1 ENS Live Breaking News

సీఎం చంద్రబాబు విశాఖ పర్యటననూ తప్పుదోవ పట్టించిన సమాచారశాఖ.. అట్లుంటది మనతోని

విశాఖజిల్లా జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై తప్పుడు సమాచారం ఇచ్చారు.. నేరుగా కలెక్టరే ఇస్తే పాపం జిల్లా సమచారాశాఖ అధికారులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.. జిల్లా కలెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా.. అన్నది అన్నట్టుగా జిల్లా సమాచారశాఖ అధికారులు మీడియాకి వారి స్టైల్ లో సమీక్షా సమావేశంతో కూడిన సమాచారం పెట్టేశారు.. ఏంటి ఏదో తేడా కొడుతుంది కదూ.. పక్కాతేడానే.. తేడా కాదు.. అంతకంటే అత్యంత దారుణమైన నిర్లక్ష్యం.. సమాచారశాఖ చేసిన తప్పుకి జిల్లా కలెక్టర్ ని బాధ్యులను చేసేశారు.  నవంబరు 2 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనకు బదులు అక్టోబర్ 2(గాంధీజయంతి రోజున) పర్యటన అని అక్టోబర్ 30న జిల్లా సమాచారశాఖ మీడియాకి కలెక్టర్ ఫోటోలు, వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మీడియాకి పంపే సమాచారాన్ని కనీసం ఒకసారి చెక్ చేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యహరిస్తున్నరడనికి సీఎం చంద్రబాబు సమాచారమే సాక్షి..!

ఏం మాట్లాడినా.. ఏం చేసి.. టెక్నికల్ ప్రాబ్లమ్ రాకుండా చేస్తామని చెప్పే జిల్లా సమాచారశాఖ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను  సాక్షాత్తు జిల్లా కలెక్టరే తప్పుగా.. తప్పుడు తేదీలతో చెప్పినట్టు సమాచారం ఇవ్వడాన్ని బట్టి విశాఖ జిల్లా సమాచారశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ సమాచారం ప్రెస్ నోట్ కూడా రాయడం రాకపోగా అత్యంత దారుణమైన నిర్లక్ష్యంగా సమాచారశాఖ అదికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మీడియాని ఆలోచింపజేస్తుంటే.. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కి మాత్రం మోయలేని శిరోభారాన్ని తెప్పిస్తున్నది. అయినా తప్పు విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులది కాదులేండి.. క్యాడర్ ఉందనే ఒకే ఒక్క సాంకేతిక కారణంతో కనీసం ప్రభుత్వ సమాచారాన్ని ప్రెస్ నోటుగా రాయడంపైనా.. తయారు చేసిన సమాచారాన్ని మీడియాకి పంపే ముందు చెక్ చేయడం కూడా రాని అధికారులను జిల్లా అధికారులుగా నియమించిన రాష్ట్ర సమాచారశాఖది. 

రాష్ట్రంలో జిల్లాలను విభజించిన సమయంలో కొత్త జిల్లాలకు డిపీఆర్వోలు కొరత ఏర్పడితే.. సాంతిక విభాగంలో ఏఈలు, డిఈలుగా పనిచేస్తున్నవారిని తీసుకొచ్చి రాష్ట్ర సమాచారశాఖ జిల్లా సమాచారశాఖ అధికారులుగా నియమించేసేంది. దానితో వచ్చీరాని పనులతో వీరంతా మీడియాని తప్పుదోవ పట్టించేస్తున్నారు. అందునా విశాఖజిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలు, వ్యవహారం, ప్రోటోకాల్ పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న సిబ్బందిని ఇక్కడ నియమించాలి కారణం ఈ జిల్లా ఉత్తరాంధ్రకే ట్రాన్సిట్ హాల్ట్ జిల్లా కనుక. కానీ రాష్ట్ర సమాచారశాఖ అదేమీ పట్టించుకోకుండా.. ఖాళీలను భర్తీచేసే స్పీడులో సాంకేతిక విభాగంలో పనిచేసే అధికారులను జిల్లా సమాచారశాఖ అధికారులగా నియమించడంతో.. వారికి రాని, తెలయని పనులు చేయమనేసిరికి ఇష్టానుసారం తప్పులు తప్పులుగా చేస్తున్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు మీడియా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా పెద్దగా పట్టించుకోలేదు.

 దీనితో కలెక్టరే తమ తప్పులను భరిస్తున్నారు.. కానీ మీడియా మాత్రం ప్రతీ చిన్న తప్పునీ ప్రత్చేక కథనంలో చూపిస్తుందని జిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బంది తెగ ఫీలైపోతున్నారు. అసలు చేసిన తప్పు మరోసారి చేయకుండా ఉండాలనే పశ్చాతాపం లేకుండా చేసిన తప్పే పదే పదే చేస్తుడంటం బహుసా విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులకు అలవాటైపోయినట్టుంది. విశేషం ఏంటంటే చాలా పత్రికలు అదే తప్పుడు సమాచారాన్ని వార్తలుగా పెట్టేశారు. సమాచారశాఖ చేసిన తప్పు..నిర్లక్ష్యం మీడియాతో కూడా తప్పుడు సమాచారం ఇచ్చేలా చేయగలిగారు.. కలెక్టర్ సారూ ఇదీ జిల్లాసమాచారశాఖ అధికారులు మీడియాకి సీఎం పర్యటన వివరాలు పంపిస్తున్న తీరు. సీఎం పర్యటనను తేదీలను తప్పుగా పంపించేసిన సమాచారశాఖ అధికారులు ఏదో ఒక రోజున భారీ తప్పులో మిమ్మల్నీ భాగస్వామ్యం చేసేస్తారు.. అప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే లైట్ తీసుకుంటారా ఏంటి..? పారాహుషార్..?! 

visakhapatnam

2024-10-31 04:15:27

విద్యా ప‌ర్యాట‌కంతో విద్యార్థుల‌కు విజ్ఞానం..వినోదం!

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్యాట‌క రంగాన్ని అన్ని వ‌ర్గాల వారికీ చేరువ చేయాల‌నే సంక‌ల్పంతో.. విశిష్ట‌త‌ల‌ను, విశేషాల‌ను విద్యార్థులకు తెలియ జేయాల‌నే ఉద్దేశంతో మూడు సెక్టార్ల‌లో ఎడ్యుకేష‌న‌ల్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని త‌ద్వారా విద్యార్థులకు వినోదం, విజ్ఞానం ల‌భిస్తాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. విద్యా ప‌ర్యాట‌కం ద్వారా విద్యార్థుల‌కు చారిత్ర‌క ప్ర‌దేశాల‌ విశేషాలు, విశిష్ట‌త‌లు తెలుస్తాయ‌ని అన్నారు. ఎడ్యుకేష‌న‌ల్ టూరిజంలో భాగంగా ప్ర‌వేశ పెట్టిన నూత‌న విధానానికి జిల్లా క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం శ్రీ‌కారం చుట్టారు. గాయ‌త్రీ విద్యాప‌రిష‌త్, అగ‌నంపూడి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల విద్యార్థుల‌తో స్థానిక క‌లెక్ట‌రేట్ నుంచి బ‌య‌లుదేరిన‌ విద్యా ప‌ర్యాట‌క ఐటెన‌ర‌రీ బ‌స్సుల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ప‌ర్యాట‌క, విద్యా, ఫారెస్ట్, మ‌త్స్య‌శాఖ అధికారుల‌తో క‌లిసి విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎడ్యుకేష‌నల్ టూరిజంలో భాగంగా విద్యార్థుల సౌల‌భ్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప‌ర్యాట‌క కేంద్రాల‌ను అనుసంధానం చేశామ‌ని, వాటిల్లో ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో చ‌దివే వారికి ఉచితంగా, ప్ర‌యివేటు విద్యా సంస్థ‌ల వారికి రూ.10 క‌నీస రుసంతో ప్ర‌వేశాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు.

మెరైన్ మ్యూజియం ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా సాగరతీరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిం చవచ్చ‌న్నారు. సీ హారియర్ మ్యూజియం, టీయూ-167, ఐఎన్ఎస్ కురుసురా స‌బ్మెరైన్, మారిటైమ్ మ్యూజియంలను విద్యార్థులు సందర్శించ‌వ‌చ్చ‌ని గైడ్ లు విశేషాల‌ను తెలుపుతార‌ని వివ‌రించారు. టైడ్ పూలింగ్కు వెళ్లేలా ప్రణాళిక‌లు రూపొందించామ‌న్నారు. దీని ద్వారా భూమి, జీవావరణ శాస్త్రంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థుల‌కు అవకాశం ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు.

జీవ వైవిధ్య పర్యటనలో భాగంగా పర్యావ‌ర‌ణంలోని జీవరాశుల అధ్యయనాన్ని చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇందిరా గాంధీ జులాజీకర్ పార్క్, కావులుప్పాడ సమీపంలోని బయోడైవర్సిటీ పార్కును సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని, కంబాలకొండ అభయారణ్యంలో కొన్ని ట్రెక్కింగ్ అనుభవాలను కూడా విద్యార్థులు సొంతం చేసుకోవచ్చ‌ని సూచించారు.

