట్ల వ్యవహారం అటకెక్కినట్టు కనిపిస్తున్నది. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో కలెక్టరేట్లు ఉండగా.. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మాత్రం అద్దె భవనాల్లోనే కలెక్టరేట్లు నిర్వహణ జరుగుతోంది. కొన్ని జిల్లా కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అంతెందుకు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల నివాసాలు, క్యాంపు కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్తజిల్లాల్లోని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి ఇలా అఖిలభారతస్థాయి అధికారులంతా అద్దెఇళ్లల్లో నివాసం ఉండాల్సి వస్తున్నది.

ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించే సమయంలోనే కలెక్టర్, జెసి, ఎస్పీలకు కూడా నివాస సముదాయాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని తలపెట్టింది. అయితే ఆ ప్రక్రియకు నేటి వరకూ బీజం పడలేదు. పడుతుందనే గ్యారెంటీ కూడా కనిపించడం లేదు. కలెక్టరేట్లతోపాటు, జిల్లా అధికారుల నివాస సముదాయాల నిర్మాణం చేపడితే కొత్త జిల్లాలకు వచ్చే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన సమయంలోనే ఆలోచన చేపట్టింది. హడావిడిగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అధికారుల నివాసాల నిర్మాణాలకు అనువైన ప్రభుత్వస్థలాలను కూడా గుర్తించారు. అదంతా అప్పట్లో కాగితాలకే పరిమితం అయిపోయింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కొత్తజిల్లాల్లో అక్కడి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మిస్తోంది. జిల్లా కలెక్టర్, జెసి, ఎస్పీ, ఫారెస్టు అధికారి మొదలుకొని అన్నిశాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు కూడా ఒకేచోట నిర్మాణం చేయడం ద్వారా ప్రజలకు కూడా సౌకర్యంగా వుంటుందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఎంతో గొప్పగాచేసిన ఆలోచనను మాత్రం కార్యాచరణలో ఒక్క అడుగు కూడా ముందుకి కదపలేకపోయింది. దీనితో కొత్త జిల్లాల్లో జల్లా అధికారులు, వారి కార్యాయాలు అద్దె కొంపల్లోన నడవాల్సి వస్తున్నది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఏవిధంగా అందుతున్నాయో జిల్లా కేంద్రంలో కూడా అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఒకేచోట ఉంటే నిర్వహణ వ్యయ భారం భారీగా తగ్గుతుందని..దానికంటే ముఖ్యంగా వినూత్నంగా వుంటుందని కూడా ప్రభుత్వం యోచన చేసింది. కొత్తజిల్లాల్లో పరిపాలన ఏడాది దాటిపోయి రెండవ ఏడాదికి దగ్గరపడుతున్నా..ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణ ఆలోచనకు పునాదులు కూడా పడలేదు. దీనిపై జిల్లాల మంత్రులు కూడా పెద్దగా ద్రుష్టిసారించకపోవడం విశేషం. ఎంతసేపూ గ్రామాల్లో సచివాలయాలు, లైబ్రెరీలు, పిహెచ్సీల నిర్మాణాలు జరిగాయా లేదా అనే విషయాలను చూస్తున్నారు తప్పితే కొత్తజిల్లాలు ఏర్పడిన చోట ఉన్న మంత్రుల్లో ఒక్కరైనా తమ జిల్లాలో తొలుత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించి ప్రారంభించుకోవాలనే ఆలోచన చేయడం లేదు. ఉన్న సమయం పరిపాలనకు..లేదంటే ప్రతిపక్షాలపై ఎదురు దాడికే సమయం సరిపోతుందన్నట్టుగా ప్రజాప్రతినిధులు కూడా వ్యవహరిస్తున్నారు. అదిగో ఇదిగో అంటే ఇంకా 8నెలలు మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. అందులో మూడు నెలలు గడిచిపోతే..మిగిలిన సమయం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తే ఒక్క ప్రభుత్వ పనికూడా ముందుకి సాగే పరిస్థితి లేదు..సో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు విషయం ఈ ప్రభుత్వంలో అయితే మరిచిపోవచ్చు, లేదా శేషం మిగిలిపోయేలా ఆఖరు నిమిషంలో అంటే ఎన్నికలకు ముందు ఒకటి రెండైనా నిర్మాణాలు ప్రారంభించవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందనే వేచి చూడాల్సిందే..!

