1 ENS Live Breaking News

ఆ నేతలందరికీ రాజకీయ సమాధి..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. రాజకీయపార్టీలు ప్రజా సేవ కంటే..అధికారం కోసం ఏమైనా చేయడానికి..ఎలాంటి పనులనైనా చేపట్టడానికి సిద్దపడి పోతున్నాయి. జెండాలు మోసి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీని పటిష్టం చేసిన వారిని కాకుండా లాభీయింగ్ చేసే వారికి ప్రధాన్యత ఇస్తున్నాయి. గెలిస్తే పదవులు ఇవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థానానికి, మంత్రిగా అవకాశం కావాలనుకునే వారికి కాస్త డబ్బు దండిగా ఖర్చుపెట్టేవారికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎన్నికల రంగంలోకి తించుతున్నాయి రాజకీయ పార్టీలు. ఉత్తరాంధ్రాలో ఒక ఎంపీ తాను మంత్రిని కావాలనుకుంటున్నానని.. దానికి తానేం ఇవ్వాలో చెబితే.. దానికి రెట్టింపు ఇవ్వడానికి సిద్ధమని ఒప్పుకోవడంతో ఆయనను ఎంపీ నుంచి పిలిచి మరీ ఎమ్మెల్యేగా పోటీచేయిస్తున్నాయని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీ లు నాలుగు కాలాలపాటు నిలబడాలన్నా..అధికారం చేజిక్కుంచుకోవాలన్నా..  స్థానిక సీయర్ నాయకుల రాజకీయ భవిష్యత్తుని సమాధి చేసి.. స్థానికేతర బడా నాయకులకు రాజకీయ ఉపాది చూపిస్తే తప్పా పరిస్థితి తమకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితిలేదనే పరిస్థితికి వచ్చేశాయి.  ఇక వామ పక్షపార్టీలు తీరు ఆది నుంచి ఒకేలా కనిపస్తున్నా.. ఇపుడు సదరు పార్టీలోని నేతలు కూడా రిజర్వేషన్లు ఆధారంగా కమర్షియల్ పొలిటికల్ పార్టీల్లోకి జంపింగ్ లు చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచే వారికి, ప్రజల మద్దతు ఉన్నవారికి, సామాజిక బలం ఉన్నవారికి, ఆపై కాస్తో కూస్తో ఆర్ధిక బలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చేవి. ఆ పరిస్థితి ఇపుడు పూర్తిగా మారిపోయింది. ఆర్ధికంగా బలంగా ఉంటే రాష్ట్రంలో ఏమూలనైనా, ఏ నియోజకవర్గంలోనైనా నిలబెట్టి గెలిపించేయొచ్చుననే లెక్కకు వచ్చేశాయి రాజకీయపార్టీలు. దీనితో పార్టీనే నమ్ముకున్న స్థానిక నేతలకు చిప్పచేతికి వచ్చేస్తున్నది. జిల్లాలో పుట్టి పెరిగి.. రాజకీ యపార్టీలకు ఊడిగం చేసేసరికే వారి బ్రతుకులు తెల్లారి పోతున్నాయి. ఈ క్రమంలో పార్టీలనే నమ్ముకున్న చాలా మంది నేతలకు రాజకీయ భవిష్యత్తుకి సమాధులు సిద్ధమైపోతున్నాయి. 

తాజాగా ఉత్తరాంధ్రాలో ఈ పరిస్థితి అన్ని రాజకీయ పార్టీల్లోనూ కనిస్తున్నది. పార్టీలు అధికారంలోకి రావడం కోసం సామాజిక వర్గాల్లోని నెట్వర్క్ ఉన్న యువతను, వాక్ చాతుర్యం ఉన్న యువతను పావులుగా వాడుకొని వారికి మొండి చేయి చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో సుమారు 100 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న పార్టీలు తమ అభ్యర్ధులను పూర్తిగా మార్చేసి..ఇప్పటి వరకూ పనిచేసిన వారికి పార్టీని నమ్ముకున్న వారికి పక్కన పెట్టేశాయంటే అధికార దాహం ఏ స్థాయిలో ఉండి జెండా మోసిన వారికి దండవేసేశారో అర్ధం చేసుకోవచ్చు. పైగా అలా దగాపడ్డ నేతలందరికీ సదరు రాజకీయపార్టీలు చెప్పే కాకమ్మ కథలేంటంటే.. మీకు సామాజిక బలం లేదు..? ఆర్ధిక బలం లేదు..? మీ పై ఇంటెలి జెన్స్ రిపోర్టులు వ్యతిరేకంగా ఉన్నాయి..? మీకు స్థానిక బలం అంతకంటే లేదు.. మీరు ఈసారికి పక్కనుండండి.. పార్ఠీ గెలిచిన తరువాత ఏదో ఒక నామినెటెడ్ పోస్టు ఇస్తాం..లేదంటే మీ ఇష్టమని తెగేసి చెబుతున్నాయి. కాస్త వాయిస్ ఉన్న నేతలు ఉండాలనుకుంటే పార్టీలో ఉంటున్నారు.. లేదంటే పక్కపార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. అలా జంప్ అయిపోయిన వారికి కూడా పక్కపార్టీలు పిలిచి మరీ సీట్లు ఇవ్వడంతో అప్పటి వరకూ తాను ఎమ్మెల్యే, ఎంపీ రేసులో ఉంటానని పార్టీ కార్యక్రమాల లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన నేతలంతా తమ డబ్బంతా పార్టీ కార్యాలయాలకు సున్నానికి వాడినట్టు అయిపోయిందనే బావనకు వచ్చేస్తున్నారు. రాజకీయమంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందా..? అధికారం కోసం, పదవుల కోసం పార్టీని నమ్ముకున్న సీనియర్లను ఎంతకైనా మడత పెట్టేస్తారా..? అని ఓ ప్రధాన పార్టీ నేత మీడియా ముందు వ్యాఖ్యానించారంటే ప్రస్తుత రాజకీయ పార్టీల అధికార పందేరం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇపుడున్న రాజకీయ వ్యూహంలో ఎంపీ స్థానానికి వంద నుంచి 200 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని..ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని..ఆ స్థాయి ఉంటేనే ఎన్నికల్లో నిలబడటానికి ముందు రావాలనే సంకేతం పార్టీలే స్వయంగా ఇచ్చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వానికి సమర్పించే అఫడివిట్ లలో చూపించే ఖర్చులకు, ఎన్నికల బరిలో నిలబడి అభ్యర్ధులు చేసే ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీనితో రాజకీయ ఉపాది జీవితాంతం కావాలనుకుంటే పక్కనేతకు సమాధి కట్టడానికి మనం కూడా ఇసుక మోయాలి, ఇటుక పేర్చాలన్నట్టుగా మారిపోయిందని నేతలు బుర్రలు పీక్కుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలకి బీ-ఫాం ఇచ్చే వరకూ ఏ రాజకీయ పార్టీలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్ధి, ఎవరు ఎంపీ అభ్యర్ధి, ఎవరు ఎమ్మెల్సీ అభ్యర్ధో తెలియని పరిస్థితి నెలకొంది. కులాల మధ్య చిచ్చుపెట్టి మా పార్టీ పేదల పార్టీ అని చెప్పుకుంటూనే ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్తులతో ఆట్లాడుకునే పార్టీల వ్యవహారాన్ని ఓటరు చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడనే విషయం ఇప్పుడిప్పుడే పార్టీలకు అర్ధం అవుతున్నా.. కమర్షియల్ పొలిటికల్ బిజినెస్ లో అవేమీ పరిగణలోకి రావడం లేదు. గతంలో జరిగిన ఎన్నికలు, 2024లో జరిగే ఎన్నికలకు చాలా తేడాలున్నాయని.. ఈసారి ఏ నేత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుంది..? ఏ సీనియర్ నేత రాజకీయ భవిష్యత్తు ఈ ఎన్నికలతో సమాధి కాబోతుందో త్వరలోనే తేలిపోనున్నది. మరే నేతకు రాజకీయ ఉపాది మరో ఐదేళ్లకు కుదురుతుందో లెక్కలు గడుతున్నాయి పార్టీలు. నిజమైన ఓటరు..తెలివైన ఓటరు ఈ రాజకీయపార్టీల చేసే వ్యాపారాన్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకుంటే నిజం ప్రజల కోసం పనిచేసే నేతలను చట్టసభలకు పంపిస్థాడు. అది జరుగుతుందా..? లేదటే మళ్లీ యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా రాజకీయపార్టీలే ఓటరుని నోటు దగ్గరకి తీసుకొచ్చి అధికారం కోసం ఏమైనా చేస్తాయా అనేది వేచి చూడాలి..!

vizag

2024-03-31 20:44:20

విశాఖపై విషం కక్కుతున్నారు..!?