తీర పర్యావరణ వ్యవస్థ యాత్రలో భాగంగా ఏయూలోని జీవశాస్త్ర ప్రయోగశాలని విద్యార్థులు సందర్శించవచ్చ‌ని, మడ అడ‌వుల పరిశోధన కేంద్రం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం చూసే అవకాశం కలుగుతుంద‌ని చెప్పారు. ఈ యాత్ర ద్వారా పర్యావరణ పరిక్షణకు ఆయా జీవులు ఏ విధంగా దోహదపడ‌తాయో, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే అంశాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కలుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీనిలో భాగంగా తీర ప్రాంత పరిశోధనలకు సంబంధించి మెరైన్ లైవ్ వాక్ కూడా అనుసంధానం చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ అవ‌కాశాన్ని జిల్లాతో పాటు ఇత‌ర ప్రాంతాల విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

కార్య‌క్ర‌మంలో జిల్లా టూరిజం అధికారిణి జ్ఞాన‌వేణి, డీఈవో చంద్ర‌క‌ళ‌, మారిటైం బోర్డు అధికారి సుబ్బిరెడ్డి, ఫారెస్ట్, మ‌త్స్య శాఖ‌ల అధికారులు, టూరిజం కౌన్సిల్ స‌భ్యులు, విద్యార్థులు, టూరిజం శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

visakhapatnam

2024-10-19 13:38:37

9, 11 తరగతుల్లో ప్రవేశానికి నవోదయ నోటిఫికేషన్

జవహర్ నవోదయ విద్యాలయ కొమ్మాది,విశాఖపట్నం లో  2025-26 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి మరియు 11వ తరగతి ప్రవేశ పరీక్షలకు నవోదయ విద్యాల సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.

9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవటానికి ప్రస్తుతం2024-25 విద్యాసంవత్సరం లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. 

11వ తరగతి కొరకు దరఖాస్తు చేసుకోవటానికి ప్రస్తుతం 2024-25 విద్యాసంవత్సరం లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు చేసుకొను విధానం: 
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

జవహర్ నవోదయ విద్యాలయకు  దరఖాస్తు చేసుకొను విద్యార్థినీ - విద్యార్థులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నివసిస్తునట్లు నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి..

9 మరియు 11 తరగతులకు దరఖాస్తు చేసుకొనుటకు గాను  2024 - 25 విద్యా సంవత్సరం నందు ప్రభుత్వ మరియు  ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9 మరియు 11 తరగతులు చదువుతున్న బాల బాలికలు అర్హులు.

ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2010 మే 1 నుంచి 2012 జూలై 31 మధ్య జన్మించిన వారై ఉండాలి....

ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2008 జూన్ 1 నుండి 2010 జూలై 31 మధ్యన జన్మించిన వారై ఉండాలి.


దరఖాస్తుకు చివరి తేదీ: 30/10/2024

పరీక్షా తేదీ : 08/02/2025

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్న్  వినియోగించుకోగలరు 
9 వ తరగతికి: https://cbseitms.nic.in/2024/nvsix

11 వ తరగతి :
https://cbseitms.nic.in/2024/nvsxi_11


     మరిన్ని వివరాల కోసం
          ప్రిన్సిపల్                  
 డా య.సా.శి. చంద్రశేఖర్ 
జవహర్ నవోదయవిద్యాలయ 
 విశాఖపట్నం జిల్లా

viskhapatnam

2024-10-13 14:58:38

ఆంధ్రయూనివర్శిటీ లో ర్యాగింగ్ రక్కసి..!

ఆంధ్రయూనివర్శిటీలో మళ్లీ ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుంది..గత కొంత కాలంగా బయటకు రాని వ్యవహారం విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ర్యాగింగ్ విషయం మరోసారి బట్టబయలు అయ్యింది. విశాఖలోని ఏయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్‌ విద్యార్థినులపై కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా వాటిని వీడియోలు తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా పెట్టారు. ర్యాగింగ్‌ అంశం బయటకు రావడంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్కిటెక్చర్‌ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులతో కొంతమంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థినులు దురుసుగా ప్రవర్తించారు. హాస్టల్‌ రూమ్‌లో అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చేయలేం.. మాకు డ్యాన్స్‌ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. 

అంతేకాకుండా ర్యాగింగ్‌ సమయంలో సీనియర్లు వీడియోలు తీసి వాట్సాప్‌ గ్రూప్‌ల్లో షేర్‌ చేశారు. వాటికి మరికొంతమంది సీనియర్లు కామెంట్లు పెట్టారు. ర్యాగింగ్‌ విషయాన్ని ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తే సీనియర్లు తమను మరింత ఇబ్బందులకు గురిచేస్తారేమో అని జూనియర్లు భయపడిపోయారు. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో చివరకు కొంతమంది విద్యార్థినులు మీడియాను ఆశ్రయించడంతో ర్యాగింగ్‌ విషయం బయటకొచ్చింది. ర్యాగింగ్‌ అంశం బయటకు రావడంతో కాలేజీ యాజమాన్యం ఘటనపై ఎంక్వైరీ చేయించింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్ధుల తల్లిదండ్రులకు ముందు కౌన్సిలింగ్ చేయడంతో పాటు.. ర్యాగింగ్ కి పాల్పడే వారి ఫోటోలు, వీడియోలు,  వివరాలు మీడియాకి నేరుగా ఇచ్చే యోచనకి వస్తే ఇలాంటి చర్యలు ఉపక్రమించరని బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు గొల్లుమన్నారు. 

ఇలాంటి ర్యాగింగ్ లు వారింట్లో అక్కకో.. చెల్లికో.. తల్లికో జరిగితే ఎలావుంటుందంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాగా ఈ విషయాన్ని విశాఖ నగర పోలీస్ కమిషనర్ కూడా సీరియస్ గానే తీసుకున్నట్టు తెలిసింది. అంతేకాకుండా ఆంధ్రాయూనిర్శిటీపై ఒక కన్నేసి ఉంచాలనే యోచనకు వచ్చినట్టు సమాచారం అందుతుంది. చాలా కాలంటా యూనివర్శిటీలో ర్యాంగింగ్ లు జరుగుతున్నా.. అవిబయటకు పొక్కలేదు. కానీ సోమవారం జరిగిన ర్యాగింగ్ శృతిమించడంతో మీడియాలో రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యూనివర్శిటీల్లో ర్యాగింగ్ బయట పడటంపై ఇదంతా ఒక పథకం ప్రకారమే చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని రాజకీయం చేయాలని కూడా కొందరు చూస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. కాగా యూనివర్శిటీలో ర్యాగింగ్ జరిగిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు విశాఖ చేరుకుంటున్నారు. కొందరు ఫోన్లలో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో ఆంధ్రాయూనివర్శిటీ యాజమాన్యం.. అధికారులు.. పోలీసులు నేటి నుంచి ఏ విధంగా స్పందిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

visakhapatnam

2024-10-07 19:30:01

జర్నలిస్టుల మనసు గెలిచిన జిల్లా కలెక్టర్..!

బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలకు, ప్రభుత్వాలకి తెలియజేసేది మీడియా.. ప్రజ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధిని చూపించేది జర్నలిస్టులు.. ఏం చేసినా మీడియానే చేయాలి.. అలాంటి మీడియాలో పనిచేసే జర్నలిస్టులకే కష్టకాలం వస్తే.. అలాంటి వారిని ఆదుకునేది, అక్కున చేర్చుకునేది ఒక్క జిల్లా కలెక్టర్ మాత్రమే..ఇపుడు విశాఖలో జర్నస్టులకు ఏం  కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకి వచ్చి అండగా నిలబడుతున్న విశాఖజిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ జర్నలిస్టుల మనసు గెలుచుకొని అందరివాడు అయ్యారు. ఎప్పుడో జిల్లా కలెక్టర్ గా జె.శ్యామలరావు, జెసిగా పోలాభాస్కర్  విశాఖలో పనిచేసిన కాలంలో అధికార యంత్రాంగానికి.. మీడియాకి ఉన్న స్నేహ పూర్వక వాతావరణాన్ని మళ్లీ ఇన్నేళ్ల తరువాత జిల్లా కలెక్టర్ గా హరేంధిర ప్రసాద్ వచ్చిన తరువాత చూస్తున్నారు జర్నలిస్టులు. అంతేకాదు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తూ విశాఖ అభివృద్ధిలో చెరగని సంతకంలా కూడా మారిపోయారు. 

సమాజంలో నాల్గవ స్థంభంగా వున్న మీడియాకి సముచిత స్థానం కల్పించాలని.. అందులో పనిచేసే జర్నలిస్టులకు కనీస అవసరాలు తీర్చేందుకు ముందుకి వచ్చారు వైజాగ్ కలెక్టర్. విశాఖజిల్లాలో బాధత్యలు తీసుకున్న నాటి నుంచి ప్రజాసమస్యల పరిష్కరించడంతోపాటు, క్షేత్రస్థాయిలోనూ పర్యటనలు చేస్తూ ప్రజలకు కూడా అత్యంత చేరువ అయ్యారు. సాధారణంగా జిల్లా కలెక్టర్ అంటే ప్రోటోకాల్ అధికారి.. కానీ ఈయన అత్యంత సాధారణంగా ఉంటూ అటు అధికార యంత్రాంగానికి.. ఇటు ప్రజలకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు చేరువ అయ్యారు. అదే సమయంలో సమజంలో జరిగే అన్ని విషయాలను పత్రికలు మీడియా ద్వారా చూపించే మీడియా పట్ల కూడా ఎంతో గౌరవంతో మెలగుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించ గలిగారు.

మహావిశాఖనగర పాలక సంస్థకు కూడా ప్రత్యేక అధికారి కావడంతో దేశంలోనే జివిఎంసీని ప్రప్రధమ స్థానంలో ఉంచే క్రమంలో చేపడుతున్న అభివృద్ధిలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అంటే సుమారు 75 ప్రభుత్వ శాఖలకు ముఖ్య అధికారి.. రాష్ట్రప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పరిపాలనలో ఎంత కీలకమో.. జిల్లాలో కూడా కలెక్టర్ అంతే కీలకం. నిత్యం ఎన్నో బిజీ బిజీ పనులు ఉన్నప్పటికీ జర్నలిస్టులన్నా.. వారి సమస్యల పరిష్కరించంలోనూ ఒక అడుగు ముందుకేసి మరీ చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారు. జర్నలిస్టుల్లో చాలా మంది నిరుపేదలు ఉండటంతో వారికి కాస్త చేదోడుగా.. జిల్లా అధికార యంత్రాంగాన్ని చైతన్య పరిచి సేకరించిన సిఎస్ఎస్ నిధులతో జర్నలిస్టుల హెల్త్ కార్డు ప్రీమియం చెల్లించడంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. 

