1 ENS Live Breaking News

రాజ్యాధికారమే లక్ష్యంగా ఏకం కావాలి..

రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు సంఘటితమవ్వాలని "బహుజన ఐక్య వేదిక" జిల్లా రాజకీయ సలహా కమిటీ నాయకులు చోల్లంగి వేణుగోపాల్ సూచించారు.  ఐక్య వేదిక జిల్లా కమిటీ అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ, కార్యదర్శి సబ్బతి ఫణీశ్వరరావు ఆధ్వర్యంలో బీసీ సంఘ నాయకుల సమన్వయ సమావేశం కాకినాడ కచరిపేట లోని డా.బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగింది. "బహుజన ఆత్మభిమానం - 
రాజ్యాధికారం" అంశంపై జరిగిన ఈ సమావేశానికి చోల్లంగి వేణుగోపాల్ ముఖ్య సలహాదారుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బహుజన (బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ) వర్గాలు సమైక్యమై రాజ్యాధికారం దిశగా  సమన్వయం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. సమావేశంలో పాల్గొన్న బిసి సంఘ నాయకులు మాకిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో బహుజన ఐక్యత సాధించాలన్నారు. తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దెంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  బహుజనులు తమ ఆత్మభిమానాన్ని  కాపాడుకుని, రాజ్యాధికారం దిశగా బలపడాలని హితవుపలికారు. గత అనుభవాలను పరిగణలోనికి తీసుకుని, బహుజనుల ఐక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో ఐనవిల్లి నారాయణ, ఆవుపాటి ఉమశంకర్, న్యాయవాదులు టి.పృద్వి రాజ్,కె. శ్రీనివాస్, వి.బద్రి, వి.సాయినాధ్, పి.దుర్గ రమేష్,డి.అబ్రహం, మాణిబాబు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-06 14:10:07

నిర్మాణాలపై అధికారులు ద్రుష్టిపెట్టాలి..

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల ఫ‌లాల‌ను పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందించ‌ డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు త‌దిత‌రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాల‌ను యుద్ధ‌ప్రాతిప‌దికన పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సి.హ‌రికిర‌ణ్ అధికారుల‌ను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం అనుసంధానంతో చేప‌డుతున్న శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల్లో బాగా వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల పంచాయ‌తీరాజ్ ఈఈ, డీఈ, ఏఈల‌తో శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. కొత్త‌పేట‌, మండ‌పేట‌, రాజోలు, పి.గ‌న్న‌వ‌రం, తుని, ముమ్మిడివ‌రం, అమ‌లాపురం నియోజ‌వ‌ర్గాల్లో గ్రామ స‌చివాల‌యాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు త‌దిత‌రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు సంబంధించి క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు, వాటిని ప‌రిష్క‌రించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను క‌లెక్ట‌ర్ సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప‌నుల్లో పురోగ‌తి ఆధారంగా ఎప్ప‌టిక‌ప్పుడు బిల్లుల‌ను అప్‌లోడ్ చేస్తూ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలు త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తిచేసేలా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. 

ఇసుక స‌ర‌ఫ‌రా, భూమి త‌దిత‌రాల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే జాప్యం చేయ‌కుండా జిల్లాస్థాయి అధికారుల స‌హాయంతో త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికీ ప్రారంభం కాని భ‌వ‌నాలకు సంబంధించి వెంట‌నే గ్రౌండింగ్ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. క్షేత్ర‌స్థాయిలో విలేజ్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్లు రూపంలో స‌మ‌ర్థ‌వంత‌మైన సిబ్బంది అందుబాటులో ఉన్నార‌ని, వారికి మార్గ‌నిర్దేశనం చేస్తూ వీలైనంత త్వ‌ర‌గా భ‌వ‌నాల‌ను వినియోగంలోకి తీసుకురావాల‌ని సూచించారు. మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్‌) క‌న్వ‌ర్జ‌న్స్ ప‌నుల్లో జిల్లాను ముందువ‌రుస‌లో నిలిపేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు లోపాల స‌వ‌ర‌ణ‌తో, స‌మ‌ర్థ‌వంత‌మైన కార్యాచ‌ర‌ణ‌తో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ ఇంజ‌నీరింగ్ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో పంచాయ‌తీరాజ్ సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ బీఎస్ ర‌వీంద్ర‌; రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, అమ‌లాపురం, కాకినాడ ఈఈలు ఏబీవీ ప్ర‌సాద్‌, కె.చంటిబాబు, బీవీఎస్ఎన్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఏడు నియోజ‌క‌వ‌ర్గాల డీఈలు, ఏఈలు హాజ‌ర‌య్యారు.

