1 ENS Live Breaking News

పదోన్నతులపై పీఆర్ ఉద్యోగుల హర్షం..

ఎంపిడిఓలకు ప‌దోన్న‌తుల‌ను క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల పంచాయితీరాజ్ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ‌కాలంగా దాదాపు 25 ఏళ్ల నుంచీ ఎటువంటి ప‌దోన్న‌తి పొంద‌కుండా ఒకే కేడ‌రులో ప‌నిచేస్తున్న సుమారు 255 మంది ఎంపిడిఓల‌కు, పంచాయితీరాజ్ శాఖ సిబ్బందికీ ఈ నిర్ణ‌యం ఎంతో మేలు చేస్తుంద‌ని వారు పేర్కొన్నారు.  స్థానికంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఎంపిడిఓల సంఘం జిల్లా నాయ‌కులు కె.రాజ్‌కుమార్, కె.రామ‌చంద్ర‌రావు మాట్లాడుతూ, ఈ నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌నిచేస్తున్న సుమారు 18,500 మంది పంచాయితీరాజ్ ఉద్యోగుల‌కు కూడా, వారి హోదాను బ‌ట్టి ప‌దోన్న‌తులు ల‌భిస్తాయ‌ని చెప్పారు. ఈ నిర్ణ‌యం తీసుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డికి, పంచాయితీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి, జిల్లా మంత్రుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విలేక‌ర్ల స‌మావేశంలో పిఆర్ మినిస్టీరియ‌ల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్య‌క్షులు ఏ.సురేష్‌, కార్య‌ద‌ర్శి సిహెచ్ ముర‌ళి, ప‌రిష‌త్ యూనిట్ అధ్యక్ష‌, కార్య‌ద‌ర్శులు పిజె అమృత‌, పి.కిర‌ణ్‌, పిఆర్ విస్త‌ర‌ణాధికారుల సంఘం నాయ‌కులు సురేష్ పాల్గొన్నారు.

Vizianagaram

2021-08-06 13:52:58

జాతీయ రహదారి పనులు వేగం పెంచాలి..

రాయిపూర్ –విశాఖపట్నం 6  లైన్ల  జాతీయ రహదారి కి సంబంధించి  559.50  హెక్టార్లలో  జరగాల్సిన   పనులను  వేగంగా  పూర్తయ్యేలా చూడాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి   అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారులు త్వరగా పూర్తి ఆయితే  పర్యాటకం, పరిశ్రమల  అభివృద్ధి వేగంగా జరుగుతుందని,  అందువలన ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. శుక్రవారం జాతీయ రహదారుల పనుల పై భూ సేకరణ అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించారు.  జాతీయ రహదారుల డిప్యూటీ మేనేజర్  ప్రశాంత్ మిశ్ర పనుల పురోగతిపై కలెక్టర్ కు వివరించారు.  రాయిపూర్ నుండి  విశాఖపట్నం జాతీయ రహదారి  సివిల్ పనుల పురోగతి  పాకేజ్ 1 నుండి 4 వరకు ఏ ఏ  స్థాయిలలో ఉన్నాయో   సమీక్షించారు.  గ్రామాలలో  అటవీ క్లియరెన్స్ , ఉద్యాన పంటల, ఇతర ఆస్తుల  లెక్కింపు త్వరిత గతిన పూర్తి చేసి  పరిహారం చెల్లింపులు త్వరితగతిన జరగాలని  సూచించారు. అటవీ క్లియరెన్స్ కు సంబంధించి అటవీ శాఖ అధికారులు స్వయంగా  వెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు.    భూ సేకరణ కు సంబంధించి తహసిల్దార్ల సమక్షం లో తప్పకుండా గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్  డా. జి.సి .కిషోర్ కుమార్ మాట్లాడుతూ  రాయిపూర్ – విశాఖ రహదారి కి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇప్పటికే పొందడం జరిగిందని అటవీ క్లియరెన్స్  పాకేజ్ 1,2 కు సంబంధించి 6.40 కిలో మీటర్లలో 29.18 హెక్టార్ల భూమి కి సంబంచించి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.   పాకేజ్ 1 నుండి 4 వరకు  అవసరమగు అదనపు భూమి కోసం  3 డి పబ్లికేషన్ పూర్తి చేసామని  తెలిపారు. పాకేజ్ 1,2,3 పనులు పురోగతి  లో ఉన్నాయని, పాకేజ్ 4 లో కోర్ట్ కేసు లు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించి పనులు వేగంగా జరిగేల చూస్తామని తెలిపారు. ఈ సమావేశం లో సబ్ కలెక్టర్ భావన,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, రెవిన్యూ  డివిజినల్ అధికారి  భవాని శంకర్, ఉప కలెక్టర్  వెంకటేశ్వర్లు ఉద్యాన, జలవనురుల, విద్యుత్, ఆర్.డబ్లు..ఎస్. శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-06 13:52:09