తద్వారా జిల్లాలోని వైట్ రేషన్ కార్డు కలిగిన అక్రిడేటెడ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ ప్రీమియం చెల్లిడానికి మార్గం సుగమం అయ్యింది. అంతేకాకుండా ఇపుడు మిగిలిన జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డుల ప్రీమియం సిఎస్ఎస్ నిధుల నుంచి చెల్లించాలనే ప్రతిపాదనలకు కూడా న్యాయం చేసేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా బాగా విస్తరించడంతో టెక్నాలజీని వినియోగించి పరిపాలన చేయడంలోనూ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ అందరికీ  అవగాహనక కల్పించడంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు.

విశాఖలో ఇటీవల  జర్నలిస్టు(లక్ష్మణ్) అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో ఆయనకు ప్రెస్ అక్రిడిటేషన్ లేదు. అది ఉంటే తప్పా హెల్త్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. దానితో విశాఖలోని జర్నలిస్టులు ఆర్ధిక సహాయం చేసి మృతి చెందిన లక్ష్మణ పార్ధీవ శరీరాన్ని విశాఖ తీసుకువచ్చి.. జర్నలిస్టులే దహన సంస్కారాలు చేశారు. ఆ సమయంలో జర్నలిస్టుల పాలిన ఆత్మబంధవు, అందరివాడు, నిశ్వార్ధ సేవకుడు ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు ముందుకొచ్చి తన సొంత నిధులతో జర్నలిస్టు లక్ష్మణ్ దశదిన ఖర్మను కూడా చేసి జర్నలిస్టులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అత్యధిక మొత్తంలో ఆర్ధిక సహాయం కూడా చేశారు. ఆ తరువాత మరో జర్నలిస్టు తల్లి గుండె పోటుతో మృతిచెందడం, మరో జర్నలిస్టు సతీమణి చికిత్స పొందుతూ మృతిచెందడం, ఇలా ఏడాది కాలంలో పలువురు జర్నలిస్టుల కుటుంబాల్లో జరిగిన విషాద సంఘటలన్నీ కలెక్టర్ దృష్టికి జర్నలిస్టులు తీసుకెళ్లడంతో చలించిపోయారు.

 ఆఖరుగా అర్హత ఉండి ప్రెస్ అక్రిటిటేషన్ కార్డులు పొందలేని జర్నలిస్టుల కోసం ప్రత్యేక అక్రిడిటేషన్ కమిటీ సమావేశం పెట్టి మరీ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసి.. తద్వారా హెల్త్ కార్డులు పొందడానికి అవకాశం కల్పించారు. మంచి మనసుతో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేసిన సహాయం పట్ల జర్నలిస్టులు, జర్నలిస్టులు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా జర్నలిస్టుల మనసు తెలుసుకున్న కలెక్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే అర్హత ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులు రావడంతోపాటు, హెల్త్ కార్డులు కూడా చక్కగా వచ్చే అవకాశం వుంటుంది. జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా అందే మేలు జరగడంతోపాటు.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి కూడా ఎంతో పేరు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!

visakhapatnam

2024-10-02 15:02:35

ప్రతీనెల ఒకరోజు ఎలక్ట్రికల్, పబ్లింగ్ పనులకు సెలవు

తూర్పుగోదావరి జిల్లాలో ఇకపై ప్రతీనెలా 4వ తేదిన ఒకరోజు సెలవు దినంగా ప్రకటిస్తూ యూనియన్ లో తీర్మానం చేసినట్టు గోదావరి ఎలక్ట్రి కల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్   ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ తెలియజేశారు. ఈ మేరకు యూనియన్  సమావేశంలో రాజమండ్రిలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా యూనియన్ లోని పలు అంశాలను చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నెలలో ఒకరోజు కార్మికు లకు సెల వు ఇవ్వాలని.. కార్మికులకు కొత్త రేట్లు ఏర్పాటు చేయాలని, ఆపద సమయంలో ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకోవా లనే తదితర ప్రధాన అంశాలను చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి పెంచిన కొత్తరేట్లను అమలు చేయాలని కూడా నిర్ణయించారు.  అదేవిధంగా రాజమహేంద్ర లో ఉన్న బిల్డర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, షాపు యజమానులు, వినియోగదారులు ఇతర యూనియన్ల సభ్యులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.  అనంతరం గౌరవ అధ్యక్షులు ఎడ్ల సూర్యచంద్రరావు, ఎంవిజివి ప్రసాద్ లు యూనియన్ కు నూతన ట్రెజరర్ గా సుదర్శన్ షణ్ముఖం నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదా రులు కాకి రవిబాబు , సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు , స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వ రరావు, కమిటీ  సభ్యులు నిమ్మలపూడి రవివర్మ , గెడ్డం ప్రసన్నకుమార్ , ఉత్తరాల సోమేశ్వరరావు, పోలేపల్లి విజయ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

rajamundry

2024-09-28 17:32:57

విశాఖలో నర్సింగ్ సీట్లు అడ్డగోలుగా అమ్మేస్తున్నారు..!

విశాఖజిల్లాలో ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లో జీఎన్ఎం సీట్ల వ్యాపారం మూడుపువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది.. ఒక్క ప్రైవేటు కళాశాల కూడా వెబ్ కౌన్సిలింగ్ మొదలు కాకుండానే అపుడే 70శాతం సీట్లు అమ్మేశాయంటే జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంతో ఏ స్థాయి ఒప్పం దాలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రైవేటు నర్శింగ్ కళాశాలల్లో ఒక్కో మేల్ జిఎన్ఎం సీటు ఏడాదికి రూ.75వేలు, మహిళలకు రూ. 55వేలు చొప్పున అమ్మేస్తున్నారు. ఇదేదో చీకటిలో బాణం వేసి చెబుతున్న మాటలు కాదు. ఈఎన్ఎస్-ఈరోజు స్వయంగా కొన్ని ప్రైవేటు కాలేజీల్లో సీటు కోసం విచారణ చేస్తున్నట్టు విద్యార్ధిగా వెళ్లి మరీ విచారణ చేస్తే అసలు విషయాలు బయట పడింది. మేనేజ్ మెంట్ సీట్లు ప్రైవేటు కళా శాలల ఇష్టం...కానీ కన్వీనర్ కోటా సీట్లు కూడా కౌన్సిలింగ్ మొదలు కాకుండానే అమ్మేస్తున్నారంటే నర్సింగ్ కళాశాల్లో జీఎంఎసం సీట్ల అమ్మ కాలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా  అడ్డగోలుగా అమ్మేస్తున్న నర్శింగ్ కళాశాలల సీట్ల అమ్మకంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే వాస్తవ పరిస్థితి వెలుగు చూస్తుంది.

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో కింగ్ జార్జి ఆసుపత్రి అనుబంధ ప్రభుత్వ నర్శింగ్ కళాశాలతోపాటు ప్రైవేటుగా 27 నర్శింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల కళాశాల తప్పితే  మిగిలిన అన్ని కాలేజీల్లోనూ 70-80శాతం సీట్లు అమ్మేశారు. అంతేకాదు. కొన్ని కాలేజీల్లో మేల్ నర్శింగ్ కి అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే అదంతా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులం మేమూ చూసుకుంటామని.. మీ మీడియా వాళ్లు ఏం రాసుకున్నా ఇబ్బందేమీ లేదని.. మీ పని మీరు చూసుకోండని..మా పని, మా సీట్ల అమ్మకం మేము చేసుకుంటామని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఇంటర్ పాసైన విద్యార్ధులు ఆన్ లైన్ లో బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎస్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా అనుమతి ఇచ్చింది. సదరు వెబ్ సైట్ లోని ప్రైవేటు నర్శింగ్ కళాశాలలన్నీ ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన తరువాత మాత్రమే సీట్లు భర్తీచేయాలి.

 కాకపోతే మేనేజ్ మెంట్ కోటా సీట్లు మాత్రం ఎప్పుడు భర్తీచేసుకున్నా దానికి ప్రభుత్వం అనుమతి అవసరం ఉండకపోవచ్చు. అదీ కన్వీనర్ కోటా సీట్లు భర్తీ జరిగిపోతే. కానీ విశాఖలో మాత్రం ప్రభుత్వం జిఎన్ఎంకి సీట్లకు దరఖాస్తు చేసే సమయంలోనే విశాఖలోని కాలేజీల్లోని సీట్లన్నీ అమ్మేస్తున్నారు. ఇలా అక్రమంగా..అడ్డగోలుగా ప్రైవేటు నర్శింగ్ కాలేజీలు సీట్లతో లక్షల వ్యాపారం ప్రభుత్వ అనుమతులు రాకుండానే చేస్తున్నా.. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి గానీ, కార్యాలయంలోని సంబంధిత విభాగంలోని సిబ్బంది కానీ నోరు మెదపడం లేదు. అటు ప్రైవేటు కాలేజీలు ఆరోగ్యశాఖ అధికారులకు వారుచేసే వ్యాపారానికి సహకారం అందిస్తుండటంతో నిబంధనలకు విరుద్దంగా సీట్ల భర్తీచేసుకోవడానికి వ్యాపారం చేస్తున్నందుకు సీటుకింత లెక్కన కమిషన్లు ఇస్తున్నట్టు సమాచారం అందుతుంది. పైగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోని సిబ్బందే ఏ కాలేజీలో ఫీజులు తక్కువగా ఉంటాయి..మరే కాలేజీలో ఎక్కువగా ఉంటాయి.. వారి సిఫారసులు ఎక్కడ పనిచేస్తున్నాయో కూడా చెబుతుండటం విశేషం. 

