1 ENS Live Breaking News

విశాఖ నగరంలో పారిశుధ్య నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు

రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, తాగునీటి విభాగపు సిబ్బంది, సమ్మెలో పాల్గోన్నందున నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు, పారిశుధ్య సేవలు అందిం చడంలో ఆటంకం కలుగుతున్న దృష్ట్యా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరి సతీష్, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ లతో కలసి జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆమె చాంబర్లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, జివిఎంసి బడ్జెట్ సమావేశం అనంతరం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పారిశుధ్య నిర్వహణపై చర్చలు జరిపి, వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే నగర పరిధిలో పారిశుద్ధ కార్మికులు, తాగునీటి విభాగం సిబ్బంది సమ్మె కారణంగా నగరంలో పారిశుధ్య పనులకు, తాగునీటి సదుపాయానికి అంతరాయం కలుగుతున్నందున జివిఎంసి యంత్రాంగం ప్రత్యేక చర్యల ద్వారా తాత్కాలికంగా పారిశుధ్య సిబ్బందిని వ్యర్దాలు తరలించుటకు ప్రైవేట్ వాహనాలను అలాగే జివిఎంసి కి చెందిన సొంత వాహనాలు, జివిఎంసి పర్మినెంట్ పారిశుధ్య సిబ్బందిని ఉపయోగించి పారిశుధ్య నిర్వహణ పనులు చేపడుతుందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నందున ప్రభుత్వం సానుకూల వాతావరణంలో కార్మికులతో చర్చలు జరుపుతున్నందున అవి ఫల ప్రథమవుతాయని అంతవరకు నగర ప్రజలకు అంతరాయం కలుగకుండా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు పారిశుధ్య కార్మికులు నగర పరిశుభ్రతకు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2024-01-09 15:39:37

జడ్డు వాసుదేవరావు మృతి ప్రభుత్వ హత్యే.. టిడిపి నేత ఆడారికిషోర్ కుమార్

సర్వశిక్ష ఉద్యోగి జడ్డు వాసుదేవరావు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 21రోజుల పాటు ఆందోళన చేస్తూ అకస్మాత్తుగా మృతిచెందడం చాలాదారుణమని టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనకాపల్లి డిఈఓ కార్యాలయం వద్ద సర్వశిక్షాఉద్యోగులు, మృతిచెందిన వాసుదేవరావుతో మృతదేహంతోపాటు ఆయన కూడా ఆదందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ, సర్వశిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎంటిఎస్ గా చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ల సాధన కోసం పోరాటం చేసే ఉద్యోగి మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ఇంకా ఎంతమందిని బలితీసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తోందో ప్రకటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ, ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించేంతవరకూ ఉద్యోగుల ఉద్యమానికి, పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. వాసుదేవరావు మృతిపై డిఈఓ సమాధానం చెప్పాలని, ఆందోళన చేపడుతున్న సర్వశిక్ష ఉద్యోగి మృతిపైపోలీసుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించి ఆందోళన ఉదృతం చేయాలన్నారు. ఈ విషయాన్నిఇంటెలిజెన్స్ సంస్థలు కూడాప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మృతుని కుటుంబానికి ఆసుపత్రికి అయిన రూ.10లక్షలతోపాటు, తమ కుటుంబ పెద్దను కోల్పోయినందుకు కూడా నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వశిక్షా ఉద్యోగుల ఉద్యమానికి రాజీలేని మద్దతు ఇస్తామని పునరుద్గాటించారు. అనంతరం బయటకు వచ్చిన డిఈఓ తో జరిగినవిషయంపై గట్టిగా చర్చించారు. డిఈఓ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయినా ఆమాటలకు అంగీకరించని కిషోర్ మృతదేహంతోనే జాతీయ రహదారిపై బైటాయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిషోర్ యువసేన ప్రతినిధులు, అధిక సంఖ్యలో సర్వశిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు.