క్రిస్టియన్, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి..

రాష్ట్రం లో క్రిస్టియన్, మైనారిటీ వర్గాల  అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సేవలు అందించే కు స్మశాన వాటికల అంశానికి  తొలి ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర క్రిష్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ అన్నారు.  త్వరలోనే ఆయా జిల్లాల కలెక్టర్లు తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్ లోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ పదవి అలంకారం కాదని, బాధ్యతని సంపూర్ణంగా స్వీకరించి క్రిస్టియన్ లు  అందరికీ న్యాయం చేస్తామని అన్నారు.    చర్చిలకు సంబంధించి అధిక ఆస్తులు వున్నా అంతర్గత విభేదాల కారణంగా కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అటువంటి ఆస్తులను పరిరక్షించుకుంటామన్నారు. ప్రార్ధన మందిరాల నిర్మాణాలకు నిబంధనల సడలింపు నకు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని అన్నారు. జెరూసలేం, ఈజిప్ట్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు నిజమైన పేదలకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. "నవరత్నాల" ద్వారా క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పధకాలను చేరువ చేస్తామని తెలిపారు.
మిగిలిన పార్టీల సంగతి ఎలా వున్నా.. వైఎస్సార్సీపీ లో కష్ట పడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తుందని చెప్పేందుకు  తనకు అప్పగించిన బాధ్యతే ఉదాహరణ అని ప్రస్తావించారు.  సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయ సాయి రెడ్డి నిజాయితీగా ఉంటూ మిగిలిన  నాయకులను సమర్ధ వంతంగా పనిచేయించ గలుగుతున్నారని అన్నారు. మనం నిజాయితీ పరులు  అయితేనే అవతలి వారిపై చర్యలుతీసుకోగలమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా  విజయ సాయి రెడ్డి పోరాటం చేస్తున్నారని అన్నారు.
మంచి తనాన్ని గుర్తించి వైజాగ్ జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఒదిగి ఉండే వారికి ఉన్నత అవకాశాలు అంది వస్తాయని జాన్ వెస్లీ సాదర మనస్తత్వాన్ని  అభినందించారు. ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి  సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షుడు నాగరాజ్ పట్నాయక్,జాయింట్ సెక్రెటరీ దాడి రవికుమార్ కార్యవర్గ సభ్యులు ఈరోతి ఈశ్వరరావు, ఎంఎస్సార్ ప్రసాద్, దొండా గిరిబాబు,డేవిడ్రాజ్, వరలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-06 10:43:08

మహిళాపోలీసుల రెగ్యులైజేషన్ పై ఎప్పీలకు డిజిపీ సూచనలు..

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి”  పై ఆంధ్రప్రదేశ్  డిజిపి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం తూర్పుగోదావరి  జిల్లా నుంచి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ  గౌతమ్ సవాంగ్  “మహిళా పోలీసుల నియామక ప్రక్రియ మరియు ఉద్యోగ నియమావళి” పై ఎస్పీలకు పలు సూచనలు చేశారు. మహిళా పోలీసుల నియామక ప్రక్రియ, దేహధారుడ్య పరీక్షా, శారీరక ప్రమాణాలు, శిక్షణ, జీత భత్యాలు, యూనిఫాం, ప్రోబేషన్ డిక్లరేషన్, ప్రమోషన్ మొదలగు సర్వీసు అంశాలపై రాష్ట్ర పోలీసు ఉన్నత అధికారులు  జిల్లా ఎస్పీ లతో చర్చించారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డిజిపి ఆదేశాల మేరకు మహిళా పోలీసులకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు స్థానిక మీడియాకి వివరించారు.ఈ కార్యక్రమంలో లా అండర్ ఆర్డర్ అదనపు డిజిపి  రవిశంకర్ అయ్యనార్, డిఐజీ టెక్నికల్ సర్వీసెస్  పాల్ రాజు, దిశ స్టేట్ నోడల్ అధికారి రాజకుమారి పలువురు పోలీసు ప్రధాన కార్యాలయ ఉన్నత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్సులో హాజరయ్యారు.