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు తీసుకొని కౌన్సిలింగ్ తేదీ వరకూ కార్యాలయంలోనే ఉంచాలనే నిబంధనలను వారే స్వయంగా ఉల్లంఘించి ప్రైవేటు కాలేజీలకు పంపిమరీ అడ్మిషన్లకు సహకరిస్తుండటం ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది. ఇదే విషయమై ఈఎన్ఎస్-ఈరోజు నేరుగా చరవాణిలో విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా డిఎంహెచ్ఓ స్పందించలేదు. విశాఖలోని అడ్డగోలు నర్సింగ్ కాలేజీల్లోని జీఎన్ఎం సీట్లు కౌన్సిలింగ్ అమ్మకాలు చేస్తున్న వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తే వైద్యఆరోగ్యశాఖ కార్యాల యంలోని ఈ తేడా వ్యవహారంపై ఎందుకు స్పందించలేదనే విషయం బయటకు వస్తుంది.

visakhapatnam

2024-09-25 02:26:38

సినీ పరిశ్రమకు విశాఖ పర్యాటకం ఒక స్వర్గదామం-డా.కంచర్ల

ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు నిర్మించే దర్శక నిర్మాతలకు విశాఖ పర్యాటకం ఒక స్వర్గదామమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విభజన ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి విశాఖ ఎంతగానో ఉపయోగ పడుతు న్నదన్నారు. విశాఖమహానగరంతోపాటు ఉమ్మడి జిల్లాలో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు సినిమాలకు ఎంతో అనువుగా ఉంటాయ న్నారు. సినీ నిర్మాతలు, దర్శకులు, టివీ సీరియల్ నిర్వాహకులు తక్కువ ఖర్చుతో విశాఖలో తమ షూటింగ్స్ చేసుకోవచ్చు నన్నారు. సొంత రాష్ట్రం లోని సినిమాలు నిర్మించడం ద్వారా సదరు ఆదాయం రాష్ట్రప్రభుత్వానికి చేరడానికి ఆస్కారం వుంటుందన్నారు. అతేకాకుండా విశాఖ పర్యాక ప్రదేశాలను సినిమాల ద్వారా ప్రమోషన్ చేసే అవకాశం కూడా లభిస్తుందన్నారు. 

నిర్మాతలు, దర్శకులు కథ, హీరో హీరోయిన్లతో విశాఖ వస్తే ఇక్కడే పూర్తి సినిమా తీసుకునేంతగా సదుపాయాలు ఉన్నాయన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమను విశాఖ తీసుకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. విశాఖలోనే సినిమా ఇండస్ట్రీకి చెందిన అనుబంధ పరిశ్రమ లను కూడా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాతలు సినిమా నిర్మించడంతోపాటో ఫస్ట్ కాపీ ఇక్కడి నుంచే తీసుకెళ్లే విధంగా అభివృద్ధి చేయడా నికి కార్యాచరణ సిద్దమవుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా విశాఖ లో ఏర్పాటు చేసేలా చేయడానికి రాష్ట్రప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళుతున్నామన్నారు. దేశంలోనే విశాఖలో ఉన్న పర్యాటక ప్రాంతాలు మరె క్కడా లేవన్నారు. అలాంటి అందమైన విశాఖను పర్యాటకంగా ప్రమోట్ చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్టు కంచర్ల చెప్పారు.

visakhapatnam

2024-09-24 17:16:09

టూరిజం అండ్ పీస్ పై విశాఖజిల్లా పర్యాటకశాఖ పోటీలు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో "టూరిజం అండ్ పీస్"  అనే అంశంతో యువ టూరిజం క్లబ్ ద్వారా స్కూల్స్ కాలేజీల్లోలో ఎస్సే రైటింగ్ ఆర్ట్ పెయింటింగ్ కాంపిటీషన్స్ ను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెకలెక్టర్ హరేంధిరప్రసాద్ పేర్కొ న్నారు. ఈ మేరకు మంగళవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. మూడు అంశాల మీద ఫోటోగ్రఫీ,  షార్ట్ ఫిలిం కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్, చైర్మన్ డిస్టిక్ టూరిజం కౌన్సిల్ ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో.. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ తో 26న ఉదయం ఆరు గంటలకు హెరిటేజ్ వాక్ కూడా నిర్వహి స్తున్నామన్నారు. అదేవిధంగా నగరంలోని ముఖ్య మైన కూడళ్ళలో విశాఖలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలతో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ఫోటో గ్రఫీ  పోటీలో ఎన్నికైన వారికి  27న వుడా చిల్డ్రన్స్ ఎరీనా లో జరగనున్న వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్లో  బహుమతులు అందజేయనున్నట్టు చెప్పారు. ఈ పోటీల ద్వారా యువతకు టూరిజంపై అవగాహన, ఆశక్తి పెంపొందించాలనే లక్ష్యంతోనే చేపట్టే ఈ కార్యాక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లా పర్యాటకశాఖ నిర్వహిం చే ఈ పోటీల్లో పాఠశాల, కళాశాల విద్యార్దులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పర్యాటక అధికా రి జ్ఞానవేణి  9494918484 చరవాణిలో  సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

visakhapatnam

2024-09-24 15:58:33

ఆ.. సూపరింటెండెంట్ బదిలీ కోసం ఎస్ఈ అష్ట కష్టాలు

 విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం (జోన్-1) సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారంపై విశాఖ మీడియాలో వచ్చిన కథనాలు కూడా డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. ముఖ్యంగా శ్రీకాకుళం జాల్లాలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న జి.కనవల్లీ కుమారి ప్రస్తుతం ఓడీపై విశాఖజిల్లాలోనే పనిచేస్తున్నారు. ఈమెకు 2024 పంచాయతీరాజ్ బదిలీల్లో జీఓఎంఎస్ నెంబరు -75 నిబంధనల ప్రకారం బదిలీకి దరఖాస్తుచేసుకునే అర్హత లేకపోయినా.. ఆమె బదిలీకి దరఖాస్తు చేసుకోవడంతో ఇటీవలే రిటైర్ అయిన ఎస్ఈ, ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈలు ఆమెను కోరుకున్న చోటుకి బదిలీలు చేయడానికి అన్ని దారులు వెతుకుతున్న విషయంపై వచ్చిన మీడియా కథనాలు కూడా డిప్యూటీ సీఎం కార్యాలయాలకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఇటు విశాఖజిల్లా కలెక్టర్ వద్ద ఆమె విశాఖలోనే  ఓడిపై విధులు నిర్వహిస్తున్న విషయాన్ని, సదురు ఆర్ఢర్ ను దాచిపెట్టి ప్రస్తుత ఎస్ఈ కనకవల్లీ కుమారిని బదిలీచేయడానికి రంగం సిద్దం చేయడంతో ఈ విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ లు స్వయంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్(ఇఎన్సీ) బాలూనాయక్ దృష్టికి కూడా ఈఎన్ఎస్-ఈరోజు ప్రతినిధి స్వయంగా తీసుకెళ్లారు. 

దానితో స్పందించిన విశాఖ జిల్లా కలెక్టర్ ఆమె బదిలీపై ఎస్ఈల అత్యుత్సాహం, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారంపై విచారణ చేస్తామని ప్రకటించగా.. ఇఎన్సీ మాత్రం జీఓనెంబరు 75కి విరుద్ధంగా బదిలీలు చేపడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇదే  విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు నేరుగా ప్రస్తుతం బదిలీలు చేపడుతున్న జోన్-1 ఇన్చార్జి ఎస్ఈ ఎం.శ్రీనివాసరావుని  ఇప్పటికే ఓడిపై పనిచేస్తూ.. మళ్లీ బదిలీలకు నిబంధనలకు విరుద్దుంగా దరఖాస్తు చేసుకున్న సూపరింటెండెంట్ ను బదిలీచేయడానికి నిబంధనలు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఎవరి సహకారంతో ఆమెను ప్రభుత్వ జీఓకి వ్యతిరేకంగా బదిలీ చేస్తున్నారని.. దీనిపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరగా..  ఈ విషయమై తాను తర్వాత మాట్లాడతానని జవాబు దాటవేశారు. అంతేకాకుండా ఈ బదిలీలపై జరుగుతున్న అక్రమాలకు సంబంధించి సమాచార హక్కుచట్టం దాఖలైన విషయాన్ని కూడా బయట పెట్టడానికి ఆయన అంగీకరించలేదు. 

ఈమె బదిలీ విషయంలో ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఈ, ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈలు పనిగట్టుకొని మరీ కష్టపడటం. ఇటీవలే రిటైర్ అయిన ఎస్ఈ, కొందరు డిఈల, ఈఈల సహకారంతో సిఫారసు లేఖల కోసం ప్రయత్నాలు చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  కాగా తనకు క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సదరు సూపరిటెండెంట్ కి సిఫారసు చేస్తూ ఇవే కారణాలతో బదిలీ చేయాలని చూస్తున్నారని కూడా తెలుస్తుంది. విశేషం ఏంటంటే ఈసారి బదిలీల్లో అనారోగ్య సమస్యలపై బదిలీలు చేసుకోవడానికి వీలు లేకుండా నిబంధనలు కఠినతరం చేసినా.. అదే కారణాలు చూపించడం.. బదిలీలు చేసే అధికారులు తనకు వత్తాసు పకడంతో తానే తన ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ను ముందుస్తుగానే తయారు చేసేసుకొని.. జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలపై సమాచారహక్కుచట్టం దరఖాస్తు దాఖలైనందును వచ్చే సమాచారం.. సదరు ఉద్యోగిని ఆరోగ్య సమస్యలపై నిజంగానే వైద్యాధికారులతో విచారణ చేపడితే దానికి కూడా ఈమెను ఎలాగైనా బదిలీ చేసేయాలని చూస్తున్న ఎస్ఈలు లిఖిత పూర్వకంగా చేసిన తప్పులను ఒప్పుకోవాల్సి వస్తుంది..!

visakhapatnam

2024-09-24 02:31:06

విశాఖ ఉక్కుకోసం ఉద్యమాలన్నీ వేస్టేనా..?!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఒకప్పటి మాట.. విశాఖ ఉక్కు కేంద్రం హక్కు ఇది నేటి మాట. అవును ఎవరు బాధపడినా.. మరెవరు ఆనందపడినా ఇది నిజం. కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నిజం. విశాఖ కోసం నాడు చేసిన ఉద్యమం.. అదే విశాఖ కోసం నేడు చేస్తున్న ఉద్యమం కేంద్రానికి అస్సలు పట్టలేదు. సరికదా..కేంద్రంలోని ఖాయిలా పడ్డ పరిశ్రమల్లో విశాఖ ఉక్కు మాత్రమే ప్రధమ స్థానంలో ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబూరావు పార్లమెంటులో వేసిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. విశాఖ ఉక్కుని ఖచ్చితంగా ప్రైవేటు పరం చేసేస్తామని. ఇక మేటర్ క్లియర్ అయిపోయింది కదా..

