1 ENS Live Breaking News

నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి..

నాడు - నేడు కార్యక్రమం కింద అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో చేపట్టిన పనులు వేగవంతం చేసి పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.  బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నాడు - నేడు కార్యక్రమం కింద ఆస్పత్రులలో చేపట్టిన పనుల పురోగతిపై జిల్లా వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో  జేసీ కీర్తి చేకూరి సమీక్షించారు.జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లకు వచ్చే ప్రజలకు  పూర్తిస్థాయిలో అన్ని సేవలు అందించే విధంగా ఆసుపత్రులలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పనులలలో నాణ్యత ప్రమాణలను మరింత మెరుగుపరుచుకుని నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులు స్థానం సంపాదించి విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.సమర్థవంతమైన ఐఇసి, సిగ్నేజీలు, ల్యాండ్‌స్కేప్ మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా  అన్ని పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలలో నాణ్యతను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. కె వి ఎస్ గౌరీశ్వర రావు, ఇతర వైద్య అధికారులు,ఆర్‌అండ్‌బి, ఎపిఎంఐఎస్‌డిసి, ఎన్‌హెచ్‌ఎం, జిల్లా నాణ్యత బృందం, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-16 15:19:29

ఇంటి పోషకుడికి భీమా కల్పించాలి..

వైఎస్సార్ బీమా పథకానికి సంబంధించి రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ పోషకుడికి బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు.  బుధవారం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు,  డిఆర్డిఎ పిడి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించనున్నామన్నారు. బీమా సౌకర్యానికి అర్హులు , వారి నామినీల నుంచి బయోమెట్రిక్ డేటా సేకరించాలన్నారు.   జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ 18 నుండి 50 సంవత్సరాలు ఉన్న వారు సాధారణ మరణం చెందితే లక్ష రూపాయలు, 18 నుండి 70 సంవత్సరాలు కలిగి ప్రమాద వశాత్తూ మరణిస్తే వారికి రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని రూపొందించిందని తెలిపారు. వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ లు పారదర్శకంగా సర్వే చేసి పది రోజుల్లోగా ఆన్లైన్ లో బీమా హక్కుదారులు, నామినీల వివరాలు నమోదు చేయాలన్నారు. జూలై ఒకటవ తేదీ నుండి అమలు కానున్న వైయస్సార్ చేయూత లో మిగిలిన వారి వివరాలను త్వరతగతిన నమోదు చేయాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా బీమా హక్కు దారులతో పాటు నామినీల నుంచి కూడా బయోమెట్రిక్ వివరాల సేకరించడంలో ఇబ్బందులున్నాయని డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి విన్నవించారు. చాలా సందర్భాల్లో నామినీలు ఒక చోట, బీమా లబ్ది దారులు ఒక చోట ఉండటం వల్ల ఇద్దరి వివరాలు సేకరించడం సమస్యగా మారిందన్నారు. కార్యక్రమంలో డీపీఎం సత్యనారాయణ తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. 

Anantapur

2021-06-16 15:10:23

ఆలయ భూములు పరిరక్షిస్తాం..

 రాష్ట్రంలోని దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేవాదాయ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేవాదాయ శాఖకు చెందిన  ఆస్తులు, భూముల ద్వారా మరింత ఆదాయం లభించే విధంగా పారదర్శకంగా ఉండే లీజు విధానాన్ని తీసుకువస్తామని అన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను తిరిగి శాఖ ఆధీనంలోకి తెస్తామని అన్నారు. భూములకు ఫెన్సింగ్ వేయించి ఆక్రమణలను నివారిస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని భూములను కామన్ గుడ్ ఫండ్ నిధులతో లేదా అవసరమైతే పీపీపీ విధానంలో పరిరక్షిస్తామని చెప్పారు. మాన్సాస్ ట్రస్టు నిర్వహణ పారదర్శకంగా లేదని, అకౌంట్లను ఆడిట్ చేయిస్తామని తెలిపారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆస్తుల లీజు విధానాన్ని మెరుగు పరచాలని అన్నారు.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు.

రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, చట్టవిరుద్ధంగా ఇతరుల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ దేవాదాయ భూముల పరిరక్షణకు రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, బివి సత్యవతి, జి.మాధవి, విప్ బూడి ముత్యాల నాయుడు, శాసనసభ్యులు అదీప్ రాజ్, కరణం ధర్మశ్రీ, కె.భాగ్యలక్ష్మి, జి.అమర్ నాథ్, ఉమా శంకర గణేష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, కమీషనర్ అర్జున రావు, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీవో లు కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, అనిత, దేవాదాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-16 15:08:13

అమూల్ కిఏర్పాట్లు పూర్తిచేయాలి..

అమూల్ ప్రాజెక్టు అమలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) చాంబర్లో జిల్లాలో అమూల్ ప్రాజెక్టు అమలు నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమూల్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తోందని, ఈ నేపథ్యంలో అమూల్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో పాల సేకరణ సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హిందూపురం, అనంతపురం, కదిరి క్లస్టర్ లను అమూల్ ప్రాజెక్టు అమలు కోసం గుర్తించడం జరిగిందని, ఆయా క్లస్టర్ల వివరాలను అమూల్ టీం వారు హెడ్ ఆఫీస్ కి పంపించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన మూడు క్లస్టర్లలో ఏ క్లస్టర్ బాగుంటుంది అనేది అమూల్ టీం ఎంపిక చేస్తారని, ఎంపిక చేసిన క్లస్టర్ లో రూట్లు ఫైనలైజ్ అయ్యాక సంబంధిత క్లస్టర్ లోని గ్రామాల్లో మహిళా డైరీ సమాఖ్య సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పాలను సేకరించడం జరుగుతుందన్నారు. అమూల్ ప్రాజెక్టు అమలు విషయమై రెండు రోజుల్లోగా సమగ్ర సమాచారం అందించాలని అధికారులను జెసి ఆదేశించారు. అమూల్ ప్రాజెక్టు అమలుపై డిఆర్డిఎ, డ్వామా, పశుసంవర్ధకశాఖ, డైరీ శాఖ, డిప్యూటీ కోపరేటివ్ ఆఫీసర్ లు కోర్ టీంగా ఉంటారని, వారందరూ సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జెడి వెంకటేష్, డిప్యూటీ డైరెక్టర్ స్వరూపారాణి, హిందూపురం, పెనుగొండ, అనంతపురం, ధర్మవరం డిప్యూటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-16 14:08:05

నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించాలి..

శక్తి వంచన లేకుండా పని చేసి లక్ష్యాన్ని చేదించాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ పై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయుడు లతో కలసి సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ క్రాప్ ఖచ్చితంగా అమలు చేసి తీరాలన్నారు. ఈ క్రాప్ కు సంబంధించి వివరాలను  టం టం, సోషల్ మీడియా, తదితర వాటి ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు. రైతులు వద్దకు వెళ్లినప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్ రోల్ చేసినట్లు రైతులకు ఎకనాలెడ్జ్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పరిశీలించి ఆయా భూముల్లో ఏ ఏ పంటలు ఉన్నాయో తెలియజేయాలన్నారు.  జెసి సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న తర్వాత ఎంట్రీ సరిగా ఉందా లేదా అని సంబంధిత రైతులకు చూపించాలని చెప్పారు. ప్రైస్ మోనిటరింగ్ కమిటీ కు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పై జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్  వివరించారు. జిల్లా స్థాయిలోనే ధరలను నిర్ణయించాలని కమీషనర్ చెప్పారు. 

రైతులకు ప్రొవిజనల్ గా మంజూరు చేయాలని ఎడిలను కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ధరలు సరి చూసుకుని రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.   ట్రాక్టర్ కంపెనీలతో  సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో   ఇంటిగ్రేటెడ్ లేబ్స్ త్వరితగతిన పూర్తిచేయాలని కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశించారు. నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింటెక్స్ వాటర్ ట్యాంక్ లు,. ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రణస్థలం, రాజాం, ఆముఉదాలవలస, కొత్తూరు మండలాల నియోజక వర్గాల ఆగ్రో లేబ్స్ జూలై 8 నాటికి అందజేయనున్నట్లు సంబంధిత డిఈ చెప్పారు.  మిగిలిన వాటిని ఆగస్టు నాటికి అందజేయనున్నట్లు తెలిపారు.