విశ్వవిఖ్యాత నగరంగా రూపాంతరం చెందుతున్న విశాఖ మహానగరంపై పనిగట్టుకొని విషం కక్కుతున్నారు.. ప్రశాతం వాతావరణాన్ని భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నారు.. చక్కటి సంస్క్రుతికి సున్నం రాసేస్తున్నారు.. ప్రైవేటు యూనివర్శిటీల వ్యాపారం కోసం ప్రభుత్వ యూనివర్శిటీల మనుగడ ప్రశ్నార్ధకమయ్యేలా దెయ్యం రంగు అంటగడు తున్నారు.. పథకం ప్రకారం పదవుల కోసం రాజకీయ రౌడీ ఇజం చేస్తున్నారు.. అభివృద్ధికి కలిసిరాని స్థానికేతరులు చిరస్థాయిగా విశాఖను ఏలడానికి అన్ని విధాలా ఖబ్జా చేస్తున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ వీరిని ఏమీ చేయలేకపోతున్నాయి.. దేశంలోనే సిటీ ఆఫ డెస్టినీగా పేరొందిన విశాఖను నేడు అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకి కేంద్ర బిందువుని చేసేశారు.. ఉంటే విశాఖలోనే ఉండాలనుకునే ఆశలకు శాస్వత సమాధి కట్టేస్తున్నారు..ఇక విశాఖను తాకనిది ఒక్క టెర్రరిస్టులు మాత్రమే.. విశాల విశాఖను విచ్చిన్నం చేసేందుకు జరుగుతున్న భారీ కుట్ర ఇపుడు అన్ని రంగాల వారిని ఉలిక్కి పడేలా చేస్తున్న వైనంపై ఈరోజు ప్రత్యేక కథనం..!

విశాఖ సిటీ అంటే ఒకప్పుడు అందాలకు, చక్కటి వాతావరణానికి పెట్టింది పేరు. కానీ నేడు ఆ పేరు పోయి మర్డర్ సిటీ, రౌడీ సిటీ, డ్రగ్ సిటీ, పొలిటికల్ సిటీ అనే స్థాయికి వచ్చేసింది. దేశంలోనే ప్రముఖంగా వినిపించే విశాఖను పూర్తిగా కబ్జా చేసేందుకు స్థానికేతరులు విశాఖ తీరంలో లంగరేసుకు పాతుకుపోతున్నారు. వీరి వలన ఎన్నాళ్ల నుంచో కష్టపడుతున్న రాజకీయనాయకులకు పదువులు పోతుంటే..స్థానికులకు ఎప్పుడు ఎక్కడ ఏ మర్ఢర్ జరుగుతోందోననే భయం పట్టుకుంది. రాజకీయం కోసం రౌడీయిజం చేసి..చదువుల కిల్లా విశాఖజిల్లాలోని  ప్రభుత్వ యూనివర్శిటీలకు సైతం దెయ్యం దెయ్యాల రంగు పులిమే వరకూ వచ్చింది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం పనిగట్టుకొని చేస్తున్న అరాచక మాఫియా వ్యాపారానికి విశాఖ మహానగరాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చేలా చేసింది. వారి ప్రైవేటు యూనివర్శిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వ యూనివర్శిటీలపై బురద చల్లుతూ.. వారి రాజకీయ పదవుల కోసం స్థానికులను డబ్బుకట్టలతో పార్టీలను ప్రశన్నం చేసుకొని ఇక్కడే పాతుకు పోతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయ పదవులను వీరొచ్చిన తరువాత అది బహుళ వ్యాపారానికి లైసెన్స్ గా మార్చేశారు. కిడ్నాప్ లు, చోరీలు, గంజాయి, నేడు చివరకి డ్రగ్స్ దిగమతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. వీరి కబ్జా చర్యలతో విశాఖపై విషయం కక్కుతు వారు మాత్రం పక్కాగా పాతుకుపోతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి తేడాగాళ్లకే రాజకీయపార్టీలు కూడా కొమ్ము కాస్తూ పిలిచి మరీ వారి పార్టీలో సీట్లిచ్చి పదవులు కట్టబెడుతున్నాయి. అధికార మదంతో, డబ్బు దర్పంతో, కుల అండతో విశాఖ కీర్తిని కకావికలం చేస్తున్నారు.  వీరి ఆగడాలను అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. అధికారం కోసం రాజకీయపార్టీలు ఆడుకున్న రాజకీయ క్రీడలో విశాఖను విచ్చిన్నం చేయడానికి తండోప తండాలు తరలి వచ్చేస్తున్న స్థానికేతరులు పదవులను అడ్డం పెట్టుకొని సువిశాల విశాఖను కకావికలం చేస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ కేంద్రంగా నగరాన్ని మార్చేయడానికి పన్నాగం వేసి అడ్డంగా దొరికిపోయారంటే ఏ స్థాయిలో నగరాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఎత్తుగడ వేశారో ఒక్కసారి ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సి వుంది.

నాటి విశాఖ..నేడు రాష్ట్ర రాజధాని కాబోతుందని అంతా కలలు కని..ఉద్యోగాలపై ఆశలు పెంచుకుంటున్నవేళ..డ్రగ్ మాఫియా అడ్డాగా, గంజాయి, డ్రగ్స్ కేపిటల్ గా చిత్రీకరించి నాగరాభివృద్ధికి శాస్వత అడ్డుకట్ట వేస్తున్నారు. ఒకప్పుడు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చే కంపెనీలు, సంస్థలు నేటి తాజా డ్రగ్స్ మాఫియా చర్యలతో ఇక్కడి నుంచి బిచానా సర్దేసుకోవాలని నిర్ణయాయిని వచ్చాయి. త్వరలోనే ఇక్కడి ఐటి కంపెనీలు, కర్మాగారాలు భారీ స్థాయిలో తరలిపోవడానికి నేటి 25వేల కోట్ల డ్రగ్స్ డీల్ కారణం అయ్యిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో వారికి .. జిల్లా నుంచి రాష్ట్రం..రాష్ట్రం నుంచి దేశం..దేశం నుంచి అంతర్జాతీయంగా ఎంతటి నెట్వర్క్ ఉందో కూడా అర్ధం చేసుకోవచ్చు. డ్రగ్స్ డంప్ ను కనుగొనడంతో ఉలిక్కిపడిన విశాఖ వాసులు రానున్న రోజుల్లో నగరానికి టెర్రరిస్టులు కూడా వచ్చినా రావొచ్చునని భయాం దోళన చెందుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతున్న విశాఖలో నేడు డ్రగ్స్ కూడా అంతకంటే పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్నాయంటే స్థానిక యువత భవిష్యత్తు ఏంటోననే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కోట్లకు పడగలెత్తిన స్థానికేతరులు నగరంలో ఆస్తులను పెంచుకోవడంతోపాటు, వారి వికృత వ్యాపారానికి, యువతను నాశనం చేయడానికి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వ్యాపారానికి తెరలేపారంటేనే పరిస్థి చేదాటి పోయిందని తేలిపోయింది. ఇక విశాఖకు తరలి రావాలనుకుంటున్న కంపెనీల పరిస్థితి ఏంటి..? ఇదే పద్దతి కొనసాగితే స్థానికుల రాజకీయ భవిష్యత్తు ఏంటి..? అసలు విశాఖలో మనస్సాంతిగా జీవించగలమా..? ఉన్నత చదువుల కేంద్రం కాస్త..కరుడు గట్టిన డ్రగ్ డీల్ డెస్టినేషన్ గా మారిపోతే యువత పరిస్థితి ఏంటి..? స్థానికులు ఇక్కడ ఉండాలా..? లేదంటే నగరం విడిచి వెళ్లిపోవాలా..? ప్రస్తుతం సీబిఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో నేడో రేపో ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ) కూడా రంగ ప్రవేశం చేస్తుందని చెబుతున్నారు.