Amaravati

2023-06-13 04:47:56

సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఎస్ఓపి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఎస్ఓపిని విడుదల చేసింది. ఈమేరకు ఆశాఖ డైరెక్టర్ ఆర్సీ నెంబరు‌-238 విడుదల చేశారు. ఐదు రకాల బదిలీల కోసం కావాల్సిన పత్రాలను తెలియజేస్తూ లేఖలో ఉటంకించారు. 1)మ్యూచువల్ కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసుకునేవారు నో డ్యూస్ సర్టిఫికేట్స్, 2)స్పౌజ్ కోటా క్రింద దరఖాస్తు చేసుకున్నావారు వివాహ రిజిస్ట్రేషన్ పత్రం, స్పౌజ్ సర్టిఫికేట్,ఎంప్లాయి ఆథరైజేషన్, ఎంప్లాయి ఐడి, స్పౌజ్ ఆధార్, 3)సింగిల్ ఉమెన్ లేదా విడో, డైవర్సీ కి సంబంధించిన సర్టిఫికేట్, 4)మెడికల్ గ్రౌండ్స్ క్రింద దరఖాస్తు చేసుకున్నవారు రాష్ట్ర, లేదా జిల్లా మెడికల్ బోర్డు ద్రువీకరించిన మెడికల్ సర్టిఫికేట్, 5)వికలాంగుల కోటా క్రింద దరఖాస్తు చేసుకున్నవారు బోర్డు ద్రువీకరించిన సర్టిఫికేట్ సమర్పించాల్సి వుంటుంది. అదే సమయంలో ఎవరైనా నకిలీ ద్రువీకరణలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. 

అభ్యర్ధులకు ముందుగా కేటాయించిన ప్రదేశాలను ఆన్ లైన్ లో 14న ఆయా జిల్లా కలెక్టర్లు తెలియజేస్తారు. అభ్యర్ధులు నేరుగా కౌన్సిలింగ్ 15న సంబంధిత ద్రువీకరణ పత్రాలతో హాజరు కావాల్సి వుంటుంది. ఈ మేరరకు లైన్ డిపార్ట్ మెంట్స్(ప్రభుత్వ శాఖలు) జిల్లా అధికారులు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాల్సి వుంటుంది. మొదటి ప్రాధాన్యత మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్( జిల్లా, అంతర్ జిల్లాలు) కి ఇచ్చిన తరువాత, వికలాంగులు, మందబుద్ది కలిగిన తల్లిండ్రులకి, ఆ తరువాత మెడికల్ గ్రౌండ్స్, సింగిల్ ఉమెన్, విడో, తరువాత స్పౌజ్ లోకల్ జిల్లా, స్పౌజ్ అంతర్ జిల్లాలకు, ఆపై  ఇతరులకు కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Amaravati

