1 ENS Live Breaking News

చందన సమర్పణలో భాగస్వాములు కండి..

శ్రీ వరాహ లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానం చేపట్టిన చందన సమర్పణకు దాతలు ఎవరైనా భాగస్వాములు కావచ్చనని సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు..
బుధవారం సింహాద్రి నాధుడు ని దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, చందన సమర్పణ లో భాగస్వాములు కావడం దాతలు,భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు,
అర కేజీ చందన సమర్పణకు 10,116 లు కేజీ చందన సమర్పణకు 20,116 స్వామి దేవస్థానం కు విరాళాలు సమర్పించి చందన ప్రసాదం స్వీకరించాల్సిందిగా శ్రీనుబాబు కోరారు,,ఇప్పటికే రెండు చందన సమర్పణ లు పూర్తి అయ్యాయని,వచ్చే జేష్ఠ పౌర్ణమి, తదుపరి వచ్చే ఆషాడ పౌర్ణమిలలో స్వామికి మూడేసి మణుగుల చొప్పున చందన సమర్పణ గావిస్తారన్నారు, కావున అరుదైన ఈ అవకాశాన్ని భక్తులు,దాతలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు,, దీంతో  పాటు గతంలో చేపట్టిన శా0డ్ బ్లాస్టింగ్ పనులు వల్ల ఆలయంలో వర్షం నీరు కారుతుందని కాబట్టి వాటికి మరమ్మతులు చేపట్టేందుకు దాతల సహకారం తీసుకోవాల్సిందిగా ఇప్పటికే తాను ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ ను కోరడం జరిగిందన్నారు,, ఐతే ఆయా పనులు  పూర్తిస్థాయిలోచేపట్టెందుకు ప్రాజెక్టు సవివర నివేదిక ను ఈఓ సిద్ధం చేయించారన్నారు..

Visakhapatnam

2021-06-16 07:06:04

మాన్సాస్ మరో మలుపు తిరుగుతుందా..

విజయనగర రాజ వంశంలో కీలకంగా వున్న మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇపుడు మాన్సాస్ ఏ మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.. ఇప్పటి వరకూ ఆ ట్రస్టుకి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆ ట్రస్టు సంచయిత గజపతిరాజు చేతిలోకి వచ్చింది. చాలా ఏళ్ల తరువాత ట్రస్టు చేతులు మారిందని, దాని రూపు రేఖలు మారుతాయనుకున్న తరుణంలో మళ్లీ హైకోర్టులో అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాధి వాదలను వినిపించడంతో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఉత్తరాంధ్రాలోని కీలకమైన అంశంలో ఒక కుదుపు కుదిపిన మాన్సాస్ వ్యవహారంలో ఒకే కుటుంబంలో కూతురు, చిన్నాన్నలు కోర్టుకెళ్లి నువ్వా నేనా అని తలపడిన సమయంలో హైకోర్టు చిన్నాన్న వైపే తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాన్సాస్ లో చాలా అవినీతి జరిగిందని, భూములు పక్కదారిపట్టాయని వాటి పరిరక్షిస్తామని చెప్పి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో ఇపుడు మళ్లీ ప్రతిపక్షాలకు ఈ అంశం ప్రధానం అయిపోయింది. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వాని వ్యతిరేకంగా వున్న మీడియా దీనినే ప్రధాన అంశంగా కూడా చూపిస్తున్న ప్రజలకు రక రకాల ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఈ తరుణంలో మాన్సాస్ మరో మలుపు తిరిగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందానే అనుమానాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి మాన్సాస్ ట్రస్టును టిడిపి నాయకులు మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేసమయంలో సింహాచలం ట్రస్టుబోర్టులో కూడా ఈ కుటుంబం నుంచే అనువంశికంగా ధర్మకర్తలు కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన సంచయిత గజపతిరాజుని ప్రభుత్వం ప్రమోట్ చేయడం..ప్రత్యేక జీఓల అధికారం చేతిలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది నెలల్లోనే ఆశల సౌధంపై హైకోర్టు తీర్పుఅనే పిడుగు పడటంతో మళ్లీ సింహాచలం ట్రస్టుబోర్టు, మాన్సాస్ వ్యవహారం మొదటికి వచ్చాయి. ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందోనని అంతా భావిస్తున్న తరుణంలో ప్రభుత్వంలో ఈ విషయంపై ప్రత్యేక అంశంగా మారింది. ఇపుడు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లి పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలోనే  ప్రభుత్వానికి  కోర్టు వ్యవహారాలు అచ్చిరాలేదని అంశం మాన్సాస్ ట్రస్టు మరోసారి రుజువుచేసిందని చెబుతుతన్నారు. ఈ రసవత్తర సమయంలో మాన్సాస్ విషయంలో సంచయిత గజపతిరాజుకి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా తిరిగి మళ్లీ మాన్సాస్ కి మహారాణి అవుతుందా..లేదంటే అక్కడ కూడా చుక్క ఎదురై చిన్నాన్న చేతికే మాన్సాస్ ను అప్పగిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు మాన్సాస్, సింహాచలం ట్రస్టుబోర్టు..చివరిగా సుప్రీంకోర్టు ఏం జరుగుతుందనేది వేచూడాలి..!

