1 ENS Live Breaking News

అనకాపల్లి వేల్పుల వీధి సంబరానికి రండి.. గంట్లకు ఉత్సవ కమిటీ ఆహ్వానం.

విశాఖజిల్లాలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన అనకాపల్లి వేల్పుల వీధి లో ఈ నెల 22న గౌరీ పరమేశ్వరుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.ఈఉత్సవంలో  పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును కోరారు. సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు  అందరూ విశాఖలో  శ్రీనుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ వేల్పుల వీధి ఉత్సవానికి తనను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.. కొవిడ్ నేపథ్యంలో గౌరీ అమ్మవారు కృప ప్రజలందరికీ ఉండాలని శ్రీను బాబు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Anakapalle

2022-01-17 11:38:39

జర్నలిస్టులూ కోవిడ్ కేసుల పట్ల భద్రంగా ఉండండి..

విశాఖ జిల్లాతోపాటు, మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కోవిడ్ వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మళ్లీ ఆశన్నమైందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో మళ్లీ కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున జర్నలిస్టులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ భారిన పడకుండా ఉండేందుకు అవకాశం వుంటుందని తెలియజేశారు. జర్నలిస్టులపైనే వారి ఇంట్లో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే భాహ్య ప్రపంచంలో జరిగే విషయాలను ప్రజలకు మీడియా ద్వారా చేరువ చేయగలమన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గేంత వరకూ నిబంధనలు పాటిస్తూ, అవసరం అయితే తప్పా భయటకు రావొద్దని గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టులకు ఈ సందర్భంగా సూచించారు.

Visakhapatnam

2022-01-17 06:57:21

సింహగిరిపై వైభవంగా కనుమ పండుగ..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం కనుమ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.  తెల్లవారుజామున సింహాద్రినాధుడు, శ్రీదేవి ,భూదేవి అమ్మవార్లును  సుప్రభాతసేవతో మేల్కొలిపి, ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కనుమ పండుగ నేపథ్యంలో సింహాచలం గోశాలలో గోపూజ ఘనంగా నిర్వహించినట్టు  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. సింహాద్రి నాధుడుని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా  ఆలయంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లోపాల్గొన్నారు. ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ,  ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగాల నరసింహనాయుడు పలువురు అధికారులు సభ్యులు పాల్గొని గోశాలలో గోపూజలు  ఘనంగా  జరిపించారు. సింహగిరిపై మకరవేట ఉత్సవం అత్యంత సాంప్రదాయబద్దంగా నిర్వహించారన్నారు.  ఉత్సవంలో భాగంగా సింహాద్రినాధుడు కి  శ్రీమహావిష్ణువుఅలంకరణ గావించినట్లు తెలిపారు. మొసలి బారిన పడిన గజేంద్రుడిని శ్రీమహావిష్ణువు అలంకరణలో ఉన్న సింహాద్రినాధుడు  రక్షించడమే ఉత్సవము ప్రత్యేకత ఆని శ్రీనుబాబు వివరించారు. అందుకు తగ్గట్లుగానే ఆలయ వర్గాలు ఈ ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా కన్నులపండుగగా జరిపించారన్నారు. ప్రతియేటా నిర్వహించే ఈ ఉత్సవం కోవిడ్ కారణంగా కొండపైన ఆలయం వెనుక ఉన్న నీటి కొలనులో వైభవంగా జరిపించారన్నారు.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  ఈఓఆధ్వర్యములోఅన్ని సదుపాయాలు కల్పించారు.

Simhachalam

2022-01-16 09:10:15

ఉత్తరద్వారం లో కొలువైన శ్రీ సింహాద్రి అప్పన్నకు గంట్ల పూజలు..