2023-06-12 16:28:57

ఎస్ఐ, కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుకూడా ఎన్నికలముందేనా..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయాలనుకున్న 411 ఎస్ఐ, 6511 కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ కొనసా...గుతూ వస్తోంది. అభ్యర్ధులకు ప్రలిమినరీ పరీక్ష పెట్టి ఫలితాలు విడుదలచేసి.. త్వరలోనే ఫిజికల్ టెస్టు ఉంటుందని చెప్పి ఊరుకున్న బోర్డు అధికారులు ఆ దిశగా కన్నెత్తి చూడలేదు. దీనితో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులంతా ప్రతినిత్యం ఫిజికల్ టెస్టు కోసం ప్రాక్టీసు చేస్తూ ఉండాల్సి వస్తుంది. సాధారణంగా ప్రిలిమినీ పరీక్షపూర్తయిన 2 నెలలకు ఫిజికల్ టెస్టు నిర్వహిస్తారు. అది పూర్తియిన 2 నెలలకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రక్రియ మొత్తం అంటే ఉద్యోగ ప్రకటన దగ్గర నుంచి అన్ని పరీక్షలు పెట్టిని ఎంపికైన వారిని పోలీసు శిక్షణకు పంపడానికి అయ్యే ఆరునెలల్లోపుగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయబోయే ఉద్యోగాలకు ఇప్పటి వరకూ ప్రిలిమినరీ పరీక్ష, ఆతరువాత ఫలితాల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. దానికే ఆరునెలల సమయం పట్టేసింది. అంటే మిగిలిన 2 టెస్టులు ఇంకెప్పుడు పూర్తవుతాయోనని అభ్యర్ధులు దిగాలు పడిపోతున్నారు.

మిగిలిన రెండు పరీక్షలే అత్యంత కీలకం!
పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియ గతంలో 2 దఫాలుగా మాత్రమే ఉండేవి. అయితే ఉద్యోగాలు తక్కువ, అభ్యర్ధులు ఎక్కువగా దరఖాస్తు చేసుకోవడంతో ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను 3 దఫాలుగా చేపడుతున్నారు. అందులో ప్రిలిమినరీ పరీక్షలోనే చాలా మంది ఫిల్డర్ అయిపోతున్నారు. తరువాత జరిపే దేహదారుడ్య పరీక్షలో తొలిపరీక్షలో ఉత్తీర్ణులైనవారిలో సగానికిపైనే ఫిల్టర్ అయిపోతున్నారు. ఆపై ఫైనల్ పరీక్షలో ఎన్ని ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇచ్చారో అంతే మంది మిగులుతున్నారు. ఇదంతా ప్రభుత్వం నియామకప్రక్రియను ఒక పద్దతి ప్రకారం చేపడినపుడు జరిగే తంతు. కానీ ఈ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలకు ప్రకటన, ఆపై పరీక్షల నిర్వహణ అంతా గాలిలో దీపంలా ఉంటుందని అభ్యర్ధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబరులో వచ్చిన పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు ఫిబ్రలో ప్రిలిమినరీ పరీక్ష పెట్టి, ఆపై వెంటనే ఫలితాలు ఇచ్చేసి నేటి వరకూ ఊరకుండిపోయారు. ఇప్పటికే ప్రక్రియ జరిగి ఆరునెలలు గడిచిపోయాయి. మిగిలిన పరీక్షలు ఎప్పుడు పెడతారో తేలని పరిస్థి నెలకొంది.

ఎన్నికల ముందు హడావిడిగా మిగిలిన పరీక్షలు?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా 8నెలలు సమయం ఉన్నందున ఎన్నికలకు ఐదు నెలల ముందు మిగిలిన దేహదారుడ్య పరీక్ష, ఫైనల్ ఎగ్జామ్ పెట్టి.. ఆపై ఎన్నికలు పూర్తయిన తరువాత కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపికైన వారిని శిక్షణకు పంపిస్తారా అంటూ అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దేహదారుడ్య పరీక్షపూర్తయితే ఎంతమంది ఫైనల్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయ్యారో తెలిసేదని..ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే, ప్రభుత్వం తీయబోయే మిగిలిన ఉద్యోగాలకైనా సిద్దం కావడానికి అవకాశం వుంటుందని అభ్యర్ధులు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన వారంతా తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్ధులను ద్రుష్టిలో ఉంచుకొని మిగిలిన 2 దశల పరీక్షల పరీక్షలు నిర్వహించి నియామకప్రక్రియ పూర్తిచేయాలని కోరుతున్నారు. చూడాలి పోలీసు నియామకాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