Kakinada

2021-08-06 14:04:30

కోవిడ్ నిబంధనలతోనే పంద్రాగస్టు వేడుకలు..

కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటిస్తూ జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వ‌హించ‌నున్న జిల్లా స్థాయి వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్ల‌ను జె.సి. శుక్ర‌వారం రెవిన్యూ అధికారుల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. వేదిక‌పైకి ప్ర‌ముఖులు మిన‌హా ఇత‌రులు ఎవ్వ‌రూ వెళ్ల‌కుండా నిరోధించాల్సి వుంద‌ని ఆర్‌.డి.ఓ. భ‌వానీశంక‌ర్ కు సూచించారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌కోసం కేటాయించిన సీట్ల‌ను వారికే వ‌దిలిపెట్టాల‌ని, ఇత‌రులు వాటిని ఆక్ర‌మించ‌కుండా చూడాల‌న్నారు. ప్ర‌ముఖుల‌కు ఎక్క‌డా అతిథి మ‌ర్యాద‌ల్లో లోపం లేకుండా ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాల‌న్నారు. అవార్డుల కోసం వేదిక‌పైకి వ‌చ్చేందుకు ఆయా శాఖ‌ల సిబ్బంది క్యూ వ‌రుస‌ల్లో నిల్చొనేలా ఏర్పాట్లు చేయాల‌ని పేర్కొన్నారు. వేదిక ముందు గుంపులుగా ప్ర‌భుత్వ సిబ్బంది గుమికూడ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. వేడుక‌లు జ‌రిగే స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి అంత‌రాయం లేకుండా చూడాల‌న్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్‌, త‌హ‌శీల్దార్ ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-06 13:53:58

పదోన్నతులపై పీఆర్ ఉద్యోగుల హర్షం..

ఎంపిడిఓలకు ప‌దోన్న‌తుల‌ను క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల పంచాయితీరాజ్ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ‌కాలంగా దాదాపు 25 ఏళ్ల నుంచీ ఎటువంటి ప‌దోన్న‌తి పొంద‌కుండా ఒకే కేడ‌రులో ప‌నిచేస్తున్న సుమారు 255 మంది ఎంపిడిఓల‌కు, పంచాయితీరాజ్ శాఖ సిబ్బందికీ ఈ నిర్ణ‌యం ఎంతో మేలు చేస్తుంద‌ని వారు పేర్కొన్నారు.  స్థానికంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఎంపిడిఓల సంఘం జిల్లా నాయ‌కులు కె.రాజ్‌కుమార్, కె.రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ, ఈ నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌నిచేస్తున్న సుమారు 18,500 మంది పంచాయితీరాజ్ ఉద్యోగుల‌కు కూడా, వారి హోదాను బ‌ట్టి ప‌దోన్న‌తులు ల‌భిస్తాయ‌ని చెప్పారు. ఈ నిర్ణ‌యం తీసుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి, పంచాయితీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, జిల్లా మంత్రుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విలేక‌ర్ల స‌మావేశంలో పిఆర్ మినిస్టీరియ‌ల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్య‌క్షులు ఏ.సురేష్‌, కార్య‌ద‌ర్శి సిహెచ్ ముర‌ళి, ప‌రిష‌త్ యూనిట్ అధ్యక్ష‌, కార్య‌ద‌ర్శులు పిజె అమృత‌, పి.కిర‌ణ్‌, పిఆర్ విస్త‌ర‌ణాధికారుల సంఘం నాయ‌కులు సురేష్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-06 13:52:58

జాతీయ రహదారి పనులు వేగం పెంచాలి..