Kakinada

2021-08-06 09:09:04

అప్పన్నకు అదనపు కార్యదర్శి పూజలు..

సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరహా లక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న) వారిని ప్రభుత్వ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్ శుక్రవారం దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ అధికారులు స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ వైభవాన్ని ఆయనకు తెలియజేశారు. వేదపండితులు ఆశ్వీర్వాదాలు అందించగా, సిబ్బంది స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట యూనియన్ బ్యాంక్ ఎఫ్జీఎం కెఎస్డిఎస్వీ ప్రసాద్, జోనల్ మేనేజర్ గుణనంద్ గని, సిజిఎం ఎస్.కె.జాన్వర్, నాబార్డు డిడిఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Simhachalam

2021-08-06 03:13:49

వైఎస్సార్ జగనన్న కాలనీలు వేగంపెంచాలి..

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్ జగనన్న కాలనీలలో గ్రూప్ హౌసింగ్ విధానం అమలు చేసి ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అధికారులను ఆదేశించారు.  గురువారం స్థానిక కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో గుంటూరు డివిజన్ లోని ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాలలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళ పధకం వైఎస్సార్ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ రోజు వారి కూలీలకు వెళ్ళే భార్య భర్తలు సొంతంగా గృహ నిర్మాణం చేసుకోవడం కష్టంతో కూడుకున్న విషయమని, వీరికి ఆప్షన్ మూడు ద్వారా ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా లే అవుట్లలో రెండు రోజుల్లో పెండింగ్ లో ఉన్న విద్యుత్ పనులను పూర్తి చేయాలన్నారు.  ప్రతి లే అవుట్ లో సాండ్ స్టాక్ యార్డులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ప్లాస్టిక్ పట్టాలతో భూమిలో సంపులను నిర్మించాలన్నారు. లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాల  పర్యవేక్షణకు వీలుగా తాత్కాలికంగా అధికారులు ఉండేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.  ఇళ్ళ నిర్మాణంకు అవసరమైన కంకర సరఫరా కోసం క్వారీ యజమానులతో సమావేశం నిర్వహించి, తక్కువ ధరకు కంకర సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో వైఎస్సార్ జగనన్న లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. 

  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో జగనన్న కాలనీలలో 1.22 లక్షల ఇళ్ళ నిర్మాణాలు  మంజూరు చేసారన్నారు.  ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు వ్యక్తిగతంగా ఇళ్ళు నిర్మించుకునే వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా  మెప్మా, బ్యాంకర్ల తో లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెగా గ్రౌన్దింగ్ మేళా లో 91,343 గృహాలకు శంఖుస్థాపన చేసామని, లబ్దిదారుల వివరాలు ఆన్ లైన్ చేసి, జియో ట్యాగింగ్, ఇళ్ళ మ్యాపింగ్ చేస్తున్నామన్నారు.  అన్ని లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలకు అనుకూలంగా విద్యుత్, నీరు, ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

  గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మద్దాలి గిరిధర్, తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి, నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు  మాట్లాడుతూ  జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణంలో పురోగతి కనిపిస్తున్నదని, ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన మెటిరియల్, స్టేజ్  వైజ్ నిధులు సకాలంలో అందేలా అధికారులు సహకరించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన లే అవుట్లలో అవసరమైన అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ తరపున అమలు జరుగుతున్న పధకాల ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. 

