1 ENS Live Breaking News

చంద్రబాబు ఆరోగ్య నివేదికలు వాస్తవాలేనా?!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఏపీ‌ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల అనుమా నాలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ దశలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‌నిజంగానే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణిస్తోందా లేక ఇవన్నీ అపోహలు, అవాస్తవాలేనా అనేది ఎవరికీ తెలియడం లేదు. కాకపోతే చంద్రబాబు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని భువనేశ్వరి, లోకేష్, టీడీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలు.. విమర్శలు కావని, నిజమని వైద్యుల నివేదికలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. యస్..చంద్రబాబు ఆరోగ్యం మునుపటిలా లేదు. అనేక అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముడు తున్నాయి.  స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ సెప్టెంబరు 9న అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో గత 48 రోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో 'స్నేహా' బ్లాక్ లో రిమాండ్ ఖైదీగా కాలం వెళ్ళదీస్తున్నారు. 

అయితే గత పదీ పదిహేను రోజుల క్రితం రిమాండ్ ఖైదీ చంద్రబాబుతో ములాఖత్ తీసుకుని ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు శరీరంపై ఉన్న దద్దుర్లను కుటుంబ సభ్యులు గమనించారు. ‌ఈ విషయాన్ని కోర్టుకు న్యాయవాదుల ద్వారా తెలియజేయగా ఏసీ సమకూర్చడంతో పాటు రాజమండ్రి నగర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఒక బృందంగా ఏర్పాటు చేసి..నిత్యం చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిశీలించాల్సిందిగా విజయవాడ కోర్టు ఆదేశించింది. ఆనాటి నుంచి వైద్య బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పరీక్షించి హెల్త్ బులెటిన్ ను జైళ్ళ శాఖ అధికారుల‌ ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే వైద్య పరీక్షలలో కొన్ని అంశాలను ప్రస్తావించకుండా హెల్త్ బులెటిన్ ను విడుదల చేయడాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. తమకు కూడా వైద్య పరీక్ష నివేదికలు అందజేయాలని కోరడంతో కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీ బుధవారం చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యుల బృందం జైళ్ళ శాఖ అధికారులకు ఒక నివేదిక అందజేసింది. అయితే ఆ మేరకు జైలు అధికారులు బులెటిన్ విడుదల చేయకపోవడం గమనార్హం. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందని, ఆయన ఆరోగ్య సమస్యలను కావాలనే దాచి పెడుతోందని‌ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్యులు కంటి సమస్యతో‌ ఆయన బాధపడుతున్నారని, చికిత్స అవసరమని జైలు అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పట్లో ఎలాంటి చికిత్సా అవసరం లేదని ఆ నివేదికలో మార్చి ఇవ్వాలని‌ ప్రభుత్వ వైద్యులపై జైలు శాఖ అధికారులు వత్తిడి తెస్తున్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇదే వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్లో‌ కంటి సమస్యను ప్రస్తావించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గూర్చి, బయట షికార్లు చేస్తున్న వార్తలపై జైలు సూపరింటెండెంటు స్పందిస్తూ.. చంద్రబాబుకు నాలుగు నెలల క్రితమే ఒక కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేశారని, రెండో కంటికి ఆపరేషన్ అవసరం లేదని ఆయనను పరిశీలించిన వైద్యులు చెప్పారన్నారు. సరే వైద్యులు తెలిపారు..మరి కనీసం కంటి సమస్యను ఎందుకు హెల్త్ బులెటిన్ లో చూపలేదని టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‌ఒక్క కంటి సమస్య మాత్రమే కాదు..చంద్రబాబు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని‌ తెలుస్తోంది. వంటిపై దద్దుర్లు, విరేచనం అయ్యే ప్రాంతంలో నొప్పి, వెన్ను కింద భాగం నొప్పి తదితర సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్టు  ప్రభుత్వ వైద్య బృందం‌ భువనేశ్వరికి తెలిపినట్టు సమాచారం. మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్ రే తదితర పరీక్షలు చేయించాలని వైద్య బృందం సూచించినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. క్రోగ్యలేషన్ ప్రొక్టివ్ అనే పరీక్షను చేయించాలని వైద్యులు సూచించారు. ‌


చంద్రబాబుకు దద్దుర్లు వల్ల మంట వస్తోందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని‌ కోర్టు దృష్టికి తీసుకు రావడంతో టవర్ ఏసీ‌ ఏర్పాటు చేశారు. అయితే పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న చంద్రబాబుకు మెరుగైన వైద్యం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి పరీక్షలు చేయిస్తే ఏయే లోపాల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారో స్పష్టమవుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.‌ కేవలం రెగ్యులర్ చెకప్ వల్ల ఫలితం ఉండదని, అశ్రద్ధ చేస్తే మొత్తం శరీరానికే ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు చంద్రబాబు అనారోగ్య సమస్యలను దాచాల్సింది ఎందుకనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పైపెచ్చు కంటి సమస్యను హెల్త్ బులెటిన్ లో చూపించవద్దని‌ జైలు అధికారులు ప్రభుత్వ వైద్య బృందాన్ని ఎందుకు కోరిందో తెలియడం లేదు.

 అంటే కావాలనే ప్రభుత్వం వెనుక ఉండి జైలు అధికారులతో‌ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని‌ టీడీపీ శ్రేణులు చేస్తున్న అనుమానాల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వ వైద్యుల బృందం, జైలు అధికారుల మధ్య విభేదాలు పొడచూపే అవకాశం కనిపిస్తోంది. వైద్యులు వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నా..జైలు అధికారులు కూడా వారి విధులను ఎవరి ఆదేశాలకు అనుగుణంగా నిర్వర్తిస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రికి జైలులో అందుతున్న వసతులు, అతని వయస్సు, ఆరోగ్యం, ప్రస్తుతం వస్తున్న చర్మవ్యాధులు, కంటి సమస్యలు ఇవన్నీ చంద్రబాబుపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరో వైపు వాయిదాలు పడుతున్న కోర్టుకేసులతో చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు బయటకు వచ్చే అవకావాలు కనపించడంలేదు. ఈ పరిస్థితి ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి..!

Rajamahendravaram

2023-10-28 02:41:13

జగనన్న ఆరోగ్య సురక్ష..అంగన్ వాడీలకు ఆర్ధిక శిక్ష

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అంగన్ వాడీ స్టాల్స్ చాలా చక్కగా కనిపించాలి..అన్ని రకాల ఆకుకూరలు, బరలవర్ధక ఆహారం ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి.. గర్శిణిలకు సీమంతాలు చేయాలి..బట్టలు పెట్టి, పూలు గాజులు ఇవ్వాలి..ఇవీ అంగన్ వాడీలకు జిల్లా అధికారుల నుంచి వచ్చే ఆదేశాలు. ఆదేశాలొస్తే..సదరు కార్యక్ర మాలకు నిధులు కూడా వస్తాయనుకునుకుంటే మీరు పొరపాటు పడినట్టే..నిధులా.. ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు ఐసిడిఎస్ అధికారులు...! ఏం ఆ మాత్రం పెట్టు కోలేరా..? జగనన్నకోసం ఒక్కరోజు ఖర్చుకూడా మీరు భరించలేరా..? ప్రతీదానికి నిధులు అంటే ఎక్కడి నుంచి వస్తాయ్..కొన్నింటిని సిబ్బంది మీ బాధ్యతగా నిర్వర్తిం చే యాలి..ఇలా చిన్న కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులంటూ ఏమీ ఇవ్వదు అని సన్నాయి నొక్కుల్లు నొక్కుతున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ల నుంచి ఆదేశాల రావడంతో అంగన్ వాడీలు ఆరోగ్య సురక్ష కార్యక్రమాల్లో అయ్యే ఖర్చుమొత్తం వీళ్లే భరించాల్సి వస్తున్నది. అందులోనూ ఐసిడిఎస్ పౌష్టి కాహార ప్రదర్శన అంటే మామూలుగా ఉండదు. ఇవన్నీ నిజంగా గర్భిణిస్త్రీలు తింటే ఆరోగ్యం వీరికి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనేలా అన్ని రకాల వంటకాలు, ఆకు కూర లు, ఇతర పౌష్టికాహారం మొత్తం ప్రదర్శనకు ఉంచుతారు. 