Anakapalle

2024-01-09 08:27:17

అనకాపల్లి టిడిపి ఎంపీగా అవకాశం కల్పించడి..బుద్దాకి ఆడారి వినతి

అనకాపల్లి పార్లమెంటు స్థానానిక ఎంపీ అభ్యర్ధిగా తనపేరును ప్రతిపాదించాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ బుద్దానాగజగదీష్ కు ఆడారి కిషోర్ కుమార్ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి అభ్యర్ధించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షుల సూచనలు, సలహాల మేరకు నడుచుకుంటూ యువజనవిభాగంలో కష్టపడి పనిచేస్తున్నానని, ఈ ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పిస్తే తనను తాను నిరూపించుకుంటానని అన్నారు. యువతతోపాటు, పార్లమెంటు నియోజవర్గంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలలో టిడిపి, జనసేన యువత మద్దతు కూడా అభ్యర్ధిస్తున్నట్టు కిషోర్ కుమార్ బుద్దా దృష్టికి తీసుకొచ్చారు. ఆడారి అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన జిల్లా అధ్యక్షులు పార్టీ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆడారి కిషోర్ వెంట పలువురు టిడిపి నాయకులు, యువజనవిభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Anakapalle

2024-01-08 15:29:30

జనభాగీదారి కార్యక్రమాలను విజయవంతం చేయాలి

అమ‌రావ‌తిలోని స్వ‌రాజ్ మైదానంలో జనవరి 19న 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించనున్న  నేప‌థ్యంలో జ‌న‌భాగీధారి పేరిట ఈ నెల 9-18 వరకు నిర్వహించనున్న జిల్లా స్థాయి చైత‌న్య కార్య‌క్ర‌మాల్లో అందరూ భాగస్వామై, విజయవంతం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా మంగళవారం ఉద‌యం 7.00 గం.ల‌కు స్థానిక ఎల్.ఐ.సి బిల్డింగ్ స‌మీపంలోని అంబేద్క‌ర్ విగ్రహం నుంచి రామాటాకీస్ వ‌ద్దనున్న అంబేద్క‌ర్ భ‌వ‌న్ వ‌ర‌కు జిల్లాస్థాయి మార‌థాన్ నిర్వహించ‌నున్నట్లు చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జేకేసీ కార్యక్రమం అనంతరం డీఆర్ఓ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మంగళవారం, బుధవారం, జనవరి 18న పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న అంబేద్కర్ భవన్ లో ఉదయం 9 గం. ల నుండి రక్తదాన కార్యక్రమం, జిల్లా స్థాయి ఫోటో ఎగ్జిబిషన్, అంబేద్కర్ జీవిత చరిత్రపై తీసిన షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనలకు బహుమతి ప్రధానం ఉంటుందని చెప్పారు. అలాగే 18న ఉదయం 9 గం.లకు ఎల్ఐసి భవనం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకరణ, మానవహారం, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో ప్రతిజ్ఞ కార్యక్రమాలు ఉన్నట్లు వివరించారు. అదే రోజు ఉదయం 11 గం.లకు అంబేద్కర్ భవన్ లో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జనవరి 9, 10 తేదీల్లో రక్తదాన కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా అధికారులు, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది భాగస్వాములు అవుతారని తెలిపారు. రక్తదాన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని చెప్పారు.

Visakhapatnam

2024-01-08 14:52:51

సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషిచేయాలి - వంశీక్రిష్ణశ్రీనివాస్

విశాఖజిల్లాలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని జిల్లా అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం శివాజీపాలెం జనసేన క్యాంప్ కార్యాలయంలో  జీవిఎంసీ పరిధిలో గల జనసేన వీర మహిళలతో విశాఖ నగర జనసేన అధ్యక్షులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా పార్టీ కోసం ఇప్పటివరకు అహర్నిశలు శ్రమించిన వీర మహిళల  అభిప్రాయాలను, సూచనలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం వంశీ మాట్లాడుతూ, త్వరలో పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టనున్నట్టు చెప్పారు. శ్రమించి పనిచేసేవారికి సముచిత స్థానం వుంటుందని తెలియజేశారు. పార్టీ  మరింత బలపడేందుకు, వీర మహిళలు చేయవల్సిన విది విధానాలను పార్టీ  అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆదేశానుసారం  మహిళలను ప్రోత్సహిస్తామని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను, పార్టీ  విది విధానాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో  విజయ్ కుమార్, నార్త్ ఇంఛార్జి  ఉషాకిరణ్, వెస్ట్ ఇంఛార్జి  ఆంగా ప్రశాంతి, ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మీ , ఉత్తరాంద్ర  రీజినల్ కో ఆర్డినేటర్  కిరణ్ ప్రసాద్, నాగ లక్ష్మీ, త్రివేణి , అధిక సంఖ్యలో వీర మహిళలు పాల్గొన్నారు.