 అయితే విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)ను ప్రైవేటు పరం చేస్తే సహించం అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నప్పటికీ  కేంద్రం మాత్రం ఆ దిశగా చక చకా అడుగులు వేసుకొని పోతోందని అధికారికంగా ప్రకటించడం పట్ల ఉత్తరాంధ్ర ఉప్పెనై పైకి లేస్తున్నా.. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలో లిఖిత పూర్వక హామీ మాత్రం తేలేకపోయింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు ఈనెల సెప్టెంబరు 10వ తేదీన రాసిన లేఖ ఈరోజు విశాఖలో ఆయన బయట పెడితే తప్పా అసలు విషయం బయటకు రాలేదు.. గత అయిదేళ్లగా వైఎస్సార్సీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం నుంచి నిర్ధిష్టమైన హామీ తీసుకురాలేకపోవడం విశాఖ ఉక్కు రాజకీయాలకు వేదికైంది.

 విశాఖ ఉక్కులో పెట్టుబడులను ఉపసంహరించుకోడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రాజ్య సభ సభ్యునికి రాసిన లేఖ వెల్లడించారు. అంతే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పాలసీ ద్వారా కొత్త పబ్లిక్ సెక్టార్ పాలసీకి కేంద్రం అనుమతించిందని కూడా పేర్కొన్నారు. నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లలో వుండే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ్స్ను ప్రైవేటు రంగానికి ఇచ్చేయడమో, లేదా మూసి వేయడమో చేస్తామని మంత్రి స్పష్టంగా ఈ లేఖలో తెలియజేశారు. అంతే కాదు ఉక్కు పరిశ్రమ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లో వుందని కూడా మంత్రి పంకజ్ చౌదరి గుర్తు చేస్తూ చావు కబురు చల్లగా చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే నాడు ఉక్కో కోసం చేసిన ఉద్యమాలు.. ఇపుడు దానిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఉద్యమాలు వేస్టేనని తేలిపోయింది.  ఎవరేమనుకున్నా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోయితుందనే అధికారిక లేఖ ఇపుడు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతోంది. మరోవైపు ఈ విషయమై అటు వైఎస్సార్సీపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు ప్రజలను నేటికీ మభ్య పెడుతూనే ఉన్నాయి..

 విశాఖ ఉక్కుపై మీ స్టాండ్  ఏంటంటే మీ స్టాండ్ ఏంటంటూ మీడియా వేదిక ముష్టి యుద్దాలు కూడా చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం నుంచి సాగుతున్న ఈ వ్యవహారం కూటమి స్నేహబంధంలో ఆగుతుందని అంతా అనుకున్నారు. అయినా కేంద్రం తన పనిని తాను చల్లాగా చేసుకుపోతుందని తేలిపోయింది. ఎవరేమనుకున్నా మాకు వినపడదు.. కనపడదు.. అన్నట్టుగానే కేంద్రం వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు వైఎస్సార్సీపీ, ఇటు కూటమి ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కోసం చేస్తున్న ఉద్యమాలు చేస్తున్న కార్మికులకి, ఉత్తరాంధ్ర సెంటిమెంట్ అనుకున్న ఈ ప్రాంత ప్రజలకు కేంద్రం ద్వారా ఎలాంటి సమాధానం మళ్లీ రాజకీయంగా చెప్పిస్తారనేది కోటి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. కేంద్రం అనుకున్నట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణా లేదంటే..ఉత్తరాంధ్ర ప్రజల మనోభవాలపై నీళ్లా.. కాదంటే రాజకీయంగా పైచేయా..? ఎవరు ఏం చేస్తారనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

visakhapatnam

2024-09-16 19:19:03

విశాఖ జిల్లా కలెక్టర్ నే బురిడీ కొట్టించారు..!

పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీల విషయంలో జోన్-1 ఎస్ఈలు(విశాఖ ఎస్ఈ కె.శ్రీనివాసరావు)  విశాఖ జిల్లా కలెక్టర్ నే బురిడీ కొట్టించారు. జిఓఎంఎస్ నెంబరు 75కి విరుద్ధంగా బదిలీలు జరుగుతున్నాయని.. ఈరోజు-ఈఎన్ఎస్ లు ఆధారాలతో సహా కథనాలు ప్రచురిం చాయి. దానిపై స్పందించిన విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జోన్-1 యూనిట్ ఆఫీసర్ ను వివరణ కోరగా.. అంతా బాగానే జరుగుతున్నా యని.. పత్రికల్లో వచ్చిన కథనాలు ఆధారాలు లేవని ఉమ్ముతడిగా సమాధానం ఇచ్చారు. అయితే ఇదే విషయాన్ని గురువారం ఈరోజు ప్రధాన ప్రతినిధి జిల్లా కలెక్టర్ వద్ద స్వయంగా ప్రస్తావించారు. అంతేకాకుండా సూపరింటెండెంట్ల బదిలీల్లో జోన్-1 ఎస్ఈలు ఏవిధంగా వ్యవహరిస్తు న్నారో కూడా పూసగుచ్చినట్టు కలెక్టర్ కు వివరించారు. మరీ ముఖ్యంగా సూపరింటెండెంట్ ల బదిలీల్లో ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకొని  శ్రీకాకుళం జిల్లాలో సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తూ.. ఆరోగ్యసమస్యలు, మహిళా, హ్యుమారిటే యన్  తదితర కారణాలతో  జివికనవల్లీ కుమారినే  సూపరింటెండెంట్ ఓడిపై విధులు చేస్తున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. 

దానికి సంబంధించిన ఆధారాలను కూడా జిల్లా కలెక్టర్ ఓడీ ఆర్డర్లు కూడా చూపించడంతో అసలు తన దృష్టికి ఓడిపై విశాఖలో విధులు నిర్వ హిస్తున్న అంశం ఎస్ఈలు తన దృష్టికి తీసుకు రాలేదన్నారు. 2024లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకపోయినా.. దరఖా స్తు చేసుకున్నారని.. సదరు నోట్ ఫైల్ పై ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఈ బిఎస్.రవీంధ్ర సంతకం చేసిన వాటినే  ఫైనల్ చేస్తూ నేడు( సెప్టెంబరు 13న) ఆర్డర్లు కూడా ఇవ్వడానికి సిద్దపడిపోతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో అసలు నోట్ ఫైల్ పై తన అప్రూవల్ లేకుండా ఏ విధంగా బదిలీ చేస్తారని కలెక్టర్ సమాధాన మిచ్చారు. ఈ విషయాన్ని తాను స్వయంగా జోన్-1 బదిలీల అధికారి అయిన ఎస్ఈ లని పిలిపించి మాట్లాడతానని కూడా చెప్పారు. బదిలీల విషయంలో తేడాలు జరుగుతున్నాయని ఎస్ఈని వివరణ ఇవ్వమంటే ఏదో ఇచ్చా రు కానీ పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేదని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. దానితో ఈరోజు ప్రతినిధి మాట్లాడుతూ.. జిఓఎంఎస్ నెంబరు-75కి విరుద్దంగా జరిగిన బదిలీల ప్రక్రియపై ఏవిధమై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. తొలుత ఎస్ఈతో మాట్లాడతానని.. ఇప్పటికే ప్రభు త్వం బదిలీలకు గడువు పెంచిన నందున.. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం బదిలీలు జరిగేలా చూస్తామని చెప్పారు. 

ఒక ఉద్యోగి పదే పదే తనకు అనుకూలంగా ప్రభుత్వ ప్రయోజనాలను తన బదిలీల కోసం ఎలా వినియోగించుకుంటారని.. ఇలా చేయడం వలన మిగిలిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని కూడా కలెక్టర్ కు వివరించడంతో ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయిస్తామని కూడా చెప్పారు. దీనితో నేడు నేరుగా బదిలీల ఉత్తర్వులు తీసేసుకుంటానని.. ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నవారికి జిల్లా కలెక్టర్ ఆదేశం అడ్డుకట్ట పడినట్టు అయ్యింది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై సమాచారహక్కు చట్టం దరఖాస్తు కూడా దాఖలు కావడంతో దానికి కూడా పంచాయతీరాజ్ జోన్-1 అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఒక వేళ ఇప్పుడు సమాచారం ఇవ్వకుండా బదిలీలు జరిగిపోయిన తరువాత సమాచారం ఇచ్చినా.. వాస్తవాలు, చేసిన తప్పులు బయటపడినపుడు జిల్లా కలెక్టర్ ను కావాలనే పంచాయ తీరాజ్ ఎస్ఈలు సూపరింటెండెంట్ జివి. కనవల్లీ కుమారికి ప్రయోజనం చేకూర్చడానికి ప్రజాప్రతినిధిలు ఇచ్చిన సిఫారసు లేఖలు కూడా పక్కనపెట్టి నడిపించిన కథ మొత్తం బయటకు వస్తుంది. 