మంగళగిరి

2023-06-12 06:59:01

జిపిఎస్ అంత బాగుందా..అయితే మీ ఓపిఎస్ వదిలేయండి..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి జిపిఎస్ ను అమలు చేస్తామన్న ప్రకటనపై సిపిఎస్ ఉద్యోగులు సంఘాల నేతలకు ఎక్కడి కక్కడ ఊరమాస్ పంచ్ లు ఇచ్చేస్తున్నారు. ఇవే ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ, సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పాద యాత్ర సమయంలో ఇచ్చిన హామీని ఎన్నికలకు 9నెలల ముందు రివర్స్ లో అమలు చేయడాన్ని సిపిఎస్ ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అదే సమయంలో ఓపిఎస్ లో ఉన్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వం తీసుకు వస్తామంటున్న జిపిఎస్ ఎంతో బాగుందని ప్రభుత్వాన్ని కీర్తిస్తుండటాన్ని తప్పు బడుతున్నారు. అంతేకాదు..జిపిఎస్ మీకు అంతనచ్చిందా..అయితే ఓపిఎస్ లో ఉన్న ఉద్యోగ సంఘ నేతలందరూ.. మీ ఓపిఎస్ ను వదిలేయండి.. అందరూ జిపిఎస్ లోకి వచ్చేయండి.. అపుడు ఏది బాగుందో మీకు తెలుస్తుంది అంటూ మండి పడుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానిస్తే వారి స్వప్రయోజనాలకు సుమారు 3.50లక్షల సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తారా అంటూ ఆరోపిస్తున్నారు. రాజకీయపార్టీలు రాజకీయం చేయడం చూస్తున్నామని..కానీ సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగ సంఘాల నేతలే రాజకీయం చేయడం ఇపుడే చూస్తున్నామంటూ ఉద్యోగులు మండి పడుతున్నారు.

దేశంలో సిపిఎస్ ను రద్దు చేసి చాలా రాష్ట్రాలు చత్తీస్ ఘడ్, జార్ఖాండ్ రాష్ట్రాలు ఓపిఎస్ ను అమలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న అధికారంలోకి వచ్చిన కేరళ ప్రభుత్వం ఉద్యోగుల సిపిఎస్ రద్దు చేసింది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేస్తుంటే..ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్నింటికంటే భిన్నంగా జిపిఎస్ ను తెరపైకి తీసుకు రావడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓపిఎస్ కు.. జిపిఎస్ కు మధ్య వ్యత్యాసాన్ని సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులందరికీ తెలిసేలా చైతన్యాన్ని తీసుకు వస్తున్నాయి. మరో వైపు పెన్షనర్లకు జరుగుతున్న అన్యాయంపైనా కూడా సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగుతున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలను మూకుమ్మడిగా తిప్పికొట్టాలంటే ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహం అవసరం ఉందంటూ సమాచాలోచనలు చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సిపిఎస్ రద్దు చేస్తారనే వైఎస్సార్సీపీకి ఓటు వేశామని..తీరా మా ఉద్యోగుల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంటే మళ్లీ టిటిడిపి పట్టించిన గతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకీ పట్టిస్తామని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగానే ప్రచారాన్ని చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలా ప్రచారాలు చేసిన ఉద్యోగులపై ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైనా..వాటిని ఎవరూ లెక్కడచేయడం లేదు. ఉద్యోగులకు నాడు రివర్స్ పిఆర్సీ ద్వారా అన్యాయం జరిగిందని.. ఇపుడు సిపిఎస్ రద్దు విషయంలో మరో భారీ అన్యాయం జరిగిందని..ఇదే పద్దతి కొనసాగితే రానున్నరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే ఆందోళనకు ఉద్యోగులు వచ్చేస్తున్నారు.

ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగ సంఘాలు..నేతల వలన ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావనే విషయాన్ని గుర్తించిన సిపిఎస్ ఉద్యోగులు తమ ఉద్యమా న్ని ఓటుతోనే తెలియజేయాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. సాధారణ ఎన్నికలకు ఇంకా 9నెలలు సమయం ఉన్నందున..సిపిఎస్ ఉద్యోగులు.. వారి కుటుంబాలను..వారి పిల్లలను, పెన్షనర్లును కూడా చైతన్యం చేస్తే తప్పాఅన్ని వర్గాల్లో మార్పు రాదని కూడా చెబుతున్నారు. సిపిఎస్ ఉద్యోగుల ఆందోళనకు ఆర్టీసీ, పోలీసు, ఐసిడిఎస్, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను, చైతన్య కార్యక్రమాలను సామాజిక మాద్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి.. జిపిఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ఉద్యోగులు, వివిధ సంఘాలు ఫేస్ బుక్, వాట్సప్, టెలీగ్రామ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరికొందరు టెక్నాలజీ తెలిసిన వారు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రిన్సిపల్ కార్యదర్శిల అఫిషియల్ ఖాతాలకు ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న జిపిఎస్ విధానంపై సిపిఎస్ ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతుంటే.. ఉద్యోగ సంఘాల నేతలకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తున్నది. చూడాలి సిపిఎస్ రద్దు పోరాటం వచ్చే 2024 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చేస్తున్న ఉద్యోగుల ప్రచారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనేది..!

Amaravati

2023-06-11 05:01:20

సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేసేందుకు కసరత్తు ప్రారంభం అయ్యింది. దానికోసం త్వరలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనాలని ప్రభుత్వం భావిస్తుందట. దానికంటే ముందుగా రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ..విధినిర్వహణలో మరణించిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల క్రింద సచివాలయాల్లోనే ఉద్యోగాలు కల్పించడం ద్వారా కొంత భర్తీని చేపట్టి ఆ తరువాత మిగులు ఉద్యోగాను భర్తీచేయాలని అధికారులు యోచిస్తున్నారు. గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో పాత 13 జిల్లాలు, విభజన 26 జిల్లాల వారీగా ఖాళీలను ఇప్పటికే జిల్లా అధికారులు గుర్తించారు. ఆయా ఖాళీలను భర్తీచేయడానికి కారుణ్య నియామకాల్లో భర్తీచేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని.. ముఖ్యంగా కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్ల ఖాళీలను భర్తీచేయడం ద్వారా ప్రజలకు సచివాలయాల ద్వారా సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే చాలా జిల్లాల్లో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. బదిలీల ప్రక్రియ పూర్తి అయ్యేనాటికి ఖచ్చితంగా మిగిలిన ఖాళీలను భర్తీచేయడానికి చర్యలు తీసుకోవాలని..దానికోసం పరిపాలనా పరమైన అనుమతుల కోసం పంపామని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల్లో అత్యధికంగా వెటర్నరీ అసిస్టెంట్లు ఖాళీలు అధికంగా ఉండగా.. తరువాత స్థానంలో హార్టికల్చర్, మహిళా పోలీసుల, పంచాయతీ కార్యదర్శిలు, డిజిజల్ అసిస్టెంట్లు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేసేస్తే ప్రభుత్వం నియమించాలనుకున్న 1.35 లక్షల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీచేసినట్టు అవుతుంది. ఉద్యోగాలు పొందిన వారే వివిధ ప్రభుత్వ శాఖల్లో సచివాలయ ఉద్యోగాల కంటే మంచి ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ఇలా ఏర్పడిన ఖాళీలు సుమారు 15 నుంచి 18వేల వరకూ ఉంటాయని తెలుస్తుంది. అంతేకాకుండా 2023 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2వేల ఖాళీలు ఇదేశాఖలో ఉద్యోగ విరమణల ద్వారా ఏర్పడనున్నాయని సమాచారం. 2024 ఏప్రిల్, మే, నాటికి ఒక్క పంచాయతీ కార్యదర్శిలే 1300 మంది ఉద్యోగ విరమణ చేయననున్నారు. అదీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచడంతో వీరి ఉద్యోగాలు అప్పటి వరకూ ఉండనన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని సచివాలయాలు కార్యదర్శదర్శితోపాటు ముగ్గురు, నలుగురు సిబ్బందితోనే నడుస్తున్నాయి. అందులో ప్రాధాన్యత కలిగిన వీఆర్వో, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ తదితర పోస్టులను సాధ్యమైనంత త్వరగా కారుణ్య నియామకాల కోటాలో భర్తీచేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఏ శాఖలో ఉద్యోగి మ్రుతిచెందినా..దానికి సంబంధించిన పోస్టింగులను ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే భర్తీచేస్తుండటం విశేషం. మరోవైపు ఏపీపోలీసుశాఖలో తీసిన నోటిఫికేషన్ లోని ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా చాలామంది ప్రిలిమినరీ పరీక్షను సచివాలయ ఉద్యోగులు అధిగమించారు. మిగిలిన రెండు పరీక్షల్లోనూ విజయం సాధిస్తే మరికొంత మంది సచివాలయ సిబ్బంది పోలీసుశాఖలోకి వెళ్లిపోనున్నారు. అపుడు మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఒకరకంగా అలా సిబ్బంది వెళ్లిపోతారనే కారణంతోనే పోలీసు నియామక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేసి ప్రభుత్వం మిగిలిన రెండు దశల పరీక్షలను చేపట్టడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది. సచివాలయాల్లో ప్రధానశాఖల సిబ్బంది ఖాళీలు భారీగా ఏర్పడితే సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే ఊహించిన ప్రభుత్వం కారుణ్య నియామకాల్లోనే ఎక్కువ మందిని భర్తాచేయాలని చూస్తుంది. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ నాటికి మిగులు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయాలని కార్యాచరణ చేపడుతున్నది. నోటిఫికేషన్ వస్తే నిరుద్యోగులకు మళ్లీ కొలువుల పండుగ వస్తుంది..!