Visakhapatnam

2024-01-08 14:46:25

ఎన్టీఆర్‌ అభిమానుల సేవా కార్యక్రమాలు భేష్..దాడి రత్నాకర్‌

స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఎన్టీఆర్‌, నందమూరి అభిమానుల సేవలు మరువలేనివని యువ నాయకులు , డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్‌ అన్నారు.  గవరపాలెం లోని శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం  నందమూరి అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సొంత డబ్బులు వెచ్చిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఘతన ఒక్క నందమూరి అభిమానులకే దక్కుతుందన్నారు. నందమూరి అభిమానులు చేపట్టే ఏ కార్యక్రమానికైనా తనవంతు పూర్తి సహాయ సహకారాలు  అందిస్తామన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు.  నందమూరి బాలకృష్ణ,నారా భువనేశ్వరి , లోకేష్‌ తోపాటు బ్రాహ్మణి కూడా స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజా సంక్షేమానికి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. అనకాపల్లి అంటే ఎన్టీఆర్‌ కి ఎంతో ఇష్టమని..అందుకే ఒక లెక్చరర్‌గా పనిచేసే దాడి వీరభద్రరావు కి ఎమ్మెల్యే పదవి తో పాటు రాష్ట్ర కేబినెట్‌ మంత్రి పదవి కూడా ఇచ్చి అనకాపల్లికి దేశంలో మంచి గుర్తింపు వచ్చేలా చేశారన్నారు. దీంతో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు  హయాంలో అనకాపల్లిలో ఎన్టీఆర్‌ పేరుతో ఎన్టీఆర్‌ వైద్యాలయం, ఎన్టీఆర్‌ బెల్లం మార్కెట్‌ యార్డు, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ రింగురోడ్డు, ఎన్టీఆర్‌ రక్షిత మంచినీటి పథాకాలు వంటి అభివృద్ధి జరిగిందన్నారు.  ఎన్టీఆర్‌ సతీమణి బసరతారకం పేరుతో వెంకుపాలెం వద్ద వంతెన, బసవరామతారక కాలనీ (బీఆర్‌టీ) ఇలా కలకాలం నిలిచిపోయే కట్టడాలను నిర్మించి ఎన్టీఆర్‌ రుణం తీసుకొనే అవకాశం వచ్చిందన్నారు. ఆయన తో ఉన్న అనుబంధాలను, అనుభవాలను ఈ సందర్భంగా రత్నాకర్‌ వివరించారు. అనందరం అభిమానులు రత్నాకర్‌ ని శాలువా లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కొణతాల బాల, కరణం శ్రీనివాసరావు, కర్రి దివాకర్‌, చౌదరి, పొలిమేర నాయుడు, నాగు, తవుడుబాబు, పెతకంశెట్టి శ్రీను, అధికసంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-01-08 14:03:11

జ‌న‌వ‌రి 7-13వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 5న శుక్ర‌వారం శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు రామ‌చంద్ర‌క‌ట్టపైకి వేంచేపు చేస్తారు. ఆండాళ్ అమ్మ‌వారి నీరాటోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు స్వామివారు ముందుగా ఊరేగింపుగా వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.  జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి  అభిషేకం, ఆస్థానం చేపడ‌తారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ఈ విధంగా ఏడు రోజుల పాటు ఈ ఉత్సవం సాగుతుంది.

Tirupati

2024-01-04 11:45:38

జనసేన విశాఖజిల్లా అధ్యక్షుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది. ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు వంశీకృష్ణ. వైఎస్సార్సీపీలో పోటీ చేసే అవకాశాలు రావని తెలియడంతో వంశీకృష్ణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పవన్‌ సమక్షంలోనే జనసేనలో చేరారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరానని వంశీకృష్ణ యాదవ్‌ తెలిపారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని, తన రాజకీయ భవిష్యత్‌ నాశనం కావడానికి  ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని వంశీకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. యువరాజ్యం తరఫున అప్పటి ప్రభుత్వం పవన్‌తో కలిసి పోరాటం చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతోవైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ నుంచి ఎమ్మెల్సీగా పని చేస్తున్న ఆయన.. జనసేనలో చేరడంతో తిరిగి పవన్‌తో కలిసి పని చేయనున్నారు. వంశీకృష్ణ జనసేనలో చేరడంపై పవన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి వంశీకృష్ణ కృషి చేస్తారని పవన్‌ భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే విశాఖజిల్లా అధ్యక్షుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ ని నియమించడం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam

2024-01-03 13:56:26

అనకాపల్లి వైఎస్సార్సీపీలో ఫస్ట్ వికెట్ ఔట్.. దాడి రాజీనామా..!

వైఎస్సార్సీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసింది. విభజన జిల్లా అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గం నుంచి అంతకంటే బలమైన నాయకుడు పార్టీకి రాజీ నామా చేయడం ఇపుడు సంచలనంగా మారింది. దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రికి  తన రాజీనామా లేఖ పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ ముగించారు మాజీమంత్రి. అయితే.. రాజీనామా కాపీని సజ్జల, విజయసాయి రెడ్డికి పంపుతూ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించారు వీరభద్రరావు. టిడిపి నుంచి పార్టీ మారిన సమయంలో మంచి స్థానం ఇస్తారని అంత భావించారు. అయితే పార్టీ అభివృద్ధిలో దాడి మాటలకు విలువ ఇవ్వలే దనే మనోవేదన దాడి కుటుంబంలో ఆది నుంచీ ఉంది. అయితే పార్టీ మారిన వెంటనే ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయింది దాడికుటుంబం. ఆ తరువాత రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ పదవి గానీ దక్కుతుందని కేడర్ బావించినా ఆ సహకారం కూడా అందలేదు. ఈ క్రమంలో కేడర్ నుంచి, కుటుంబ సభ్యులు, నాయకులు నుంచి నిరసన వ్యక్తం కావడంతో దాడి ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు వైఎస్సార్సీపి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామాచేయడం సంచలనం అయ్యింది.

దాడి వీరభద్రరావు.. 1985లో మొదటిసారి ఎన్టీఆర్ పిలుపు అందుకుని రాజకీయ అరంగేట్రం చేసి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1994, 19 99లలో వరసగా గెలిచారు. అలా నాలుగు సార్లు గెలిచి పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. అనకాపల్లి రాజకీయాలను శాసించారు. 2007 నుంచి 2012 దాకా ఎమ్మె ల్సీగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఆ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమి చెందడంతో వైఎస్సార్సీపీకి దాడి కుటుంబం అంతే వేగంగా రాజీనామా చేసి బయటకు వచ్చారు. మళ్లీ 2019 ఎన్నికల ముందు తిరిగి వైఎస్సార్సీపీలో చేరి మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మె ల్యేగా గెలిపించేందుకు కృషి చేశారు.ఇపుడు 2024 ఎన్నికలకు ముందు దాడి కుటుంబ రాజీనామా పార్టీలో తీవ్రమైన చర్చకు తెరలేపింది. దాడి మళ్లీ టిడిపీలోకే వెళ్లే అవకాశాలున్నట్టు కనిపిస్తుంది. ఆయన టీడిపిలో చేరతారా లేదంటే ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందనేది కూడా చర్చనీయాంశం అవుతోంది.