ఇప్పటికే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీల విషయంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాన్ని ఈఎన్ఎస్-ఈరోజు మొత్తం బయట పెట్టింది. అపుడు సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానం వస్తే అధికారులే ఈ బదిలీల విషయంలో అర్హత లేనివారికి కూడా బదిలీలకు అవకాశం కల్పించారని రుజువు అవుతుంది. దానితో జిల్లా కలెక్టర్ ను ఒక ఉద్యోగిని కోసం బురిడీ కొట్టించి మరీ బదిలీలు చేశారని వారంతట వారే లిఖిత పూర్వకంగా ఒప్పుకున్నట్టు అవుతుంది.  ఇలా జరగకుండా ఉండేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ కూడా లేకుం డా మొత్తం వ్యవహారం తమ అనుకూలితల కోసం పాత ఎస్ఈ సంతకాన్ని బూచీగా చూపి కథ నడిపించేద్దామనుకున్న విశాఖపట్నం ఎస్ఈ కె.శ్రీవాసరావు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఆమెకోసం అనకాపల్లి ఎమ్మెల్యే కాళ్లావేళ్లా పట్టుకొనైనా సిఫారసు లేఖ తీసుకొస్తానని.. ఆమెకు అనకాపల్లి బదిలీ చేయడానికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ కూడా తయారు చేయాలని సిబ్బందికి సూచించారట. అయితే ఇక్కడ  జోన్-1 యూనిట్ ఆఫీసర్, ఎస్ఈ మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల మేరకే బదిలీలు చేయడానికి సిద్దపడినట్టు సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో విశాఖ ఎస్ఈకి గొంతులో పచ్చి వెలక్కా య్ పడ్డట్టు అయ్యింది. మొన్నటి వరకూ నియోజకవర్గానికి సంబంధం లేని ప్రజా ప్రతినిధి సిఫారసు లేఖను అడ్డం పెట్టంకొని కొన్ని ఎలాగైనా బదిలీచేయాలని చూస్తే.. సదరు నియోజకవర్గం నుంచి లేఖలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు బదిలీ అధికారులకు ఫోన్లు చేయడంతో ఆ విషయా న్ని పక్కన పెట్టేశారు.

 ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం బదిలీ చేయాలంటే వీలుపడదని.. మహిళా ఉద్యోగి, ఆరోగ్య సమస్యలు, మానవీయ కోణాన్ని బూచిగా చూపి బదిలీ చేయాలని చూస్తే.. ఆ ప్రయోజాన్ని కూడా సదరు సూపరింటెండెంట్ జివి.కనవల్లీ కుమారి ప్రస్తుతం వినియోగించేసుకొని శ్రీకాకుళం ఉద్యోగాన్ని విశాఖ పంచాయతీరాజ్ లో చేస్తున్నారు. ఇపుడు ఆ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి మీడియా తీసుకెళ్లడంతో ఒక ఉద్యోగిని ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నిసార్లు అధికారులు ఆమెకు అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అంటే ఇక్కడ ఏ విధంగానైనా సదరు ఉద్యోగిని కోరుకున్న చోటుకి బదిలీ చేయాలన్నది జోన్-1 పంచాయతీరాజ్ ఎస్ఈలలో విశాఖపట్నం ఎస్ఈకి అత్యు త్సాహం ప్రదర్శిస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇంత మొండిగా ప్రభుత్వ జిఓని కూడా పక్కన పెట్టి  వ్యవహరిస్తున్నారంటే ఏ స్థాయిలో మనీ లాభీయింగ్ జరిగిందనేది స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. పైగా ఎన్నికారణాలు, లోపాలు బయటపెట్టినా ఎలాగైనా బదిలీ చేయడానికే ఎస్ఈలు చూపించే అత్యత్సాహానికి జిల్లా కలెక్టర్ మలి విచారణ అడ్డుకట్ట వేయనున్నది. చూడాలి.. జోన్-1 లోని, విశాఖ ఎస్ఈ కె.శ్రీనివాస్ లు ఈమె కోసం మరోసారి విశాఖ జిల్లా కలెక్టర్ ను ఏ విధంగా ముగ్గులోకి దించే ప్రయత్నం చేస్తారో.. ఏ ప్రభుత్వ ప్రయోజనాన్ని ఆమె బదిలీకోసం విని యోగిస్తారనేది..!

visakhapatnam

2024-09-12 19:07:47

అడ్డగోలు బదిలీలపై ఆర్టీఐ దాఖలు..!

పంచాయతీరాజ్ శాఖలోని జోన్-1(విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) సూపరింటెండెంట్ల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు ఆధా రాలతో సహా నిగ్గుతేల్చేందుకు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జిల్లా ప్రభుత్వశాఖల చైర్మన్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. అర్హత లేకపోయినా కాసులకు కక్కుర్తి పడిన బదిలీ అధికారులు జిఓనెంబరు 75లోని ప్రధాన నిబంధ నలను పక్కన పెట్టి మరీ సూపరింటెండెండ్లను అడ్డగోలుగా బదిలీ చేయడానికి రంగం సిద్దం చేసేసుకున్నారు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్-ఈరోజు ఆధారాలతో సహా బయట పెట్టడంతో విశాఖజిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేది కలు ఇవ్వాలని ఇద్దరు ఎస్ఈలను వివరణ కోరిన సమయంలోనూ వారు అంతా సక్రమంగా జరిగిందంటూ జిల్లా కలెక్టర్ ను మాటలతోనే బురిడీ కొట్టించారు. ఈ బదిలీల్లో జివికనకవల్లీ కుమారి అనే సూపరింటెండెంట్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. రెండేళ్లుగా ఓడీపై విశాఖలోనే పనిచేస్తున్నారు. 

శాస్తవానికి సదరు ఉద్యోగినికి బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత 2024 పంచాయతీరాజ్ శాఖలోని జిఓఎంఎస్ నెంబరు -75 ప్రకారం అర్హత లేదు. కానీ ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన విశాఖ పంచాయతీరాజ్ సర్కిల్ ఎస్ఈ బిఎస్.రవీంధ్ర తాను రిటైర్ కావడానికి ఒక్కరోజు ముందు గానే ఆమె బదిలీకి సంబంధించిన నోట్ పైలుపై సంతకం చేసేశారు. దీనితో మిగిలిర రెండు జిల్లాల ఎస్ఈలు కూడా తలూపారు. ఇదంతా అక్రమమని బదిలీల్లో తమకు అన్యాయం చేసి.. ఆమెకు మాత్రం అడ్డదారిలో న్యాయం చేశారని అర్హులైన ఉద్యోగులు డిప్యూటీ సీఎం కార్యాలయానికి మీడియాకి ఫిర్యాదులు చేశారు.  విషయం బయట పడటంతో విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంత జరిగినా పెద్ద ఎత్తున బదిలీలకు నగదు చేతులు మారడంతో రిటైర్ అయిన ఎస్ఈ సంతకాలు చేసిన ఫైలు, వ్యవహారం పై తానేమీ చేయలేనని ప్రస్తుత ఇన్చార్జి ఎస్ఈ కె.శ్రీనివాసరావు సదరు ఉద్యోగినికి న్యాయం అడ్డదారిలో అనకాపల్లి జిల్లాకి బదిలీ చేయడం కోసం చక చకా ఫైళ్లు కదిపేశారు. అయితే పంచాయతీరాజ్ లోని బదిలీలు చేపట్టే ఎస్ఈల అడ్డగోలు వ్యవహారాన్ని ఆధారాలతో బయటకు తీసేందుకు ఈ బదిలీ వ్యహారానికి సంబంధించిన 11 కీలకమైన అంశాలకు సంబంధించి సమాచారహక్కు చట్టం దరఖాస్తు జిల్లా ప్రభుత్వశాఖల చైర్మన్, విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాఖలైంది. 

ఈ దరఖాస్తుకి సంబంధించి సమాచారం రావడానికి నెలరోజు సమయం పడుతుంది. అయితే ఈ 15లోగా బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తయి పోతుంది. ఈ బదిలీల్లో అక్రమార్కులను బదిలీలు చేసేసినా.. సమాచార హక్కు చట్టం క్రింద దాఖలైన దరఖాస్తుకి సమాచారం లిఖిత పూర్వకంగా ఇస్తే.. అర్హులైన వారికి కావాలనే అన్యాయం చేస్తే.. రిటెన్షన్ ఇచ్చినట్టు.. బదిలీలు చేపట్టిన వివరాలతో కూడి సమాచారం ఇవ్వా ల్సి వస్తుంది. అలా ఇచ్చిన ఆధారాలతో బాధితులు కోర్టును ఆశ్రయిస్తే ఉద్దేశ్య పూర్వకంగానే బదిలీ చేసే అధికారులు వారికి కావాల్సిన ఉద్యోగులకు అర్హత లేకపోయినా బదిలీలు చేపట్టినట్టు ఆధారాలతో సహా రుజువవుతుంది. దానితో జిల్లాశాఖ చైర్మన్, జిల్లా కలెక్టర్ తో పాటు, బదిలీలు చేసే అధికారులు కూడా కోర్టుకి సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఖచ్చితంగా పరిపాలనా పరమైన అంశం కావడంతో ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్ఈలు కావాలని, జిఓనెంబరు-75 ఉల్లంఘించినట్టు తేలినా..ఎస్ఈలపై చర్యలు తీసుకోని అధికారిగా కూడా ముద్ర పడే అకకాశాలున్నాయి. అందులోనూ ఈ బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, అసెంబ్లీ స్పీకర్ఇచ్చిన సిఫారసు లేఖలకు కూడా వక్రీకరించి చేపట్టిన బదిలీల వ్యవహారం కావడంతో మొత్తం వ్యవహారం రచ్చ రచ్చ అయ్యే అవకాలున్నాయి.

 ఈ మొత్తం వ్యవహారం సూపరిటెండెంట్ జివి.కనకవల్లీ కుమారి కోసమే చేసినట్టుగా ఆర్టీఐలో కోరిన సమాచారంతోనే రుజువవుతుంది. ప్రస్తు తానికి బదిలీల ప్రక్రియ ఈనెల 15 వరకూ ఉన్నప్పటికీ.. 13నే నోట్ ఫైల్ పై సంతకాలు పూర్తయిన వారికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు ఇస్తామని ఇప్ప టికే కబుర్లు పెట్టేశారు ఎస్ఈ కార్యాలయం సిబ్బంది. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ ఈ అక్రమ బదిలీల వ్యవహారాన్ని పూర్దిగా రద్దు చేయా లంటే రీ-కౌన్సిలింగ్ తప్పా మరో మార్గం లేదు. రీ-కౌన్సిలింగ్ చేపడితే అర్హులకు న్యాయం జరిగి.. అనర్హులకు అసలు బదిలీలకు దరఖాస్తు చేసు కునే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇంకా పంచాయతీరాజ్ ఎస్ఈలు ఈ మొత్తం బదిలీల ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ కోరిన నివేదికలు ఇవ్వనందున.. కలెక్టర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది..!

visakhapatnam

2024-09-05 07:42:38

ఆమె కోసం రాత్రికి రాత్రే నోట్ పైల్ పై సంతకం..!