యువత కలల ఆశల విశాఖ..ప్రస్తుత చర్యలతో డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘ విద్రోహ చర్యలను నియంత్రించాల్సిన ఆవశ్యకత తక్షణం ఏర్పడింది. అంతేకాకుండా స్థానికేతరులకు పదవులు ఇస్తే..స్థానికుల మనుగడ ప్రశ్నార్ధకమవుతుందనే విషయాన్ని కూడా రాజకీయపార్టీలు ఆలోచించాలి. లేదంటే వారి ధనార్జన కోసం వేలమంది విద్యార్ధులను ఉన్నత చదువుల్లో తీర్చి దిద్దుతున్న ప్రభుత్వ యూనివర్శిటీలు మూసేసుకోవాల్సిన అత్యవసర దుస్తితి కూడా రావొచ్చు. ఇప్పటికే పలు ప్రైవేటు యూనివర్శిటీలు కన్ను విశాఖపై పడి ఉన్న ఆంధ్రయూనివర్శిటీ కూడా అంధకారంగా మారిపోయినా మారిపోతుంది..? విశాఖలో జరగుతున్న వికృత చర్యలను, వినాశ ఘట్టాలను, మనుగడ ప్రశ్నార్ధకం చేసే వ్యవహారాలను ఉన్నత విద్యావంతులు మూకుమ్మడిగా తిప్పికొట్టాల్సిన ఆవశ్యక త ఏర్పడింది. స్థానికులు స్థానికేతురలపై తిరగబడకపోతే..ఉన్న గూడు కూడా కబ్జా అయిపోయి, మనల్నే వలస పంపే చర్యలు ప్రారంభమూ కావొచ్చు..విశాఖపై విషం కక్కుతున్న చర్యలను ఉత్తరాంధ్ర ఉక్కుపాదంతో అణగదొక్కాల్సి సమయం ఆశన్నమైంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్థానికుల బలం ఏంటో చూపించాలి.. లేదంటే మన మనుగడ స్థానికేతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. విశాల విశాఖ బోరున విలపిస్తుంది..తస్మాత్ జాగ్రత్త..!

vizag

2024-03-26 05:17:12

కన్ను పడితే.. కాటేస్తాడు.. ఫిషరీష్ జెడీ వికృత చేష్టలు

ఆ అధికారి కన్నుపడితే టార్గెట్ చేసిన మహిళా ఉద్యోగిణిని కాటేయాల్సిందే..నయాన్నో..భయాన్నో ఏదోలా శారీరకంగా లొంగ దీసుకోవాలని సామవేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు.. ఏదీ కుదరకపోతే శాఖాపరమైన విధానాలు ఎతుకుతాడు.. దానిని అడ్డం పెట్టుకొని బలవంతంగానైనా అనుభవించాలని చూస్తాడు..సరిగ్గా ఈ కామాంధుడి కంటిలో 27ఏళ్ల జూనియర్ అసిస్టెంట్ బలైపోబోయి తృటిలో తప్పించుకుంది.. ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టులేక పోలీసులను ఆశ్రయించి కీచక అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేలా చేసింది. ఈ తంతు అంతా జరిగింది త్వరలో పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖజిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయంలో..ఆ కీచక అధికారి జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్.. ఉన్నతాధికారే తనను కాటేయాలని కక్షగట్టాడని బావించి..చాకచక్యంగా తప్పించుకొని బయపడి మహిళా సంఘాల సహకారంతో పోలీసులకి ఫిర్యాదు చేసి తప్పించుకోగలిగింది. ఈ కీచక ఉన్నతాధికారి లైంగిక వేదింపుల పర్వం ఒక్కసారి తెలుసుకుంటే...

లాల్ మహ్మద్ విశాఖజిల్లాలోని మత్స్యశాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన జిల్లాకి వచ్చేనాటికి ఇదే కార్యాలయంలో పనేచేసే 27ఏళ్ల మహిళా  ఉద్యోగిణి ఆఫీస్ సబార్డినేట్ గా ఉండేది. సరిగ్గా కామాంధుడి కన్ను ఆ ఉద్యోగిణిపై పడింది..ఎలాగైలా లోబరుచుకోవాలని పథకం వేసి..మెల్లగా ఆమె సీనియారిటీ, పదోన్నతిని వాడుకొని ఆమెకు ఇదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతిలో సహకరించాడు. పాపం ఆ మహిళా ఉద్యోగిణి..ఉన్నతాధికారి మానవతా దృక్పదంతో సహాయం చేశాడనుకొని చెప్పిన పని, చెప్పని పని అన్నీ చేస్తూ తల్లో నాలుకగా ఉండేది. అదే అదునుగా చేసుకున్న జెడి ఆమెను విధినిర్వహణలో ఉండగానే తన గదిలోకి చీటికీ మాటికి పిలిపించుకొని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం మొదలు పెట్టేవాడు. తనకి ఒంట్లో బాగాలేదని చెబితే ఏదీ..జ్వరం ఎంతుందో చూస్తానంటూ స్థనాలపై చేతులు వేయడం, మెడపై చేతులు వేయడం, వీపుకి చేతులు ఆనించడం వంటి రక రకాల చేష్టలు ప్రదర్శించేవాడు. ఒక్కోసారి తాను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని, ప్రమోషన్ డిమోషన్ చేస్తానని కూడా బెదిరంచేవాడు.  దీనితో ఎలాగైనా తనను లోబరుచుకుని కాటేసేలా ఉన్నాడనుకుని భావించిన ఆద్యోగిణి ఎలాగోలా  చాలా కాలం భరించిన ఆ ఉద్యోగిణి సహనం నశించిపోయి పోలీసులను ఆశ్రయించి.. తనను ఏవిధంగా లొంగదీసుకోవాలని చూస్తున్నాడో లిఖిత పూర్వకంగా సోమవారమే పోలీసుకు ఫిర్యాదు చేసి కార్యాలయానికి రావడం మానేసింది. 

 చిన్న కేసుతో తప్పించాలని పోలీసుల యత్నం..
విశాఖలో సంచలనంగా మారిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ లైంగిక వేధింపుల కేసుని పోలీసులు నిర్వీర్యం చేయాలని చూసినా ఫలితం దక్కలేదు. బెదిరించాలని చూసినా దైర్యంగా నిలబడి మరీ ఉన్నతాధికారి, పోలీసులకు ఎదురెల్లింది ఆ మహిళా ఉద్యోగిణి. ప్రస్తుతం ఆమెకు మహిళా సంఘాల మద్దతు పెరిగింది. తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులు కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చింది. ఉన్నతాధికారిగా వున్న తనను బయట పడేయాలని ఎన్ని ప్రయోగాలు చేసినా పాచికలు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఆపలేకపోయాయి. చిన్న సెక్షన్లతో నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మహళా ఉద్యోగి పట్ల మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అఫీస్ కేబిన్ కు పిలిపించి ఆమెపై అసభ్యకరమైన ప్రవర్తనకు పాల్పడితే మరీ చిన్న సెక్షన్లతో అతడిని తప్పించాలనే ప్రయత్నం  సరైంది కాదని ఇందులో ఎంతటి వారు వచ్చినా సదరు అధికారికి శిక్ష పడేవరేకూ వదిలిపెట్టేది లేదని తెగేసి చెబుతున్నారు.


పరారీలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్
మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన జాయింట్ డైరెక్టర్ లాల్ మహ్మద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది. లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం అందుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని పర్యటనలు చేయాల్సి ఉండగా వాటన్నింటినీ రద్దు చేసుకున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం లాల్ మహ్మద్ కాకినాడ  స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన పనిచేసే ప్రతీ చోట ఇదే తరహా లైగింక వేధిపులు మహిళా ఉద్యోగులు ఎదుర్కొన్నట్టు సమాచారం అందుతుంది. మత్స్యశాఖలో ఉన్నతాధికారిగా ఉన్న లాల్ మహ్మద్ లైంగిక వేధింపుల ఘటన సదరు మత్స్యశాఖ కమిషనర్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. ఆమె ఆదేశాలతో ఈయన విధులకు లాంగ్ లీవ్ పెట్టినట్టు చెబుతున్నారు. ఈరోజు 2టౌన్ పోలీసు స్టేషన్ లో విచారణ ఎదుర్కొన్న అనంతరం బెయిల్ కోసం వెళ్లిపోయినట్టు వార్తలొస్తున్నాయి. చూడాలి అత్యంత దారుణంగా వ్యవహరించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విషయంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది.

visakhapatnam

2024-03-13 02:07:33

డబ్బు కొట్టు..ఆర్డర్ పట్టు.. ఆ లెక్కే వేరబ్బా..?!