రాయిపూర్ –విశాఖపట్నం 6  లైన్ల  జాతీయ రహదారి కి సంబంధించి  559.50  హెక్టార్లలో  జరగాల్సిన   పనులను  వేగంగా  పూర్తయ్యేలా చూడాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులు త్వరగా పూర్తి ఆయితే  పర్యాటకం, పరిశ్రమల  అభివృద్ధి వేగంగా జరుగుతుందని,  అందువలన ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. శుక్రవారం జాతీయ రహదారుల పనుల పై భూ సేకరణ అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు.  జాతీయ రహదారుల డిప్యూటీ మేనేజర్  ప్రశాంత్ మిశ్ర పనుల పురోగతిపై కలెక్టర్ కు వివరించారు.  రాయిపూర్ నుండి  విశాఖపట్నం జాతీయ రహదారి  సివిల్ పనుల పురోగతి  పాకేజ్ 1 నుండి 4 వరకు ఏ ఏ  స్థాయిలలో ఉన్నాయో   సమీక్షించారు.  గ్రామాలలో  అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల, ఇతర ఆస్తుల  లెక్కింపు త్వరిత గతిన పూర్తి చేసి  పరిహారం చెల్లింపులు త్వరితగతిన జరగాలని  సూచించారు. అటవీ క్లియరెన్స్ కు సంబంధించి అటవీ శాఖ అధికారులు స్వయంగా  వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.    భూ సేకరణ కు సంబంధించి తహసిల్దార్ల సమక్షం లో తప్పకుండా గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్  డా. జి.సి .కిషోర్ కుమార్ మాట్లాడుతూ  రాయిపూర్ – విశాఖ రహదారి కి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇప్పటికే పొందడం జరిగిందని అటవీ క్లియరెన్స్  పాకేజ్ 1,2 కు సంబంధించి 6.40 కిలో మీటర్లలో 29.18 హెక్టార్ల భూమి కి సంబంచించి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.   పాకేజ్ 1 నుండి 4 వరకు  అవసరమగు అదనపు భూమి కోసం  3 డి పబ్లికేషన్ పూర్తి చేసామని  తెలిపారు. పాకేజ్ 1,2,3 పనులు పురోగతి  లో ఉన్నాయని, పాకేజ్ 4 లో కోర్ట్ కేసు లు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించి పనులు వేగంగా జరిగేల చూస్తామని తెలిపారు. ఈ సమావేశం లో సబ్ కలెక్టర్ భావన,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, రెవిన్యూ  డివిజినల్ అధికారి  భవాని శంకర్, ఉప కలెక్టర్  వెంకటేశ్వర్లు ఉద్యాన, జలవనురుల, విద్యుత్, ఆర్.డబ్లు..ఎస్. శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-06 13:52:09

క్రిస్టియన్, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి..

రాష్ట్రం లో క్రిస్టియన్, మైనారిటీ వర్గాల  అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సేవలు అందించే కు స్మశాన వాటికల అంశానికి  తొలి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ అన్నారు.  త్వరలోనే ఆయా జిల్లాల కలెక్టర్లు తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ పదవి అలంకారం కాదని, బాధ్యతని సంపూర్ణంగా స్వీకరించి క్రిస్టియన్ లు  అందరికీ న్యాయం చేస్తామని అన్నారు.    చర్చిలకు సంబంధించి అధిక ఆస్తులు వున్నా అంతర్గత విభేదాల కారణంగా కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అటువంటి ఆస్తులను పరిరక్షించుకుంటామన్నారు. ప్రార్ధన మందిరాల నిర్మాణాలకు నిబంధనల సడలింపు నకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని అన్నారు. జెరూసలేం, ఈజిప్ట్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు నిజమైన పేదలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. "నవరత్నాల" ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పధకాలను చేరువ చేస్తామని తెలిపారు.
మిగిలిన పార్టీల సంగతి ఎలా వున్నా.. వైఎస్సార్సీపీ లో కష్ట పడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తుందని చెప్పేందుకు  తనకు అప్పగించిన బాధ్యతే ఉదాహరణ అని ప్రస్తావించారు.  సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయ సాయి రెడ్డి నిజాయితీగా ఉంటూ మిగిలిన  నాయకులను సమర్ధ వంతంగా పనిచేయించ గలుగుతున్నారని అన్నారు. మనం నిజాయితీ పరులు  అయితేనే అవతలి వారిపై చర్యలుతీసుకోగలమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా  విజయ సాయి రెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు.
మంచి తనాన్ని గుర్తించి వైజాగ్ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఒదిగి ఉండే వారికి ఉన్నత అవకాశాలు అంది వస్తాయని జాన్ వెస్లీ సాదర మనస్తత్వాన్ని  అభినందించారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి  సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజ్ పట్నాయక్,జాయింట్ సెక్రెటరీ దాడి రవికుమార్ కార్యవర్గ సభ్యులు ఈరోతి ఈశ్వరరావు, ఎంఎస్సార్ ప్రసాద్, దొండా గిరిబాబు,డేవిడ్రాజ్, వరలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-06 10:43:08

మహిళాపోలీసుల రెగ్యులైజేషన్ పై ఎప్పీలకు డిజిపీ సూచనలు..