విత్తనాలు పంపిణీలో సమస్యలు లేకుండా చూడాలని ఎడిలను ఆయన ఆదేశించారు.వ్యవసాయ మందులు కనీసం రైతు భరోసా కేంద్రాల వద్ద కనీసం 5 టన్నులు పెట్టుకోవాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, తదితరమైన అన్ని రకాల మందులు ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ డిడి పాల్ రాబర్ట్ కమిషనర్ కు వివరించారు. ఆర్.బి.కె. ల్లో వ్యవసాయ సంబంద ఎరువులు, మందులు కొనుగోలు చేస్తే రైతులకు ఒక భరోసా ఉంటుందని కమీషనర్ చెప్పారు.

జిల్లాలో పండించే పంటలు గూర్చి జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ కమిషనర్ కు వివరించారు. కలుపు నివారణ మందులు, తదితర పోస్టర్ లను విడుదల చేశారు.  ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్త పివి సత్యనారాయణ, వంశధార ప్రాజెక్టు ఎస్ఈ డి. తిరుమలరావు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాబర్ట్ పాల్,    వ్యవసాయఆగ్రోస్ డిఎం కె. జగన్ మోహన్ రావు హార్టీ కల్చర్  ఎ.డి.,  రాగోలు వ్యవసాయ కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-16 13:59:41

గ్రామాల్లో నిర్మాణాలు వేగం పెంచాలి..

రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్స్ భవనాల నిర్మాణ పనులు  నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా పనులు వేగవంతం అయ్యేలా  జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సూచించారు.  బుధవారం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కోవిడ్ -19 నివారణ చర్యలు,  ఉపాధి హామీ పధకం, సచివాలయాలు, ఆర్ బి కే లు, అంగన్ వాడీ కేంద్రాలు, బియంసియులు, ఎఎంసిల భవనాల నిర్మాణ పనులు,   డా. వైస్సార్ అర్బన్ క్లీనిక్స్, పేదలందరికీ ఇళ్ళ పధకం ప్లాట్ల పంపిణీ, పక్కా  గృహాల నిర్మాణం, 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, జగనన్న శాశ్వత భూ హక్కు పధకం సర్వే పనులపై  సమీక్షించి జిల్లా కలెక్టర్లకు పలు  సూచనలు అందించారు.   ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన పేదవారికి ఆర్దిక భారం లేకుండా  వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు.   ఖరీఫ్ లో సాగు చేసిన ప్రతి ఎకరం ఈ క్రాప్ లో నమోదు అయ్యేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.  జిల్లాల్లో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై నిరంతరం జిల్లా కలెక్టర్లు సమీక్షిస్తూ, క్షేత్రస్థాయిలోని అధికారులకు అవసరమైన సూచనలు అందించాలన్నారు.  

  వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు కలక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్  హాఫిజ్, సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవిన్యూ) ఏ.ఎస్.దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి.ప్రశాంతి,  సంయుక్త కలెక్టర్ (హౌసింగ్) అనుపమ అంజలి, సంయుక్త కలెక్టర్ (ఆసరా,సంక్షేమం)కే. శ్రీధర్ రెడ్డి,   జిల్లా రెవిన్యూ అధికారి పి. కొండయ్య,  జిల్లా అధికారులు  పాల్గొన్నారు. 

Guntur

2021-06-16 13:56:24

చెత్తను వేగంగా తరలించాలి..

మహావిశాఖ నగర పరిధిలో సేకరించిన చెత్త తరలింపు వేగవంతం చేయాలని జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసి రావు శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఆయన ఐదవ జోన్ 45వ వార్డు పరిధిలోని సత్యసాయి కోలనీ, సాలి గ్రామ పురం, గణేష్ నగర్, నరసింహ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మీకులు గత రెండు రోజుల సమ్మె కారణంగా ప్రతి చోట చెత్త పెరుకుపోయిందని, దానిని యుద్ధ ప్రాతిపదికన తొలగించి, ప్రతీ ఇంటినుండి తడి-పొడి చెత్తను సేకరించి  వాహనం ద్వారా డంపింగు యార్డు కు తరలించాలని ఆదేశించారు. రోడ్లు, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలని వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులను ఆదేశించారు.  డంపర్ బిన్లు చుట్టూ చెత్తను తొలగించాలని, చెత్త తరలించే వాహనాలు అదనపు ట్రిప్పుల ద్వారా చెత్త తరలించి చెత్త నిల్వ లేకుండా చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను  ఆదేశించారు. డంపర్ బిన్లను శుభ్రం చేయాలని, పాడైన డంపర్ బిన్లు రిపేరు చేసి వాటి స్థానంలో అమర్చాలని సూచించారు.  ఈ కార్యక్రమలో శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది తదితరులను పాల్గొన్నారు.           