మీ అందరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతున్నాయి..డేటా మొత్తం ఆన్ లైన్ చేయాలి..దానికి అమరావతి సెక్రటేరియట్ నుంచి అందరు అధికారులకు డబ్బు లు ఇవ్వా లి..ఒక్కో ఉద్యోగి రూ.10వేలు ఇస్తేనే వివరాలు పైకి వెళతాయి లేదంటే మీ ఇష్టం కాంట్రాక్టు ఉద్యోగిగానే ఉండిపోతారు..కట్ చేస్తే 98 మంది పారామెడికల్, ఇతర ఉద్యోగులు వారి సర్వీసులు రెగ్యురల్ చేసుకోవడానికి వారి వారి విభాగాలోని మినిస్టీరియల్ స్టాఫ్ కి అక్షరాలా రూ.10 కట్టారు.. ఇక ఇందులో ప్రధాన పత్రికల వారికిచ్చేది ఇచ్చే యండి..విషయం ఎక్కడా బయటకి పొక్కకూడదు.. సదరు పత్రికల్లో వస్తే ఇరుకున పడతాం.. డబ్బులు ఇచ్చిన విషయం బయటకు చెబితే ఇచ్చిన ఆర్డర్లు కూడా కేన్సిల్ చేస్తామని ముందుగా చెప్పి ఉంచారు..ఏదైనా మీడియాలో వస్తే..సర్వీసులు రెగ్యులర్ అయిన ఉద్యోగులే తిరగబడాలి..మీరే ఖండించాలి..ప్రెస్ మీట్లు పెట్టాలి.. ఈ నిబంధనలకు ఒప్పుకున్నవారే డబ్బులు కట్టాలనే నిబంధనలు కూడా ఉద్యోగులకి వెళ్లాయి. అంతే అనుకున్నట్టుగా జాబితా స్టేట్ సెక్రటేరియట్ కి వెళ్లిపోయాయి. ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తంతు మొత్తం భారీ మొత్తం కావడంతో పంపకాల్లో తేడాలొచ్చి విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచే విషయం పొక్కేసింది. ఈ విషయం తెలుసుకున్న ‘ఈరోజు’ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జగదీశ్వర్రావు దృష్టికి విషయాన్ని తీసుకెళితే అబ్బే అలాంటిదేమీ లేదండీ అని మొదలు పెట్టి.. ఆర్డర్లు కోసం డబ్బులిచ్చిన వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులిస్తే తప్పా తానేమీ చేయలేనని..తానే స్వయంగా రెండు రోజులు పాటు కార్యాలయంలో రాత్రింబవళ్లు కష్టపడి మరీ ఆర్డర్లు జారీ చేశానని, ఎలాంటి లావాదేవీలు చేతు మారలేదని చెప్పారు..

ఇక్కడ ఒక విషయం  రాష్ట్ర తాధికారులు, జిల్లా కలెక్టర్ కూడా గమనించాలి.. చాలా ఏళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతుందన్న ఆనందంతో ఉద్యోగులు ఉన్నారు. ఈ సంతోషంలో జిల్లా ఆరోగ్యశాఖలోని అధికారులు సిబ్బంది పెట్టిన కండిషన్ కి తలొగ్గి అడిగినంతా ఇస్తారా..? లేదంటే మేము డబ్బులివ్వలేమని కాంట్రాక్టు జాబ్ రెగ్యులర్ అవుతున్నా, కాకపోయినా పర్లేదని కాలదన్నుకుంటారా..? సరిగ్గా ఈ వీక్ పాయింట్ నే క్యాష్ చేసుకున్నారు విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖలోని అధికారులు, సిబ్బంది. ప్రభుత్వం నుంచి 98 మంది ఉద్యోగులకు సంబందించి డేటా వచ్చినపుడే షరతులతో కూడిన కలెక్షన్ మొదలు పెట్టారు. ముందుగా పేమెంట్లు చేసిన వారికి ఆర్డర్లు ఇచ్చి..ఇవ్వని వారికి మరో సరికొత్త కండిషన్లు కూడా పెట్టారట. ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన’..రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తే దానిని కూడా తమ కలెక్షన్ల కోసం వాడేసుకున్నారు ఇక్కడి అధికారులు. పైగా తాము సత్య హరిశ్చంద్ర వంశానికి చెందిన వారమని..ఉద్యోగులు, సిబ్బంది అంతా చాలా వృత్తి ధర్మరమే పరమావధిగా బావించి, మానవతా దృక్పదంతో సొంతడబ్బులు ఖర్చు చేసీ మరీ ఆర్డర్లు తయారు చేసి ఇచ్చామని వల్లెవేస్తున్నారు ఉమ్మడి విశాఖజిల్లా కార్యాలయ సిబ్బంది.
‘పిల్లి గుడ్డిదైతే..ఎలుక ఏదో ఎత్తి చూపించిందట’.. చేసిన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి, వసూళ్ల విషయం బయటకు వచ్చిందని దాచిపెట్టడానికి, ప్రధాన మీడియాలో ఈ విషయం వార్తలు రాకుండా మేనేజ్ చేసున్న అధికారులు.. తీరా విషయం బయటకు వచ్చేసరికి వైద్యఆరోగ్యశాఖలోని అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన కొందరు మీడియాకి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.జగదీశ్వర్రావు దగ్గర నుంచి సంబంధిత విభాగాల సిబ్బంది కూడా మూకుమ్మడిగా ఒకే రకమైన వివరణ ఇచ్చారు.  రెగ్యులర్ ఆర్డర్ల కోసం ఎవరైనా ఉద్యోగులు డబ్బులు ఇచ్చినట్టు నేరుగా తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే తాను చర్యలు తీసుకోగలనని, లేదంటే తానేమీ చేయలేనని చెప్పారు. ఉద్యోగులు వారి ఉద్యోగాల మీదకు వచ్చే విషయాన్ని ఎవరు మాత్రం ముందుకొచ్చి బయటపడి ఫిర్యాదులు చేస్తారని ప్రశ్నిస్తే..దానికి మమ్మల్ని ఏం చేయమంటారు అని బదులిచ్చారు. మీ దగ్గరకొచ్చి ఫిర్యాదు చేసిన వారిని ఎందుకు బహిరంగంగా విషయాన్ని బయటపెట్టారని టార్గెట్ చేసి, తరువాత ఇబ్బంది పెడతామని ముందుగానే హెచ్చరించారనే సమాచారం కూడా ఉందని చెప్పగా.. అలా ఎందుకు చేస్తామని..తమపై గిట్టని వారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట దాటవేశారు. నేనూ.. మా సిబ్బంది చాలా నీతి మంతులమని..అవసరం అయితే సొంతంగా ఖర్చు చేస్తాం తప్పా మరెవ్వరి వద్దా పైసా కూడా తీసుకొమని కూడా చెప్పుకొచ్చారు. సాధారణంగా ఉద్యోగాలు రెగ్యులర్ అయిన సమయంలో ఇలాంటి ప్రచారాలు బయటకి వస్తాయని..వాటిని మీడియా కూడా లైట్ తీసుకోవాలని సూచించడం కూడా విశేషం.

ప్రధాన పత్రికలు, ఛానళ్లకు రూ.2లక్షలు నజరారా..?!
విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన ఈ అక్రమ వసూళ్ల తంతు బయటకు రాకుండా ఉండేందుకు ప్రధాన పత్రికలు, టివి ఛానళ్ల ప్రతినిధులకు సుమారు రూ.2 లక్షల వరకూ ముట్టజెప్పినట్టు తెలిసింది. నొక్కిన మొత్తంలో కొంతమొత్తమెట్టి కొట్టడంతో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏమీ జరగనట్టుగా ఉన్నారని సమాచారం. అడ్డగోలుగా వసూళ్లు చేసినా..జిల్లా అధికారి నుంచి సిబ్బంది వరకూ నిస్సుగ్గుగా చెబుతున్న సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదే కార్యాలయానికి చెందిన కొందరు ఉద్యోగులైతే ఒక అడుగు ముందుకేసి మేము ఒక్కరమే అంతా తినేస్తున్నామా..మీడియాకిస్తున్నామా..జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇస్తున్నామా..స్టేట్ సెక్రటేరియట్ పంపిస్తున్నామా..ఇంతా చేస్తే మాకు మిగిలేది ఎంత..? ఆ మాత్రం దానికే మీరు వార్తాలు రాసేస్తారా..ఏం ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖలుంటే ఒక్క జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చేసిన వసూళ్లే కనిపించాయా..మిగిలిన ఏ డిపార్ట్ కనిపించ లేదా అంటూ తిరగబటం విశేషం. పక్కా ప్లాన్ అండ్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ తో మడతెట్టిన భారీ మామూళ్లుపై యదా రాజా తదా ప్రజా అన్నట్టుగా అధికారులు కూడా లైట్ తీసుకున్నారు..విశాఖ జిల్లా వైద్యఆరోగ్యశాఖకు ఇదాంతా షరామామూలే..!?

vizag

2024-03-11 17:38:20

సరికొత్త రాజకీయ వ్యూహం..?!