ఇలా ఒకరోజు కార్యక్రమం చేసి, వచ్చినవారికి సీమంతాలు చేయాలన్నా ఒక్కో అంగన్ వాడీకి రూ.3 నుంచి 5వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేస్తుందా అంటే అదీలేదు. అంగన్ వాడీ కేంద్రాల్లో కేవలం, బియ్యం, గ్రుడ్లు, కందిపప్పు, పాలు, బెల్లపు చక్కీలు, కర్జూరం ప్యాకెట్లు, మంచినూనె మాత్రమే ఉంటాయి. ఇతర వస్తువలన్నీ వీళ్లు సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసుకోవాల్సిందే. పోనీ ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతో ప్రదర్శన పెట్టాలని చూస్తే మాత్రం వారికి హెచ్చరికలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతోపాటు, రకరకాల పిండివంటలు, ఆకు కూరలు, పౌష్టికాహారానికి సంబంధించిన మొత్తం వంటకాలు తేవాలంటూ హుకం జారీ చేస్తున్నారు. ఏం చేయాలతో పాలపోని పరిస్థితిలో అప్పలు చేసి మరీ గ్రామాల్లో ఆరోగ్య శిభిరాలు ఏర్పాటు చేస్తే ఇద్దరు ముగ్గు అంగన్ వాడీలు కలిపి వారి చేతి డబ్బులు పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సి వస్తున్నది. ఈ విషయం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లకు తెలిసినప్పటికీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం లేదు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వస్తున్నందున భారీగా కార్యక్రమాల్లో ప్రదర్శనలు చేయాలని మాత్రం హుకుం జారీచేస్తున్నారు.

 వచ్చే జీతాలే సక్రమంగా రాక అప్పులు చేసి మరీ అంగన్ వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న వర్కర్లు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరింతగా అప్పులు చేయాల్సి వస్తున్నది. మండల కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలు కాస్త భారీగా చేపడుతుండటంతో మండలంలోని అందరు అంగన్ వాడీలకు చేతి చమురు వదిలిపో తున్నది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో అనుకుంటే కాదు..రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అందులోనూ ఐసిడిఎస్ జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఆఫీ సర్లు, సూపర్ వైజర్లు కూడా కార్యక్రమాలకు హాజరవుతుండటంతో వారికి మళ్లీ ప్రత్యేకంగా మధ్యాహ్నాం భోజనాలు కూడా వీరే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తున్నది. తమ అధికారులకు తాము ఏ విధంగానైనా భోజనాలు పెట్టుకోగలం కానీ, ప్రభుత్వ కార్యక్రమానికి తమతో ఖర్చులు పెట్టించి మరీ కార్యక్రమాలు చేయమంటే తాము ఎక్కడి నుంచి తేవాలంటూ అంగన్వాడీలు వాపోతున్నారు. విషయం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు తెలిసినా వీళ్లు కూడా ప్రభుత్వానికి ఈ సమస్యను నేరుగా చెప్పే పరిస్థితి లేదు. దీనితో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు మాత్రం ఐసిడిఎస్ సిబ్బందికి ఆర్ధిక శిక్షగానే మారుతున్నాయి. ఇప్పటికై ప్రభుత్వం స్పందించి అధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని అంగన్వాడీలు ముక్త కంఠంతో కోరుతున్నారు.

Amaravati

2023-10-27 02:42:41

ఉద్యోగులకు జీతాలులేని ‘సమగ్ర దసరాపండుగ శిక్ష’..!

దసరా పండుగవేళ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో పనిచేసే కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా మూడు నెలల నుంచి జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 25వేలమంది క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిఆర్టిలు, ఎస్ఓలు గాపనిచేస్తున్నారు. విద్యాశాఖలోపెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి ప్రభుత్వంసక్రమంగా నెలనెలా జీతాలు విడుదల చేయడంలేదు. ఎన్ని సార్లుతమ సమస్యను జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా, జగనన్నకు చెబుదాం, స్పందన లాంటి కార్యక్రమాల్లో అర్జీలు పెట్టినా ఫలితంలేకుండాపోతుందని వీరంతా చెప్పుకొస్తున్నారు. అయినప్పటికీ తాము క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ, నేటికీ  మాకు రావాల్సినజీతాల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే అప్పులు చేసుకొనిమరీవిధులు నిర్వహిస్తున్న వీరి విషయంలో ప్రభుత్వం మరీ దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వశిక్షా అభియాన్ లోని అందరూ చదవాలి..అందరూ ఎదగాలి..అనే సంకల్పంతో ప్రారంభమైన ఈస్కీములో పనిచేస్తున్న మాకు ఇచ్చే అరకొరజీతాలుకూడాసమాయానికి ఇవ్వడం లేదని విద్యాశాఖ అనుబంధంగాపనిచేస్తున్న వీరంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాముపనిచేసవన్నీ ఫీల్లుతరహా పనులని..ఎక్కడికి వెళ్లాలన్నా పైసాలేనిదే పనిజరగడంలేదని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. జీతంతక్కువే అయినా జీవితానికి భరోసా ఉంటుందని భావించి విధులునిర్వహిస్తున్నామని, అయినా ప్రభుత్వం తమపై కనీసం జాలి చూపించడంలేదని వాపోతున్నారు.తమకు రావాల్సిన జీతాల బకాయిలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తే తప్పా తమకు ఏడాది దసరాపండుగ  చేసుకునే భాగ్యం కూడా కలగదని చెబుతున్నారు. సమగ్ర శిక్ష లో పనిచేసే ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలు,బకాయిజీతాల విషయమై మండల విద్యాశాఖ అధికారి నుంచి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకూ అర్జీలు పెట్టుకున్నారు. తొలుత నాలుగు నెలలు జీతాలు బకాయిలు ఉంటే ఒక నెల జీతం ఇచ్చారు. ఇంకా పూర్తిగా రెండు నెలలు బకాయిఉంది. ఈపదిరోజులు  పూర్తయితే(ప్రభుత్వ శాఖల్లో 25వ తేది నుంచి 25వతేదికి నెలగాపరిగణిస్తారు,ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీలోగా సాలరీ బిల్లులు పెడతారు) పూర్తిగా మూడు నెలలు జీతాలు ఉద్యోగులకు అందాల్సి వుంటుంది.

 ప్రతీసారి ఉద్యోగులు జీతాల కోసంప్రభుత్వం చుట్టూ, విద్యాశాఖలోని ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వచ్చే అరకొర జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోతే తాము ఎలాబ్రతకగలమని,  పెరిగిపోతున్న నిత్యవసర సరుకుల ధరలు కూడా తమ ఆర్ధిక ఇబ్బందులకు తోడవుతున్నాయని వీరంతా గగ్గోలుపెడుతున్నారు. పండుగ వేళ పస్తులుంటున్న ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో పనిచేసే కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ఆర్ధిక ఇబ్బందులు,కుటుంబ పోషణలను ద్రుష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం ద్రుష్టికి ఈసమస్యనుతీసుకెళ్లి కు జీతాల సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులంతా ముక్తకంఠంతో  సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

Tadepalli

2023-10-21 03:58:24

ఈఎన్ఎస్ చెప్పిందే నిజమైంది..ఏపీలో అధికారిక కులగణన..!

ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(ఈఎన్ఎస్) అధికారికి మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పింది ఎప్పుడూ ఒమ్ముకా లేదు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సామాజిక కులగణన చేపట్టనుందనే విషయాన్ని ప్రత్యేక కథనంగా ప్రజల ముందుంచాం. దానిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఇపుడు ఆ మాటను నిజం చేస్తూ కులగణన చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు కేవలం కులసంఘా లు మాత్రమే చేసుకునే కుల గణన ఇపుడు నేరుగా ప్రభుత్వమే చేపట్టనుంది. దీని ద్వారా ఆయా కులాలకు ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల ద్వారా అభివ్రుద్ది కార్యక్రమాలు, రాజకీయం, ఓటు బ్యాంకు ఇలా అన్నింటికీ సదరు డేటా పనిచేస్తుందని భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏ కులంలో ఎంత మంది ఉన్నారు..? మగవారు ఎంతమంది..? ఆడవారు ఎంతమంది..? పిల్లలు ఎంతమంది..? వారి వయస్సులు.. వారి ఆర్ధిక పరిస్థితి, సొంతిల్లు, ఉద్యోగం, వ్యాపారం, కూలీపనులు, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం ఈ డేటాలో సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. తద్వారా రాష్ట్రంలో ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఎంతమంది జనాభా ఉన్నారు..? ఏ కులానికి ఏఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి..ఇంకా ఎవరెవరికి అందలేదు..అందులో ధనికులు, పేదవారు ఇలా అన్ని వివరాలు పొందుపరచనున్నారు. ఈ వివరాలు 2024 ఎన్నిక సమయానికి పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30లక్షల మంది ఉద్యోగులు, మరో నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ డేటాను నవంబరు 14 నుంచి ప్రభుత్వం సేకరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర జనాభా సంఖ్య కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అనధికారికంగా రాష్ట్రంలో కుల గణన 2023 మార్చినాటి కే పూర్తయి పోయి నట్టు సమాచారం. వాటిని ఆయా కుల సంఘాలు చేపట్టేశాయి. కానీ ఇపుడు అధికారికంగా సేకరించే సమాచారంలో రాష్ట్రంలో ఎంతమంది ప్రజలున్నారు..? ఎన్ని కులాలు ఉన్నాయి..? ఏఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారనే విషయం అధికారికంగా తెలియనుంది. ఈ కుల గణన వలన అన్ని రాజకీయపార్టీలకు మేలు, కీడు రెండూ జరగనున్నాయని చెబుతున్నారు. కులంలో జనాభా ప్రాతిపధికన కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, జెడ్పీ చైర్మన్లు, కుల కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇలా ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా ప్రభుత్వాలు కుల బలాన్ని బట్టి భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ రెడ్డి, కమ్మ రెండు సామాజిక వర్గాలు మాత్రమే ప్రభుత్వాలను నడుపుతూ వచ్చాయి. ప్రభుత్వం చేపట్టే కులగణనతో ఏ కులం బలం ఎంతుందో తేలిపోయి..వారి వారి కుల బలాన్ని బట్టి పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మాకులంలో అత్యధిక జనాభా, ఓట్లు, ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారని ఏ కులానికి ఆ కులం బల ప్రదర్శన చేసేది.