విశాఖ సిటీ

2021-06-16 13:53:47

ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు..

మహావిశాఖ నగర పరిధిలోని ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన హెచ్చరించారు. బుధవరం  4వ జోన్ లో ని పాండురంగాపురం, బీచ్ రోడ్, ఎంవిపి కోలనీ సెక్టర్-9, ఫిషర్ మెన్ కోలనీ తదితర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలోని ఎక్కడా ఫుట్ పాత్ లు ఆక్రమణలు జరగకూడదని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత రెండు రోజులు పారిశుధ్య కార్మీకులు సమ్మె కారణంగా నగరంలో చెత్త పేరుకుపోయినదని, అదనపు గంటలు పనిచేసి చెత్తను ఎత్తించాలని, ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్లు, కాలువలు, గెడ్డలలో పేరుకుపోయిన చెత్తను యుద్ధప్రాతిపదికన అదనపు ట్రిప్పుల ద్వారా చెత్తను డంపింగ్ యార్డు లకు తరలించాలన్నారు. భూగర్భ డ్రైనేజి నుండి మురుగు నీరు పొంగకుండా చూడాలని, కాలువలపై ఉన్న డ్రైనేజి పలకలను చెత్త తొలగించిన వెంటనే మూసివేయాలని  అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు లేకుండా చూడాలని, డంపర్ బిన్లు చుట్టూ బ్లీచింగు జల్లించి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను అదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ఎసిపి భాస్కర్ బాబు, ఇ.ఇ.(మెకానికల్) చిరంజీవి, ఇ.ఇ.(వర్క్స్) శ్రీనివాస్, ఇ.ఇ.(వాటర్ సప్ప్లై) పి. శ్రీనివాసరావు, ఎఎంఒహెచ్ రమణ మూర్తి, శానిటరి సూపర్వైజర్ జనార్ధన్, శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.             

ఎంవీపికాలనీ

2021-06-16 13:51:18

నెలాఖరుకి ఇళ్ల గ్రౌండింగ్ పూర్తికావాలి..

పేదలందరికి ఇళ్లు క్రింద మొదటి  విడత లో మంజూరు చేసిన గృహాలన్ని ఈ నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కులు,  ఏఎంసియు లు& బిఎంసియు లు, అంగన్వాడి కేంద్రాలు, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్కులు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆప్షన్ 3 ను ఎంచుకున్న లబ్ధిదారుల కోసం కాంట్రాక్టర్ లతో మాట్లాడి బృందాలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడి గృహ నిర్మాణాల్లో సమస్యలు ఉంటే పరిష్కరించుకుని ముందుకు వెళ్లాలన్నారు. కరోనా మూడవ దశపై ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయని, అయినప్పటికీ మూడో వేవ్ కోసం సన్నద్ధమవడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండనందున అధికార యంత్రాంగం పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.  కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్లక్ష్యం కూడదన్నారు.  

రైతుకు మేలు జరగాలంటే ఈ-క్రాప్ బుకింగ్  సమర్థవంతంగా జరగాలన్నారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా ఈ-క్రాప్ బుకింగ్ ను పర్యవేక్షణ చేసి పరిస్థితి మెరుగుదిద్దాలన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగంగా జరగాలన్నారు.  ప్రతి జిల్లాలో కనీసం 2 వేల కిలో మీటర్ల పరిధి లో అవెన్యూ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్  జరగాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున జగనన్న భూ హక్కు-భూ రక్ష  క్రింద సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.   స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాలు నుంచి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ, డీఆర్ఓ గాయత్రీ దేవి, సీపీవో ప్రేమ్ చంద్, హౌసింగ్ పీడీ వెంకటేశ్వర రెడ్డి, డ్వామా పీడీ వేణు గోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. 

Anantapur

2021-06-16 13:35:10

రెడ్ క్రాస్ సేవలను వినియోగించుకోవాలి..