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి”  పై ఆంధ్రప్రదేశ్  డిజిపి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం తూర్పుగోదావరి  జిల్లా నుంచి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ  గౌతమ్ సవాంగ్  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి” పై ఎస్పీలకు పలు సూచనలు చేశారు. మహిళా పోలీసుల నియామక ప్రక్రియ, దేహధారుడ్య పరీక్షా, శారీరక ప్రమాణాలు, శిక్షణ, జీత భత్యాలు, యూనిఫాం, ప్రోబేషన్ డిక్లరేషన్, ప్రమోషన్ మొదలగు సర్వీసు అంశాలపై రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారులు  జిల్లా ఎస్పీ లతో చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డిజిపి ఆదేశాల మేరకు మహిళా పోలీసులకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు స్థానిక మీడియాకి వివరించారు.ఈ కార్యక్రమంలో లా అండర్ ఆర్డర్ అదనపు డిజిపి  రవిశంకర్ అయ్యనార్, డిఐజీ టెక్నికల్ సర్వీసెస్  పాల్ రాజు, దిశ స్టేట్ నోడల్ అధికారి రాజకుమారి పలువురు పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో హాజరయ్యారు.

Kakinada

2021-08-06 09:09:04

అప్పన్నకు అదనపు కార్యదర్శి పూజలు..

సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరహా లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్ శుక్రవారం దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ అధికారులు స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ వైభవాన్ని ఆయనకు తెలియజేశారు. వేదపండితులు ఆశ్వీర్వాదాలు అందించగా, సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట యూనియన్ బ్యాంక్ ఎఫ్జీఎం కెఎస్డిఎస్వీ ప్రసాద్, జోనల్ మేనేజర్ గుణనంద్ గని, సిజిఎం ఎస్.కె.జాన్వర్, నాబార్డు డిడిఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Simhachalam

2021-08-06 03:13:49

వైఎస్సార్ జగనన్న కాలనీలు వేగంపెంచాలి..

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ జగనన్న కాలనీలలో గ్రూప్ హౌసింగ్ విధానం అమలు చేసి ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు.  గురువారం స్థానిక కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో గుంటూరు డివిజన్ లోని ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాలలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళ పధకం వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ రోజు వారి కూలీలకు వెళ్ళే భార్య భర్తలు సొంతంగా గృహ నిర్మాణం చేసుకోవడం కష్టంతో కూడుకున్న విషయమని, వీరికి ఆప్షన్ మూడు ద్వారా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా లే అవుట్లలో రెండు రోజుల్లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు.  ప్రతి లే అవుట్ లో సాండ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ప్లాస్టిక్ పట్టాలతో భూమిలో సంపులను నిర్మించాలన్నారు. లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాల  పర్యవేక్షణకు వీలుగా తాత్కాలికంగా అధికారులు ఉండేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన కంకర సరఫరా కోసం క్వారీ యజమానులతో సమావేశం నిర్వహించి, తక్కువ ధరకు కంకర సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో వైఎస్సార్ జగనన్న లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. 

  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో జగనన్న కాలనీలలో 1.22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు  మంజూరు చేసారన్నారు.  ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఇళ్ళు నిర్మించుకునే వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా  మెప్మా, బ్యాంకర్ల తో లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెగా గ్రౌన్దింగ్ మేళా లో 91,343 గృహాలకు శంఖుస్థాపన చేసామని, లబ్దిదారుల వివరాలు ఆన్ లైన్ చేసి, జియో ట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ చేస్తున్నామన్నారు.  అన్ని లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా విద్యుత్, నీరు, ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

  గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు  మాట్లాడుతూ  జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంలో పురోగతి కనిపిస్తున్నదని, ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన మెటిరియల్, స్టేజ్  వైజ్ నిధులు సకాలంలో అందేలా అధికారులు సహకరించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో అవసరమైన అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ తరపున అమలు జరుగుతున్న పధకాల ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

  సమావేశంలో సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి,  హౌసింగ్ పీడీ వేణు గోపాల రావు, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల  హౌసింగ్, రెవిన్యూ, పంచాయితీ, విద్యుత్, ఇంజనీరింగ్, నగరపాలక సంస్థ  అధికారులు పాల్గొన్నారు.  