 అయితే ఇపుడు ప్రభుత్వం చేపట్టే అధికారిక కుల గణనతో ఏ కులంలో ఎంత మంది ఉన్నారనే విషయం ప్రభుత్వమే అన్నికులాల వారికీ తెలియజేయనున్నది. ఇది ఒక రకంగా శుభపరిణామం అనే చెప్పాలి. తద్వారా ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, వర్గాలు వారీగా జాబితా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలియనున్నది. తద్వారా ఇకపై రాజకీయాలు కూడా రసవత్తరంగా మారే అవకాశాలు బలపడనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులకు గానీ, రాజకీయనాయకులకు గానీ ఏ ఏ కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారనే విషయం తెలీదు. ఇపడు అనకాపల్లి నుంచి అమెరికా వరకూ ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు ఎక్కడున్నారో కూడా తేలిపోతుంది. ప్రస్తుతం రాజకీయాల్లోకి సివిల్ సర్వీస్ ఆఫీసర్లు, ఇతర జిల్లా శాఖల అధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు వస్తుండం వలన వారికి ఈ కుల గణన జాబితా ఎంతో చక్కగా ఉపయోగపడనున్నది. ఇప్పటి వరకూ కులాభిమానం చూపించేవారికి, చూపించలేని వారికి, చూపించాలనుకునేవారికి కూడా ఈ జాబితా ఒక వేదిక కానున్నది. ఒక రకంగా కులగణన అనేది కత్తిమీద సాములాంటి వ్యవహారం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహసం ప్రదర్శించి చేపట్టనున్న కులగణనపై భారీ అంచనాలు అపుడే నమోదు అవుతున్నాయి. అదేస్థాయిలో అన్ని వర్గాల్లోనూ చర్చలు కూడా ప్రారంభం అయ్యాయి. చూడాలి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలు కులగణన విషయంలో నమోదు చేస్తుందనేది..!

Visakhapatnam

2023-10-15 04:56:45

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు ఆలోచనలో పడ్డారా..?!

ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఆలోచనలా పడ్డారా..? ప్రభుత్వ విధానాలు, ఎన్నడూలేనివిధంగా జీతాలు ఆలస్యం కావడం, కొత్తజిల్లాల్లో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారులకు వసతి సౌకర్యాలు లేకపోవడం, మాట్లాడితే కోర్టులకు నేరుగా అధికారులే హాజరు కావడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఉద్యోగులు నుంచి వస్తున్న ఒత్తిడి, సహకారం లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే బ్యూరోక్రాట్ లు వేరే లెవల్ లో ఆలోచన చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. దానికి తోడు రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకి నియమితులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ, ఫారెస్ట్ ఆఫీసర్లకు నేటికీ ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడం, వారంతా సాధారణ ఉద్యోగులు మాదిరిగా ప్రైవేటు ఇళ్లల్లో అద్దెకు ఉండటం ఇతర జిల్లాశాఖల అధికారులు సొంతిళ్లల్లో ఉంటం కూడా ఉన్నతాధికారులకు ఇబ్బందిగా ఉంది. రాష్ట్రప్రభుత్వం అయితే గవర్నర్ గెజిట్ ద్వారా జిల్లాలను విభజించింది తప్పితే, ఇంకా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు రాలేదు.

దీనితో కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల కేడర్ జిల్లా రాష్ట్రం వరకూ మాత్రమే పరిగణలోకి వస్తున్నది. కేంద్రం దృష్టిలో మాత్రం వీరంతా దిగువస్థాయి అధికారులుగానే లెక్క. ఇలాంటి సందర్భంలో ఉద్యోగాలు చేస్తున్నా..ఎందుకనో లోలోన అధికారులంతా మనసులో తీవ్రవమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారులు ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా వారి సమస్యలను వారే సహచరులతో చెప్పుకొని బాధపడుతున్నట్టు తెలిసింది. ఒకప్పుడు జిల్లా కలెక్టర్ అన్నా, జిల్లా ఎస్పీ అన్నా, జిల్లా ఫారెస్టు అధికారి అన్నా ఒక గుర్తింపు ఉండేదని, ఇపుడు సాధారణ ఉద్యోగులు మాదిరిగా అధికారులంతా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండాల్సి వస్తుందన్న ఇబ్బందిని వ్యక్తపరచుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని మార్పులు చేసిన క్రమం తొలుత దాని ప్రభావం జిల్లా కలెక్టర్లపైనే పడినట్టు కనిపిస్తున్నది. జిల్లాలు అయితే పెంచిన ప్రభుత్వం దానికి తగ్గట్టు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఇతర కేడర్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ మాత్రం చేయలేదు. దీనితో ఉన్నతాధికారులు సైతం అధికారుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 2024 మార్చి దాటితో ఉద్యోగులు, మినిస్టీరియల్ సిబ్బంది కొరత మరీ తీవ్రతరం కానుంది. వేల సంఖ్యల ఉద్యోగులు ఉద్యోగ విరమణలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఒక్కో జిల్లా అధికారి ఉమ్మడి జిల్లాతోపాటు, విభజన జిల్లాలను కూడా పర్యవేక్షించాల్సి వస్తున్నది.

రిటైర్ మెంట్లు జరిగితే ఒక్కోశాఖ అధికారి అదనంగా ఇతర శాఖలను చూసే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో జిల్లా అధికారులు కూడా కలెక్టర్, ఎస్పీల మాటలు వినే పరిస్థితి కనిపించడం లేదనేది ప్రధాన వాదనగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నడూలేనివిధంగా సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి తయారైందని, సాధారణ జిల్లాశాఖల ఉద్యోగులకు, తమకు పెద్దగా వ్యత్సాసం కనిపించలేదని యువ కలెక్టర్లు లోలోన మధన పడుతున్నారట. అలాగని విశేష అధికారాలను వినియోగించి అభివృద్ధి పనులు చేయాలన్నా, తమ మార్కు చూపించుకోవాలన్నా నిధుల కొరత తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది. గతంలో ప్రతీ జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా జిల్లాకు నిధులు ఉండేవి. వాటితో కలెక్టర్లే ప్రత్యేక అవసరాలకు ఆ నిధులను వెచ్చించే వారు. ఇపుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. దీనితో సివిల్ సర్వీస్ అధికారులు కూడా డమ్మీలైపోయినట్టుగా వాళ్లంతట వాళ్లే భావిస్తున్నారని సమాచారం. మరో వైపు రాష్ట్రంలోని శాఖాధిపతులుగా ఉన్నవారు రాష్ట్ర సర్వీసులకు నమస్కారం పెట్టి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్థితి ఎదరైందనే వాదన కూడా బ్యూరోక్రాట్ లలో బలంగా వినిపిస్తోందట. రాష్ట్ర సమీక్ష సమావేశాల్లో ఏ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు కలిసినా ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయనే విషయం నిఘా వర్గాలకు సైతం వెళ్లిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఐఏఎస్ లకు జీతాలు ఆలస్యం గా ఇవ్వడం, అదే స్థాయిలో కొన్నిశాఖల ఉద్యోగులకు నెల నెలా ఇవ్వాల్సిన జీతాలు 45 రోజులకి ఒకసారి ఇస్తుండటం కూడా సీనియర్ ఐఏఎస్ లకు మింగుడు పడటం లేదు. జిల్లా అధికారులు, ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యంగా వచ్చినట్టే మనకీ ఆలస్యంగానే అందుతున్నాయి..రేపు ఈ పరిస్థితి మరింతగా పెరగొచ్చని ఓ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించండం కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వాన్ని నడిపించే సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి ఇలాఉంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది వేయి డాలర్ల ప్రశ్న. చూడాలి ముందు ముందు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల మనోగతం మరెంతగా మారుతుందనేది..!

