1 ENS Live Breaking News

ఉమ్మడి విశాఖలో 70 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులను కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ‌అభ్యర్థులకు కలెక్టర్ అందజేశారు. ఉమ్మడి విశాఖపట్నం  జిల్లాలో సాధారణ కారుణ్య నియామకాలు క్రింద 70 మందికి, రెవెన్యూ శాఖ 9 మందికి, గ్రామ సచివాలయాలు 3 , ఆర్టీసీ 21 మంది , రెవెన్యూ శాఖలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 43 మొత్తం 146 మందికి  నియామక పత్రాలు కలెక్టర్‌ అందజేశారు . ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈరోజు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో కలిపి 436 మందికి నియామక పత్రాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా ఉన్నత విద్యనభ్యసించాలని, నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారందరూ నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ విధులను నిర్వహించాలన్నారు. 

ఉద్యోగం పొందిన ప్రతి అభ్యర్థి చేసే పనిలో నైపుణ్యత, నాలెడ్జ్,  అవగాహన కలిగి ఉంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారని... క్లిష్ట సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఏ పని అప్పగించిన బాద్యత యుతంగా  పనిచేసి ఉన్నతాధికారుల గుర్తింపు పొందాలని కలెక్టర్ అన్నారు. కుటుంబ బాధ్యతలను కూడా సరిగా నిర్వర్తించాలని కలెక్టర్‌ సూచించారు. జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు ప్రజలకు సేవ చేయాలని అన్నారు. సమయ పాలన పాటిస్తూ నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎస్ శ్రీనివాసమూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , కలెక్టరేట్‌ కార్యాలయ పరిపాలన అధికారి ఈశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-09-05 14:10:15

నేక్ సంస్థ ద్వారా ఉచిత ఎలక్ట్రీషియన్ శిక్షణ

నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నేక్) ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ  నిరుద్యోగ యువతకు ఉపాధి కొరకు ఎలక్ట్రీషియన్ కోర్సులో 'ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0' పథకం కింద ఎలక్ట్రీషియన్ కోర్స్ లో ఉచిత శిక్షణ, ఉపాధి నిమిత్తము నేరుగా దరఖాస్తులు కోరుతున్నట్లు నేక్ సహాయ సంచాలకులు రవికుమార్ తెలిపారు. అభ్యర్థులు 10 వ తరగతి పాసై 15 సం. నుండి 45 సం.ల వయసు కలవారే ఉండాలన్నారు. సుమారు 2 నెలలు శిక్షణా కాలం ఉంటుందని తెలిపారు. 60 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.  మాకవరపాలెం "నేక్" శిక్షణా కేంద్రంలో శిక్షణ,  స్టేషనరీ ఉచితముగా అందజేయబడుతుందన్నారు. శిక్షణ  నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో వుంటుందని శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత రంగంలో (ప్రైవేటు సెక్టారులలో) ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని వివరించారు.  ఆశక్తి గల అభ్యర్థులు 7780275922 లేదా 9394885164 ఫోన్ నెంబరులో  సంప్రదించాలన్నారు.

Anakapalle

2023-09-05 07:18:21

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి

నిబద్దత, అంకిత భావంతో విధులు నిర్వహించండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కారుణ్య నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగులు కోవిడ్ తో మృతి చెందారని.. సదరు మృతి చెందిన కుటుంబ సభ్యులకు గ్రామ, వార్డు సచివాలయాలలో వివిధ శాఖల్లో కారుణ్య నియామకాల క్రింద ఉద్యోగాలను భర్తీచేస్తూ.. 4గురికి నియామక పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అందరూ సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇంచార్జ్ డిఆర్ఓ మురళీ కృష్ణ, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్,  తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-09-04 09:03:32

చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్..అన్ స్కిల్డ్ పొలిటీషియన్