అనకాపల్లిలో అసలైన రాజకీయం మొదలైంది..మాజీ మంత్రులు ఇద్దరూ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. వీరి కలయిక ఆంధ్రప్రదేశ్ లోనే హాట్ టాపిక్ అవుతోంది. ఏది ఏమైనా జిల్లాను హస్తగతం చేసుకోవాలంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రధాన నేతలు కలవకపోతే కుదరదనే ఆలోచనకి వచ్చిన వీరు కలిసి పనిచేసి జిల్లా నుంచి తొలిగెలుపు..అదీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్నే టిడిపి-జనసేన కూటమికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరి కలయికతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయం వేడెక్కింది వైఎస్సార్సీపి చెక్ పెట్టాలంటే అది దాడి, కొణతా కలయిక వలనే సాధ్యపడుతుందనే కార్యకర్తల అభీష్టాన్నీ ఇరువురు నాయకులు నిజంచేయడానికి ఒక్కటవడం సంచలనం రేపుతోంది..!  తెలుగుదేశం జనసేన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విజయానికి ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. శుక్రవారం గవరపాలెం లోని ఆయన నివాసానికి రామకృష్ణ  విచ్చేశారు. ఈ సందర్భంగా దాడి ఆయన అంతరంగికులందరూ రామకృష్ణ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ పలకరింపు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై ఇరువురి నేతలు చర్చించారు. వారిని కలిసిన విలేకరులతో వీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీ విజయం చారిత్రాత్మక అవసరం అన్నారు. రాష్ట్రం అరాచక పాలన వల్ల అధోగతి పాలవుతుందన్నారు భూకబ్జాదారులు సంఘ విద్రోహసక్తులు పెట్రేగిపోతున్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రామకృష్ణ సమర్థవంతమైన పాత్ర పోషించార న్నారు .ఆ సమయంలో తాను శాసనమండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని చెప్పారు . కొణతాలకు టికెట్టు పొత్తులో భాగంగా జనసేన నుండి రావటం జరిగిందన్నారు  అందుకు అందరూ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ గెలుపుకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు. అలాగే జనసేన నేత టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ దాడి వీరభద్రరావు తో కాలేజీ నుండి అనుబంధం ఉందన్నారు.

ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఎ ఎల్ కాలేజీ లో తాను చదువుకోవడం జరిగిందన్నారు.  మా కుటుంబానికి ఆయన ఆత్మీయులు అన్నారు. అయితే రాజకీయంగా విభేదించాల్సిన పరిస్థితి నెలకొందని తిరిగి మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం  ఏర్పడిందని చెప్పారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన  సహకారం తనకు ఎంతో అవసరమన్నారు .ముందు ముందు అన్ని విషయాలు చర్చించుకుని ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల సత్యనారాయణ, మల్ల రాజా, దాడి జగన్ ప్రభాకర్, విల్లూరి రాము, కాండ్రేగుల కృష్ణప్పారావు, బొడ్డపాటి రాజారావు , బొడ్డేడ శంకరరావు, కోటిపల్లి జేజి బాబు, పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవరపాలెం సంతబైల సందడి వాతావరణం నెలకొంది అనకాపల్లి నియోజకవర్గంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

anakapalli

2024-03-09 00:41:50

ఏపీటిఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా సిహెచ్.కరుణాకరరావు

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటిఎఫ్) విశాఖపట్నం జిల్లా అధ్యక్షునిగా సిహెచ్.కరుణాకరరావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈయన గత20ఏళ్లుగా యూనియన్ లో వివిధ హోదాల్లో పనిచేసి, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు చేశారు. ఇటీవల జరిగిన యూని యన్ ఎన్నికల్లో కరుణాకరరావుని ఉపాధ్యాయులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు, సిపిఎస్ రద్దు, ఇతర అలవెన్సులు, పీఆర్సీ బకాయిలు, అరియర్స్ విడుదల విషయంలో ఈయన కీలకంగా వ్యవహరించారు. కరుణాకరరావు సేవలను గుర్తించిన ఉపాధ్యాయులు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ఎంపిక పట్ల జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు, సిపిఎస్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్ లు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Visakhapatnam

2024-02-22 10:43:46

అనకాపల్లి జిల్లాలో 604 జంటలకు రూ.3.57 కోట్లు

అనకాపల్లి జిల్లాలో వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు, షాదీ తోఫా క్రింద 604 జంటలకు రూ.3కోట్ల 57 లక్షల 20 వేలు జమ చేసినట్లు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి తెలిపారు.  మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్దిదారులకు చెక్కును అందజేశారు.  కలెక్టరు మాట్లాడుతూ కొత్తగా వివాహం చేసుకున్న వారిలో అర్హులైన వారందరూ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొరకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  జిల్లాలో బిసి-ఎ కు చెందిన 74 జంటలకు రూ.37 లక్షల 50 వేలు, బిసి-బి కి చెందిన 51 జంటలకు రూ.28 లక్షల 75 వేలు, బిసి-డికు చెందిన 406 జంటలకు రూ.2కోట్ల, 14లక్షల 75 వేలు, బి.సి.ఈ కి చెందిన మూడు జంటలకు రూ. 3 లక్షలు, ఓసికి చెందిన ఒక జంటకు రూ.1లక్షా 50 వేలు,  ఎస్.సి.కి చెందిన 63 జంటలకు రూ.64 లక్షల 90 వేలు, ఎస్.టి.కి  చెందిన 6 జంటలకు రూ.6లక్షల 80 వేలు వారి ఖాతాలలో జమచేసినట్టు తెలిపారు.   అనకాపల్లి జెడ్.పి.టి.సి. బి. వరాహ సత్యవతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల పేద ప్రజలకు పెద్ద కొడుకుగా వారి ఆర్ధిక సమస్యలను తీర్చడమే ధ్యేయంగా సుపరిపాలన సాగిస్తున్నారని చెప్పారు.  అమ్మఒడి, పించన్లు, ఆసరా మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టి అన్ని కుటుంబాలను ఆదుకుంటున్నారని చెప్పారు.  పేదలైన ఎస్.సి., ఎస్.టి., బి.సి. కుటుంబాలలో ఆడపిల్లల పెళ్ళికి ధన సహాయం చేస్తూ ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు.  అంతకు ముందు తాడేపిల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గన్న కార్యక్రమాన్ని అందరూ తిలకిం చారు.  తరువాత జిల్లా కలెక్టరు లబ్దిదారులకు చెక్కును అందజేశారు.  ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏ పి.డి. శచీదేవి, ఎపిడి డైజీ, బి.సి. సంక్షేమ శాఖ ఏ.డి.  అజయ్ బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువ జంటలు పాల్గొన్నారు. 