Amaravathi

2023-06-10 04:10:44

గ్రామాల్లోనూ ఇక 5జి ఇంటెర్ నెట్ సేవల విస్తరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాల్లోని అన్ని గ్రామాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ ఇంటర్నెట్ ను విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఏపిఎస్ఎఫ్ఎల్ ను ఆర్ధికంగా బలోపేతం చేయడంతోపాటు, అన్ని గ్రామాలకు 5జి ఇంటర్నెట్ అందించాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఎంపిక చేసిన గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ ను మరింతగా అభివ్రుద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని  గ్రామాల్లో ఇప్పటి వరకూ సాధారణ కేబుల్ టివి, డిటిహెచ్, ఓటిటి యాప్ లు అందుబాటులోకి రాగా..అత్యంత వేగంగా ఏపీ ఫైబర్ నెట్ ను అభివ్రుద్ధి చేసి ప్రజలకు అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ తోపాటు, కేబుల్ సర్వీసులు, టెలీఫోన్ సేవలను తీసుకురావాలిని యోచిస్తున్నది. దానికోసం ఏపీఎస్ఎఫ్ కి రూ.445.7 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ టివిల వినియోగం, స్మార్ట్ ఫోన్ ల వినియోగం గ్రామాలలో అధికంగా పెరిగినందున అక్కడే హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఆన్ లైన్ సేవలు, విద్య అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తన్నది.

 దానికోసం ఏపిఎస్ఎఫ్ఎల్ ను విస్తరించి మండల కేంద్రం నుంచి అన్ని గ్రామపంచాయతీలకు విస్తరించి, పాఠశాలలు, డిజిటల్ లైబ్రెరీలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు, పిహెచ్సీలకు హై బ్యాండ్ విడ్త్ ను అనుసంధానించనున్నది. ఇంటర్నెట్ లో లోపాలు రాకుండా, అంతరాయాలు లేకుండా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, విద్యార్ధులు, ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని కూడా ఏపీ ఫైబర్ నెట్  ద్వారా అందిం చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను అదేరోజు ఏపీ ఫైబర్ నెట్ లోనే ఇంట్లో ఉండి చూసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 14వేల 5 గ్రామ, వార్డుసచివాలయాలతోపాటు, అన్ని పంచాయతీలు, గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

తాడేపల్లి

2023-06-09 05:17:05