Anakapalle

2024-01-02 10:46:42

విజెఎఫ్ ప్రక్షాళన దిశగా సమిష్టి కార్యాచరణకై అడుగులు

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రక్షాళన దిశగా సమిష్టి కార్యాచరణకై అడుగులు వేస్తున్నామని, దానికి విశాఖలో విజెఎఫ్ సభ్యులంతా కలిసి రావాలని కోశాధికారి అభ్యర్ధి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరో చీఫ్, పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం విజెఎఫ్ లో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజెఎఫ్ నిబంధనలకు విరుద్దంగా, కోర్టు కేసుల నెపాన్ని సాకుగా చూపి కాలం చెల్లిన కార్యర్గం అనధికారింగా పాలిస్తూ వచ్చిందన్నారు. దీని వలన ఎందో సీనియర్ జర్పలిస్లులు విజెఎఫ్ సభ్యత్వానికి కూడా నోచుకోకుండా పోయారన్నారు. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఆర్వర్వంలో ఫైవ్ కమిటీ, ఎన్నికల అధికారిని నియమించి స్వయంగా చేపడుతున్న ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా సభ్యులంతా సమిష్టిగా పనిచేసి విజెఎఫ్ ను అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని కోరారు. ఇన్నేళ్ల కాలంలో విజెఎఫ్ కి ఒక్కరూపా ఆస్తికూడా పెరగలేదని, వచ్చిన ఆదాయం కూడా సంక్షేమం పేరట అధిక ఖర్చుల రూపంలోనే సభ్యులకు చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా సొసైటీ నిబంధనలను, బైలానిబంధనలు పక్కన పెట్టి పాలించి, సభ్యులను మభ్య పెట్టిన పాత కార్వవర్గానికి అభ్యర్ధుల ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపు నిచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో రాజ్ న్యూస్ రిపోర్టర్ సుంకరిసూర్యం, సాక్షి టివిబ్యూరో రాచంద్రరావు, పబ్లిక్ బ్యూరో యర్రా నాగేశ్వర్రావు, మహాటివి బ్యూరో జి.శ్రీనివాసరావు, మనభూమి ఎడిటర్ సత్యన్నారాయణ, నేషనల్ న్యూస్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ పరశురామ్,వార్త ఇస్రయేల్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-12-09 11:11:36

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణలో పార‌ద‌ర్శ‌క విధానాలు పాటించాలి

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క విధానాలు అవ‌లంభించాల‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌లు తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా ఓట‌ర్ల జాబితా ప‌రిశీల‌కులు (రోల్ అబ్జెర్వ‌ర్) జె.శ్యామ‌ల‌రావు ఆదేశించారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విమాన మార్గం ద్వారా సోమ‌వారం ఉదయం ఆయ‌న విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గాజువాక‌, ప‌శ్చిమ‌, ఉత్త‌ర అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాల ప‌రిధిలోని పోలింగ్ కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. జాబితాల‌ను, సంబంధిత రికార్డుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించారు. మార్పులు చేర్పులు, తొల‌గింపు, నోటీసుల జారీ త‌దిత‌ర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓట‌ర్లు, పోలింగ్ కేంద్రాల నిష్ప‌త్తి, కొత్త ఓట‌ర్ల చేరిక‌లపై ఆరా తీశారు. గాజువాక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అక్కిరెడ్డిపాలెంలో జ‌డ్పీ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ముందుగా త‌నిఖీ చేశారు. అక్క‌డ ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. 154 నుంచి 162 వ‌ర‌కు గ‌ల పోలింగ్ కేంద్రాల్లో ఓట‌ర్ల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. చిన్న పొర‌పాట్లు కూడా జ‌ర‌గడానికి వీలులేద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మ‌ర్రిపాలెం సౌత్ రైల్వే ఎయిడెడ్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని, ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని సీత‌మ్మ‌ధార పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని త‌నిఖీ చేశారు. ఓట‌ర్ల తొల‌గింపు విష‌యంలో జాగురూక‌త వ‌హించాల‌ని, డూప్లికేట్ ఓట్ల‌ను తొల‌గించే క్ర‌మంలో నోటీసులు జారీ చేయాల‌ని, సద‌రు ఓట‌రు అంగీకారం తీసుకున్న త‌ర్వాత మాత్ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. నోటీసులు జారీ చేసి సంబంధిత ర‌శీద‌ను భ‌ద్రంగా ఉంచాల‌ని, రికార్డుల‌ను ప‌క్కా నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎలాంటి వివాదాల‌కు తావివ్వ‌కుండా జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌ను, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. అప్ర‌మ‌త్తంగా ఉంటూ విధులు నిర్వ‌హించాల‌ని చెప్పారు. ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న వెంట ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, ప్ర‌త్యేక ఉప క‌లెక్ట‌ర్లు ల‌క్ష్మారెడ్డి, అఖిల‌, త‌హ‌శీల్దార్లు ఆనంద్ కుమార్, కె. జ‌య‌, శ్రీ‌వ‌ల్లీ, ఇత‌ర రెవెన్యూ అధికారులు త‌దిత‌రులు ఉన్నారు.