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురువారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు కు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. తొలుత సర్వాభరనాలతోస్వామిని  చూడముచ్చటగా వైకుంఠనాథుడు అలంకరణగా గావించి తదుపరి  స్వామిని ఉత్తర ద్వారంలో ఆశీనులను చేశారు.. వేదమంత్రోచ్ఛారణల మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ కొలువై ఉన్న స్వామిని పలువురు భక్తులు  దర్శించుకున్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు. జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని స్వామిని పూజించి సేవించారు. కొండ దిగువన శ్రీ  వెంకటేశ్వర ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం  నిర్వహించారు. అక్కడ కూడా శ్రీను బాబు దంపతులు స్వామిని సేవించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు బోర్డు సభ్యులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Simhachalam

2022-01-13 15:47:13

పరమపవిత్రం సింహాచల అప్పన్న ఉత్తర ద్వార దర్శనం..

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తర ద్వారం లో కొలువున్న శ్రీ మహా విష్ణువు ను ఏకాదశి రోజు దర్శించుకుంటే  సాక్షాత్తు వైకుంఠంలో కొలువైవున్న శ్రీమన్నారాయనుడుని  దర్శించు కున్నంత పుణ్య ఫలం కలుగుతుందని శ్రీనుబాబు వివరించారు. ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఆ శ్రీ మన్నారాయనుడును అదే రోజున దర్శించుకున్నారు అని  
పురాణ ఇతిహాసాలు కథనం ఉందన్నారు.. బుదవారం ఉదయము సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న గంట్ల శ్రీనుబాబు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతియేటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే   ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు.. ఉదయము 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం లభిస్తుందన్నారు.  సర్వదర్శనం తో పాటు వంద, 300, టికెట్స్ తోపాటు రూ. 500 టిక్కెట్ పై   ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా సింహగిరి  పై జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఉదయం ధర్మకర్తల మండలి సభ్యులు దినేష్ రాజ్, సూరిశెట్టి సూరిబాబు ,దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పరిశీలించారు. సింహగిరి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, అధికారులను వీరు ప్రసంసించారు. ఆలయ ఈవోఎంవి సూర్య కళ ఆధ్వర్యంలో ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు.

Simhachalam

2022-01-12 07:36:48

సంక్రాంతి సందర్భంగా కాకినాడకు ప్రత్యేక రైళ్లు..

సంక్రాంతి పండుగ దినాలను పురుష్కరించుకొని దక్షణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కాకినాడలో దక్షణ మధ్య రైల్వే ప్రాంతీయ కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. ఈనెల 12 13 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని, ఈ ప్రత్యేక రైళ్లు రాజమండ్రి, సామర్లకోట లలో ఆగుతాయని కూడా  రైల్వే అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Kakinada

2022-01-10 05:38:19

SCRWA ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. విశాఖలోని ఎంవిపి, సెక్టార్-1 లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధులుగా సిటీ కనెక్ట్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ లంకలపల్లి ఆనందకుమార్,ఎస్సీఆర్డబ్ల్యూఏ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరావు హాజరయ్యారు. ముందుగా అసోసియేషన్ సభ్యులకు అతిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ సందర్బంగా లంకలపల్లి ఆనందకుమార్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్టులకు చేస్తున్న సంక్షేమం అద్వితీయమని ప్రశంసించారు. మున్ముందు అసోసియేషన్ పేరిట మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని దానికి  తమ సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం నాగనబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ, పాత్రికేయుల సంక్షేమానికి ఎస్సీఆర్డబ్ల్యూఏ  చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా అధ్యయన,విజ్ఞాన యాత్రలను కూడా అసోసియేషన్ నిర్వహించాలని సూచించారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈఏడాది మరిన్ని కార్యక్రమాలు చేసి పలుఅసోసిషన్లకు మార్గదర్శకంగా  స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిలవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ,  2016 నుంచి జర్నలిస్టుల సంక్షేమంతో పాటుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే జర్నలిస్టుల సమస్యలపై పోరాడడంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రత్యేకతను చాటుకుందన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమంతో పాటుగా విజ్ఞానాన్ని పెంపొందించే  కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కృషి చేస్తున్నామని, జర్నలిస్టుల హక్కులను కాపాడడంలో అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అనంతరం అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ చేపట్టి, సభ్యులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్.అప్పారావు,కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్ ,ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ, నక్కాన అజయ్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్,పద్మజ,కార్యనిర్వహ కార్యదర్శి రిషి కేష్, విజయ్,సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్ర శేఖర్,బాలు పాత్రో, ఆదినారాయణ,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-01-01 10:16:17

సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం..