కోవిడ్ బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కోవిడ్ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి అందించేందుకోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఏర్పాటు చేసిన 20 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్ కాపు భారతి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ కు సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి 10 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను, అమెరికాలోని థానా అసోసియేషన్ వారు 5 లీటర్ల కెపాసిటీ కలిగిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఏర్పాటు చేసిన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను తీసుకుని వెళ్లి వాడుకుని మళ్లీ వెనక్కి ఇవ్వాలన్నారు. కరోనా నుంచి  త్వరితగతిన బయటపడేందుకు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ అవకాశాన్ని కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్ పర్సన్ కాపు భారతి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కరోనా నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను, ఆక్సిజన్ సిలిండర్ లను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రతిరోజు కరోనా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్  నిబంధనలతో బ్లడ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. కరోనా నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి కోసం రెడ్ క్రాస్ - ఆక్సిజన్ బ్యాంక్ తరఫున ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని కోవిడ్ సోకినవారు ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎవరైనా ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ కావాలనుకుంటే రెడ్ క్రాస్ జిల్లా క్షేత్రాధికారి జి. రమేష్ నెంబర్ 8106733307 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మనోరంజన్ రెడ్డి, రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ ప్రసాద్, కోశాధికారి మల్లికార్జున, రెడ్ క్రాస్ స్టేట్ కోఆర్డినేటర్ మోహన్ కృష్ణ, రెడ్క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.

అనంతపురం

2021-06-16 13:31:56

మౌళిక సదుపాయాలు కల్పిస్తాం..

వై.ఎస్.ఆర్.జగనన్న  కాలనీలలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయలన్నింటిని కల్పిస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలిపారు.  బుధవారం ఆయన జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో  కలసి వి.ఎమ్.ఆర్.డి.ఎ. సమావేశ మందిరములో జిల్లాలో నవరత్నాలు –పేదలందరికి ఇళ్లు కార్యక్రమం అమలు పై  అధికారుతో  సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భముగా  మంత్రి  మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణంలో విశాఖ జిల్లాలో మొదటి విడత స్పెషల్ డ్రైవ్ లో 5వేల ఇళ్లు ప్రారంభించాలని లక్ష్యం నిర్ణయించగా 5019 ఇళ్లను ప్రారంభించినందుకు జిల్లా కలెక్టరును,   అధికారులను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని  నిరుపేదలందరికి రాష్ట్ర ముఖ్యమంత్రి  స్థలాలతో  పాటు  ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని  తెలిపారు.  అధికారులు, సిబ్బంది లబ్దిదారులకు  అందుబాటులో  ఉంటూ వారికి  గృహాల నిర్మాణంలో  పూర్తి సహకారం  అందించాలన్నారు.  జిల్లాలో  వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీలలో  ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా  ప్రతి కాలనీకి  దగ్గరలో  ఒక ఇసుక స్టాకు  పాయింట్  ఏర్పాటుకు  అధికారులను  ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని  ఒక యజ్ఞంగా భావించి సమస్యలను  పరిష్కరించాలని  అధికారులకు  సూచించారు.  జగనన్న ఇళ్ల  కోసం  పెద్ద ఎత్తున భూసేకరణ చేయడం జరిగిందన్నారు.  జగనన్న కాలనీలలో  లబ్దిదారుల సంతృప్తి ముఖ్యమని  వారితో  అధికారులు సమన్వయం  చేసుకోవాలని  సూచించారు.  తదుపరి  మంత్రి  నియోజక వర్గాల వారిగా ఈ కార్యక్రమ ప్రగతి, సమస్యలపై  ప్రజా ప్రతినిధులతో  చర్చించారు.  వారు  లేవనెత్తిన  పలు సమస్యలను  పరిష్కరించాలని  అధికారులకు  సూచించారు.  ఏజెన్సీలలో  గిరిజనులు మోసానికి  గురవుతున్నారని  పాడేరు ఎం.ఎల్.ఎ. కె.భాగ్యలక్ష్మి మంత్రి దృష్టికి  తీసుకు వచ్చారు.  దీనికి  మంత్రి స్పందిస్తూ ఈ విషయం పై  ఆర్.డి.ఓ. స్థాయిలో  కమిటీ  ఏర్పాటు  చేయాలన్నారు. 
పర్యాటక శాఖ మాత్యులు  ముత్తం శెట్టి శ్రీనివాసరావు  మాట్లాడుతూ  వై.ఎస్.ఆర్  పేదలందరికి  ఇళ్లు పథకం కింద  ఊళ్లే  నిర్మించ బడుతున్నా యన్నారు.  పేదవారికి సహాయం  చేయాలన్నది  ముఖ్యమంత్రి  ఆలోచన అన్నారు.  ఇళ్ల నిర్మణాలు  అత్యంత నాణ్యతతో  నిర్మించాలని  అధికారులకు  సూచించారు.  ఇళ్ల నిర్మాణానికి  నిర్దిష్టంగా  కాలపరిమితి  పెట్టుకొని  ఆ గడువులోగా  పూర్తి గావించాలన్నారు. 
అంతకు ముందు జిల్లా కలెక్టర్  వి.వినయ్ చంద్  మాట్లాడుతూ  వై.ఎస్.ఆర్.జగనన్న  కాలనీలలో గృహ నిర్మాణ పురోగతిని  మంత్రికి  వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పురోగతిని  ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని,  ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో  5వేల ఫ్లాట్ లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని, ప్రతి లబ్దిదారుని సంసిద్దం చేస్తున్నామని  తెలిపారు.  లే ఔట్ లలో  ఉన్న సమస్యలు  దశల  వారిగా  పరిష్కరిస్తామని తెలిపారు. 
ఈ సమావేశంలో ప్రభుత్వ  విప్ బూడి ముత్యాలనాయుడు, మేయర్ జి. వెంకట హరి కుమారి, అరకు ఎం.పి జి.మాధవి, హౌసింగ్ ఎం.డి భరత్ నారాయణ గుప్తా, జివియంసి కమిషనర్ డా.జి.సృజన, వి.ఎమ్.ఆర్.డి.ఎ. కమిషనర్ పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్లు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి శాసన సభ్యులు యు.వి.రమణమూర్తిరాజు, పెట్ల ఉమా శంకర గణేష్, జి.అమర్ నాథ్, కె.భాగ్యలక్ష్మి, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-16 13:27:51