Visakhapatnam

2023-11-27 11:15:49

మత్సకారులకు అండగా ప్రభుత్వం- జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

 మత్స్యకారులకు భారోసానిస్తూ ఎల్లపుడు ప్రభుత్వం అండగా నిలుస్తోందని   జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు.  మత్స్య సంపదను పెంచడానికి, మత్స్యకారులకు మత్స్య  వ్యాపారాలను సజావుగా చేసుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి అనేక పధకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.  ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని  మంగళవారం  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకారులకు సందేశాన్ని అందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ను కలెక్టరేట్ నుండి  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్,  రాజాం శాసన సభ్యులు  కంబాల జోగులు, మత్స్య శాఖ డి డి నిర్మలా కుమారి, మత్స్యకార సంఘాల ప్రతినిధులు బర్రి చిన్నప్పన్న, ఇతర లబ్దిదారులు తిలకించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో  32 మంది లబ్ది దారులకు  24 లక్షల విలువైన ద్వి చక్ర వాహనాలను  అందజేసారు. వీరిలో 6 గురు మహిళా లబ్దిదారులు ఉన్నారు. అదేవిధంగా ఎస్.సి వర్గానికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు 33,29,798 లక్షల విలువైన రెండు  ఫిష్ సీడ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను    అందజేశారు.  అదే  విధంగా 20 లక్షల విలువైన్స్ ఇన్సులేటెడ్ వాహనాన్ని అందించారు.  ఈ మొత్తం వాహనాల విలువ 84 లక్షలు కాగా  అందులో లబ్దిదారుని వాటాగా 44,60,000   రూపాయలు , ప్రభుత్వ సబ్సిడీ గా 39,40, 000 లక్షల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు.   వాహనాలను లబ్దిదారులకు జిల్లా పరిషత్ చైర్మన్ , జే సి చేతుల మీదుగా అందజేసారు. 
అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మీడియా తో మాట్లాడుతూ  మత్స్య  కార వృత్తి పైనే ఆధార పది, మత్స్య వ్యాపారాలు చేసే వారికి  ప్రభుత్వం అనేక రకాలుగా ఉపకరణాలను అందించడమే కాకుండా వేట నిషేద సమయం లో  ఒక్కో మత్స్యకార కుటుంభానికి 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం  భ్రుతి కల్పిస్తుందని పేర్కొన్నారు.  ఫిష్ ఆంధ్ర పేరుతో లైవ్ ఫిష్ ను వినియోగదారులకు సరసమైన ధరలకు అందించడం  ద్వారా ఇటు వినియోగ దారునికి, అటు మత్స్యకారునికి  లబ్ది జరుగుతోందని తెలిపారు.  ఈ నెల్ 20 న విశాఖపట్నం  లో జరిగిన బోటు ప్రమాదం లో నష్ట పోయిన వారికీ 80 శాతం వరకు ప్రభుత్వమే ఇన్సురెన్సు ను భరిస్తోందని తెలిపారు.    మత్య్సకారులకు మెరుగైన జీవనోపాది, భద్రత కు భరోసా నివ్వడమే కాకుండా  మత్స్య రంగం లో ఎదుర్కొటున్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఆదుకోవడం జరుగుతుందన్నారు.

Vizianagaram

2023-11-21 13:57:24

రాత్రి నిరాశ్రయకేంద్రాల నిర్వహణ భేష్..

మహావిశాఖ నగరంలో జివిఎంసి నిర్వహిస్తున్న నైట్షెల్టర్ల నిర్వహణను పరిశీలించిన ప్రైమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీ అతిష్ చంద్ర సంతృప్తిని వ్యక్తం చేసారు. శనివారం   మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన  జివిఎంసి నిర్వహిస్తున్న 8 నిరాశ్రయ కేంద్రాలలో టిఎస్ఆర్ కాంప్లెక్స్, భుపేష్ నగర్ లో నిర్వహిస్తున్న నిరాశ్రయ కేంద్రాలను ఎపియుఎఫ్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమీషనర్ సిఎం.సాయికాంత్ వర్మతో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా నిరాశ్రయ కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడుతూ, నైట్ షెల్టర్ లో ఎంత మంది నిరాశ్రయులు వున్నారు? వారికి కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో భాగంగా భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ, వసతి, విద్యుత్, త్రాగునీటి సరఫరా, డార్మిటరి, వినోదం కొరకు టేలివిజన్, సి.సి.టివి తదితర వివరాలను అడిగి తెలుసుకోవడం తో పాటు స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసారు.