  సమావేశంలో సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి,  హౌసింగ్ పీడీ వేణు గోపాల రావు, ప్రత్తిపాడు, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల  హౌసింగ్, రెవిన్యూ, పంచాయితీ, విద్యుత్, ఇంజనీరింగ్, నగరపాలక సంస్థ  అధికారులు పాల్గొన్నారు.  

Guntur

2021-08-05 17:24:09

మట్టికొట్టుకు పోతావు ఆడదాని ఉసురుపోసుకుంటే..

ఒక ఆడబిడ్డను ఏడిపించి వేధింపులకు గురిచేస్తే మట్టికొట్టుకుపోతావంటూ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై  నిజంగానే మట్టిని విసిరికొట్టారు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఈ సంఘటన గురువారం విశాఖలోని డిసి కార్యాలయంలో జరిగింది. తనను పదే పదే ఏడిపించడం, వివిధ కారణాలతో తన కింది స్థాయి సిబ్బందితో లాలూచీ పడుతున్నట్టు చిత్రీకరిస్తూ వివిధ మీడియాల్లో వార్తలు రాయిస్తున్నారని, పైగా తనను వేధిస్తున్నారని ఏసి మీడియా ముందు బోరున విలపించారు అసిస్టెంట్ కమిషనర్. మహిళనైన తనపై వేధింపులు తట్టుకోలేకే ఈరోజు డిసిపై నిజంగానే మట్టిని విసిరి కొట్టానని కన్నీటి పర్యంతమై చెప్పారు. కిందిస్థాయి సిబ్బంది తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి తప్పితే వాటిని తనకు ఎలా ఆపాదిస్తారని ఆరోపించారు. వేరొక ప్రాంతం నుంచి కుటుంబాన్ని వదలి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని, అయినా తనపై పదే పదే వేధింపులకు డిప్యూటీ కమిషనర్ దిగుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తమ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు ఆమె ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈయన చేస్తున్న వేధింపులపై గతంలోనే రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ సమయంలో కూడా ఆయన హాజరు కాలేదన్నారు. అయితే జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా డిసి చెప్పడం విశేషం. తన వ్రుత్తి ధర్మంగానే తాను వ్యవహరించానని ఆయన కూడా మీడియాకి వివరించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత కారణాలు, ఆలోచనలు లేవని చెప్పుకొచ్చారు. దేవాదాయశాఖ డిసిపై మహిళా ఏసి మట్టి విసిరి కొట్టం చర్చనీయాంశమవుతోంది. అయితే గతంలో ఓ దేవస్థానంలో సుమారు రూ.7లక్షల దేవుని హుండీ ఆదాయం కాజేశారనే ఆరోపణలు క్రింది స్థాయి సిబ్బందిపై ఉన్నాయి. ఆ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరుగుతున్న సమయంలో కాన్ఫిడెన్సియల్ ఇన్ఫర్ మేషన్ మీడియాకి లీక్ చేశారనే ఆరోపణలు కూడా డీసి పై ఉన్నాయి. సాధారణంగా కాన్ఫిడెన్సియల్ సమాచారాన్ని ఏ ప్రభుత్వ అధికారి మీడియాకి వివరించ కూడదు. ఈ విషయంలో డిసిని ఉన్నతాధికారులు మందలించినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి వుంది..

Visakhapatnam

2021-08-05 17:18:25

ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేసిన కలెక్టర్..

అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అదనపు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఎన్.గోపి,  వి ఆర్ ఓ  మాకం కోటయ్య లను  జిల్లా కలెక్టర్  ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఆ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం మండలంలో అదనపు ఆర్ ఐ గా పనిచేస్తున్న గోపి క్షేత్రస్థాయి విచారణ, రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండానే చుక్కల భూమిని కొందరికి అనుకూలంగా ఆన్ లైన్ లో నమోదు చేయడంపై విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఇడుపూరు విఆర్ఓ గా పనిచేస్తున్న మాకం కోటయ్య నకిలీ రికార్డులను సృష్టించి, కొందరికి అనుకూలంగా భూమిని ఇచ్చారనే ఆరోపణలపై విచారణ నివేదిక అనుసరించి సస్పెండ్ చేశారు.  సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు గురువారం నుంచే అమలులోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

Ongole

2021-08-05 17:00:43

రహీమున్నీసా బేగంకు ఆరుదైన అవకాశం..