ఉపాధ్యాయులకు సరుకులు వితరణ..

కోవిడ్ 19 కారణంగా జిల్లాలో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ స్కూల్ టీచర్ల కు  దాతలు నిత్యవసర సరుకులు అందించి ఆదుకోవడం అభినంద నీయమని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో 376 మంది ప్రైవేట్ టీచర్లకు దాతలు ద్వారా వచ్చిన, 8 రకాలైన నిత్యవసర సరుకుల కిట్ లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2020  మార్చి నెల నుంచి ప్రైవేట్ స్కూళ్ళు మూతపడటంతో టీచర్లు  తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్లను ఆదుకునేందుకు యు.ఎస్.ఎ కు చెందిన ఎన్.ఆర్.ఐ చలువాది కృష్ణ, మాధవిలు  ముందుకు వచ్చి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ద్వారా నిత్యవసర సరుకులను  సాయం చేయడాన్ని జిల్లా  కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రశంసించారు. ఒక్కో టీచరు కుటుంబానికి రూ.1400/ విలైవ కలిగిన 10 కేజిల బియ్యం, కందిపప్పు, చింతపండు, నూనె, మినపగుళ్ళు,గోదుమ పిండి, రవ్వ,పంచదార వంటి  నిత్యవసర సరుకులను కలెక్టర్ వివేక్ యాదవ్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్.ఎస్.ఎస్ గంగా భవానీ  మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు కరోనా కష్టాలు వెంటాడటంతో వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటి ద్వారా దాతలు ముందుకు వచ్చి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు  నిత్యవసర సరుకులు సాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ సొసైటి వైస్ ఛైర్మన్ రామచంద్ర రాజు మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీవన గమనం కోవిడ్ వలన అగమ్య గోచరంగా మారిందని అన్నారు. ఇటువంటి తరుణంలో దాతలు ముందుకు వచ్చి ప్రైవేటు టీచర్లను ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్ వడ్లమాని రవి, వైస్ ఛైర్మన్ రామచంద్రరాజు, సాహితి సమాఖ్య జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.   

Guntur

2021-06-16 13:23:14

26న ఆన్‌లైన్‌లో లోక్ అదాల‌త్‌..