కాదేదీ పంచాయతీ రాజ్ ఎస్ఈలకి  ఆఖరి రోజు కూడా అక్రమ ఆదాయానికి, అడ్డగోలు వ్యవహారానికి రాచమార్గం.. ఏంటి మీకు డౌట్ వస్తుంది కదూ ఇది పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల తేడా బదీలీల కోసమేనని.. నిజమేనండి అదే.. అర్హత లేని ఉద్యోగిని జివి.కనకవల్లీ కుమారిని శ్రీకాళుం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాకు బదిలీచేసేస్తున్నట్టు రిటైర్ అవ్వడానికి ముందురోజు రాత్రి విశాఖపట్నం పిఆర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్  బిఎస్.రవీంధ్ర బదిలీలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేసేశారు. అదీ ఎందుకంటే సూపరింటెం డెంట్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈఎన్ఎస్-ఈరోజు సంయుక్తంగా అడ్డగోలు వ్యవహారాన్ని బయటపెట్టాయి. దీనితో ఎక్కడ తన బదిలీ ఆగిపోతుందోనని భయ పడిన జివి.కనవల్లీ కుమారి ఎస్ఈ రిటైర్ మెంటుకి ముందురోజే నోట్ ఫైల్ పై సంతకం చేయించే సుకున్నారు.. దీనితో భారీ మొత్తంలో నగదు చేతులు మారిన కారణంగానే అసలు బదిలీకి అర్హత లేకపోయినా ఈమెకోసం సంతకాలు చేసినట్టుగా రుజువైంది. పక్కా పథకం ప్రకారం ముందుగానే సంతకాల వ్యవహారాన్ని చక్కబెట్టేశారన్నమాట. అంతేకాకుండా 31వ తేది నుంచి నేటి వరకూ బదిలీల విషయంలో జరుగుతున్న అక్రమాలపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా.. ఇన్చార్జి ఎస్ఈగా ఉన్న కె.శ్రీనావాసరావు సైతం ఈ వ్యవహారంపై సదరు ఉద్యోగిని వివరణ కోరలేదు సరికదా.. రిటైర్ అయి వెళ్లిపోయిన ఎస్ఈ బిఎస్.రవీంధ్ర సంతకం చేసేసిన నోట్ ఫైల్ ను తాను తిరిగి మార్చలేనని భీష్మించుకు కూర్చుకున్నారు. 

వాస్తవానికి జీఓఎంఎస్ నెంబరు 75కి విరుద్ధంగా జరిగిన ఈ బదిలీలను జోన్-1 పరిధిలోని ఎస్ఈలు ఏ ఒక్కరైనా వ్యతిరేకించాల్సి వుంది. నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వుంది. లేదంటే ఈ విషయాన్న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఎవరూ వ్యతిరేకించకపోగా.. ఆమెకోసం మొత్తం వ్యవహారం మొత్తం సాఫీగానే సాగిపోయిందని.. బదిలీ ఉత్తర్వుల కోసం 13న రావాలని ఉద్యోగులకు అనధికార ఆదేశాలు కూడా జారీ చేశారు. వాస్తవానికి బదిలీలు చేసే సమయంలో ఉద్యోగులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, శాసన సభ స్పీకర్ ఇలా ఎవరు సిఫారసు లేఖలు ఇచ్చినా సదరు నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే బదిలీలు చేసే అధికారులు పరిగణలోనికి తీసుకోవాల్సి వుంది. కానీ అప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ.. ఓడిపై రెండేళ్లు విశాఖలోనే పనిచేస్తూ.. మళ్లీ అనకాపల్లిజిల్లా బదిలీకోసం ప్రక్కనియోజవకర్గం ఎమ్మెల్యే లేఖతో ఈమె తన బదిలీని రిటైర్ అయిన ఎస్ఈ  బిఎస్.రవీంధ్ర సంతకాలు తీసేసుకోగలిగారు. జోన్-1 పరిధిలో బదిలీలు చేసే సమయంలో ముగ్గురు ఎస్ఈలు అనుకునే ముందుగానే సంతకాలు చేసేశారు. అయితే ఈ అక్రమ బదిలీలపై 30న ‘ఈఎన్ఎస్-ఈరోజు’ కథనాలు బయటపడటంతోపాటు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లినా.. మిగిలిన ఇద్దురు ఎస్ఈలు ఈమె బదిలీ విషయంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. 

సూపరింటెండెంట్ల అడ్డగోలు బదిలీలపై మీడియాలో వచ్చిన కథనాలపై విశాఖ జిల్లా కలెక్టర్ నివేధిక కోరిన తరువాత కూడా నేటికీ అక్రమాల వ్యవహారాన్ని మాత్రం జిల్లా కలెక్టర్ ముందు ఉంచలేదు. కలెక్టర్ వివరణ కోరినపుడు కూడా బదిలీలను అంతా జీఓ ప్రకారమే చేసుకొని మాత్రమే వచ్చామని జిల్లా కలెక్టర్ ను కూడా బురిడీ కొట్టించారంటే ఇక్కడ ఎస్ఈలు ఏ స్థాయిలో లాలూచీ పడ్డారో అర్ధం చేసుకోవచ్చు.  వాస్తవానికి అర్హత లేని ఉద్యోగులను బదిలీలకు పరిగణలోనికి తీసుకోవడమే తప్పు.. అందునా ఈ విషయం మీడియాలో బహిర్గతం అయిన తరువాత కూడా రిటైర్ కావడానికి ఒక్కరోజు ముందుగా ఈమె బదిలీ కోసం నోట్ పైల్ పై ముగ్గురు ఎస్ఈలు సంతకాలు చేయడం రెండో తప్పు.. ఈమె కోసం ఇతర జిల్లాల్లోని సూపరింటెండెంట్లకు బదిలీ అర్హత ఉన్నా కూడా జిఓలోని నిబంధనలను పక్కనపెట్ట  వారిని కూడా  రిటెన్షన్ చేయడం మూడో తప్పు.. ముగ్గురు ఎస్ఈలు చేసిన నోట్ ఫైల్ విషయం నేటికీ కలెక్టర్ ముందు ఉంచకపోవడం  నాల్గవ తప్పు. ఇవన్నీ ఆగస్టు 31 నుంచి నేటి వరకూ మీడియాలో కథనాలు వస్తున్నా వాటిని పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించడం ఐదవ తప్పు ఇలా.. ఒక ఉద్యోగిని కోసం ఎస్ఈలు తప్పులు మీద తప్పులు చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఆర్దిక లావాదేవీలు.. ప్రభుత్వ జీఓల ఉల్లంగన.. నియోజవర్గాల ఎమ్మెల్యేల లేఖలు అపహాస్యం అయ్యారో మూడు జిల్లాల కలెక్టర్లు గుర్తించాల్సి ఉంది. 

ఇంత పెద్దస్థాయిలో అక్రమాలు జరిగిన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల బదిలీలపై విశాఖ జిల్లా కలెక్టర్ రీ-కౌన్సిలింగ్ ఆదేశిస్తే తప్పా అక్రమాలకు అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. ఇదే విషయమై ఈఎన్ఎస్-ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం జరిగిన బదిలీలపై ఎస్ఈలను వివరణ కోరామని.. నివేధికలు రావాల్సి ఉందని.. వారిచ్చిన వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోప్రక్క తమ నియోజవర్గంలోని ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన సిఫారసు లేఖలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సైతం గుర్రుగా ఉన్నారు. ఇదేనా జిల్లా జిల్లాలో ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగం ఇచ్చే గౌరవం అంటూ మండి పడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి రావాలన్నా.. బాధితులకు న్యాయం జరగాలన్నా రీ-కౌన్సిలింగ్ పెడితే న్యాయం జరగడంతోపాటు, ఎస్ఈలు చేసిన అడ్డగోలు వ్యవహారాలు బయట పడతాయని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా రేపో, మాపో డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఈ అక్రమ బదిలీలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!