సమాజ ప్రగతిలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత ప్రశంసనీయమని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి కొనియాడారు. శుక్రవారం ఇక్కడ సీతమ్మధార వీజెఎఫ్ వినోద వేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో మేయర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత మేయర్ హరివెంకటకుమారి, విఎంఆర్డీఏ ఛైర్మన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె. రాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు చేతులు మీదుగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2022 నూతన డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరంతా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని, అహోరాత్రులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే జర్నలిస్టుల కి ఇళ్ళ స్థలాలు కేటాయించడం కాయమన్నరు విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో జర్నలిస్టులు ఒక వైపు సమాజానికి అవసరమైన మెరుగైన సేవలందిస్తూనే మరో వైప అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా శక్తివంచన లేకుండా సాహసోపేతంగా విధులు నిర్వహించారన్నారు. ప్రభుత్వపరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అన్ని పండుగలతో పాటు విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయమన్నారు. గౌరవ అతిధులుగా హాజరైన మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి గాదె శ్రీధర్ రెడ్డి, హనీగ్రూప్ ఛైర్మన్ ముక్కా ఒబుల్ రెడ్డి . మాట్లాడుతూ జర్నలిస్టుల నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వీజెఎఫ్కు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులంతా విశాఖ జిల్లా జర్నలిస్టులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీసుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామన్నారు. నిరంతరం వైద్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తమ పాలకవర్గం హయాంలో సభ్యులు సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేయడంతో పాటు పండుగలు, క్రీడలు ఇతర అంశాల్లో కూడా పరిధి మేరకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సభ్యులందరూ నూతన సంవత్సరంలో మరింత ఆనందంగా ఉండాలని వీరు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రెండు ప్రెస్ క్లబ్ లను  మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అనంతరం సభ్యులకు అతిధులు చేతులు మీదుగా డైరీ, క్యాలెండర్తో కూడిన తొమ్మిది రకాల వస్తువుల కిట్లను అందజేయడం జరిగింది. వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజుపట్నాయక్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ధియేటర్ ఆర్ట్స్ విద్యార్ధులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు టి.నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పి.ఎన్.మూర్తి, కార్యవర్గ సభ్యులు దొండా గిరిబాబు, ఇరోతి ఈశ్వరరావు, ఎమ్.ఎస్.ఆర్.ప్రసాద్,ఏం.. దివాకర్.. మాధవరావు.. తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-12-31 07:49:28

ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను వేగంగా పరిష్కరించాలి

విశాఖ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులపై జరిగే దాడులు అత్యాచార కేసులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ యాక్ట్  జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి నేరాలలో నిందితులకు కఠిన శిక్ష విధించేలా తగు ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశ పెట్టాలన్నారు. పెండింగ్ కేసులపై ఆయన స్పందిస్తూ సాంకేతిక పరమైన కారణాలను రెవెన్యూ, పోలీస్, సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలపై జరిగిన అత్యాచార కేసులో వివిధ కేటగిరీల కింద  నమోదు చేసిన కేసులను వాటి పురోగతిని విశాఖ అర్బన్ రూరల్ జిల్లా పోలీసులు కలెక్టర్ కువివరించారు. కేసులపై పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించాలని, అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలను అనుసరించి నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  విశాఖ కమిషనరేట్ పరిధిలో యుఐ కేసులు 123 ఉండగా పిటి కేసులు 578 వరకు పెండింగ్ ఉన్నాయని, అయితే వీటిలో ఎక్కువగా దీర్ఘకాలంగా ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు చెందిన కేసులు విచారణ పూర్తయితే క్లోజింగ్ దశలో వున్నాయిని పోలీస్ అధికారులు తెలియజేశారు. రూరల్ జిల్లా పరిధిలో 67 యుఐ కేసులు 229 పిటీ కేసులు ఉన్నట్లు తెలిపారు