ఆర్థిక నేరాలలో అడ్డంగా దొరికిపోయినా, తాను ఇంకా నిజాయితీపరుడనంటూ  చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నాడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమ ర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆర్థిక నేరాలను అంకెలతో సహా ఆదా య పన్ను శాఖ అధికారులు రుజువు చేసినా, వాటితో తనకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు బుకాయించటం విడ్డూరంగా ఉందని అన్నారు. కుట్రలు, కుతంత్రా లు, అవినీతితో  నిర్మితమైన ఆయన రాజకీయ జీవితం అంతా చీకటి చరిత్ర అని అమర్నాథ్ విమర్శించారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుకే ఉన్నాయని ఆయన చెప్పారు. ఏలేరు, స్టాంపుల కుంభకోణాలలో బాబు హస్తం ఉందని అనేకసార్లు రుజువైందని ఆయన చెప్పా రు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన రాజకీయంలోకి వచ్చారని ఆయన అన్నారు. నారావారిపల్లె నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు ఆయన ప్రతి అడుగు అవినీతి మయమేనని అమర్నాథ్ విమర్శించారు. తాను నిజాయితీపరుండని   రోజు  ప్రవచనాలు వల్లించే చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయల తన లంచావతారం గురించి ఎందుకు మాట్లాడటం లేదని అమర్నాథ్ ప్రశ్నించారు. అన్నా హజారే వారసుడునని, గాంధీజీ తమ్ముడనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన అవినీతి ఆరోపణలపై వ్యవస్థలను మేనేజ్ చేసి స్టే తెచ్చుకున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా, చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఐటీ శాఖ బాబు బాగోతాన్ని స్పష్టంగా వివరిస్తూ, ఆయన ఎక్కడెక్కడ నుంచి డబ్బులు ఎలా దండుకున్నాడో 46 పేజీల షోకాస్ నోటీసులో స్పష్టంగా పేర్కొందని అమర్నాథ్ చెప్తూ, దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించకపోగా, తన పేరు అందులో లేదు కదా, మీరెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అంటూ ఐటీ అధికారులను అర్థం లేని ప్రశ్నలు వేస్తూ తప్పించుకుంటున్నాడని ఆయన అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ బాబు గారి ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని, టిట్కో ఇల్లు, హైకోర్టు నిర్మాణం సి ఆర్ డి ఏ లో చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించి డబ్బులు ఏవిధంగా తీసుకున్నారో వెల్లడించారని ఆయన తెలియజేశారు.  దుబాయ్ నుంచి కూడా దినామ్స్ లో 15 కోట్ల రూపాయలు వరకు చేజిక్కించుకున్నారని అమర్నాథ్ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు అధికారులను మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు 350 కోట్ల రూపాయలు కొట్టేసారని ఆయన వివరించారు.
చంద్రబాబు నాయుడు అవినీతి చరిత్రను ప్రజల్లోకి తీసుకువెళతామని, ప్రజా కోర్టులో ఆయన సమాధానం చెప్పుకోవాలని, ఆయనకు శిక్ష తప్పదని అమర్నాథ్ అన్నారు.  చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరాల విషయంలో ఈ.డి. జోక్యం చేసుకోవాలి అని అమర్నాథ్ డిమాండ్ చేశారు.

Visakhapatnam

2023-09-04 07:21:07

నన్నయ్య వర్శిటీ నూతన ఈసీగా డా.సులేమాన్

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నూత న కార్యనిర్వాహక మండలి (ఈసీ) సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు మీడియాకి తెలియజేశారు. ప్రభుత్వం జీవో 77ను విడుదల చేసిందని చెప్పారు. ఆయా విభాగాల నుంచి నిష్ణాతులైన వారిని ఈసీ సభ్యు లుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డా.షేక్ సులేమాన్  గతంలో వైఎస్ కళాశాల అధ్యాపకుడిగా, ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధిశా ఖలో పనిచేశారు. విద్యారంగంలో ఆయనకున్న విశేష అనుభవాన్ని గుర్తించిన ప్రభుత్వం తాజాగా నన్నయ్య యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా నియమించింది. ఈయన నియామకం పట్ల ఉన్నత విద్యావంతులు, ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ప్రొఫెసర్ జాన్ క్రిష్ఠపర్(మహర్షి), నన్నయ్య యూనివర్శిటీ విసి ఆచార్య కె. పద్మరాజు కూడా అభినందనలు తెలియజేశారు. 

Narsapur

2023-09-03 15:29:15

ఆర్థిక నేరాల కథనాలపై చంద్రబాబు స్పందన ఏంటి?

అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన ఆర్థిక నేరాలు ఒక ఆంగ్ల పత్రిక ద్వారా బహిర్గతమయ్యాయని, ఇవన్నీ తప్పని, తాను నిజాయితీపరుడనని,ఈ కథనాలు రాసిన పత్రికపై కేసు వేయడానికి చంద్రబాబు లేదా లోకేష్ ముందుకు వస్తారా? అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ 
అమర్నాథ్ ప్రశ్నించారు. శుక్రవారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాలరు. లోకేష్ తన తల్లిని తాము పల్లెత్తు మాట కూడా అనకపోయినా, తమపై కేసులు పెట్టడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తండ్రిపై వచ్చిన కథనాలు తప్పని ఆయా పత్రికలపై కేసులు వేయడానికి ముందుకు వస్తాడా? లేక నా తండ్రికి నాకు ఎటువంటి సంబంధం లేదని వదిలేస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆర్థిక నేరాలన్నీ రుజువులతో సహా బహిర్గతమయ్యాయని ఆయన అన్నారు. చంద్రబాబు ముడుపుల వ్యవహారాలు పత్రికల్లో వచ్చాయని, వాటిని ఆయన ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే, అవన్నీ నిజమేనని స్పష్టమవుతోందని అమర్నాథ్ చెప్పారు. 

గతంలో తాను అసెంబ్లీలో ఇదే అంశంపై అన్ని ఆధారాలతో సుమారు 45 నిమిషాలు మాట్లాడానని అమర్నాథ్ తెలియజేశారు. చంద్రబాబు ఆస్తులపై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించినప్పుడు లెక్కల్లో లేని 2000 కోట్ల రూపాయలు దొరికినట్లు ఆధారాలతో సహా సంబంధిత శాఖ బహిర్గతం చేసిందని అమర్నాథ్ చెప్పారు. 2016 సంవత్సరానికి ముందు నుంచే కాంట్రాక్టర్ల దగ్గర కిక్ బ్యాగ్స్ తీసుకున్నాడని, అమరావతి నిర్మాణాలలో అవినీతి సొమ్మును డొల్ల కంపెనీలకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బదలాయించాడో చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ ద్వారా ఇన్కమ్ టాక్స్ అధికారులు తెలుసుకున్నారని అన్నారు.  అవినీతి అంటే ఏంటో తనకి తెలియదని, అవినీతి డబ్బు తాను ఎప్పుడూ చూడలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పత్రికల్లో వచ్చిన కథనాలకు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడని అని ప్రశ్నించారు. 
చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతి ఊబిలో కోరుకుపోయాడని, తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా శేష జీవితంలో శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఈ జన్మలో చేసిన పాపాలు .ఈ జన్మలోనే అనుభవిస్తాడని ఆయన అన్నారు.కదా చంద్రబాబు నాయుడుకొత్తగా భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ కొత్త నిదానంతో ప్రజల ముందుకు వస్తున్నాడని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానమైనా నెరవేర్చడా? అని ఆయన ప్రశ్నించారు. రైతులను, మహిళలను పూర్తిగా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మద్దని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు. చంద్రబాబు తన బుర్ర ఉపయోగించి ఒక కొత్త పథకాన్ని అయినా ప్రకటించగలిగాడా అని ఆయన ప్రశ్నించారు.

Visakhapatnam

2023-09-01 15:39:35

చేనేత వర్గాలు రాజకీయంగా ఎదగాలి..గాజువాక గర్జన

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు పద్మశాలి సామాజికవర్గాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని, రాజకీయంగా చేనేత వర్గాలను ఎదగనీయకుండా అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తున్నాయని పద్మశాలి గర్జనలో పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గాజువాకలో జరిగిన ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ సదస్సు లో విశాఖ జిల్లా అధ్యక్షుడు వానపల్లి ఈశ్వరరావు అధ్యక్షతన గాజువాక గర్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్బంగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత సామాజిక వర్గీయులంతా ఒకే తాటిమీదకి రావాలన్నారు. ఇప్పటివరకు మన చేనేత వర్గానికి రాజకీయంగా ఎదుగుదల లేదని, రానున్న రోజుల్లో చేనేతలు అందరూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా ఉంటేనే చేనేతలు ఎదగడానికి అవశాకశం వుంటుందన్నారు. మన కంటే తక్కువ శాతం వున్న  బీసీల్లో అనేకమంది చట్టసభలకు వెళ్తున్నారని.. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా పద్మశాలీయులు, చేనేత కులస్తులు లేకపోవడం బాధాకరమన్నారు. మాజీ మంత్రి, నిమ్మల కృష్ణప్ప, రాజ్యసభ సభ్యులు జీవియల్ నర్సింహారావు,  ఆప్కోస్ చైర్మన్ గంజి చిరంజివి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత , మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, వావిరాళా సరళ దేవి, చేనేత కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు  తదితరలు ప్రసంగించారు. జనాభాలో అధిక శాతం ఉన్న పద్మశాలి కులస్తులకు రానున్న ఎన్నికల్లో తగినన్ని ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కుల సంఘం పెద్దలు తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి చేనేతలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Gajuwaka