visakhapatnam

2024-09-04 15:50:15

పంచాయతీరాజ్ లో అడ్డుగోలు బదిలీలకు అడ్డుకట్ట..నివేదిక కోరిన జిల్లా కలెక్టర్

పంచాయతీరాజ్ లోని సూపరింటెండెంట్ ల అడ్డగోలు బదిలీలకు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అడ్డు కట్ట వేశారు. అర్హత లేకపో యినా కావాల్సిన చోటుకి బదిలీలు చేయడానికి జోన్-1వలోని మూడు జిల్లాల ఎస్ఈలతో కలిసి చక్కబెట్టిన తేడా వ్యవహారానికి కలెక్టర్ ఆదేశా లతో బెడిసికొట్టాయి. పంచాయతీరాజ్ రాజ్ లో జీఓనెంబరు 75కి విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలపై ఈఎన్ఎస్-ఈరోజులు సంయుక్తంగా వరుస కథనాలు ఆధారాలతో సహా ప్రచురించాయి. దీనితో ఆగ్రహం వ్యవక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇద్దరు ఎస్ఈలని కలెక్టరేట్ కి రప్పించారు. ఏంటి బదిలీల వ్యవహారం.. అసలు సూపరింటెండెంట్ ల బదిలీల్లో ఏం జరుగుతుంది.. రోజూ మీడియాలో దీనికి సంబంధించి ఎందుకు వ్యతిరేక వార్తలు వస్తున్నాయి.. అసలు మీరు బదిలీల్లో ఏం చేశారు.. ఎవరికి అన్యాయం చేస్తున్నారు.. మరెవరికి మేలు చేయడం కోసం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు.. అసలు జీఓ ప్రకారమే బదిలీలు చేస్తున్నారా.. కావాల్సిన వారికోసం జీఓ నిబంధనలను పక్కన పెట్టేశారా.. ఇప్పటి వరకూ జరిగిన బదిలీలకు సంబంధించిన జీఓ, నిబంధనలపై పూర్తిస్థాయిలో నివేదిక కావాలని ఆదేశించారు. కలెక్టర్ ఆగ్రహంతో అడగటంతో  బదిలీ అధికారుల్లో ఒణుకు మొదలైంది. సూపరింటెండెంట్ ల బదిలీల్లో ప్రస్తుతా తాజాపరిస్థితి జోన్-1లో జరుగుతున్న బదిలీల ప్రక్రియపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించడంతో.. శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న జివి.కనకవల్లీ కుమారికి అనకాపల్లి జిల్లా బదిలీ చేయడానికి  పీఆర్ ఎస్ఈలు మ్.శ్రీనివాసరావు(ఎస్.ఇ, పి.అర్- శ్రీకాకుళం) బి.ఎస్. రవీంద్ర(ఎస్.ఇ, పి.అర్ - విశాఖపట్నం), యూ.వి ప్రసాద్ (ఈ.ఈ, పి.ఆర్ - క్వాలీటి కంట్రోల్ విశాఖపట్నం)లు చేసిన కార్యాచరణ మొత్తం ఇపుడు కలెక్టర్ ముందు ఉంచాల్సి వచ్చింది.

బదిలీల్లో ఎస్ఈలు కావాలని చేసిన తేడా వ్యవహారం.. వారికి కావాల్సిన వారికోసం అడ్డగోలుగా చక్కబెట్టిన వైనం ఒక్కసారి తెలుసుకుంటే..  బి.శ్రీనివాసరావు సూపరింటెండెంట్, ఈ.ఈ.పి.ఐ.యూ సదరు అధికారి పాడేరులో ఆరేళ్లు పూర్తి అయ్యాయి. జి. ఓ. ఎమ్.ఎస్.నెం. 75 ప్రకారం ఏజెన్సీ ఏరియాలో రెండేళ్లు  పూర్తైన వ్యక్తిని వారి కోరిన చోట బదిలీ చేయమని జి.ఓ.లో ఉన్నది కాని అలా చేయకుండా ఇతనిని  పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్ ఇచ్చారు. అది ఏ జీఓ ప్రకారంగా చేశారో పర్యవేక్షక అధికారులు జిల్లా కలెక్టర్ కు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శికి  నివేదికలు సమర్పించాల్సి ఉన్నది.  ఇక  ఆర్.నాగరాజు సూపరింటెండెంటు, డి.పి.ఆర్.ఈ.ఓ ఆఫీస్ అనకాపల్లిలో పనిచేస్తున్న ఇతనని రెండేళ్లు నిండకపోయినా  పి.ఆర్.ఐ. డివిజన్ టెక్కలికి బదిలీ చేశారు. ఇతని స్థానంలో సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారిని ఓ ఎమ్మెల్యే ఇచ్చిన శిఫారసు లేఖ ఆధారంగా చూపి అనకాపల్లికి బదిలీచేసేశారు. అంటే ఇక్కడ నిభందనలు ఏమీ పరిగణలోనికి తీసుకోలేదు.. 

ఈమెను బదిలీ చేయడానికి కానీ ఈమెకు అనుకూలంగా అనకాపల్లి జిల్లాలో  ఏ ఎమ్మెల్యే కూడా సిఫారసు లేఖా ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్టుగా అధికారులను మభ్య పెట్టి అమాయకులైన  ఆర్. నాగరాజు ని ఆమె స్థానంలోనికి పంపేశారు. ఇక్కడ పెద్ద మొత్తంలో చేతులు మారిన కారంణంగానే లేని ఎమ్మెల్యే సిఫారసు లేఖను బూచిగా చూపించినట్టు తేటతెల్లం అయ్యింది. ఈయనను కె.ఎస్.కె.శోభా రాణి స్థానంలో బదిలీ చేశారు. ఈమె పై ఎ.సి.బి. కేసుతోపాటు శాఖాపరమైన కేసులు కూడా ఉండటం విశేషం. బదిలీ అయిన స్థానానికి వెళ్లకపోతే ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామని కూడా సదరు అధికారిని బెదిరించడం కొసమెరుపు.  ఎస్.రమేష్ ఈయన జూనియర్ అసిస్టెంట్ పాడేరు డివిజన్ లో ఏడేళ్లు సర్వీసు పూర్తిచేసుకొని బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే.. జీఓ ప్రకారం కోరిన ప్రదేశానికి బదిలీ చేయాల్సి ఉండగా  ఇతనని కూడా పాడేరు ఏజెన్సీలోనే రిటన్షన్  చేసేశారు. ప్రభుత్వం బదిలీల జీఓ ఒక్క శాతం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అంతా మా ఇష్టం అన్నరీతిలోనే బదిలీలను చేయి తడుపు వ్యవహారంలో చక్కబెట్టేశారు.

మరో విశేషం ఏంటంటే సదరు సూపరింటెండెంట్ జి.వి. కనక వల్లీ కుమారి శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉండగా..విశాఖపట్నంలో కూడా ఓ.డి బేసిస్ మీద గత రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక్కడే ఓడీలో పనిచేస్తున్న అధికారి బదిలీల్లో ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సి ఉంది. లేదా జీఓ ప్రకారం కోరుకున్న అధికారుల బదిలీలు జరగగా ఖాళీ ఉన్న ప్రదేశాల్లోకి బదిలీపై వెళ్లాలి. కానీ ఇక్కడకి దగ్గర్లోని అనకాపల్లికి చాలా చాకచక్యంగా బదిలీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం జీఓ ఈ అధికారిణి బదిలీ విషయంలో చేతి వ్యవహారం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. చక్రం తిప్పే నేర్పు ఉంటే ఏ విధంగా నైనా బదిలీలు చేయించుకోవచ్చునని.. దానికోసం బదిలీలు చేసే అధికారులు కూడా వారికి అనుకూలంగానే పనిచేస్తార విషయం పంచాయతీరాజ్ శాఖలోని బదిలీల్లో చాలా క్లియర్ గా కనిపించింది. జి.గంగారామ్ సూపరింటెండెంట్ మూడు నెలల సర్వీసు చేసిన వ్యక్తిని అడ్డగోలుగా విజయనగరానికి బదిలీచేసేశారు. ఇలా ఒకటి కాదు రెండు ఇష్టానుసారం బదిలీలు చేశారు అధికారులు. వీటన్నింటికీ బదిలీల ఉత్తర్వులే సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ విషయాలను బయటకు రానీయకుండా ఉండేందుకుందు, ఒక వేళ తమపై మీడియాలో  కథనాలు వచ్చినా వెనుక నుంచి రక్షించేందుకు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని.. ఎవరేం చేసుకున్నా పర్లేదంటూ హుకుం కూడా జారీ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈమె విషయంలో బదిలీ అధికారులు ఏం చేశారో.. అవన్నీ ఇపుడు కలెక్టర్ నివేదికలో అక్షరం పొల్లుపోకుండా సమర్పించాల్సి వుంటుంది. అదే జరిగితే ఇక్కడ బదిలీ అధికారులైన ఎస్ఈలు జిఓనెంబరు 75కి పూర్తిగా విరుద్ధంగా చేసినట్టుగా కలెక్టర్ కోరిన నివేదికలో ఒప్పుకున్నట్టు అవుతుంది. 

అపుడు ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఇప్పటి వరకూ జరిగిన బదిలీల ప్రక్రియ నిలుపుదలచేసి.. అర్హులైన ఉద్యోగులకు బదిలీలు చేయాలని ఆదేశించాలి జీఓలో ఉన్న నిబంధనల ప్రకారం. కానీ ఇపుడు జోన్-1లోని ఎస్ఈలు కలెక్టర్ కోరిన నివేదికలో మళ్లీ సదరు జివి కనకవల్లీ కుమారి విషయాన్ని గానీ.. ఇద్దరు ఉద్యోగులకు రిటెన్షన్ ఇచ్చిన విషయాన్ని గాని పొందుపరచకపోతే అన్యాయం జరిగిన ఉద్యోగులంతా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారట. అదే జరిగితే అపుడు బదిలీల చేసిన ఎస్ఈలు, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ లతో సహా కోర్టుకి హాజరు అయ్యే అవకాశం వుంటుంది. కానీ ఒక సూపరింటెండెంట్ కోసం ఎస్ఈలు నివేదికలు మార్చి కలెక్టర్ బురిడీ కొట్టించే సాహసం చేస్తారా లేదా అన్నది ఇపుడుఆశక్తి కరంగా మారింది. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ బదిలీల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడంతోనే కొందరు ఉద్యోగుల కోసం బదిలీలు చేసే అధికారులు నేటికీ వారిని వెనుకేసుకు వస్తూ..వారికి న్యాయం చేసి.. మిగిలిన వారికి అన్యాయం చేయాలని చూస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఈఎన్ఎస్-ఈరోజులు ఎప్పటికప్పుడు బయటపెట్టడంతో.. తొలుత లైట్ తీసుకున్న అధికారులు నేరుగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నివేదికలు కోరడంలో ఎస్ఈలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికైనా ఎస్ఈలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఆమెను పక్కన పెట్టి.. అర్హులకు జిఓనెంబరు 75 ప్రకారం న్యాయం చేస్తారా..? లేదంటే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఉత్తర్వులు ఇస్తారా.. అసలు జిల్లా కలెక్టర్ నివేదిక తరువాత మొత్తం సీన్ మారుతుందా లేదా అనేది ఆశక్తి కరంగా మారింది...!

visakhapatnam

2024-09-03 05:59:52