జిల్లాలో  పౌర హక్కుల దినోత్సవాలను తరచుగా నిర్వహించి ఎస్.సి. ఎస్.టి. పౌరులకు వారి హక్కులను గురించి తెలియజేయాలని సూచించగా జిల్లాలో సివిల్ రైట్స్ డే లను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు కలెక్టరుకు తెలిపారు.  దీనిపై కలెక్టరు వారిని అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డి వి రమణ మూర్తి మాట్లాడుతూ 169 కేసులలో  208 మంది ఎస్సీ ఎస్టీ బాధితుల కు రూ. 2 కోట్ల 96 లక్షల 20 వేలు నష్ట పరిహారం అందజేసినట్లు చెప్పారు.  సంఘ సభ్యులు  పెందుర్తి మండలంలో నరవ గ్రామ పరిధిలో ఎస్.టి.లకు కేటాయించిన ఇండ్ల స్థలాలుకొన్ని ఇతరుల ఆక్రమణలో వున్నాయని సూచించగా దీనిపై జాయింట్ యాక్షన్ కమిటీని వేస్తామని తెలిపారు.  ఆనందపురం మండలంలో కొంత మంది ఎస్.సి. రైతులకు  రైతు భరోసా అందడం లేదని తెలుపగా దీనిపై ఆర్డీవో, వ్యవసాయ శాఖ జెడి లను విచారణ చేయవలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్.పి.  బి.కృష్ణారావు, జె.సి.లు యం. వేణు గోపాలరావు, పి.అరుణ్ బాబు, డి.సి.పి. ఎస్. గౌతమి, డిఆర్వో శ్రీనివాసమూర్తి,  ఎ.ఎస్.పి.లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-12-30 14:30:44

ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

కోవిడ్ ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ చర్యలు తిసుకోవాలని కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎజి. చిన్నికృష్ణ తెలిపారు.  గురువారం సాయంత్రం కాకినాడ రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఆర్డీవో ఎజి చిన్నికృష్ణ..డీఎస్పీ వి. భీమరావుతో  కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, యస్పీ ఆదేశాల ప్రకారం డివిజన్ స్థాయిలో ఒమిక్రాన్ పట్ల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ రూపంలో క్రొత్త ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపద్యంలో  ఈ నెల 31వ తేదీ రాత్రి, 2022 జనవరి1న నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంటివద్దనే ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటం, ప్రధానంగా యువత రాత్రివేళ రోడ్ల కూడలి మధ్య ఉత్సవాలు నిర్వహించడానికి వీలు లేదన్నారు. అదేవిధంగా సముద్రతీర ప్రాంతంలో బైక్ రేస్ లు ఇతర పార్టీలు నిషేధించడం జరిగిందని ఆయన తెలిపారు.  ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. బయటకు వెళ్ళేటప్పండు విధిగా మాస్కులు ధరించడడం, భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో త్రీటౌన్ సీఐ వి.కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-12-30 14:27:07

వెబ్ ఛానల్ అసోసియేషన్ కు గంట్ల శ్రీనుబాబు 25 వేల ఆర్థిక సహాయం..