విశాఖలో ప్రముఖ న్యాయవాది, సామాజిక వేత్త రహీమున్నీషాకు అరుదైన అవకాశం దక్కింది. కోవిడ్ పోరులో భాగంగా కరోనా పరిణామాలు, పరిష్కార నైపుణ్యాలు అనే అంశంపై ఆగస్టు 7న జరగనున్న అంతర్జాతీయ వెబినార్ లో ఆమె పాల్గొని ప్రశంగించనున్నారు. ఆఫ్రికా గ్లోబల్ డెవలప్ మెంట్ ఫర్ పాజిటివ్ చేంజ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో ఎంపవర్ ఉమెన్, ఎంపవర్ సొసైటీ అంశానికి సంబంధించి ఈ అంతర్జాతీయ వెబినార్ లో ఆమె తన అభిప్రాయాన్ని ఆలోచనలు, తన వద్ద వున్న ప్రస్తుత పరిస్థితుల తాజాసమాచారాన్ని తెలియజేస్తారు.  అంతేకాకుండా మహిళా సాధికారత దిశగా  దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయో ఆమె ఈ వెబినార్ లో విశ్లేషిస్తారు. ఈ అద్భుతమైన అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని, అలాగే తనకు అంతర్జాతీయంగా ఈ వెబినార్ మరింత బాధ్యత పెంచనుందన్నారు. ఇలాంటి వెబినార్ల ద్వారా మన దేశ పరిస్థితులను తాజాగా అంతర్జీతయంగా తెలియజేయడంతోపాటు, పలు దేశాల్లోని అంశాలను కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా ఇక్కడ పనిచేయడానికి, సేవలు అందించడానికి ఈ తరహా వెబినార్లు ఎంతగానో దోహదపడతాయన్నారు.

Visakhapatnam

2021-08-05 16:49:39

విశాఖలో లక్షమందికి కరోనా వేక్సిన్లు వేయాలి..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య   కేంద్రాలు, వార్డు సచివాలయాల్లో ఆగస్టు 6న లక్ష కోవిడ్ వ్యాక్సినేషన్లు  వేస్తున్నట్టు జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని అందరు జోనల్ కమిషనర్లు,  వార్డు ప్రత్యేక అధికారులు ఏఎంహెచ్ వో లు,  శానిటరీ సూపర్వైజర్ లు,  శానిటరీ ఇన్స్పెక్టర్లు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో  పాల్గొని విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.  వ్యాక్సినేషన్   ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన వారు,  గర్భిణీ స్త్రీలు,  ఐదు సంవత్సరాలు లోపు పిల్లలు ఉన్న తల్లులకు,  టీచర్స్ కు వ్యాక్సినేషన్ వేయించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.

Visakhapatnam

2021-08-05 16:44:30

అర్భన్ పీహెచ్సీలకు మంత్రి శంకుస్థాపన..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గురువారం 8వ జోన్  89వ వార్డు లోని యల్లపువానిపాలెం - 2(కొత్త పాలెం) నందు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మంత్రివర్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల మేలు కోరి ఎన్నికల హామీలో ఇచ్చిన నవరత్నాలతో పాటూ, ప్రజల ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ లో అనేక రోగాలకు వైద్యం సేవలు చేర్చారని తెలిపారు. ప్రస్తుతం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వార్డులలో రూ.80 లక్షల వ్యయంతో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంనకు శంకుస్థానం చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ ఎపి హెల్త్ సిస్టం స్ట్రెంతనింగ్ మరియు జాతీయ ఆరోగ్య పథకం నిధుల నుండి రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నేడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, పనులు వెంటనే ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రతి వార్డులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, పేద ప్రజల కొరకు నవరత్నాలులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరామేశ్వరరావు, రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ మల్ల విజయప్రసాద్, అయిదవ జోనల్ కమిషనర్ చక్రవర్తి,  కార్యనిర్వాహక ఇంజనీరు, 89వ వార్డు వైసిపి  ఇంచార్జ్ దొడ్డి రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-08-05 16:35:56