Visakhapatnam

2023-10-13 06:13:32

స.హ.చట్టం దరఖాస్తుపై కదిలిన 3జిల్లాల యంత్రాంగం

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు, 19శాఖల సిబ్బంది యొక్క సర్వీసు నిబంధనలు, ఇంక్రిమెంట్లు, డిఏలు, ప్రమోషన్ ఛానల్, బదిలీలు, ఇన్ సర్వీస్, భర్తీకానీ ఉద్యోగాల ఖాళీలు, తదితర అంశాలపై ఈఎన్ఎన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరోచీఫ్ పి.బాలభాను(ఈఎన్ఎస్, బాలు) దాఖలు చేసిన సమాచారహక్కు చట్టం దరఖాస్తుపై  ఉమ్మడి విశాఖజిల్లా, విభజన మూడు జిల్లా అధికారులు కదిలారు. సుమారు 20 అంశాలతో కూడిన నివేదిక వివరాలు కావాలని సమాచారహక్కుచట్టం దరఖాస్తు దాఖలు చేసిన వెంటనే విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం కోసం జిల్లా పరిషత్ కు నివేదించామని మూడు రోజుల క్రితం తిరుగు టపా వచ్చింది. నిన్న జిల్లా పరిషత్ లో భాగంగా ఉన్న మూడు జిల్లాల అధికారులకు సమాచారం కోసం దరఖాస్తు పంపినట్టుగా తిరుగు టపా జిల్లా పరిషత్ అధికారులు పంపారు. మీరు కోరిన సమాచారం కోసం అల్లూరిసీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం డిఎల్డీఓలకు ఆర్టీఐ దరఖాస్తు పంపినట్టుగా తిరుగు జవాబులో వర్తమానం పంపించారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కెల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు, వారి విధులు భిన్నంగా ఉన్నాయి. అంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్గాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఏఒక్క అంశమూ ఇతర ప్రభుత్వశాఖల సిబ్బంది మాదిరిగా జరగడం లేదు.

ఈ ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసి నాలుగేళ్లు దాటుతున్నా నేటికీ చాలాశాఖల సిబ్బందికి సర్వీసు నిబంధనలు పొందు పరచలేదు. ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకా చాలా మంది ఉద్యోగులకు కనీసం సర్వీస్ కూడా రెగ్యులర్ కాలేదు. సుమారు ఆరు నెలల క్రిందట క్యాబినెట్ లో తీసుకున్న చట్టభద్దత నిర్ణయానికి నేటికీ అతీ గతీ లేకుండా పోయింది. సచివాలయశాఖ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశామని చెప్పిన ప్రభుత్వం వారికి అరియర్స్ ఇవ్వలేదు, సర్వీసు రెగ్యులర్ చేసిన 
రేండేళ్ల 9 నెలలకు ఇవ్వాల్సిన సుమారు మూడు ఇంక్రిమెంట్ల విషయంలోనూ ఇప్పటికీ ఏమీ మాట్లాడలేదు. వీరికి ఏ తరహా డిపార్ట్ మెంటల్ టెస్టులు పెడతారు. ఏఏ పరీక్షలు పాసైతే వీరికి పదోన్నతులు వస్తాయి అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వంలోని 76 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖలోనూ చేయని సేవలు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వశాఖ అయితే సదరు శాఖ విధులు మాత్రమే నిర్వహిస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులు మాత్రం సుమారు ఐదారు ప్రభుత్వశాఖలకు చెందిన విధులు నిర్వహించాల్సి వస్తున్నది. ఇంత చేస్తున్నా, వీరికిప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలను సక్రమంగా కల్పించడం లేదు.

ఈ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఏ ఒక్క కార్యక్రమం ఉద్యోగుల విషయంలో సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. దానికితోడు గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీఓల వరకూ ఉద్యోగులను పలు రకాల వేధింలపులకు గురిచేస్తున్నారు. ఈ తరుణంలో ఉద్యోగులకు చెందాల్సిన ప్రయోజాలను ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను, ఇతర సదుపాయాలను బహిర్గతం చేసేందుకు, వాటిని సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు తెలియజేసేందుకు వీలుగా సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా వివరాలు సేకరిస్తోంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. ప్రభుత్వం ఇచ్చే లిఖితపూర్వ వివరాలతో ఇప్పటి వరకూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏంచేసిందనే విషయం ప్రభుత్వశాఖలే తేటతెల్లం చేయనున్నాయి. ఈ తరుణంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ దాఖలు చేసిన సహచట్టం దరఖాస్తుపై జిల్లా అధికారులు స్పందించి సమాచారం త్వరలోనే అందజేస్తామని లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి లేఖల ద్వారా తెలియజేశారు. సుమారు 20 అంశాల్లో అడిగిన సమాచారం బయటకు వస్తే సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చేసిందనేది తేలనుంది. 

Visakhapatnam

2023-10-07 11:13:47

విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్బంగా సీఎం జగన్‌ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని, విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు సీఎం జగన్‌. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు. 

Amaravati

2023-09-20 08:42:07

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతంలో సేవింగ్స్ చేసుకునేందుకు వీలుగా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లను ఉద్యోగులకు ప్రత్యేకంగా తెరిచి వారి శాలరీ బ్యాంకు ఖాతాలను కూడా లింక్ చేసింది. తద్వారా ఉద్యోగులు పెట్టుకున్న కటింగ్స్ నేరుగా పిపిఎఫ్ అకౌంట్ లోకి జమ అవుతా యి. వాస్తవానికి ఉద్యోగంలోకి చేరిన వెంటనే పిపిఎఫ్ అకౌంట్లు ప్రభుత్వం తెరవాల్సి వుంటుంది. కానీ ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సుమారు ఆరు నెలలకు ఈ ఖాతాలను తెరిచింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన తొలి ఏడాది ఇంక్రిమెంట్ ఆర్డర్లు 19శాఖల సిబ్బందికీ పూర్తిస్థాయిలోరాలేదు. ఆయా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఉంచి జిల్లా నేరుగా వీరికి సమాచారం అందుతుంది. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెం ట్లను ఇవ్వలేదు. కొత్తగా వేసిన ఇంక్రిమెంటుకి ఆర్ఢర్లు అందరికీ పూర్తిగా రాకపోవడం విశేషం.

Tadepalli

2023-09-08 11:55:27

రాష్ట్రంలో 10 మంది ఐపిఎస్ లకు బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌషల్‌,  అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా విశ్వజిత్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా త్రివిక్రమ వర్మ, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్‌,విశాఖ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా కే. శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్‌ ఎస్పీగా విద్యాసాగర్‌ నాయుడు, అనంతపూర్‌ 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా ఆర్‌. గంగాధర్‌రావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్‌ నయిం అస్మీ, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్‌ నియామకం అయ్యారు. విశాఖ సిపి త్రివిక్రమ వర్మను అత్యంత తక్కువ సమయంలోనే బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో విశాఖ సిపీ ప్రభుత్వం అడిషనల్ రేంక్ అధికారిని నియమించింది.