Simhachalam

2021-06-16 03:13:36

సింహాచలంలో ఆ నియామకాలేమవుతాయ్..

మన్సాస్ తో పాటు సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్టును హైకోర్టు రద్దు చేసిన తరువాత కొత్తగా మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ట్రస్టుబోర్డు ఏర్పాటు అయిన తరువాత ఆ హోదాతో ట్రస్టు చైర్మన్, అధికారులు కలిపి ఎక్కడా లేనివిధంగా దేవస్థానంలో కొన్ని నియామకాలు చేపట్టారు. దీనితో ఇపుడు అందరి మదినీ ఆ అనుమానం తొలిచేస్తుంది. కోర్టు ఉత్తర్వులు రద్దు అయినపుడు బోర్డు అనుమతితో చేపట్టిన నియామకాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాల్సి వుంటుందని చెబుతున్నారు.. కానీ అలా జరగలేదు..కేవలం ట్రస్టుబోర్డు మాత్రమే రద్దైంది..దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందనే ధీమాతో ట్రస్టు బోర్డు చేపట్టిన నియామకాల జోలికి మాత్రం ఎవరూ వెళ్లలేదు. కనీసం అర్హత లేకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారనే వాదన కూడా బలంగా వినిస్తుంది. ఇపుడు ఆ కోర్టు ఉత్తర్వులు ట్రస్టుబోర్డు రద్దుతోపాటు, వాటిపై కూడా జరుగుతాయనే అనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారులు మాత్రం ఆ నియామకాలన్నీ ప్రభుత్వం చేపట్టందని చెబుతున్నా..ట్రస్టుబోర్డు చైర్మన్ అనుమతి, బోర్డు తీర్మాణంతోనే వాటిని చేపట్టారని సమాచారం అందుతుంది. హైకోర్టు తీర్పుపై ట్రస్టుబోర్డు రద్దు అయిన నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీం కోర్టు వెళ్లి కేసు గెలిచేవరకూ ట్రస్టుబోర్డు అనుమతితో చేపట్టిన నియాకాలన్నీ గాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేలా వుంది. అయితే ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ, కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ట్రస్టు చేపట్టిన నియామకాలన్నింటినీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకూ అలా హోల్డ్ లో పెడతాయా..లేదంటే కొనసాగిస్తాయా అనేది తేలాల్సి వుంది.. 

Simhachalam

2021-06-16 02:46:15

నదుల అనుసంధానం వేగవంతం చేయాలి..

శ్రీకాకుళం  జిల్లాలోని వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు.  శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలో ఉన్న వేలాది ఎకరాలకు అవసరమైన సాగునీరు అందించే అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాలని ఆకాంక్షించారు.   మంగళవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, వంశధార ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ డోల తిరుమలరావులు భేటీ అయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీటి ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఇందుకుగాను ఈనెల 19న శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో సాగునీటి ప్రాజెక్టుల సలహాసంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సలహాసంఘ ప్రతినిధులైన డుమా పీడి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, శాసనసభ్యులు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. జూలై నెలలో వంశధార కాలువల ద్వారా సాగునీటి విడుదలకు ఈ సమావేశంలో తేదీని ఖరారు చేస్తారు. ప్రస్తుతం సాగునీటి కాలువల్లో గుర్రపుడెక్క బాగా పెరిగిపోయినందున అది నీటి పారుదలకు ప్రధాన అవరోధం కాగలదని వంశధార ఎస్ఇ డోల తిరుమలరావు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ ఉపాధిహామీ ద్వారా గుర్రపుడెక్కని తొలిగించే పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కు సూచించారు.