Anakapalle

2024-02-20 12:03:59

ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలతో సిద్ధం..జిల్లాకలెక్టర్

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ తో కలసి  పాల్గొన్నారు.  జిల్లాలో జరగనున్న పార్లమెంటు, అసెం బ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.  జిల్లాలో గల పోలింగ్ కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయడం జరిగిందని, నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బందిని సమాయత్తం చేయడం జరిగిందని చెప్పారు. రూటు మ్యాపులను సిద్ధం చేసినట్లు, అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సమస్యాత్మక అతి సమస్యాత్మ కేంద్రాలను గుర్తించామని వాటి దగ్గర అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు పరిశీలించి తదనుగుణంగా ప్రణాళికాయుక్తంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

మద్యం ఇతర మాదక ద్రవ్యాల రవాణాను ముందుగానే గుర్తించేందుకు అవసరమైనచోట్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తగిన కమ్యూనికేషన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బంది పోలీసు సిబ్బంది వాహనాలు గస్తీ సిబ్బంది మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈవీఎంలపై ఓటింగ్ ఏ విధంగా చేయాలనే శిక్షణా కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వివాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించడం జరిగిందన్నారు. పోలీస్ రెవెన్యూ ఇతర సిబ్బందితో ప్రశాంత వాతావరణంలో ఓటర్లందరూ నిర్భయంగా ఓటింగులో పాల్గొనే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్, సిపిఓ జి రామారావు, నర్సీపట్నం ఆర్డిఓ హెచ్.పీ జయరాం, నర్సీపట్నం పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి చోడవరం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, తాసిల్దార్లు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు డి.రామ్మూర్తి, డిటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-16 13:56:40

ఎస్సెస్సీ, ఇంటర్, ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ విషయాలపై రెవెన్యూ విద్యా పోలీసు తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 18వ తేదీ నుండి 27 వ తేదీ వరకు ఎస్ ఎస్ సి పరీక్షలు ఉదయం గం 9:30 నిల .నుండి మధ్యాహ్నం గం 12 45 ని.ల వరకు జరుగుతాయని   ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉగం 9-00ని. ల నుండి మధ్యాహ్నంగం. 12-00ల వరకు, జరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా ఓపెన్ స్కూల్ పరీక్షలు, ఏపీపీఎస్సీ పరీక్షలు కూడా జరుగుతాయన్నారు. వివిధ శాఖల సమన్వయంతో  ఎటువంటి లోటుపాటులు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యుత్తు తాగునీరు పారిశుధ్యం మొదలైన మౌలిక వసతులన్నీ పూర్తిగా ఉండాలన్నారు. 

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి పనులన్నీ నియమిత కాలంలో ఖచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్లే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రికల్ డిజిటల్ స్మార్ట్ పరికరాలు పరీక్ష హాల్లోనికి అనుమతించ రాదన్నారు. సమయపాలన కచ్చితంగా అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక చికిత్స ఓ ఆర్ ఎస్ గ్లూకోస్ మొదలైనవి అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల ప్రాంతంలో ప్రశ్న పత్రాలు ఆన్సర్ పత్రాలను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచాలని పోస్ట్ ద్వారా ఆ రోజే పంపించాలన్నారు. అధికారులు సూచించిన చెక్ లిస్ట్ అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెవిన్యూ పోలీస్ విద్యాశాఖ అధికారులతో స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు.  డీఈవో వెంకట లక్ష్మమ్మ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 108 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో 397 పాఠశాలలకు సంబంధించిన 21, 259 మంది రెగ్యులర్ విద్యార్థులు 2324 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.

 పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లకు కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్ ఐ ఈ ఓ  బి. సుజాత మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14 పోలీసు స్టేషన్లలో ప్రశ్న పత్రాలు స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 13,323 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1074 మంది జనరల్, 2619 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు. రెండవ సంవత్సరం 15,298 మంది విద్యార్థులు హాజరవుతుండగా వారిలో 1278 మంది జనరల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్ ఎస్ సి పరీక్షలు మార్చి 18 నుండి 27 వరకు ఐదు కేంద్రాల్లో జరుగుతాయని 788 మంది హాజరవుతున్నారన్నారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సం.పరీక్షలు 11 కేంద్రాలలో మార్చి 18 నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని 2205 మంది హాజరవుతున్నట్లు చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు ఐదు కేంద్రాలలో మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 3 తేదీ వరకు జరుగుతాయని 991 మంది హాజరవుతున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి దయానిధి అనకాపల్లి డి.ఎస్.పి సుబ్బరాజు ఉప విద్యాధికారి రవిబాబు డిఇసి మెంబర్లు డి ఈ సి మెంబర్లు ఎం శ్రీనివాసరావు పి శిరీష రాణి పివిఎన్ మూర్తి జిల్లా బల్క్ మెంబర్ ఎం.మోహన్ రావు పోస్టల్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ పండా ఆర్ టి సి మేనేజర్ కే.ఎస్. నారాయణ ఎస్ టి ఓ పి రాజేష్ టెలిఫోన్స్ జే టి ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-13 14:29:08

అభివృద్ధి లక్ష్యాల దిశగా విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర‌

భారత‌ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆశయం, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌తి పౌరుడూ, అధికారీ, ప్ర‌జాప్ర‌తినిధి, స్వ‌చ్ఛంద సేవ‌కులు అభివృద్ధి లక్ష్యాల దిశగా విక‌సిత్ భార‌త్ సంకల్ప యాత్ర‌లో భాగ‌స్వామ్యం కావాల‌ని ఆర్ధిక వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రటరీ సోల్మన్ ఆరోక్యరాజ్ పిలుపునిచ్చారు.  2047 నాటికి భార‌త్ దేశం అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న చేర‌ట‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం వివిధ సంక్షేమ  ప‌థ‌కాల‌ను రూపొందించి, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఆర్థిక ప్ర‌యోజ‌నాలు అందిస్తోంద‌ని పేర్కొన్నారు. విశాఖ వేదిక‌గా సోమవారం ఆయ‌న జివిఎంసి పరిధిలో జోన్-5 నందు 61వ వార్డులో మల్కాపురం నందు మరిడిమాంబ కళ్యాణ మండపం నందు విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసిన వివిధ ప‌థ‌కాల ఉద్దేశాల‌ను, ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. 2047 నాటికి భార‌త దేశం అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న త‌ప్ప‌క నిలుస్తుంద‌ని, ప్రపంచంలో 5వ ఆర్ధిక వ్యవస్థగా వున్న మన భారత దేశం రాబోయే కాలంలో 3వ ఆర్ధిక వ్యవస్థ గా అభివృద్ధి చెందుతుందన్నారు. 

రెండు కోట్ల మంది మహిళలకు  లక్షాధికారులను చేయడమే సంకల్ప యాత్ర ద్యేయమన్నారు. మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. కనీస అవసరాల కల్పన దిశగా ప్రతి ఒక్కరికి గృహాలను అందించి మౌలిక వసతులను కల్పించామన్నారు. ఇప్ప‌టికే ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న‌, పీఎం ఆవాస్ యోజ‌న‌, పీఎం పోష‌ణ్ అభియాన్, దీన‌ద‌యాల్ అంత్యోద‌య యోజ‌న‌, పీఎం ఉజ్వ‌ల్ యోజ‌న‌, పీఎం గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న‌, పీఎం భార‌తీయ జ‌న్ ఔష‌ధి ప‌రియోజ‌న తదిత‌ర ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌ల‌కు సంక్షేమ‌, ఆర్థిక ఫ‌లాలు అందాయ‌ని ఆయన గుర్తు చేసారు. భారత్ దేశం ఆర్ధిక వ్యవస్టగా పెంపొందించడానికి పరిశ్రమలు, ఆదాయ మార్గాలు పెరగాలని ఆ దిశగా గత మూడు సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ లో భారీగా కేటాయింపులు చేసి కొన్ని వేల, లక్షల క్లిలోమీటర్ల రోడ్లు, రైల్వే లైన్లు, పోర్ట్లులు అభివృద్ధి కి కృషి జరుగుతుందన్నారు. ఇవన్ని తెలియ పరచటం కోసమే గత రెండు మాసాల నుండి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలు విశాఖ నగరంలో జరుపుతున్నామన్నారు. ఆ దిశగా ప్రజలకు అందిస్తున్న 17 నుండి 20 రకాల ప్రయోజనాలు, సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుతూ సంబధిత స్టాళ్లను ఏర్పాటు చేయడమైనదన్నారు. 

ఈ స్టాళ్లలో పధకాలు పొందని అర్హులైన లబ్దిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లయితే, ఇక్కడ విచ్చేసిన అధికారులు వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు పధకాలను, ప్రయోజనాలను కల్పించే దిశగా చర్యలు చేపడతారన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి ప్రోత్సాహకాలను అందించే దిశగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నిత్య సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ లను, విద్యార్ధులకు బహుమతులను అందించి కార్యక్రమానికి  విచ్చేసిన వారితో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం బిజెపి స్టేట్ సెక్రటరీ సురేంద్ర మోహన్ మాట్లాడుతూ వికసించిన భారత్ దేశం కోసం అభివృద్ధి దిశగా సంకల్పం తీసుకోవాలని, ఇప్పటికే 11 కోట్ల మందికి ఉజ్వల పధకం క్రింద 7 వేల రూపాయల విలువ చేసే ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించామన్నారు.