స్థాయి సంఘంలో 3 అంశాలు ఆమోదం..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం గురువారం జివిఎంసి స్థాయి సంఘ సమావేశ మందిరం నందు నగర మేయర్ మరియు స్థాయి సంఘం చైర్మెన్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. అజెండాలో మొదటి మూడు అంశాలు స్థాయి సంఘ సమావేశంలో ఆమోదం పొందగా, నాలుగవ అంశము వాయిదా వేయడమైనదని, 5వ  అంశమును తిరస్కరించారు. ఈ సమావేశంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, అదనపు కమిషనర్లు ఎ. వి. రమణి,  డా. వి. సన్యాసి రావు, డి.సి.ఆర్. నల్లనయ్య, డి.ఇ.ఒ. శ్రీనివాస్, కార్యదర్శి లావణ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-05 16:34:16

వ్యాధులపై ప్రజలకు అవగాహన పెంచండి..

ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన్ కల్పించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె రెండవ జోన్  10వ వార్డు పరిధిలోని ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులపై మలేరియా విభాగం వారు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా మొదలైనవి నియంత్రణకు లార్వా నిర్మూలనకు కార్యక్రమంనకు స్ప్రేయింగ్ చేయించాలని, దోమలు నియంత్రణకు నిరంతరం ఫాగింగు చేయాలని, వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ప్రతీ శుక్రవారం “డ్రై డే” పాటించాలని, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ సీసాలు ఇంటి పరిసరాలలో ఉండకుండా చూడాలని మలేరియా సిబ్బందిని ఆదేశించారు. రెసిడెన్షియాల్ వెల్ఫేర్ అసోషియేషన్ (ఆర్.డబ్ల్యూ.ఎస్), ఆర్.పి.లు వారితో మాట్లాడుతూ సేవా కార్యక్రమం ఏ ఏ ప్రాంతాలలో  చేస్తున్నారని ఆరా తీశారు. అనంతరం డోర్ టు డోర్ చెత్త నిర్వహణ చేయు విధానాన్ని పరిశీలించి, ప్రతీ ఇంటి నుండి తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తను వేరు వేరుగా సేకరించాలని ఎఎంఒహెచ్ ను ఆదేశించారు. కాలువలలో చెత్త సరిగా తీయడంలేదని, కాలువలలో ఉన్న చెత్తను దగ్గరుండి తీయించాలని శానిటరీ కార్యదర్శిని ఆదేశించారు. వార్డులో త్రాగునీరు సమయానికి రావడంలేదని స్థానికులు కమిషనర్ కు తెలపగా, సంబందిత సహాయక ఇంజినీరు(వాటర్ సప్లై)ను ప్రతీ రోజూ త్రాగునీరు సమయం ప్రకారం అందించాలని ఆదేశించారు.  డో.నెం. 03-23/1 ఇంటిలో డాబా పై కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున విధానాన్ని పరిశీలించి వారిని అభినందించారు. కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు పాటించవలసిన పద్దతులను, వాటి ఉపయోగాలను తెలిపి వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. కంపోస్ట్ ఎరువు తయారు చేయుటకు సహాయ సహకారాలు అందించాలని, వార్డులోని బరియల్ గ్రౌండ్ పాడైనందున, దానికి మరమత్తులు చేయించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, జోనల్ కమిషనర్ బి.రాము, ఎఎంఒహెచ్  కిషోర్, ఎసిపి భాస్కర బాబు, కర్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, మత్స్య రాజు,  ఉప కర్యనిర్వాహక ఇంజినీర్ వంశీ, సహాయక ఇంజినీర్లు అప్పాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.      

Visakhapatnam

2021-08-05 16:16:10

కుటుంబ నియంత్రణ శాల ప్రారంభం..