శిధిలావస్థకు చేరిన షట్టర్లను మరమ్మత్తులు చేయడం, కొత్తవి మార్చడం వంటి పనులకు గతంలో బయటపడిన షట్టర్ల కుంభకోణం ప్రతిబంధకంగా మారిందని, ఈ స్కామ్ పై దర్యాప్తు జరిగినా, చర్యలు  పెండింగ్ లో ఉండడం వల్ల వీటికి సంబంధించి ఏ పనీ జరగడం లేదని డోల తిరుమలరావు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉన్నతస్థాయిలో అధికారులతో మాట్లాడి తగిన క్లియరెన్స్ తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ ఏడాదిలోగా వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో 88, 87 ప్యాకేజీల పనులు, హిరమండలం రిజర్వాయర్ పని చివరిదశకు వచ్చేశాయని ఎస్ఐ తెలిపారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నారాయణపురం ఆనకట్టకు వంశధార జలాలను తీసుకువెళ్లడం.. అక్కడి నుంచి వాటిని నాగావళితో అనుసంధానం చేయడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చర్చించారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు, వంశధార ఎడమ ప్రధానకాలువలను పటిష్టపర్చడానికి తగిన నిధులు మంజూరుకై పంచాయతీరాజ్ కమిషనర్ కె గిరిజాశంకరు లేఖరాయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కి డిప్యూటీ సీఎం ధర్మాన సూచించారు. కాలువలను మరమ్మతు చేయడం, కాలువల పనులు వెంటనే పూర్తి చేయడానికి దీనివల్ల తగిన అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం జరిగే సాగునీటి సలహా సంఘ సమావేశంలో వీటితో పాటు సాగునీటికి సంబంధించిన పలు అంశాలను చర్చించి తగిన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

Srikakulam

2021-06-15 16:14:48

అనంత చీకట్లోనే మగ్గిపోవాలా..

అనంతపురం నగరంలో వీధి దీపాలు నిర్వహణ కూడా సరిగా లేకుంటే ఎలా అంటూ మేయర్ వసీం అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని  ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ లలో వీధి దీపాలు నిర్వహణను మంగళవారం రాత్రి మేయర్  ఆకస్మికంగా పరిశీలించారు. పలు చోట్ల వీధి దీపాలు వెలగక పోవడంతో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన వీధులలోనే లైట్లు వెలగక పోయినా పట్టించుకోని మీరు ఇక చిన్న విధులలో ఎంత మాత్రం పర్యవేక్షణ చేస్తున్నారో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. రాజు రోడ్ లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన లైట్లు కూడా వెలగక పోయినా నిర్వహణ ఎంతమాత్రం చేస్తున్నారో మీ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై లైట్ల నిర్వహణపై రిజిస్టర్ తప్పని సరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు బాలాంజినేయులు,కమల్ భూషణ్,అనీల్ కుమార్ రెడ్డి, డి ఈ  బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

అనంత సిటీ

2021-06-15 15:09:51

పైడితల్లమ్మ తల్లీ కరుణించమ్మా..

శ్రీశ్రీశ్రీ  వరాహలక్ష్మీనృసింహస్వామి వారి సోదరి, ఏడు గ్రామాల ప్రజల ఆరాధ్యదేవత శ్రీ పైడితల్లమ్మ వారి వార్షిక పండగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సదకంపట్టు వద్ద పూజార్ల వంశీయులు  లండ వెంకటరమణ, చిన్న వెంకట రమణలు అమ్మవారికి సంప్రదాయ పూజలు చేసి మంగళ హారతులిచ్చారు. కరోనా నేపథ్యంలో  దేవస్థానం పిలుపు మేరకు భక్తులంతా ఇళ్ల వద్దనే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవికలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు దేవాలయానికి వచ్చారు. తలుపులు వేసి ఉండడంతో అమ్మవారిని బయటనుంచి కూడా దర్శించుకునే భాగ్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవస్థానం అధికారులతో చర్చించడంతో లోపల తలుపులు తెరిచి ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. దీంతో భక్తులంతా ఆరుబయట నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. గేట్ల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఏ ఈవోలు తిరుమలేశ్వరరావు, ఆనందకుమార్ , ఇజ్జురోతు శ్రీనివాసరావు, సూపరెంటెండెంట్  పర్యవేక్షణలో ఉద్యోగులు దేవాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయం వద్ద దేవస్థానం ఆంక్షల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గాంధీనగర్ వద్ద ఉన్న అమ్మవారి సదకంపట్టు వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.   స్థానిక కార్పొరేటర్ పిసిని వరహానరసింహం, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వనితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్  జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, వైసీపీ నాయకులు కొలుసు ఈశ్వరరావు, కర్రి సత్తి బాబు, గంట్ల కిరణ్ బాబు, దొంతల సంతోష్ . ఆకుల నాగరాజు. కొలుసు శ్రీను. బంటు బిల్లి త్రినాధ్.. తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Simhachalam

2021-06-15 15:05:16

గంగమ్మ తల్లికి వాసుపల్లి పూజలు..