Guntur

2021-08-05 17:24:09

మట్టికొట్టుకు పోతావు ఆడదాని ఉసురుపోసుకుంటే..

ఒక ఆడబిడ్డను ఏడిపించి వేధింపులకు గురిచేస్తే మట్టికొట్టుకుపోతావంటూ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై  నిజంగానే మట్టిని విసిరికొట్టారు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఈ సంఘటన గురువారం విశాఖలోని డిసి కార్యాలయంలో జరిగింది. తనను పదే పదే ఏడిపించడం, వివిధ కారణాలతో తన కింది స్థాయి సిబ్బందితో లాలూచీ పడుతున్నట్టు చిత్రీకరిస్తూ వివిధ మీడియాల్లో వార్తలు రాయిస్తున్నారని, పైగా తనను వేధిస్తున్నారని ఏసి మీడియా ముందు బోరున విలపించారు అసిస్టెంట్ కమిషనర్. మహిళనైన తనపై వేధింపులు తట్టుకోలేకే ఈరోజు డిసిపై నిజంగానే మట్టిని విసిరి కొట్టానని కన్నీటి పర్యంతమై చెప్పారు. కిందిస్థాయి సిబ్బంది తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి తప్పితే వాటిని తనకు ఎలా ఆపాదిస్తారని ఆరోపించారు. వేరొక ప్రాంతం నుంచి కుటుంబాన్ని వదలి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని, అయినా తనపై పదే పదే వేధింపులకు డిప్యూటీ కమిషనర్ దిగుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తమ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు ఆమె ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈయన చేస్తున్న వేధింపులపై గతంలోనే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ సమయంలో కూడా ఆయన హాజరు కాలేదన్నారు. అయితే జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా డిసి చెప్పడం విశేషం. తన వ్రుత్తి ధర్మంగానే తాను వ్యవహరించానని ఆయన కూడా మీడియాకి వివరించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత కారణాలు, ఆలోచనలు లేవని చెప్పుకొచ్చారు. దేవాదాయశాఖ డిసిపై మహిళా ఏసి మట్టి విసిరి కొట్టం చర్చనీయాంశమవుతోంది. అయితే గతంలో ఓ దేవస్థానంలో సుమారు రూ.7లక్షల దేవుని హుండీ ఆదాయం కాజేశారనే ఆరోపణలు క్రింది స్థాయి సిబ్బందిపై ఉన్నాయి. ఆ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతున్న సమయంలో కాన్ఫిడెన్సియల్ ఇన్ఫర్ మేషన్ మీడియాకి లీక్ చేశారనే ఆరోపణలు కూడా డీసి పై ఉన్నాయి. సాధారణంగా కాన్ఫిడెన్సియల్ సమాచారాన్ని ఏ ప్రభుత్వ అధికారి మీడియాకి వివరించ కూడదు. ఈ విషయంలో డిసిని ఉన్నతాధికారులు మందలించినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి వుంది..

Visakhapatnam

2021-08-05 17:18:25

ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేసిన కలెక్టర్..

అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అదనపు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఎన్.గోపి,  వి ఆర్ ఓ  మాకం కోటయ్య లను  జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఆ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం మండలంలో అదనపు ఆర్ ఐ గా పనిచేస్తున్న గోపి క్షేత్రస్థాయి విచారణ, రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండానే చుక్కల భూమిని కొందరికి అనుకూలంగా ఆన్ లైన్ లో నమోదు చేయడంపై విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఇడుపూరు విఆర్ఓ గా పనిచేస్తున్న మాకం కోటయ్య నకిలీ రికార్డులను సృష్టించి, కొందరికి అనుకూలంగా భూమిని ఇచ్చారనే ఆరోపణలపై విచారణ నివేదిక అనుసరించి సస్పెండ్ చేశారు.  సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు గురువారం నుంచే అమలులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

Ongole

2021-08-05 17:00:43

రహీమున్నీసా బేగంకు ఆరుదైన అవకాశం..