 అరసవల్లి వద్ద కాజీపేటలో రూ.25 లక్షల నిధులతో  కుక్కల కుటుంబ నియంత్రణ (యానిమల్ బర్త్ కంట్రోల్ ) శాలను స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గురువారం ప్రారంభించారు.  నగరపాలక సంస్థ కమీషనర్  కుక్కల జనన నియంత్రణ గురించి శాసన సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ అదేశాల మేరకు వీధి కుక్కల సంతతి నియంత్రణ చర్యలలో భాగంగా కుటుంబ నియంత్రణ శాలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీకాకుళం లో సుమారు 4 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు కమీషనర్ తెలిపారని, ఇవి వాహనదారుల వెంటబడి కరవడం చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. యానిమాల్ వెల్ఫేర్ బోర్డ్ చట్టం ప్రకారం ప్రతీ జీవికి జీవించే హక్కు ఉందని, అందువలన వాటిని చంపకూడదని స్పష్టం చేశారు. అయితే వీటికి కుటుంబ నియంత్రణ చేసి, తద్వారా వాటి సంతతిని నిర్మూలించ వచ్చని, అందువలనే దీన్ని ప్రారంభించుకోవడం జరిగిందని  శాసనసభ్యులు తెలిపారు. అందుకోసం ఈ విభాగాన్ని ఇక్కడ అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. మొదటగా వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి 4 రోజులు పర్యవేక్షణలో ఉంచి తదుపరి ఎక్కడ పట్టుకున్న కుక్కలను అదే వీధిలో నగరపాలక సంస్థ సిబ్బంది వదిలేస్తారని అన్నారు. కుటుంబ నియంత్రణతో పాటు కుక్కలు నుండి ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉండేందుకు

రబిపూర్ ఇంజక్షన్లను కూడా కుక్కలకి వేయడం జరుగుతుందని చెప్పారు. కుక్కలు కోపంగా ఉండి కరవడానికి వెంటబడే తత్వం కలిగి ఉంటాయని, వాటికి ఆ కోపాన్ని తగ్గించే ఇంజెక్షన్లను కూడా వేయనున్నట్లు కమీషనర్ చెప్పారని అన్నారు. కాజీ పేటలో సుమారు 50 కుక్కలకు ఉంచడానికి గదులు నిర్మాణం చేయడం జరిగిందని,అలాగే శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలుగా 10 బల్లలను అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కుక్కల కుటుంబ నియంత్రణ, ఇంజెక్షన్లు, కార్యక్రమం మొత్తం స్థానిక వెటర్నరీ డాక్టర్ సూర్యం బ్లూ క్రాస్ సంస్థ  చైర్మన్ వారితో ఎం.ఓ.యూ కూడా చేసుకోబో తున్నట్లు కమీషనర్ తెలిపారని, ఇది శుభదాయకమన్నారు. బ్లూ క్రాస్ చైర్మన్ సూర్యం మాట్లాడుతూ గతంలో రాష్ట్రం మొత్తం 42 వేలకు పైగా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ చేసిన అనుభవం తమ సిబ్బందికి ఉందని అన్నారు. కుక్కలవల్ల ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కరోనా లాంటి వ్యాధి  నుండి తప్పించుకోవచ్చు కానీ రాబిస్ వ్యాధి వచ్చిందంటే మరణమే అని అన్నారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని అన్నారు. తమవద్ద డాగ్ క్యాచర్లు ఉన్నారని, వీరితో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందనే నమ్మకం తమకు ఉందని అన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డా. వెంకటరావు మాట్లాడుతూ ప్రతీరోజు కుక్కలు గురించి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే వీటిపై దృష్టి పెట్టామని అన్నారు. .ఇకముందు ఇటువంటి ఫిర్యాదులు లేకుండా ఈ కుక్కల కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నగరపాలక సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. దక్షిణ మూర్తి,ఉప కార్య నిర్వాహక ఇంజినీర్ రమణమూర్తి , పారిశుద్ధ్యం పర్యవేక్షకులు  గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Arasavilli

2021-08-05 15:57:16

స్వచ్ఛతకు మారుపేరు శ్రీకాకుళం కావాలి..