Tadepalli

2023-09-05 09:47:20

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలో శుభవార్త..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరలోనే ఒక శుభవార్త చెప్పబోతున్నట్టు తెలిసింది. సచివాలయశాఖలో ఉన్న 19 విభాగాల్లో ఇన్ సర్వీస్ కోటాలో ఉద్యోగులకు ఉన్నత చదువులు, శిక్షణకు లైన్ క్లియర్ చేసేందుకు యోచన చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏఎన్ఎంలుగా  పనిచేస్తూ ఇంటర్ క్వాలిఫై అయిన వారికి జిఎన్ఎం(నర్శింగ్)లో శిక్షణ ఇప్పిస్తోంది ప్రభుత్వం . ఇక వ్యవశాయశాఖలోని డిప్లమా అగ్రికల్చర్, డిప్లమా హార్టికల్చర్, డిప్లమా సెరీకల్చర్, డిప్లమా ఫిషరీష్, డిప్లమా యానిమల్ హజ్బండరీ, డిప్లమా ఎలక్ట్రికల్, డిప్లమా ఇంజనీరింగ్, క్వాలిఫికేషన్ తో ఉద్యోగాల్లోకి చేరిన వారికి వారి మెరిట్ ఆధారంగా ఇన్ సర్వీసు శిక్షణ ఇస్తే పదోన్నతులతోపాటు త్వరలో ఖాళీలు కాబోతున్న ఉద్యోగాలను కూడా భర్తీచేయాలని యోచిస్తున్నది. ఉద్యోగులకు ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు పదోన్నతి ఉద్యోగాలకు అర్హులవుతారు. అదే కొత్త ఉద్యోగాలు భర్తీచేయాలంటే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. అదే ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులకే ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వడం ద్వారా త్వరలో ఖాళీలు కాబోతున్న స్థానాలకు వీరిని సిద్ధం చేయవచ్చు. అదేవిధంగా మళ్లీ ఖాళీలు భర్తీచేయాలనుకుంటే సచివాలయశాఖలోనే భర్తీచేయడం ద్వారా తక్కువ జీతంతో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం వుంది. దీనితో ఏఏ శాఖల్లోని ఉద్యోగులు ఇన్ సర్వీసు శిక్షణకు అర్హులుగా ఉన్నారనే కోణంలో జోరుగా పరిశీలనలు జరుగుతున్నాయని సమాచారం.

వైఎస్సార్సీపీ అధికారంలోని వచ్చిన తరువాత రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు విరమణ వయస్సుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఆ పెంచిన వయస్సు కూడా 2024 డిసెంబరులోగా వివిధ నెలలతో పూర్తయి ఉద్యోగ విరమణలు జరుగనున్నాయి.  ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడతాయి. వాటిని భర్తీచేయాలంటే ప్రభుత్వంపై అత్యంత అధిక ఆర్ధిక భారం పడుతుంది. అలాంటి సందర్భంలో ప్రస్తుతం 19 విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆ ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా పదోన్నతులు కల్పించడానికి కూడా సర్వీసు నిబంధనలు అడ్డంకి తొలగుతుంది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు 2 పీఆర్సీలు, బకాయిపడ్డ ఇంక్రిమెంట్లు వర్తింపజేస్తే సాధారణ మండల స్థాయి ఉద్యోగుల పేస్కేలుకి చేరుకుంటారు. దీనితో వారికి ఇచ్చే ఇన్ సర్వీసు శిక్షణ వలన మండల స్థాయిలో ఉద్యోగులను ప్రత్యేకంగా అత్యధిక జీతంతో నియమాకాలు చేపట్టే పనుండదు. ఏదైనా కొత్త ఉద్యోగాలు భర్తీచేయాలన్నా క్రింది స్థాయి ఉద్యోగాలతోనే భర్తీచేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగులుకు పదోన్నతులు, ఇన్ సర్వీసు శిక్షణ, ప్రభుత్వంపై ఆర్ధిక భారం అన్నీ తగ్గుతాయి. 

రాష్ట్రంలో వివిధశాఖల్లోని ఉద్యోగాల్లో చాలాశాఖల్లో ఏర్పడుతున్న ఖాళీలను భర్తీచేయాలంటే గ్రూప్-1, 2, 4, 5 కేటగిరీల్లో భర్తీచేయాల్సి వుంటుంది. ప్రస్తుతం
ఉద్యోగులకు ఇన్ సర్వీసు శిక్షణ ఇస్తే  తద్వారా చాలా మంది గ్రూపు-2 కేడర్ కు చేరుకుని మండల స్థాయి అధికారులుగా మారే అవకాశం ఉంటుంది. అప్పటికే మండల స్థాయి అంటే గ్రూపు-2 కేటగిరీల్లో ఉన్న అధికారులు పదోన్నతుల ద్వారా గ్రూప్-1 అధికారులుగా మారడానికి అవకాశం వుంటుంది. అప్పుడు ఉద్యోగాల కల్పన, జీతాలు చెల్లింపుల భారం ప్రభుత్వంపై పెద్దగా ఉండదు. దానికి తోడు ఉద్యోగులందరికీ సకాలంలో పదోన్నతులు ఇస్తున్నప్రభుత్వంగా కూడా కీర్తిని ఆర్జించవచ్చు. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ శిక్షణ, లేదా చదువు చెప్పించడానికి సర్వీసు రూల్స్ ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నదని చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్ సర్వీసు శిక్షణ ఇవ్వాలంటే ప్రభుత్వ కళాశాలల్లోనే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల్లో అవకాశం ఉన్నంత మేరకు ఎక్కువ మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం చేస్తున్న విధులకు ఆటంకం రాకుండా నైట్ కాలేజీ విధానం లేదా, ప్రత్యేక పూర్తిస్థాయి ఇన్ సర్వీసు శిక్షణ విధానంలో ఉద్యోగులను ఎంపికి చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచం అందుతున్నది. 

డిప్లమా అగ్రికల్చర్ చేసిన వారికి బిఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సర్వీసు శిక్షణ వచ్చి పూర్తయితే వీళ్లు మండల అధికారులుగా పదోన్నతి పొందవచ్చు. డిప్లమా హార్టికల్చర్ వారికి బిఎస్సీ హార్టికల్చర్ శిక్షణ పూర్తిచేసుకుంటే వీరు మండల హార్టికల్చర్ అధికారిగా పదోన్నతి పొందవచ్చు. డిప్లమా సెరీ కల్చర్ వారు బిఎస్సీ సెరీకల్చర్ పూర్తిచేస్తే మండల సెరీకల్చర్ ఆఫీసర్, డిప్లమా ఫిషరీష్ వాళ్లు బిఎస్సీ ఫిషరీష్ పూర్తిచే ఎఫ్డీఓ లేదా ఎఎఫ్ఇ, డిప్లమా వెటర్నరీ సైన్స్ వాళ్లు పశువైద్యులు , బివిఎస్సీ, డిప్లమా ఇంజనీరింగ్ వాళ్లు బిటెక్ ఇంజనీరింగ్( సివిల్, అండ్ ఎలక్ట్రకల్, అండ్ మెకానికల్) మండల ఇంజనీరింగ్ అధికారులు ఏఈగానూ,విద్యుత్ శాఖలో ఏఈలుగానూ  ఏఎన్ఎం చేసిన వారు జిఎన్ఎం(నర్శింగ్) పూర్తిచేసిన వారు స్టాఫ్ నర్సులుగానూ పదోన్నతులు పొందడానికి అవకాశం వుంటుంది. ఇప్పటికే ఏఎన్ఎంల ఇన్ సర్వీసు శిక్షణను రాష్ట్రప్రభుత్వం మరో ఏడాదిలో పూర్తిచేయబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7నుంచి 10వేల మందికి పైగా జిఎన్ఎం శిక్షణ పూర్తిచేయబోతున్నారు. వీరంతా శిక్షణ అంనంతరం మళ్లీ సచివాలయాలు, లేదా గ్రామీణ విలేజ్ క్లినిక్ విధులు నిర్వహించడానికి వినియోగించుకునే అవకాశం వుంటుంది. కాగా ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లుగా ఉన్నవారికి ఇన్ సర్వీసు బిఈడి లేదా డిఈడి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులుగా లేదా హాస్టల్ వెల్ఫేర్ అధికారులుగా పదోన్నతి కల్పించే అవకాశాలు, ఇతర శాఖల ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షల ద్వారా పదోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భారం పూర్తిగా తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. చూడాలి ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!

Amaravati

2023-08-27 02:31:09

గ్రామ, వార్డు సచివాలయశాఖను కదిలించిన ఆర్టీఐ

ఏపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై దాఖలైన సమాచారహక్కు చట్టం దరఖాస్తుపై స్పందించింది. ఉద్యోగులకు సర్వీసు రూల్స్ అమలు చేస్తూ జీఓల ఆధారంగా పదోన్నతులు కల్పిస్తున్నది. శ్రీకాకుళంజిల్లాలో 10మంది, గుంటూరు జిల్లాలో 1, వైఎస్సార్‌ జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 2 చొప్పున పదోన్నతులు పొందారు. మిగిలిన జిల్లాల్లో 35మందికి పదోన్నతుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం 17శాఖల సిబ్బందికే ప్రమోషన్ ఛానల్ ఉండగా, ఇంజనీరింగ్ , ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. వారికి కూడా త్వరలోనే విధి విధానాలు ఖారారు చేయనుంది . అదే సమయంలో ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, పీఆర్సీ అరియర్స్, 9నెలల బకాయిల విషయం, మిగులు ఉద్యోగాల ఖాళీలపైనా స్పష్టత రానుంది.

Vijayawada

2023-08-26 06:36:47

పదోన్నతులు సరే.. ఎగ్గొట్టిన ఆ ప్రయోజనాల మాటేమిటి..?!

భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తొంగిచూసేలా గ్రామంలోనే సేవలు అందేలా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి ఒకేసారి 1.26లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వం సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కాకుండా ఇపుడు పదోన్నతులు కూడా ఇస్తుండటం ఎంతో శుభపరిణామం. ప్రజల సేవల కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మాత్రం ఇంకా మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది..కాదు కాదు ఆ విషయాన్ని మాట్లాడకుండా చేస్తున్నదనే అపవాదుని మూటగట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయాలు, అందులో ఉద్యోగాలు పొందిన సిబ్బంది కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో మరెందరో ఉద్యోగులు ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం సాధారణ సెలవులు, 2వ శనివారాలు, ఆదివారాలు కూడా తీసుకోకుండా పనిచేసిన ఉద్యోగులకు మాత్రం రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రయోజనాలను, బకాయిలను మాత్రం పూర్తిగా పెడచెవిన పెట్టింది. వాటికోసం ఏమీ మాట్లాడకుండా ఇపుడు పదోన్నతులు ఇస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఒకేసారి లక్షా 26వేల మంది ఉద్యోగులను నియమించి.. ఆతరువాత కారుణ్య నియామకాల్లో మిగిలి పోస్టులు భర్తీ చేయడం ద్వారా సుమారు లక్షా 34 వేల ఉద్యోగాలు భర్తీచేసిన ప్రభుత్వానికి ఉద్యోగులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు విషయం పెద్ద లెక్కేం కాదు. ఇక్కడ ఈశాఖను చూసే రాష్ట్ర అధికారులు ఆ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లలేదా.. కావాలనే ప్రయోజనాలేమీ ఇవ్వకుండా వారికి పదోన్నతులు ఇచ్చేస్తే ఇవ్వాల్సిన ప్రయోజనాల మాట అడగరని అధికారులు భావించి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారా అనే విషయం తేలడం లేదు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాల్లోనే రెండేళ్లు ప్రొబేషన్ తరువాత సర్వీసులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం లిఖిత పూర్వ కంగా తెలియజేసింది. కానీ వీరి ఉద్యోగాలనే 2.9 ఏళ్ల తరువాత దశల వారీగా క్రమబద్దీకరణ చేస్తూ వచ్చింది అదీ కూడా వీరికి ప్రత్యేకంగా పెట్టిన పరీక్షలు పాసైన వారికి. ఇంకా నేటి వరకూ చాలా మందికి ఉద్యోగాలు కూడా రెగ్యులర్ కాలేదు. అలా తొమ్మిది నెలలు అదనంగా పనిచేయించుకున్న సమయంలో ఉద్యోగులు తొమ్మిది నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు సుమారుగా రెండు డిఏలు కూడా కోల్పోయారు. సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన తొలి రెండు ఇంక్రిమెంట్లను ప్రభుత్వం నేటి వరకూ ఉద్యోగుల బేసిక్ పేకి కలపనేలేదు. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి రెండేళ్లు ప్రొభేషన్ అంటే ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను అనుసరించి రెండు ఇంక్రిమెంట్లను కలిపి వారి పేస్కేలు రివైజ్డ్ చేసి సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సి వుంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే సమయంలో సచివాలయ ఉద్యోగులకు కూడా వాటిని వర్తింపచేస్తున్నామని పేస్కేలు పెంచి  వీరికి పీఆర్సీ అరియర్సు ఇవ్వ లేదు. అంతేకాదు వీరికి పీఆర్సీ ఇచ్చే ముందే ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెచ్ఆర్ఏ, డిఏల్లోనే ముందుగా ప్రత్యేక జీఓని విడుదల చేసి కోత పెట్టింది. ఆ తరువాత మళ్లీ కాస్త మార్పులు చేర్పులు చేసి వాటిని పెంచుతున్నట్టు పాత వాటినే రివైజ్డ్ పీఆర్సీగా మార్పు చేసి వీరికి పీఆర్సీని అమలు చేసింది. ఈ ప్రయోజనాల బకాయిలను రాష్ట్రప్రభుత్వం నేటి వరకూ సచివాలయ ఉద్యోగులకు చెల్లించనే లేదు. ఇపుడు సర్వీసు రెగ్యులైజేషన్ పూర్తయిన వారికి ఒక ఇంక్రిమెంటు ఇస్తున్నట్టు చెబున్న ప్రభుత్వం పాత రెండు ఇంక్రిమెంట్ల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.

సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరి నాలుగేళ్లు పూర్తవుతున్న సమయంలో ఉద్యోగ ప్రవేశ పరీక్షలో టాప్ టెన్ లో నిలిచిన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలా తొలుత హార్టికల్చర్ విభాగంలో గ్రామీణ ఉద్యాన సహాయకులకు, విలేజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించింది. అయితే ఇక్కడ పదోన్నతి కల్పించే సమయంలోనూ వారికి 2 ఇంక్రిమెంటు కలపాల్సి వుంటుంది. కానీ వాటిని వారికి కలిపిందా..? లేదా..? అనే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మొత్తం 19శాలఖల ఉద్యోగుల్లో నేటి వరకూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయనే లేదు. వారికి ప్రస్తుత ఉద్యోగాల తరువాత ఏ పదోన్నతి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సచివాలయ మహిళ సంరక్షణా కార్యదర్శి(మహిళా పోలీసు)లకు కోర్టుకేసుల నేపథ్యంలో వారికి పోలీస్ స్టేషన్ విధులు, బందోబస్తు డ్యూటీలు వేయమని చెబుతూ డిజిపి ఆదేశాలతో వారికి పోలీసుశాఖ విధుల నుంచే పూర్తిగా పక్కన పెట్టేశారు. మిగిలిన 17శాఖల ఉద్యోగులకు ఏ తరహా పదోన్నతులు వస్తాయో అధికారులు తెలియజేస్తున్నారు తప్పితే వారికి ఇప్పటి వరకూ ఎగ్గొట్టిన ప్రయోజనాల విషయం మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఆ విషయాన్ని వీరికి సర్వీసు రిజిస్టర్ లో కూడా ఎక్కడా పొందు పరచలేదు. అసలు రెండేళ్ల తరువాత రెగ్యులర్  చేయాల్సిన ఉద్యోగాలను, ప్రభుత్వం ఆలస్యంగా రెగ్యులర్ చేయడంతోపాటు, వారికి న్యాయబద్దంగా రావాల్సిన, ఇవ్వాల్సిన ఇంక్రింమెంట్లు ఇవ్వకపోవడంపై సచివాలయ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. అయితే ఆ నిరసనను కల్పిపుచ్చడానికే పదోన్నతులను తెరపైకి తెచ్చారని ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. 

ప్రభుత్వం ప్రకటించినట్టుగా, చెప్పినట్టుగా, ఉద్యోగుల పక్షాన ప్రేమాభిమానాలు చూపిస్తున్నట్టుగా పదోన్నతులు ఇస్తే.. ఒకేసారి 1.30లక్షల మంది ఉద్యోగుల్లో సర్వీసు రెగ్యులర్ అయిన ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలి. అలా కల్పించిన సమయంలో వారికి ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను కూడా సర్వీసు రూల్స్ ప్రకారం ఎస్ఆర్ లో నమోదు చేయాలి. ‘‘మొదటి దానికి మొగుడు లేడు.. కడదానికి కళ్యాణం అన్నట్టుగా’..’ముందు ఎగ్గొట్టిన ప్రయోజనాల విషయం తేల్చకుండా.. పదోన్నతుల విషయాన్ని తెరపైకి తీసుకురావడం అంటే ఉద్యోగులను పూర్తిగా మోసం చేయడమేనని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ సెలవురోజుల్లో కూడా ఖాళీగా ఉంచకుండా ప్రభుత్వ విధులు ఇంటి దగ్గర నుంచే చేయిస్తూ.. జూమ్ మిటీంగులు, వివిధ రకాల సర్వేలు నిర్వహిస్తూ పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల విషయంలో అధికారులు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఉద్యోగలకు జీతం 31రోజులకీ కలిపే ఇస్తున్నప్పుడు..ప్రభుత్వం ఎప్పుడు పనిచెబితే అపుడు చేయాలని హుకుం జారీ చేస్తున్న ప్రభుత్వం..సబార్డినేట్ సర్వీసు రూల్స్ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఎందుకు ఎగ్గొట్టిందనే విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎనర్జీ అసిస్టెంట్లలో ఇప్పటి వరకూ విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదు.