విజయనగరం  ఈ నెల 26వ తేదీన వర్చువల్ విధానంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వ‌హించనున్న‌ట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ద ఛైర్మ‌న్‌  జి. గోపి తెలిపారు. ఈ మేర‌కు బుధ‌వారం బ్లూ జీన్ యాప్ సాయంతో వర్చువల్ విధానంలో న్యాయ‌వాదుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. పోలీసులు, ఎక్సైజ్‌, రెవెన్యూ, బ్యాంకుల‌ అధికారులు, న్యాయ‌వాదులు క్ష‌క్షిదారులు స‌హ‌క‌రించి ఈ లోక్ అదాలత్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని సూచించారు. సివిల్, క్రమినల్ కేసులు, బ్యాంకు కేసులు, మోటారు ప్రమాద భీమా కేసులు, ఎక్సైజ్ కేసులు, మనీ కేసులు, చెక్కబౌన్సు కేసులు, ప్రాంస‌రీ నోట్ కేసులు, విద్యుత్ మరియు టెలిఫోన్ కేసులను వర్చువల్ విధానంలో జ‌రిగే ఈ అదాలత్‌లో ఇరు పార్టీల సమ్మతితో రాజీ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. క‌క్షిదారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. లక్ష్మీరాజ్యం, విజ‌య‌గ‌న‌రం బార్ అసోషియేషన్ ప్రెసిడెంట్ పి. హరగోపాల్, సీనియర్ న్యాయ వాదులు, న్యాయవాదులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-16 13:17:53

ఎస్సీలకు రూ.5 లక్షల రుణం..

క‌రోనాతో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కుటుంబ పెద్ద మ‌ర‌ణిస్తే.. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల రుణ స‌దుపాయం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ బుధ‌వారం ఓ ప్ర‌ట‌న‌లో తెలిపారు. ఈ మేర‌కు జిల్లాలో బాధితుల‌ను గుర్తించి త‌దుపిర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో ఎవ‌రైనా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇంటి పెద్ద మ‌ర‌ణించి.. జీవ‌నాధారం కోల్పోయిన కుటుంబ స‌భ్యులను గుర్తించి నివేదిక‌ల‌ను అందించాల‌ని మున్సిపాలిటీల‌, మండ‌లాల‌ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వం నేష‌న‌ల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ (ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి.) ద్వారా అందించే ఈ రుణంలో రూ.1 ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని, మిగిలిన రూ.4 ల‌క్ష‌ల‌ను వాయిదాల్లో ల‌బ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు బాధిత కుటుంబ స‌భ్యులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు త‌గిన స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని క‌లెక్ట‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. 

అర్హ‌తలు.. ఇత‌ర ప్ర‌క్రియ‌ ఈ విధంగా ఉండాలి..

@ఎస్సీ కుటుంబాల‌కు ఆధార‌మైన భార్య‌, భ‌ర్త (18 నుంచి 60 ఏళ్ల వ‌య‌సు)  ఏ ఒక్క‌రు క‌రోనాతో చ‌నిపోయినా ఈ రుణ సాయానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
@ఏడాదికి రూ. 3 ల‌క్ష‌ల లోపు ఆదాయం మాత్ర‌మే ఉండాలి.
@ఈ నెల 20వ తేదీ లోపు బియ్యం కార్డు, ఆధార్ కార్డు, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను ద‌ర‌ఖాస్తుకు జ‌త‌చేసి  గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో అంద‌జేయాలి.
@ద‌ర‌ఖాస్తుల‌ను ఎంపీడీవో కార్యాల‌యాల‌కు పంపిస్తారు. అక్క‌డ ప‌రిశీల‌న పూర్త‌యిన త‌ర్వాత ఈ నెల 20 తేదీ సాయంత్రం లోపు ఎస్సీ కార్పోరేష‌న్ ఈడీ కార్యాల‌యానికి పంపుతారు.
@జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి రాష్ట్ర స్థాయి అధికారుల‌కు త‌నిఖీకి పంపుతారు.
@అనంత‌రం అర్హులైన ల‌బ్ధిదారుల‌కు రూ.5 ల‌క్ష‌ల రుణం మంజూరు చేస్తారు.

Vizianagaram

2021-06-16 13:15:41

కోవిడ్ 3వ దశకు కార్యాచరణ చేయాలి..