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ద్వారా  శ్రీకాకుళం స్వచ్ఛతకు మారుపేరు కావాలని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆకాంక్షించారు.  ఏ.పి.హెచ్.బి.కాలనీలో గల కార్గిల్ పార్క్ వద్ద పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడంతోనే పని అయిపోలేదని, దానిని సంరక్షించుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉందని అన్నారు. నేడు  ఎవరి ఇంటి ముందు మొక్కలు నాటారో, ఆ ఇంటి యజమానులే వాటి సంరక్షణ బాద్యతలను తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలనీలోని  ప్రతీ ఇంటికీ వాలంటీర్ ద్వారా తడి చెత్త, పొడిచెత్త, కాలుష్య చెత్త వేరు వేరుగా వేయుటకు 3 ప్లాస్టిక్ డస్ట్ బిన్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్... క్లీన్ శ్రీకాకుళం కార్యక్రమం మొట్ట మొదటిగా కార్గిల్ పార్క్ వద్ద ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ కాలనీలో విశ్రాంతి ఉద్యోగులు, కాలనీ అసోసియేషన్, మంచి రోడ్లు, పార్కులు మంచి నాయకత్వం కలిగిన వారు ఉన్నారని, ఆదర్శకాలనీగా ఈ కాలనీ ఉంటుందని ప్రగాఢంగా నమ్మి పైలట్ ప్రోజెక్టుగా  ఎంచుకున్నామన్నారు.

. గతంలో చెత్త వేయడానికి ఎక్కడా స్థలం లేని పరిస్థితుల్లో సింగుపురం వద్ద సుమారు 25 ఎకరాలలో డంపింగ్ యార్డ్ కొరకు తీసుకోవడం జరిగిందని, ఇపుడు అక్కడ కూడా చెత్త వేయడానికి స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అందువలన పాత పద్ధతిని విడనాడి కొత్త పద్దతిని అనుసరించాలని, అందులో భాగంగా ఈ డస్ట్ బిన్ల పద్దతిని అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై మొదటగా వార్డు వాలంటీర్ అవగాహన కల్పించుకుని అనంతరం వారి పరిధిలో గల గృహాల మహిళకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతీ రోజూ ఇంటి ముందరికి వచ్చే  చెత్త కలెక్షన్ చేసేవారికి అవమానకర   పద్దతిలో చూడరాదని,  అటువంటి వారు లేకపోతే మనం రోగాల పాలు కాక తప్పదని హెచ్చరించారు.   అందువలన వాళ్ళని గౌరవించాలని, తద్వారా చెత్త రహిత శ్రీకాకుళంగా తీర్చిదిద్దు కుందాం అని అన్నారు.  మరలా త్వరలో ఈ కాలనీకి వస్తానని, ఇపుడు నాటిన మొక్కలు, చెత్తపై పరిశీలన చేస్తానని తెలిపారు. పందులు, కుక్కలు, ఆవులు గురించి కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ ఫిర్యాదుపై కమీషనర్ స్పందించి పందులను వాటి యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు. అప్పటికి వారినుండి స్పందన రాకపోతే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. వీధి కుక్కలకు సంబంధించి కుటుంబనియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆవులు రోడ్లపై తిరిగితే తొలిసారికి రూ.2500/-లు, రెండవసారి రూ.5000/-లు జరిమానాగా నిర్ణయించడం జరిగిందని, ఇకపై ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కావని హామీ ఇచ్చారు.  

నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పొజెక్టులలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ఒకటని అన్నారు.  అందులో భాగంగా స్వచ్ఛతకు మారుపేరుగా శ్రీకాకుళంను తీర్చిదిద్దేందుకు విశేష కృషిచేస్తున్నట్లు చెప్పారు. క్లీన్ శ్రీకాకుళంలో భాగంగా  ప్రతీ ఇంటికి 3 రకాల ప్లాస్టిక్ డస్ట్ బిన్లు అందజేయడం జరిగిందని, డస్ట్ బిన్లను ఉపయోగించుకునే విధానం గురించి ఆయన మహిళలకు వివరించారు.   రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లలో పాత పద్దతిలో చెత్త కలెక్షన్ మార్పు కోసం కొత్త పద్దతిని అనుసరించే విధానంలో భాగమే ఈ డస్ట్ బిన్ ల పంపిణి అని అన్నారు.

Srikakulam

2021-08-05 15:53:58