గంగపుత్రులు కడుపునింపేలా మత్స్యసంపద దొరికేలా దీవించాలంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేశారు. చేపల వేట విరామం అనంతరం గంగమ్మతల్లికి పూజలు చేసిన తరువాత మత్స్యకారులు మళ్లీ చేపల వేటను ప్రారంభింస్తారు. ఈ సందర్భంగా మంగళవారం ఫిషింగ్ హార్బర్ లోని గంగమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన పండుగ కార్యక్రమంలో పాల్గొని తల్లికి పూజలు చేశారు. అనంతరం జాలర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, మత్స్యసంపదలో అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ కేసులు ఉద్రుతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, నిబంధనలు కూడా పాటించాలని మత్స్యకారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటు 37వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, ఫిషింగ్ బోట్ అసోసియేషన్ సభ్యులు పి.సి అప్పారావు, నర్సింగ్, బుజ్జి, కొండబాబు, ఎల్లాజి, అమ్మోరు, రామరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-15 14:56:33

ఆక్సిజన్ సిలెండర్ల వితరణ హర్షదాయకం..

కరోనా కష్టకాలంలో 40 ఆక్సిజన్ సిలిండర్ లను అందజేయడం ఎంత గొప్ప విషయమని, నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నేపథ్యంలో ఆలూరు ఫౌండేషన్ తరఫున హైదరాబాద్ నుంచి తెప్పించిన ఒక్కోటి 45 వేల రూపాయల విలువ చేసే 40 ఆక్సిజన్ సిలిండర్ లను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని, కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందించేందుకు సిలిండర్లను ఉపయోగించాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడం పట్ల ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు.

Anantapur

2021-06-15 14:44:09

ఘనంగా మిధున సంక్రమణం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ  వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం మిధున సంక్రమణం వైభవం నిర్వహించారు. మహా పర్వదినం, వడాయితీ సంప్రోక్షణ, స్థలశుద్ధి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు ఆస్థాన మండపంలోని గోవిందరాజస్వామి ,శ్రీదేవి, భూదేవి ఆళ్వారులకు ఆరాదణ కార్యక్రమం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహించి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మిధున సంక్రమణం రోజున తిరువీధిలో స్వామిని దర్శించుకుంటే సకల పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మిక..

Simhachalam

2021-06-15 14:43:16

ఘనంగా పైడితల్లి అమ్మవారి పండుగ..

విశాఖలోని సింహాచలం దేవస్థానం ఉపాలయమైన గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మంగళవారం ఘనంగా జరిగింది.  ఉదయాన్నే శ్రీఅమ్మవారి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన సమర్పించారు. అనంతరం భక్తుల సందర్శనార్ధం ఆలయం తలుపులు తీసి భక్తులకు దర్శనాలు కల్పించారు. కరోనా నేపథ్యంలో ముందుగానే దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు. సాయంత్రం మరోసారి అమ్మవారి దీపారాదన చేపట్టి నివేదన చేశారు.

Simhachalam

2021-06-15 14:33:03

సర్వారాయ సాయం మరువలేనిది..

కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు అవసరమైన రూ.18 లక్షల విలువైన 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన తమ సేవను చాటుకుందని జెసీ కీర్తి చేకూరి అన్నారు. ఈ మేరకు సంస్థ సిఎం కె.శ్రీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావులతో కలిసి ఆక్సిజన్ మిషన్లను జెసికి అందజేశారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ, కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం ఎంతో వుంటుందని, అలాంటి అత్యవసర మిషన్లు అందించిన సంస్థ సభ్యులను ఈ సందర్భంగా జెసి అభినందించారు. ఇదే స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వచ్చి కరోనా రోగులకు అందించే సేవకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్, సర్వారాయ సుగర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-15 14:15:43

పంటల భీమా రైతుకి ఉపయోగపడాలి..