2023-08-27 14:24:12

తొండమనాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తొండమనాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 27న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 28న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు,  ఆగ‌స్టు 29న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చ‌న నిర్వ‌హిస్తారు. ఆగస్టు 30న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం వీధి ఉత్స‌వం, నిర్వహించనున్నారు.  ఈ సంద‌ర్భంగా టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Tirupati

2023-08-26 13:20:15

ఘనంగా ఏపీఎల్, ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకలు

ఏపీఎల్, ఎసిఎ ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఎసిఎ కార్యదర్శి శ్రీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా 83 వరల్డ్ హీరోలు రానున్నట్లు తెలిపారు. విశాఖలో శనివారం ఎసిఎ జాయింట్ సెక్రటరీ రాకేశ్ తో కలిసి ఎస్. ఆర్ . గోపినాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రా రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని యువ క్రికెటర్ల లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారి గొప్ప అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది ఏపీఎల్ - 1 ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాము.  ప్రస్తుతం ఏపీఎల్ - 2 నిర్వహిస్తున్నాం.  ఆదివారం వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఎసి విడిసి స్టేడియంలో జరగనున్న ఏపీఎల్ ఫైనల్ కు మాజీ ఇండియా టెస్ట్ కెప్టెన్, బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ కృష్ణమా చారి  శ్రీకాంత్, అదేవిధంగా గౌరవ అతిథిగా మాజీ ఇండియా క్రికెటర్, ఇండియా నేషనల్ క్రికెట్ కోచ్  మదన్ లాల్ హాజరవుతారని వెల్లడించారు. ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఐపిఎల్ టీం స్కౌట్స్ వచ్చారని, దీంతో యువ క్రీడాకారులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 

ఏసీఏ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీ రోజర్ బిన్నీ, గౌరవ అతిథిగా మాజీ ఇండియన్ క్రికెటర్, ఇండియా నేషనల్ క్రికెట్ కోచ్ శ్రీ మదన్ లాల్ హాజరు అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మెన్, ఉమెన్ రంజీ ప్లేయర్లు, కెప్టెన్లు, ఏసీఏ సిబ్బందితో ఆయన  600 మంది ఎసిఎ సిబ్బంది తదితరులతో ఆయన ఇంటరాక్ట్ అవుతారని వెల్లడించారు. అదేవిధంగా తొలి భారత టెస్ట్ కెప్టెన్, ఆంధ్ర రంజీ ట్రోపి జట్టుకు మొదటి కెప్టెన్ కల్నల్ సి. కె. నాయుడు గారి కుటుంబ సభ్యులను సన్మానిస్తామని తెలిపారు. బిసిసిఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ వైజాగ్ రావడం వల్ల రాష్ట్రానికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రాంగణంలో ఎసిఎ మాజీ కార్యదర్శి శ్రీ ఎన్. వెంకట రావ్ గారి పేరిట స్టాండ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Visakhapatnam

2023-08-26 13:15:38

హానికరమైన ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలి

రంగులు, రసాయనాలు వినియోగించి తయారు చేసే ఆహారపదార్ధాలకు విద్యార్ధులు దూరంగా ఉండాలని విద్యార్దుల జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ఇ.బి. విలియమ్స్ సూచించారు. శనివారం సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్దులతో ఏర్పాటు చేసిన కన్సూమర్ క్లబ్స్ అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు మనం నగదు చెల్లించి కొనుగోలు చేసే వస్తువుల్లో కల్తీ పదార్ధాలు, నకిలీ వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కొనుగోలు చేసే వస్తువులపై తయారీ సంస్థ పేరు, తయారు చేసిన తేదీ, వినియోగానికి చివరి తేదీ చూడాలని, కొనుగోలు చేసే ప్రతి వస్తువులు సేవలకు తప్పని సరిగా రశీదు పొందాలని తెలిపారు. తల్లిదండ్రులకు, చుట్టుప్రక్కల ఉన్నవారికి వినియోగాదారుల రక్షణ చట్టం గురించి వివరించాలని సూచించారు. ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ వద్ద గ్యాస్ తూకం సరిచూసి తీసుకోవాలని, బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలని, అధికంగా కోరితే పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. 