         అనంతరం జివిఎంసి అదనపు కమీషనర్ ఎస్.ఎస్.వర్మ మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందినా దేశంగా సంకల్పమే వికసిత భారత్ యాత్రను ప్రధాన మంత్రి ప్రారంభించారన్నారు.  విశాఖ నగరం లో 60 రోజుల నుండి ఈ సంకల్ప యాత్ర కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. సంకల్ప యాత్రలో కల్పిస్తున్న వివిధ పధకాలు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లల్లో పేర్లను నమోదు చేసుకొని సంక్షేమ పధకాలను పొందాలని అన్నారు. ప్రజలందరి ఆరోగ్య పరిరక్షణకు విశాఖ నగరాన్ని పర్యావరణ హిత నగరంగా అభివృద్ధి చేసేందుకు ఎకో వైజాగ్ కార్యక్రమాన్ని సహకారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మలేరియా అండ్ హెల్త్ ఆఫీసర్ డి.జగదీశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.        

Visakhapatnam

2024-02-12 14:01:30

నువ్వా-నేనా.. అనకాపల్లి టిడిపి-జనసేన ఎంపీ సీటుకి త్రిముఖ పోటీ

అనకాపల్లి జనసేన-టిడిపి ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోనే ఉంటూ ప్రధాన సమస్యలపై పోరాడుతున్నయువనేత, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షలు టిడిపి యువనేత ఆడారి కిషోర్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్, జనసేనాని అన్నయ్య పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో కిషోర్, విజయ్ లు లోకల్ క్యాండిడేట్లు కాగా  పొత్తుపార్టీ జనసేన నుంచి స్థానికుడిగా కొణతాల రామక్రిష్ణ, కొణిదెల నాగబాబు మాత్రం నాన్ లోకల్. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో లోకల్ ఫీలింగ్ పెద్ద ఎత్తున వస్తుండటంతో ఇపుడు ఉమ్మడి విశాఖజిల్లాలోని అనకాపల్లి ఎంపీ స్థానానికి డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ పార్టీ ముందు కాస్త ఆర్ధిక బలాన్ని చూపిస్తున్న మరో వ్యక్తి పేరు కూడా సామాజిక మాద్యమల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ ప్రముఖంగా పోటీ మాత్రం ఈ ముగ్గురిలోనే కనిపిస్తున్నది. ఆది నుంచి అనకాపల్లి పార్లమెంటు ఎంపీ సీటుని ఆశిస్తున్న ఆడారి కిషోర్ కుమార్ పార్టీలోని అందరు సీనియర్ నాయకులతోపాటు అధినేత చంద్రబాబుని సైతం స్వయంగా తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీస్థాయిలో పనిచేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవల మాడుగుల మండలంలో జరిగిన టిడిపి కదిలిరా సభలో నేరుగా అయ్యన్నపాత్రుడు చంద్రబాబుని స్టేజి మీద నుంచే తన కొడుక్కు కి ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. వీరిద్దరి మధ్యలో ఈసారి అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం, దానికి అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు జరుపుతుండటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. 

అనకాపల్లి సీటు తనకు ఇవ్వాలని..లేని పక్షంలో చింతకాలయ విజయ్ కి ఇచ్చినా తాను శ్రమించి పనిచేస్తానని కిషోర్ కుమార్ అయ్యన్నపాత్రుడినే అభ్యర్ధించారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజవకర్గాల్లో డెమెక్రసీ ఇన్ డేంజర్, సేవ్ డెమెక్రసీ పేరటి సుమారు 54 రోజుల పాటు ఉద్యమాలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న అన్నిరోజులూ కిషోర్ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసంఘాలు, అన్ని రాజకీయపార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించారు. అంతేకాకుండా ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం, విమానాలు, రైళ్లు, డిల్లీ వేదిక గా కూడా తన గళాన్ని బలంగా వినిపించారు. అయితే చాలా కాలంగా పార్టీలో సీనియర్ నేతగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా గెలిచి పార్టీని అభివృద్ధి చేశానని..తన తరువాత తన వారసుడికి సీటు ఇవ్వడం ద్వారా పార్టీని మరింత అభివృద్ధి చేస్తాని అయ్యన్నపాత్రుడు సైతం తన డిమాండ్ ను పార్టీ ముందు ఉంచుతున్నారు. ఇదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన ఒక ట్రస్టు సభ్యుడు వీరిద్దరికంటే తాను ఆర్ధికంగా బలంగా ఉన్నానని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను గెలిపించుకుంటానని ప్రచారం చేసుకుంటూ..తనకే ఎంపీ సీటు ఖరారు అయిపోయిం దని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆడారి కిషోర్ కుమార్ కి సామాజిక బలం ఎక్కువగా ఉండటం, గతంలో బీజేపీ లాంటి పార్టీలో పనిచేసి ఉండ టం, స్థానికు కావడంతో  అటు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలిసింది. 

అయితే టిడిపిలో చేరిన తరువాత పతాక స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ, ప్రజల్లోనే ఉంటూ తన పోరాటాన్ని కొనసాగిస్తున్న ఈయన పార్టీ ఏం చేసినా తాను శిరసా వహిస్తానంటూ తన పనిచేసుకొని వెళుతున్నారు. దీనితో ప్రస్తుతం పార్టీ అధిష్టానం ఈ మూడు పేర్లు పరిగణలోకి తీసుకొని బేరీజు వేస్తున్నాయి. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీ సామాజిక బలం ఉన్న నాయకులను రంగంలోకి దించడం ద్వారా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్నది. అదే సమయంలో జనసేన సీనియర్ నేత కాకపోయినా ఇటీవలే పార్టీలోకి చేరిన కొణతాల రామక్రిష్ణనైనా సామాజికంగా బేరీజు వేస్తూ ఎంపీగా దించాలని యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటం టిడిపిలో ఇంకా ఎమ్మెల్యే స్థానాలే ఖరారు కాకపోవడం, ఎంపీ స్థానానికి బలమైన పోటీ ఉండటంతో అనకాపల్లి జిల్లాలో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు. అటు ఇంటెలిజెన్స్ వర్గాలు, సొంతపార్టీ నిర్వహిస్తున్న సర్వేలో సైతం ఈ మూడు పేర్లేనే ప్రస్తావిస్తుండటం విశేషం. అధికార పార్టీ, వారి గ్రౌండ్ నెట్వర్క్ లలో కూడా ఈ మూడు పేర్లకు డిమాండ్ ఉండటంతో అటు కొందరు సీనియర్లు కూడా సీటు గవర సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా పైచేయి సాధించడానికి అవకాశం వుంటుందనే విషయంలో కాస్త సీరియస్ గానే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది. కౌన్ బనేగా అనకాపల్లి ఎంపీ సీటు ఈ ముగ్గురిలో ఎవరిని వరిస్తోందో..లేదంటే ఆర్దికంగా బాలంగా ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్న నాన్ లోకల్ ట్రస్ట్ నిర్వాహకుడికి వస్తుందో లేదంటే ఇటీవలే పార్టీలో చేరిన కొణతాల రామక్రిష్ణను వరిస్తుందోననేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది..!

Anakapalle

2024-02-12 09:35:51

జగనన్న కాలనీ లో మౌలిక సదుపాయాలు పూర్తి కావాలి

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పేదలకు ఇచ్చిన  జగనన్న కాలనీ లేఅవుట్ లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను చూపించే  ప్రక్రియను  త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి లు సంయుక్తంగా హౌసింగ్ అధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్  చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మెన్ మోహిత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ లతో కలిసి జగనన్న కాలనీ లేఅవుట్ లలో  సదుపాయాల కల్పన  ప్రక్రియపై  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ, నవరత్నాలు  పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద లేఅవుట్ లలో పెండింగ్ మౌలిక అంశాలు ఏర్పాటుతో లబ్దిదారులకు వారి ఇంటి స్థలాలను చూయించా లని, దీనిపై హౌసింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు  పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో బాగంగా చంద్రగిరి నియోజకవర్గంకు సంబందించి వడమాల పేట, రామచంద్ర పురం మండల తదితర మండలాల్లోని జగనన్న కాలనీ లేఅవుట్ లలో పెండింగ్ అంశాలు ఉన్నవాటిలో  గ్రావెల్ రోడ్, అప్రోచ్ రోడ్ వంటి స్టోన్ ప్లాంటేషన్ తదితర సదుపాయాలని కల్పించి త్వరగా లబ్ధిదారులకు వారి ఇంటి స్థలాలను చూపించాలని  హౌసింగ్ అధికారులను ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ నిషాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వేంకటేశ్వర రావు, హౌసింగ్ డిఈ లు, ఎ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2024-02-10 16:05:17