సమాజంలోని వార్తా విశేషాలను ప్రజలకు అత్యంత త్వరితగతిన అందించే అంశంలో వెబ్ ఛానల్స్ ఎంతో దోహదపడుతుందని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజలకు వార్తలను అందించడంలో వెబ్ ఛానల్ జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన  కొనియాడారు. విశాఖ వెబ్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి మన్ననలను అందుకుంటున్నారని గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జర్నలిస్టుల అసోసియేషన్ కు తన వంతుగా 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎల్లప్పుడూ నిస్వార్ధంగా పనిచేసే వెబ్ ఛానెల్ జర్నలిస్టులు వార్తల సేకరణలో భాగంగా విశ్రాంతి లేకుండా గడపడం వారికే చెల్లిందని కొనియాడారు. ఈ సందర్భంగా విశాఖ వెబ్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, గోపీనాథ్, మదన్, భాస్కర్, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ వెబ్ ఛానల్ జర్నలిస్టులకు ఎల్లవేళలా ఆపద్బాంధవుడిగా ఉంటున్న గంట్ల శ్రీనుబాబు కు ధన్యవాదాలు తెలిపారు. తమ వెబ్ ఛానల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు దాన గుణం ఎంతో తోడ్పాటు అందిస్తోందని కొనియాడారు. గంట్ల శ్రీను బాబు మును ముందు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి జర్నలిస్టుల ఖ్యాతిని ఇనుమడింప చేయాలని వారు కోరారు.

Visakhapatnam

2021-12-29 14:39:28

అప్పన్న ప్రహ్లాదమండపం తిరిగి అప్పగించండి..

విశాఖ మహా నగరం జగదాంబ జంక్షన్ లో ఉన్న సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపంను తక్షణమే తిరిగి దేవస్థానానికి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుల బృందం జిల్లా కలెక్టర్ ను  కోరింది. ఈ మేరకు మంగళవారం  అప్పన్న దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యములో, దశమంతుల మాణిక్యాలరావు, యండమూరి వెంకటరావు(విజయ), ఎస్ఎమ్ రత్నంలు మంత్రి ముత్తంసెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జునను కలక్టర్ కార్యాలయం లో కలిసి ప్రహ్లాదమండపానికి సంబంధించిన వివరాలను విపులంగా తెలియజేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలయ ఇవో ఎం.వి సూర్యకళ జిల్లా కలెక్టర్ కి  సీఆర్పీఎ ఫ్ కమాండెంటెంట్ కు రాసిన లేఖలను వీరు కలెక్టర్కు అందజేశారు. మహరాణి పేట సర్వే నెంబర్ 170/2ఎ 176/2ఎ, 183/1లలో 5957 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రహ్లాద కళ్యాణ మండపం విస్తరించి ఉందని, ఈ మండపాన్ని కేవలం ఆరు నెలల కాలానికి సంబంధించి సిఆర్పీఎఫ్ కు తేదీ 22-04-2013న తాత్కాలికంగా వసతి కోసం అప్పగించడం జరిగిందని కలెక్టరు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు మేరకు అప్పల్లో ఈ మండపాన్ని సీఆర్పి ఎఫ్ కేటాయించగా నేటి వరకు కూడా ఆ మండపాన్ని సీఆర్పీఎఫ్ ఖాళీ చేయడం లేదని కలెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకు అద్దె రూపంలో సింహాచలం దేవస్థానానికి రూ.5.22,53,300 స్ఆర్ఎఎఫ్ చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. ఇందులో అసలు రూ.4,88,34,300 కాగా వడ్డీ రూపంలో రూ.1,34,19,000 కలిపి మొత్తం రూ. 6.22 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రత్యేక ఆహ్వానితులు కలెక్టరు విపులంగా వివరించారు. 2013 నుంచి ఈ మండపాన్ని సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉంచుకున్నారని, ఇప్పటికైనా అద్దె బకాయిలు చెల్లించి దేవస్థానానికి సహకరించాలని కోరారు. కోవిడ్-19 నేపధ్యంలో ఆదాయం సరిగా రాకపోవడం వల్ల ఉద్యోగుల జీతభత్యాలకే దేవస్థానం ఇబ్బంది పడుతుందని కలెక్టరు వివరించారు. కావున తక్షణమే సీఆర్పీఎఫ్ నుంచి రూ.6.22 కోట్లు అద్దె బకాయిలు చెల్లించే విధంగా తగు ఆదే శాలు ఇవ్వాలని, ఆపై సింహాచలం దేవస్థానానికి నగరంలో ఉన్న ఏకైక ప్రధాన ఆదాయవనరు ప్రహ్లాద కళ్యాణ మండపం తిరిగి అప్పగించే విధంగా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. ప్రత్యేక ఆహ్వానితుల వినతిపై జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఈ అంశము పై చర్చించడము జరిగిందన్నారు.. వీలైనంత త్వరలో ఈ విషయమై అవసరమైన సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలుత వీరంతా కలెక్టర్ను ఘనంగా సత్కరించి అప్పన్న జ్ఞాపికను అందజేశారు.