వస్తువులపై ముద్రించిన ధరకన్నా అధిక ధరలకు వినియోగిస్తున్నట్లయితే తూనికలు కొలతల శాఖ వారికి ఫిర్యాదు చేయాలని, పండ్లు, కూరగాయలపై రంగులు రసాయనాలు వినియోగించే వారిపై, పరిశుభ్రత పాఠించకుండా ఆహారపదార్ధాలు తయారు చేసేవారిపై, విక్రయించే వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారు విద్యార్దులను కోరారు. సినిమా హీరోలు, సెలబ్రెటీలతో ఉన్న ప్రకటనలు చూసి వస్తువులను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు.  వినియోగదాల రక్షణ చట్టం –2019 గురించి, విద్యార్ధులకు పవర్ పాయింట్ ద్వారా  దాసరి ఇమ్మానియేలు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో బాపట్ల సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్ ఓంకార్, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, కన్స్యూమర్ క్లబ్ ఇన్చార్జి ఫాతిమున్నీసా, పాఠశాల ఉపాధ్యాయులు,  విద్యార్దులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వారు రూపొందించిన మేము సైతం పుస్తకాన్ని పాఠశాలకు అందచేశారు.

Bapatla

2023-08-26 10:46:33

శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలి

ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని, శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు శనివారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఈవో  ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకితభావంతో యాగాలు నిర్వహించారని తెలిపారు. అనంతరం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కె.ఎస్.ఎస్.అవధాని  కారీరిష్టి-వరుణజప-పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు  మోహనరంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు  బాలిరెడ్డి, గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Tirupati

2023-08-26 08:06:49

కాకినాడజిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కురసాల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కాకినాడ జిల్లా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధిష్ఠానం తాడేపల్లి నుంచి పార్టీ కార్యాలయం విడుదల చేసింది. ఇందులో భాగంగానే జిల్లా కమిటీని 49 మందితో ఏర్పాటు చేసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఒకరిని, ఉపాధ్యక్షులుగా ముగ్గురిని, ప్రధాన కార్యదర్శులుగా ఏడుగురిని, కార్యదర్శులుగా మరో ఏడుగురిని, కోశాధికారిగా ఒకరిని, మొత్తం 30 మంది కార్యనిర్వహక సభ్యులలుగా నియమించారు.‌ జిల్లా పార్టీ కమిటీ అధ్యక్షుడుగా మాజీ మంత్రి, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నియమితులు అయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి కర్రి వెంకట శివరామకృష్ణ, తుని నియోజకవర్గం నుంచి గంటా చక్రరావు, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నరాల శ్రీనివాసరావు నియమితులు అయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కాకినాడ గ్రామీణం నియోజకవర్గం నుంచి ఇద్దరు బలగం ప్రసన్న కుమార్, పాలిక నరసింహమూర్తి, జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇద్దరు తుమ్మల వెంకట రామకృష్ణ, పోసిన బాబూరావు, కాకినాడ పట్టణ నియోజకవర్గం నుంచి ఇద్దరు బెండ విష్ణుమూర్తి, అడ్డాల శ్రీలక్ష్మి, పిఠాపురం నియోజకవర్గం నుంచి మొగిలి మాణిక్యాలరావు నియామకం అయ్యారు. 