        అనంతరం జివిఎంసి కమీషనర్ మాట్లాడుతూ, విశాఖనగరం లో 2012 లో నిరాశ్రయ కేంద్రాలను ప్రారంభించారని, ప్రస్తుతం 8 నిరాశ్రయ కేంద్రాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని కేంద్రాలలో మొత్తం  285 మంది మహిళలు, పురుషులు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వీటి నిర్వహణకు ఏడాదికి జివిఎంసి సాధారణ నిధుల నుండి 52 లక్షల 12 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు కమీషనర్ ప్రైమ్ మినిస్టర్ అడిషనల్ సెక్రటరీకు వివరించారు. ఈ పరిశీలనలో జివిఎంసి అదనపు కమీషనర్ ఎస్.ఎస్.వర్మ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (యుసిడి) పాపునాయుడు, డిపిఓ లక్ష్మి, నిర్వాహకులు ప్రగడ వాసు, తదితరులు పాల్గొన్నారు.

 

Visakhapatnam

2023-11-20 15:55:11

కులగణనపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ

అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేటి  మధ్యాహ్నం 2:30గంటల అభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు జిల్లా బి.సి., సంక్షేమ సాధికారత అధికారి కె. రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా రూపొందించడంతో పాటు అమలు చేయడం, సామాజిక విద్యా ఆర్థిక జీవనోపాధి జనాభా అంశాలకు సంబంధించిన కుల ఆధారిత సమగ్ర గణనను చేపట్టడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రతి కుల, వర్గ, సామాజిక, విద్య, ఆర్థిక, అభివృద్ధి వారి ప్రస్తుత స్థితిని తెలుసుకుంటామన్నారు. అణగారిన వ్యక్తుల లేదా ఆ వృత్తులను అనుసరిస్తున్న వారి సమస్యలను తెలుసుకుని వారి అభివృద్ధికి మెరుగైన విధానాల అమలు వ్యూహాలను రూపొందించేందుకు,  సున్నితమైన సమస్యలపై చర్చకు వీలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 

సముచితమైన విధాన రూపకల్పన ద్వారా అట్టడుగు వర్గాల అభివృద్ధి అభ్యున్నతి కార్యక్రమాల ద్వారా ఏ కుల సమూహాలు ప్రయోజనం పొందాయో తెలుసుకుని వాటిపై దృష్టి పెట్టనున్నట్టు తెలియజేశారు. నిజమైన అర్హత కలిగి ఉండి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చనున్నామన్నారు. సామాజిక న్యాయం ద్వారా సమ సమాజాన్ని సాధించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను కులగణన కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తదితర ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర సంఘాల నాయకులు, మేధావులు, విరివిగా పాల్గొని తమ అభిప్రాయాలను సలహాలు సూచనలను తెలియజేయాలని ఆమె కోరారు.

Anakapalle

2023-11-15 11:41:22

విశాఖ స్టీల్ ఉద్యమాన్ని దేశ రాజధానికి తీసుకు వెళదాం: ఆడారి కిషోర్ కుమార్

 విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదిక గా ఉద్యమించి కేంద్రానికి విశాఖ ఉక్కు సత్తా చాటుదామని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు  

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం 1000 రోజులు దాటిన సందర్భంగా బుధవారం విశాఖ స్టీల్ పోరాట శిబిరం వద్ద జరిగిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఆడారీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపి లు కచ్చితంగా ఉద్యమానికి అండగా నిలబడాలని ప్రకటించారు లేని పక్షంలో వాళ్లని ఏ ప్రాంతంలోకి అడుగుపెట్టనిచ్చేది లేదన్నారు ఉద్యమకారులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వారి ఉద్యమానికి అండగా నిలబడతామని తెలియజేశారు.

ఢిల్లీ లో  వైజాగ్ స్టీల్ ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేస్తే. కేంద్రానికి వేడి పడుతుందన్నారు. తెలుగు వారితో పాటు, ఉత్తర భారత దేశ వాసుల మద్దతు కూడా లభిస్తుందన్నారు.

ఈ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-11-08 14:13:19