కోవిడ్  మూడవ దశ కోవిడ్ వ్యాప్తి చెందితే దానిని పకడ్బందీగా ఎదుర్కొనేందుకు కార్యాచణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వివిధ కార్య్రమాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ను ముఖ్యమంత్రి బుధ వారం నిర్వహించారు. కరోనా ఎవ్వరికీ ఆర్థిక ఇబ్బంది లేకుండా కర్ఫ్యూ జరిగిందన్నారు. వాక్సినేషన్ తోనే కోవిడ్ నివారణ సాధ్యమౌతుందని ఆయన పేర్కన్నారు. కొవిడ్ నిబధనలను పాటించాలని ఆయన సూచించారు. ఇంటింటి వెళ్లి పరిశీలన చేసి లక్షణాలు ఉన్నవారిని పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 80 శాతం మంది ఆరోగ్య శ్రీ లో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. ప్రజలను మోసం చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కేసులు తగ్గుముఖం పట్టాయని తీసుకోవలసినచర్యలపై అలక్ష్యం వహించారని  ఆయన సూచించారు. మూడవ దశను ఎదుర్కొనుటకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. మూడవ దశపై ఊహాగానాలు ఉన్నాయని అనుకోని పరిస్థితుల్లో సంభవిస్తే అందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు, పరికరాలు, మందులు లభ్యంగా ఉండాలని ఆయన అన్నారు. చిన్న పిల్లల వైద్యుల జాబితాలు సిద్దంగా ఉండాలని, స్టాఫ్ నర్స్ లకు అవసరమగు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. మూడవ దశను ఎదుర్కొనుటకు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రైతు సంతోషంగా వ్యవసాయం చేయాలని ముఖయమంత్రి అన్నారు. ప్రతి రైతు ఇ - పంటలో నమోదు కావాలని స్పష్టం చేశారు. ఇ - పంట కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ లు తనిఖీ చేయాలని ఆయన పేర్కొన్నారు.జిల్లాలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు తరచూ నిర్వహిస్తూ రైతులకు తగు సూచనలు ఇవ్వాలని ఆయన సూచించారు. బోర్ల కింద వరి పంట వేయకుండా రైతులకు తగు సూచనలు అందించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా లాభదాయక పంటలు వేయాలని ఆయన అన్నారు. విత్తనాల సరఫరాలో నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆర్.బి. కే ద్వారా రాయితీ విత్తనాలు అందించాలని ఆయన అన్నారు. ధరల విషయంలో బ్లాక్ మార్కెటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ కూడదని ఆయన పేర్కన్నారు.  ఆర్.బి. కెల్లో ఎరువుల కొరత అనే అంశం ఉత్పన్నం కారాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఉపాధి హామీ గూర్చి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగవంతం కావాలన్నారు. అన్ని భవనాలు ఒకే వ్యక్తికి అప్పగించే బదులు ఎక్కువ మందికి అప్పగించడం వలన ప్రయోజనం ఉంటుందని ఆయన పేర్కన్నారు. 90 రోజులలో ఇళ్ల పట్టాల కార్యక్రమంపై చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కోర్టు కేసులు ఉంటే త్వరగా పరిష్కారం కావడానికి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జగనన్న కాలనీలలో జియో టాగ్గింగ్, మ్యాపింగ్ తదితర అంశాలపై దృష్ట సారించాలని అన్నారు. నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ మాసాంతానికి మొదటి దశ ఇళ్ల నిర్మాణంలో అన్ని ప్రారంభం కావాల్సిందే నని ఆయన స్పష్టం చేశారు. బిల్లులను ప్రతి వారం చెల్లిస్తామని ముఖ్య మంత్రి అన్నారు. 22న చేయూత కార్యక్రమం క్రింద ఆర్థిక సహాయం అందించడం జరుగతుందని ఆయన చెప్పారు.

         ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాఠకర్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కే. శ్రీనివాసులు, హిమాంశు కౌశిక్, అర్. శ్రీరాములు నాయుడు, సి.పి.ఓ ఎం. మోహనరావు, వ్యవసాయ శాఖ జెడి కే. శ్రీధర్, డిడి రాబర్ట్ పాల్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి. వేణుగోపాల్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కుర్మారావు, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-16 13:10:54