కార్యదర్శులుగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పైలా కళ్యాణ్, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి పుల్లా ప్రభాకరరావు, తుని నియోజకవర్గం నుంచి చింతల వెంకట రమణ, పెద్దాపురం నియోజకవర్గం  నుంచి ఇద్దరు బర్రే రాంగోవింద్, తాటికొండ అచ్చిరాజు, ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అలమండ చలమయ్య, పిఠాపురం నియోజకవర్గం నుంచి మామిడి రంగబాబు, అలాగే కాకినాడ నగరం నియోజకవర్గం నుంచి కోశాధికారిగ కాకరపర్తి హరినాధ్ లకు జిల్లా శాఖ కమిటీలో అవకాశం కల్పించారు. వీరితో పాటు వీరితో పాటు 39 మంది కార్యనిర్వహక సభ్యులుగా గెద్దాడ రాజు, వాసంశెట్టి నాగ దుర్గా ప్రసన్న కుమారి, గొర్ల అమ్మాజీ, కడజారి నాగేశ్వరరావు, అర్జిల్లి సింహాద్రి, నూకల కొండల రావు, జార్జ్, గుండవరపు బాబూరావు, చిలుకూరి మనోజ్ కుమార్, గుడాల శాంతి ప్రసాద్, సోమాల రామలక్ష్మి, గొడుగుల కొండబాబు, మేడిశెట్టి సింహాచలం, పురంశెట్టి నాగ వెంకట సత్య ప్రసాద్, జుత్తుక సుబ్బలక్ష్మి, దండా రాజేష్, షేక్ బషీర్, కామన రామకృష్ణ, బండి దుర్గరాజు, నాళం లోవకుమారి, ముప్పనబోయిన సోమరాజు, అబ్బిరెడ్డి భావన్నారాయణ రెడ్డి, కర్రి దివ్యవాణి, గాడి రమణబాబు, గాబు వీర వెంకట సత్యనారాయణ, చోడిశెట్టి వెంకటేష్, కాకర రాంబాబు, ఆచారి సాంబ, ఆకుల వీరబాబు, ఆకుల అనసూయలను పార్టీ నియమించింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ కమిటీలోకి ప్రాతినిధ్యం కల్పించడంలో పార్టీ సమతూకం పాటించినట్లైంది.‌ ఎంతో కాలంగా నిజాయితీగా పార్టీ కోసం నిస్వార్థంగా సేవలను అందిస్తున్న వారికి ఈ సందర్భంగా పార్టీ నుంచి సరైన గుర్తింపు లభించినట్లు అయ్యింది.

Kakinada

2023-08-25 16:53:49

6217మందికి రూ.7.58 ద్వైవార్షిక నగదు మంజూరు

అనకాపల్లి జిల్లాలో నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హత గల 6,217 మంది లబ్దిదారులకు వివిధ పథకాల క్రింద రూ.7 కోట్ల 58 లక్షల 49 వేల 019లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు.  గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల  లబ్ది అందని వారికి నగదు లబ్ధిని అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసారు.  జిల్లా కలెక్టరు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎపిడి డైజీ లబ్దిదారులు  పాల్గొన్నారు. 
 
ఈ సందర్బంగా  కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో  ద్వైవార్షిక మంజూరు కింద  అర్హత ఉన్న 6, 217 మంది లబ్దిదారులను గుర్తించి వివిధ శాఖల అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కు చెందిన రూ.7,58,49,019లను లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు.  ద్వైవార్షిక నగదు మంజూరులో భాగంగా 366 లబ్ధిదారులకు అమ్మఒడి రూ 54,90,000; 1895 మందికి చేదోడు పథకంలో రూ. కోటి 89 లక్షల 50 వేలు, 111 మందికి ఈ బీసీ నేస్తంగా 16 లక్షల 65 వేలు, మత్స్యకార భరోసా కింద 23 మందికి 2లక్షల 30 వేలు, విద్యా దీవెన కింద 1615 మందికి 2 కోట్ల 12 లక్షల 30 వేల 756, వసతి దీవెన కింద 1233 మందికి రూ. కోటి 7లక్షల 24 వేలు, వైయస్సార్ ఆసరాగా 579 మందికి రూ కోటి 57 లక్షల 93 వేల 263, వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ గా 395 మందికి 17 లక్షల 66 వేలు లబ్ధి చేకూరిందని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ డబ్ల్యుఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డి ఆర్ డి ఎపిడి డైజీ, డిఎల్ డివో ఉదయశ్రీ లబ్దిదారులు తదిత రులు పాల్గొన్నారు. 