 ఇవన్నీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కి తెలిసే సచివాలయ రాష్ట్ర అధికారులు చేస్తున్నారా..? లేదంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకునేందుకు విధులు మాత్రం అధికంగా చేయించేసి.. తీరా ప్రయోజనాలు ఇచ్చే సమయానికి మాత్రం ఎక్కడలేని నొప్పులతో అధికారులే వారి సొంత డబ్బులు వీరికి జీతాలుగానూ, ప్రయోజనాలుగానూ ఇస్తున్నట్టు ఫీలైపోతున్నారా అనే విషయం మాత్రం తెలియడం లేదు. దేశం మొత్తం తొంగిచూసే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల శ్రమదోపిడీ చేసి కూడా వారికి న్యాయబద్దంగా..చట్టబద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాల ఇచ్చేందుకు సాకులు చూపడాన్ని ఏమంటారో ప్రభుత్వమే ఉద్యోగులకు సమాధానం చెప్పాల్సి వుంది. ఉద్యోగులకు ఎన్నడూ లేనివిధంగా పదోన్నతులు ఇస్తున్నామని గర్వంగా చెబుతున్న ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రయోజనాలను ఇస్తుందా..? లేదటే వాటికి ఈ పదోన్నతులను ముడిపెడుతుందా..? లేదంటే ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని అంటగడుతుందా..? అదీ కాదంటే ఈ శాఖకు చేయాల్సిన చట్టబద్దత.. వచ్చే ఎన్నికల నాటికి ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఒక హామీగా దాచుకుంటుందా అనేది కూ డా తేలాల్సి వుంది..గ్రామ, వార్డు సచివాలయశాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక కమిషనర్, ఇద్దరు డైరెక్టర్లు, జిల్లాల్లో కలెక్టర్లు, మండలాల్లో ఎంపీడీఓలు ప్రత్యేకంగా మానటరింగ్ చేస్తున్నా.. ప్రభుత్వంలో జరిగిన తప్పుని మాత్రం ఎక్కడా ఒప్పుచేసే పనికి పూనుకోవడం లేదు. ఇదే పద్దతి కొనసాగితే దీని ప్రభావం వచ్చే 2024 ఎన్నిల్లో తప్పని సరిగా పడుతుందనే ప్రచారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతోంది.. విధినిర్వహణ విషయంలో ఆంక్షలు, ఆదేశాలు, టార్టెట్లు పెట్టే ప్రభుత్వం తీరా తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఏం మాట్లాడకుండా ఉండటాన్ని పరిశీలకులు కూడా రక రకాలుగా అంచనాలు వేస్తున్నారు.. ?!
 

Tadepalli

2023-08-26 05:02:37

తిరుమలలో మరో ఐదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

తిరుమల కాలిబాటల సమీపాన మళ్లి ఐదు  చిరుతల కదలికలు కనిపించాయి. నామాల గవి, నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో ఐదు చిరుతల కదలికలు గుర్తించారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు బోన్లు పెట్టి మూడు చిరుతలను బంధించగా ఇపుడు కనిపించినవి కొత్తవిగా భావిస్తున్నారు. తిరుమలలో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాప్‌ కెమెరాల ఆధారంగా ఇంకా ఐదు చిరుతలు ఉన్నట్లు- అధికారులు గుర్తించారు. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి..వాటిని ఎలా బంధించాలి అనే దానిపై అటవీ శాఖ వ్యూహం సిద్ధం చేస్తోంది. త్వరలో వాటిని బంధించి జూకు తరలిస్తామని డిఎఫ్‌ఓ సతీష్‌రెడ్డి చెబుతున్నారు. గతంలో అప్పుడప్పుడు తిరుమల కాలినడక బాట, అడవికి సమీపాన ఉండే గెస్ట్‌హౌస్‌ల వద్ద మాత్రమే కనపించిన వన్యమృగాలు.. ఇటీవల జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే ధైర్యంగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

 నడకదారి భక్తబృందంలోని ఓ బాలుడిపైన చిరుత దాడి చేసి గాయపరచడం, ఇటీవల బాలిక లక్షితను ఓ పొట్టన పెట్టుకోవడడం వంటి సంఘటనలతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నా యి. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ కాలినడక మార్గాలు ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.  దీంతో టిటిడి అటవీ శాఖ వన్యమృగాల రాకను అడ్డుకోవడానికి భక్తులలో నెలకొన్న భయాందోళ నలు తొలగించడానికి అనేక చర్యలు చేపట్టాయి. తిరుమలలో సాగుతున్న ఆపరేషన్‌ చిరుతలో భాగంగా కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ చిరుత బోను దగ్గరికి వచ్చి వెంటనే పక్క నుంచి వెళ్లిపోయిందని డిఎఫ్‌ఓ చెప్పారు. మరో ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు- గుర్తించారు. వీటిని బంధించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

Tirupati

2023-08-25 17:02:57

బయో మెట్రిక్ అటెండెన్స్ వేయకపోతే జీతానికి రంగుపడుద్ది

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జిఎస్ డబ్ల్యూఎస్ యాప్ ద్వారా నూరుశాతం బయో మెట్రిక్ అటెండెన్సు పడితేనే ఉద్యోగులకు ఇకపై పూర్తిస్థాయి జీతాలు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగులు విధిగా ఉదయం విధులకు వచ్చినపుడు పది గంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఖచ్చితంగా హాజరు వేయాల్సి వుంటుంది. కాగా చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉత్తర్వులను పెడచెవిన పెట్టి వారికి నచ్చినట్టుగా ఉద్యోగాలు చేస్తూ బయో మెట్రిక్ అటెండెన్స్ వేయడం మానేస్తున్నారు. దానిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. అటెండెన్సు ఆధారంగానే జీతాలు ఇస్తామని సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. దానికోసం గ్రామ,సచివాలయశాఖ డైరెక్టర్ డా.లక్ష్మీషా మెమో-114/F/2022ను జారీచేశారు. ఈ మెమో ప్రకారం ఆగస్టు 1నుంచి 31 వర్తిస్తాయని, దానికి బాధ్యత డిడిఓలు తీసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. దీనితో ఉద్యోగులు క్రమం తప్పకుండా బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారు. 

Vijayawada

2023-08-25 04:14:20

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు దారెటు..?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖకి బాలారిష్టాలు తీరకపోగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్  అధికారుల ముందుచూపులేకపోవడం, సరైన మార్గదర్శకాలు రూపొందించకపోవడం, ఉద్యోగనిమకాల్లో నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలు ఇపుడు ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించాయి. గ్రామాల్లో రక్షణ, విద్యార్ధినిలు, మహిళలు, గృహిణిల సంరక్షణార్ధం నియమించిన సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలా ఉంది. అసలు వీరు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులా..లేదంటే..మరే ఇతర శాఖకు చెందిన ఉద్యోగులో తెలియని పరిస్థితి కోర్టుకేసులతో దాపురించింది. వీరి నియామకాలు పోలీసు నియామ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఏ ముహూర్తాన ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రైవేటు కేసు హైకోర్టులో పడిందో నాటి నుంచి నేటివరకూ కోర్టు కేసులు ఈశాఖను వెంటాడుతూనే ఉన్నాయి. ఫలితంగా సచివాలయ మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ విధులు, బందో బస్తు డ్యూటీలు అప్పగించమని నేరుగా ఆంధ్రప్రదేశ్ డిజిపి కోర్టుకి విన్నవించుకోవాల్సి వచ్చింది. అక్కడితో కధ ఆగిందా అనుకుంటే అక్కడి నుంచే కష్టాలు మరింత  ఎక్కువై..వీరిని దారుణంగా వెంటాడుతున్నాయి. నేరుగా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి 26 జిల్లాల ఎస్పీలకు, సిపిలను మహిళా పోలీసులను పోలీసుశాఖ విధులకు వినియోగించవద్దని హెచ్చిరించి చెప్పినా ఫలితం లేకపోయింది. డిజిపి మాటలు, కోర్టు ఉత్తర్వులు నీటి మీద రాలతే అనుకున్నారో ఏమో పోలీసు అధికారులు..ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ..వారిని కోర్టు కేసు తరువాత కూడా స్టేషన్ డ్యూటీలు, తీర్ధాలు, ఉత్సవాల్లో బందో బస్తు డ్యూటీలకు వినియోస్తూ కోర్టు దిక్కారానికి, డిజిపి ఆదేశాల బేఖాతరుకు పాల్పడుతున్నారు.