Visakhapatnam

2021-12-28 10:24:01

రైతుబజార్లలో కేంటన్లు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు..

తూర్పుగోదావరి జిల్లాలోని రైతుబజార్లలో ఎల్ఈడీ బోర్డులు, కేంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ సహాయం సంచాలకులు సూర్యప్రకాశరెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కాకినాడ రూరల్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని  ఆలమూరు, అమలాపురం, అంగర, క్యాంటీన్లతోపాటు అన్ని రైతు బజార్లలో ఎల్ ఈడీ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం టెండరు ప్రక్రియ మొదలైందన్నారు. అది పూర్తయితే వినియోగారుల సౌకర్యార్ధం ఈ రెండు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎల్ఈడీ బోర్డులు ద్వారా కూరగాయల ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకో వచ్చునన్నారు. కేంటిన్ ద్వారా రైతు బజార్లకు వచ్చే వారికి రిఫ్రెష్ మెంట్ కలగుతుందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు చర్యలు చేపట్టినట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ సూర్యప్రకాశరెడ్డి మీడియాకి వివరించారు.

Kakinada

2021-12-22 13:19:25

తూర్పుగోదావరి జిల్లాలో 10 మందికి కరోనా..

తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం 5మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వస్తుందన్నారు.జిల్లాలో ప్రస్తుతం 200 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 1290 మంది  కోవిడ్ తో మ్రుత్యువాత పడ్డారని చెప్పారు. జిల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 95వేల 31కి చేరుకున్నాయని అదే సమయంలో కోవిడ్ వైరస్ వచ్చి కోలుకున్నవారు రెండు లక్షల 93వేల 541 మందిగా నమోదు అయ్యారని పేర్కొన్నారు.  ఆరు కోవిడ్ కేర్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల కోసం 2వేల 867 బెడ్లు అందుబాటులో ఉన్నాయని డిఎంహెచ్ఓ గౌరీశ్రర్రావు ఈ సందర్భంగా ప్రకటనలో తెలియజేశారు.

Kakinada

2021-12-22 13:15:45

తూ.గో.జిలో కేజి పట్టుగూళ్లకు రూ.740 వరకూ ధర..

తూర్పుగోదావరి జిల్లాలో పట్టుగూళ్లకు మంచి మద్దతు ధరల రైతులకు పలుకుతుందని సెరీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామరాజు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పట్టుగూళ్లకు కేజికి రూ.700 నుంచి రూ.740 వరకూ ధర పలుకుతుందన్నారు. జిల్లాలో 1200 మంది రైతులు మూడువేల ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతున్నట్టు ఆయన వివరించారు. చేబ్రోలులో పట్టుగూళ్ల మార్కెట్ నిర్వహణ జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం చైనా నుంచి పట్టుగూళ్ల దిగుమతి నిలిచి పోవడంతో దేశీయంగా పండించిన పట్టుగూళ్లకు మంచి గిరాకీ లభిస్తుందని సెరీకల్చర్ డీడీ రామరాజు ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.

Kakinada

2021-12-22 06:53:04