Anakapalle

2023-08-24 15:03:41

అనకాపల్లి నుంచే మరలా పోటీ చేస్తా ..మంత్రి అమర్

అనకాపల్లి నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని, ప్రాణం పోయినా అవినీతి కి పాల్పడనని రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. స్థానిక న్యూకాలనీ లోని రోటరీ కళ్యాణ మండపంలో మంగళవారం సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఎప్పుడు కూల్ గా సాగే ఆయన ప్రసంగం ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కనిపించింది.  సుదీర్ఘంగా సాగిన తన ప్రసంగంలో అమర్నాథ్ అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని, కార్యకర్తలే తన బలమని, చెప్పుడు మాటలు విని తనను దూరం చేసుకోవద్దు అంటూ భావోద్వేగంతో చేసిన ప్రసంగం పలువురిని ఆలోచింపజేసే విధంగా చేసింది.తన మీద నమ్మకం ఉంటే తనతోనే ఉండండి.తనను నమ్మిన వారిని  ఎప్పుడూ దూరం చేసుకోను. పలకరించలేదనో. లేక పట్టించుకోలేదనో తనను దూరం చేసుకోవద్దు. నా గుండెల్లో తన తల్లిదండ్రులకు ఏ స్థానం ఉందో అంతకుమించి తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఉందని అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవుల కేటాయింపులలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఆయా నాయకులు కార్యకర్తలు సంప్రదింపులు జరుపుకొని తన దగ్గరికి వచ్చిన తర్వాతే ఆయా పదవులనుభర్తీ చేశానని అమర్నాథ్ వెల్లడించారు. 

ఇదిలావుంటే వచ్చే ఎన్నికల్లో తాను అనకాపల్లి నుంచే పోటీ చేస్తానని, కార్యకర్తలే నా ఎలక్షన్ నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.  రాజకీయా ల్లో ఓపిక అవసరమని, సమయం వచ్చినప్పుడు పదవులు అంది వస్తాయని ఆయన అన్నారు.ఇదిలావుంటే తాను అవినీతికి పాల్పడుతున్నట్లు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రాణం పోయినా అవినీతికి పాల్పడబోనని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తలంతా కాలర్ ఎగరేసి మరీ చెప్పచ్చని అమర్నాథ్ అన్నారు. తానేదో  భూ కుంభకోణానికి పాల్పడ్డానని అంటూ దాన్ని నిరూపించడానికి వచ్చిన ఒక సినిమా యాక్టర్,  కేవలం నాలుగు నిమిషాలు ఇక్కడ ఉండి నిరూపించలేక పలాయనం చిత్తగించారని ఆయన అన్నారు. నోరు ఉందని ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అమర్నాథ్ హెచ్చరించారు. తనపై అవినీతి మరక పడకూడదని, ఎదుటివారి వద్ద తలదించుకోకూడదన్న భావన తనలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.త్వరలోనే అనకాపల్లికి తాను మకాం మారుస్తానని అమర్నాథ్ తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర బి.సి వెల్ఫేర్ గవర కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎపి ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, అర్బన్ సచివాలయాల కన్వీనర్ కొణతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-08-22 16:07:14

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా..?

ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం ఇష్టం లేదని ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన పర్యటన, మాట్లాడుతున్న మాటలు బట్టి అర్థమవుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  పవన్ కళ్యాణ్ బుధవారం ఎర్రబట్టిదిబ్బలను సందర్శించిన అనంతరం మాట్లాడిన మాటలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. ఎర్రమట్టి దిబ్బలు చారిత్రక ఆనవాళ్ళని దానిని ఆక్రమించుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అక్కడ విఎంఆర్డిఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడం తప్పంటే ఎలా? అనిఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో భూ కుంభకోణాలు బయట పెడతానంటూ గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్  వాటిని నిరూపించలేక బొక్క బోర్లా పడ్డారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీ డాడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా, వాస్తవాలు తెలుసుకొని, అవగాహన పెంచుకుని ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది." అని అమర్నాథ్పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాలు కబ్జాకు గురైతే పెదవి మీ పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు వాస్తవ విరుద్ధమని,  ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోవాలని అమర్నాథ్ కోరారు. ఆయన ఇప్పటివరకు పర్యటించిన ప్రాంతంలో  ఎక్కడ ఎటువంటి లోపం కనిపించకపోవడంతో , ఇక్కడ జరుగుతుందంతా ఎన్జీటీకి, మోడీకి చెప్తానంటూ లేనిపోని ప్రగల్బాల్ పలుకుతున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. " మీరు ఇక్కడ ఉండే ఒకటి రెండు రోజుల్లోనైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకోండి.. అవాస్తవాలను మాత్రం మాట్లాడకండి" అని అమర్నాథ్, పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2023-08-16 15:46:29