సచివాలయ మహిళా పోలీసులను పోలీసుశాఖ ద్వారా నియమించినప్పటికీ వీరికి ఐసిడిఎస్, ఎన్నికల కమిషన్ బిఎల్వో, సచివాలయాల్లో ఇతర ప్రభుత్వ పథకాల విధులు అప్పగించారు. అంతేకాదు వీరికి ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేక జీఓ ఇచ్చారు. ఇపుడు ఆ జీఓ పనిచేస్తుందో లేదో తెలియకుండా పోయింది. పోలీసుశాఖ ద్వారా నియమితులైన మహిళా పోలీసులకు ఏకంగా ఆ పోలీసుశాఖ విధులే అప్పగించమని డిజిపి ఏపీ హైకోర్టుకి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. అలాంటపుడు వీరు ఏ ప్రభుత్వశాఖకు చెందుతారు..? వీరికి డ్యూటీ చార్టు ఏవిధంగా అమలు చేస్తారనేది ప్రశ్నార్ధకమైంది..? ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో పోలీసులు డిజిపి ఆదేశాలున్నా వారికి స్టేషన్ డ్యూటీలు, బందో బస్తు డ్యూటీలు వేస్తుంటే..మరికొన్ని జిల్లాల్లో కోర్టులతో వ్యవహారం మనకెందుకులే అని వారిని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకూ సచివాలయ విధులకే వినియోగించుకోవాలని వదిలేశారు. దీనితో ప్రభుత్వ పథకాలు, ఇతర పంచాయతీ వ్యవహారాలకు మహిళా పోలీసులనే వినియోగిస్తున్నారు. ఈపరిస్థితుల్లో తమ పరిస్థితి ఏమిటో తమకు అర్ధం కావడంలేదని.. తమకు మళ్లీ పోలీసుశాఖనే కేటాయించాలని, యూనిఫాం ఇవ్వాలని, డ్యూటీ చార్టు అమలు చేయాలని కోరుతూ మెజార్టీ మహిళా పోలీసులు ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి తమ గోడును వెల్లగక్కుతున్నారు. వినతి పత్రాలు ఇస్తూ వారిని ప్రశన్నం చేసుకుంటున్నారు. విషయం కోర్టులో ఉండటంతో ప్రజాప్రతినిధులు మహిళా పోలీసులు చేస్తున్న వినతులను భద్రంగా తమ కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు.

 గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు ఉద్యోగాలను ప్రభుత్వం సుమారు 14వేలకు పైగా నియమించడంతో.. అసలైన కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి విఘాతం కలిగినట్టు అయ్యింది. దీనితో తాము ఉద్యోగాలు కోల్పాయమంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నవేళ..పోలీసుశాఖలోని కొందరు సిబ్బంది ప్రభుత్వం చేసిన తప్పును, నిబంధనలను బయటకు తీసి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అందించడంతో కోర్టులో కేసులు పడ్డాయని కూడా చెబుతున్నారు. అలా మొదటి కోర్టు కేసు పోలీసు నియామక బోర్డు ద్వారా కాకుండా వీరిని డిఎస్సీ ద్వారా ఎలా నియమిస్తారంటూ దాఖలైంది. అక్కడి నుంచి వరుస కోర్టు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుళ్లకు, హోం గార్డులకు గ్రామాల్లో కాస్త పరపతి తగ్గింది. ఏ చిన్న సమస్య వచ్చినా నేరుగా మహిళా పోలీసులనే ప్రజలు కవడం, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, సారా నియంత్రణలో కీలకంగా వ్యవహరించడం, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ లు ఇవ్వడం.. అన్ని కార్యక్రమాల్లో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలతో మహిళా పోలీసులే ఉండటంతో క్రిందిస్థాయి కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది మింగుడు పడకుండా పోయింది.. ఒకరకంగా స్టేషన్ లోని కానిస్టేబుళ్లే నేరుగా ఎస్ఐలతోనూ, సిఐలతో ప్రతినిత్యం మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది మహిళా పోలీసుకు నేరుగా ఎస్ఐలు, సిఐలు, ఇంటెలిజెన్సు సిబ్బందితో మాట్లాడే అవకాశాలు రావడం, స్టేషన్ సిబ్బంది పనులు కూడా సచివాలయ మహిళా పోలీసులతోనే చేయించుకోవాల్సి రావడంతో వారికి ఏం చేయాలతో పాలుపోకననే ప్రభుత్వ లోపాలను బయట పెట్టడం ప్రారంభించారనే విషయం ఇపుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 ఆకారణంతోనే  ఎలాగైనా మహిళా పోలీసులను పోలీసుశాఖ నుంచి వెల్లగొట్టాలనే నెపంతోనే పోలీసుశాఖలోని సిబ్బందే ప్రభుత్వం అనాలోచితంగా నియమించిన మహిళా పోలీసు ఉద్యోగాలను కోర్టు కేసుల ద్వారా ప్రభుత్వానికి విసుగు వచ్చేలా చేస్తే.. ప్రభుత్వమే వారిని వేరొక శాఖలో విలీనం లేదా, ఇదే పోలీసు శాఖలో మినిస్టీరియల్ స్టాఫ్ గా మార్చడానికి అవకాశం వస్తుందని భావించినట్టుగా చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసు నియామక బోర్డు ద్వారా వీరి నియామకాలు జరగలేదనే విషయం, వారు పోలీసు ఉద్యోగాలకు సరిపోరనే విషయాన్ని పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది చెబితే తప్పా అసలు విషయం బయటకు రాదని, ఇది కావాలని పోలీసుశాఖ సిబ్బంది చేసిన పనిగానే ఇటు ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదట. గ్రామ, వార్డు సచివాలయశాఖపై మొదటి కోర్టు కేసు నమోదు అయిన దగ్గర నుంచి తరువాత కోర్టు కేసులు ఏవిధంగా నమోదు అవుతున్నాయో వాటిని కూడా ప్రభుత్వం నిసితంగా పరిశీలించడంతోపాటు, వీటి వెనుక ఎవరెవరి ఇంటి దొంగల హస్తం వుందనే విషయంలో కూడా నిఘా పెట్టినట్టు తెలిసింది. ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు పోలీసు సిబ్బంది ఇదే మహిళా పోలీసుల్లో యూనిఫారం, పోలీసు విధులు ఇష్టం లేని వారిని గుర్తించి వారి ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా కొందరు మహిళా పోలీసులు తమకు యూనిఫారం, స్టేషన్ డ్యూటీలు వద్దంటూ ప్రభుత్వానికి అర్జీలు కూడా పెట్టారు. అయితే మెజార్టీ ఉద్యోగులు పోలీసుశాఖతో కలిసి పనిచేయాలని ఉందని చెప్పడంతో ఆ విషయం ఇపుడు ఈ శాఖలో నానుతూ వస్తోంది. పైగా ఈవిషయంలో క్లారిటీ వస్తే ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టు ఏడాదికి ఒకసారి ఐదువేల మంది కానిస్టేబుళ్లు ఇతర పోస్టులను భర్తీచేస్తుందని కూడా మహిళా పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న పోలీసుశాఖలోని పనిచేస్తున్నట్టుగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

మహిళా పోలీసుల్లో కొందరు తమకు ఈ పోలీసు విధులు వద్దని, అత్యధిక మంది కావాలని ఎవరకి వారు ప్రభుత్వానికి అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొందరు కోర్టు కేసులు కూడా వేసుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు పోలీస్ స్టేషన్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు వేయమని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసిన దగ్గరనుంచి వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసలు వీరు పోలీసుశాఖ ఉద్యోగులేనా అనే అనుమానం వీరికే వస్తున్నది. తమను మళ్లీ పోలీసుశాఖలో ఉంచి తమకు డ్యూటీచార్ట్, ప్రమోషన్ ఛానల్, సర్వీసు రూల్స్ ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విషయం కోర్టులో ఉండటంతో ప్రభుత్వం కూడా వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క గ్రామ, వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం కూడా చట్టబద్ధత కల్పించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన, ఉద్యోగం ఉంటుందా..? ఊడుతుందా అనే భయం మరింత ఎక్కువైంది. 2024 ఎన్నికలు తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే సరేసరి..ఒక వేళ రాకపోతే తమ పరిస్థితి ఏంటనే అనుమానానికి వచ్చి తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు. మరోప్రక్క వీరికి ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోవడం కూడా వీరి ఉద్యోగంపై ఆందోళనలు మరింత ఎక్కువవుతున్నాయి. చూడాలి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఈ శాఖకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తుంది..?ఉద్యోగులకు ఇప్పటి వరకూ ఇవ్వకుండా ఉండిపోయిన ప్రయోజనాలు..పీఆర్సీ అరియర్స్ బకాయిలు, రెండు ఇంక్రిమెంట్లు, కోల్పోయిన 9నెలల పేస్కేసలు, ప్రమోషన్ ఛానల్, సర్వీసు రూల్స్, తదితర విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!

Tadepalli

2023-08-24 04:22:28