విశాఖలో ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త రహీమున్నీషాకు అరుదైన అవకాశం దక్కింది. కోవిడ్ పోరులో భాగంగా కరోనా పరిణామాలు, పరిష్కార నైపుణ్యాలు అనే అంశంపై ఆగస్టు 7న జరగనున్న అంతర్జాతీయ వెబినార్ లో ఆమె పాల్గొని ప్రశంగించనున్నారు. ఆఫ్రికా గ్లోబల్ డెవలప్ మెంట్ ఫర్ పాజిటివ్ చేంజ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో ఎంపవర్ ఉమెన్, ఎంపవర్ సొసైటీ అంశానికి సంబంధించి ఈ అంతర్జాతీయ వెబినార్ లో ఆమె తన అభిప్రాయాన్ని ఆలోచనలు, తన వద్ద వున్న ప్రస్తుత పరిస్థితుల తాజాసమాచారాన్ని తెలియజేస్తారు.  అంతేకాకుండా మహిళా సాధికారత దిశగా  దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయో ఆమె ఈ వెబినార్ లో విశ్లేషిస్తారు. ఈ అద్భుతమైన అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని, అలాగే తనకు అంతర్జాతీయంగా ఈ వెబినార్ మరింత బాధ్యత పెంచనుందన్నారు. ఇలాంటి వెబినార్ల ద్వారా మన దేశ పరిస్థితులను తాజాగా అంతర్జీతయంగా తెలియజేయడంతోపాటు, పలు దేశాల్లోని అంశాలను కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా ఇక్కడ పనిచేయడానికి, సేవలు అందించడానికి ఈ తరహా వెబినార్లు ఎంతగానో దోహదపడతాయన్నారు.

Visakhapatnam

2021-08-05 16:49:39

విశాఖలో లక్షమందికి కరోనా వేక్సిన్లు వేయాలి..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య   కేంద్రాలు, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 6న లక్ష కోవిడ్ వ్యాక్సినేషన్లు  వేస్తున్నట్టు జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందరు జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేక అధికారులు ఏఎంహెచ్ వో లు,  శానిటరీ సూపర్వైజర్ లు,  శానిటరీ ఇన్స్పెక్టర్లు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో  పాల్గొని విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.  వ్యాక్సినేషన్   ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన వారు,  గర్భిణీ స్త్రీలు,  ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు ఉన్న తల్లులకు,  టీచర్స్ కు వ్యాక్సినేషన్ వేయించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.

Visakhapatnam

2021-08-05 16:44:30

అర్భన్ పీహెచ్సీలకు మంత్రి శంకుస్థాపన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 8వ జోన్  89వ వార్డు లోని యల్లపువానిపాలెం - 2(కొత్త పాలెం) నందు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రివర్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నికల హామీలో ఇచ్చిన నవరత్నాలతో పాటూ, ప్రజల ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ లో అనేక రోగాలకు వైద్యం సేవలు చేర్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులలో రూ.80 లక్షల వ్యయంతో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంనకు శంకుస్థానం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ఎపి హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరామేశ్వరరావు, రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ మల్ల విజయప్రసాద్, అయిదవ జోనల్ కమిషనర్ చక్రవర్తి,  కార్యనిర్వాహక ఇంజనీరు, 89వ వార్డు వైసిపి  ఇంచార్జ్ దొడ్డి రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-05 16:35:56

స్థాయి సంఘంలో 3 అంశాలు ఆమోదం..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం గురువారం జివిఎంసి స్థాయి సంఘ సమావేశ మందిరం నందు నగర మేయర్ మరియు స్థాయి సంఘం చైర్మెన్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. అజెండాలో మొదటి మూడు అంశాలు స్థాయి సంఘ సమావేశంలో ఆమోదం పొందగా, నాలుగవ అంశము వాయిదా వేయడమైనదని, 5వ  అంశమును తిరస్కరించారు. ఈ సమావేశంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి,  డా. వి. సన్యాసి రావు, డి.సి.ఆర్. నల్లనయ్య, డి.ఇ.ఒ. శ్రీనివాస్, కార్యదర్శి లావణ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-05 16:34:16