విశాఖ ఎంపీ కేండిట్ విషయంలో టిడిపి వినూత్నవిధానం

విశాఖ ఎంపీ కేండిట్ ను ఎంపిక చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ వినూత్న విధానాన్ని ఎంచుకున్నది. దానికోసం ప్రజల నుంచే స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఒక ఫోన్ కాల్ విశాఖలోని పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు వస్తుంది..అందులో శారాంశం ఏంటంటే మీతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడతారని, తప్పకుండా కాల్ లిఫ్ట్ చేయాలన్నది. ఆ వెంటనే మరొక ఫోన్ వస్తోంది. అందులో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా ఎం.భరత్ ను ఎంపిక చేయాలనుకుంటే ఒకటి నొక్కండి లేదు నోటా అనుకుంటే రెండు నొక్కండి అనే చంద్రబాబు వాయిస్ వినిపిస్తుంది బీప్ శబ్దం తరువాత ఓటరు తన నెంబరుని ఎంచుకున్న తర్వాత కాల్ కట్ అవుతుంది. అంటే విశాఖ ప్రజలు ఎవరిని ఎన్నకుంటారో తెలుసుకోవడానికి టిడిపి ఈ తరహా టెక్నాలజీని వినియోగించడం ఇపుడు నగరంలో చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా ఎంపీ రేసులో ఉన్నవారి పట్ల ప్రజల్లో ఎంత విశ్వాసం, నమ్మకం ఉందనే విషయంలో కూడా గ్రౌండ్ నెట్వర్క్ బృందాలు కూడా జనంలో కలసిపోయి పాన్ షాపులు, టీ షాపులు, సలూన్ షాపులు, చికెన్ మటన్ షాపులు, రైతు బజార్లు, సినిమా థియేటర్ల వద్ద కూడా కొందరు సర్వేలు చేస్తుండటం విశేషం. ఏ అభ్యర్ధి అయితే గెలుస్తారో తెలుసుకోవడానికి టిడిపి అన్ని రకాల చర్యలు చేపట్టడం ఇపుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రజల పల్స్ కూడా స్పష్టం చాలా చోట్ల బయటపడుతుంది. దానిని బట్టి విశాఖ ఎంపీ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయి.

Visakhapatnam

2024-02-10 08:31:20

అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ శాంతి సదస్సును అడ్డుకోవడం తగదు..కె.తారీఖ్ అహ్మద్

అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించేందుకు ప్రయత్నించడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని సంస్థ జాతీయ ప్రతినిధి కె.తారీఖ్ అహ్మద్ పేర్కొన్నారు. విశాఖ నగరంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రపంచ శాంతిపై జనవరి 28న గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించాల్సి ఉంద‌ని కానీ. కానీ కొన్ని ముస్లిం సంస్థలు ఈ సదస్సును అడ్డుకోవాలని పిలుపునివ్వ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ అన్యాయపు ప్రయత్నాన్ని ఆహ్మదియ్య ముస్లిం సంఘం తీవ్రంగా ఖండిస్తూ, తమకు న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన‌ట్టు విశాఖ‌లో మీడియాకి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విశాఖపట్నం శాఖ అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ముస్లిమేతరులుగా ప్రకటించే ప్రయత్నాన్ని బలపర్చడం రాజ్యాంగ ఉల్లంఘన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ మనసా వాచా “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” కలిమాను విశ్వసిస్తూ, ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి (స.అ.స) ఆయన దైవ సందేశహరుడు, ఖాతమున్నబియ్యీన్ అని, పవిత్ర ఖురాన్ అల్లాహ్ యొక్క అంతిమ దైవ గ్రంథం అని విశ్వసిస్తుందన్నారు. 

అహ్మదీయ ముస్లింలు ఇస్లాం యొక్క మూల సూత్రాలు,విశ్వాసాలపై మనస్పూర్తిగా నడుచుకుంటార‌ని తెలియ‌జేశారు. భారతదేశంలోని అనేక హైకోర్టులు అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ఒక ఇస్లామిక్ సంస్థ అని తీర్పులనిచ్చాయనే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా 2011 జనాభ లెక్కల రిపోర్ట్ అధికారికంగా అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీని ఇస్లాంలో ఒక శాఖగా గుర్తించిందని తెలియ‌జేశారు.  ప్రపంచంలో అశాంతి, ఆందోళనలు, 3వ ప్రపంచ యుద్ధం  అనివార్యంగా కనిపిస్తున్న తరుణంలో అహ్మదియ్య ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్త నాయకుడు ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్  ఆధ్యాత్మిక నాయకత్వంలో విశ్వవ్యాప్తంగా శాంతి సదస్సు లు నిర్వహిస్తోందన్నారు.

శాంతి స్థాపన కోసం జరిగే ప్రయత్నాలను అడ్డుకోవాలని కొన్ని ముస్లిం సంస్థలు చూడడం దురదృష్టకరమని, ఖండనీయమని పేర్కొన్నారు.  భారతదేశం వంటి లౌకిక దేశంలో మతపరమైన ఫత్వాలు చట్టాలు కాజాలవని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఫత్వాలకు ఇస్లాం నిజమైన బోధనలకు ఎలాంటి సంబంధం లేదని, ఇటువంటి శాంతి సదస్సులు వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించి, సమాజంలో శాంతిని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.  ఇటువంటి కార్యక్రమాలను అన్ని వ‌ర్గా ముస్లి సంఘాలు ప్రోత్సహించి, మద్దతు ఇవ్వాలని కోరారు. ఇస్లాం అంటేనే ‘శాంతి, భద్రతలు’ అని అర్థమని.. శాంతిని పెంపొందించే ప్రయత్నాల్లో అడ్డంకులు సృష్టించడం, ఇస్లాం సిద్ధాంతాలకు,  బోధనలకు విరుద్ధమన్నారు. అన్ని ముస్లిం సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సామాజిక శాంతి, మత సామరస్యానికి హాని కలిగించే ప్రకటనలు జారీ చెయ్యకూడదనీ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

Visakhapatnam

2024-02-08 13:05:53

గ్రామ సచివాలయ ఉద్యోగులను నిలువునా మోసంచేసిన వైఎస్.జగన్.. ఆడారి కిషోర్ కుమార్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ యువనాయకులు, మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సచివాలయ శాఖ సీఎం వైఎస్.జగన్ రెడ్డి మానస పుత్రిక అని చెబుతూ, ఉద్యోగులను మభ్యపెడుతూ నేటికీ ఈప్రభుత్వశాఖకు చట్టబద్దత తీసుకురాలేదన్నారు. చట్టబద్ధత లేని ప్రభుత్వశాఖ ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉంటుందో ఉద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు. అంతేకాకుండా పీఆర్సీని అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం నేటికి సదరు పీఆర్సీ అరియర్స్ ఇవ్వలే దని, రెండేళ్ల తరువాత సర్వీసును రెగ్యులర్ చేస్తామని చెప్పి అదనంగా 9 నెలలు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకోలేదా అని ప్రశ్నించారు. సర్వీసు రెగ్యులర్ చేసిన తరువాత ఏపీ సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో నేటికీ ఎలాంటి ప్రకటనే చేయకపోవడం ఉద్యోగులను మోసం చేసినట్టు కాదా అని నిలదీశారు. నేటికీ కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేయలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా 
ఒకేసారి 1.25లక్షలు ఉద్యోగాలు భర్తీచేశామని తెగ ప్రచారం చేసుకునే ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకు కల్పించిన ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఎందుకు అమలు చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీకే ఓట్లు వేయించుకునే విధంగా ఆఖరి క్యాబినెట్ సమావేశం వరకూ గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత కల్పించే అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సచివాలయ శాఖకు ఈ క్యాబినెట్ లో చట్టబద్దత కల్పించడంతోపాటు, ఉద్యోగులకు గత పీఆర్సీ లో ఇవ్వాల్సిన అరియర్స్..9నెలల కాలానికి 2 డిఏలు, సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలని ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులను మోసం చేసిన తీరును రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు తెలియజేసి వారిని చైతన్య పరిచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Visakhapatnam

2024-01-30 15:23:15