పంట‌ల విష‌యంలో.. భీమా విష‌యంలో రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే విధానాల‌ను రూపొందించాల‌ని, దాదాపు అన్ని పంట‌ల‌కూ వైఎస్సార్ భీమా వ‌ర్తించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో వైఎస్సార్ ఉచిత పంట‌ల భీమా ప‌థ‌కం జిల్లా స్థాయి మానిట‌రింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ముందుగా గ‌త ఏడాది ఖ‌రీఫ్, ర‌బీ సీజన్‌లో అమ‌లు చేసిన విధానాల‌పై చ‌ర్చించారు. ఈ ఏడాది ఖ‌రీఫ్‌లో అమ‌లు చేయాల్సిన విధానాల‌పై స‌మీక్షించారు. ఏయే పంట‌ల‌కు భీమా వ‌ర్తింప జేయాలి, ఏయే పంట‌ల‌ను భీమా పరిధి నుంచి త‌ప్పించాల‌నే అంశాలపై క‌మిటీ స‌భ్యులు, అధికారులు చ‌ర్చించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌లో అమ‌లు చేయ‌బోయే విధానాలు అంతిమంగా రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ఉండాల‌ని పేర్కొన్నారు. జిల్లాలో అధికంగా వ‌రి పంట‌ను వేస్తున్న‌ప్ప‌టికీ దాదాపు అన్ని పంట‌ల‌కూ భీమా వ‌ర్తించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. ఈ-క్రాప్ సైట్‌లో స‌జ్జ‌ల పంట‌ను జోడించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. విప‌త్తుల స‌మ‌యంలో రైతుల‌ను భీమా ప‌థ‌కం ఆదుకుంటుంద‌ని, కావున రైతుల ఎన్రోల్‌మెంట్ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. మండ‌ల‌, గ్రామ స్థాయి యూనిట్‌గా పంట‌ల‌ను న‌మోదు చేయాల‌ని చెప్పారు. భీమా ప‌థ‌కంలో చిన్న‌, స‌న్న‌కారు రైతులకు ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. పంట న‌ష్టం అంచ‌నా విష‌యంలో సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబించాల‌ని పేర్కొన్నారు. పంట‌ల ర‌కాలను బ‌ట్టి భీమా వ‌ర్తింపు విధానాల‌ను అనుస‌రించాల‌న్నారు. ఆహార‌, వాణిజ్య పంట‌ల‌కు సంబంధించి భీమా వ‌ర్తింపుపై నూత‌న విధానాల‌ను ప్ర‌భుత్వానికి నివేదించాల‌ని సూచించారు.

స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఆశాదేవి, సీపీవో విజ‌య‌ల‌క్ష్మి, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ వాకాడ నాగేశ్వ‌ర‌రావు, ఎల్‌.డి.ఎం. శ్రీ‌నివాస్‌, కేవీకే శాస్త్ర‌వేత్త డా. కె. తేజేశ్వ‌ర‌రావు, హార్టిక‌ల్చ‌ర్ డీడీ శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-15 14:06:22

జగనన్న కాలనీలు వేగవంతం చేయాలి..

అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ జేసీ నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జగనన్న ఇళ్ల నిర్మాణాలపై స్థానిక హౌసింగ్ కార్యాలయంలో హౌసింగ్ జేసీ నిశాంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు అంటే కేవలం ఇళ్లు కట్టి ఇవ్వడం కాదని, ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కలిగిన కాలనీలు అందించడమన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం పలు శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉన్నందున కేవలం ఇళ్ల నిర్మాణాలకోసమే ప్రత్యేకంగా జాయింట్ కలెక్టరును నియమించడం జరిగిందన్నారు. సమావేశంలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని మైనింగ్ ఏడీ కృష్ణమూర్తిని అదేశించారు. నాడు-నేడు పనులు దాదాపు పూర్తయిందున ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పేదల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాలని పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాగ్యరాజ్ ను ఆదేశించారు. ప్రతి లేఅవుట్ వద్ద నీటి వసతి కోసం బోర్లు తవ్వాలని, బోరు బావులు తవ్వినప్పటికి నీరు లభించని ప్రదేశాల్లో ప్రత్యామ్నాయాలు చూడాలన్నారు. విద్యుత్ సప్లై పనులను పూర్తి చేసి నిర్మాణ పనులకు ఇబ్బంది రాకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఇళ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తి చేసేందుకు సహకరించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, మైనింగ్ ఏడీ కృష్ణమూర్తి, మునిసిపల్ ఆర్డీ నాగరాజు, జెడ్పీ సీఈవో శ్రీనివాసులు, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీశ్ చంద్ర, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-15 13:52:18

ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోండి..

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలిని  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న దీక్షకు ఆమె సంపూర్ణ మద్దతు తెలిపారు.  మంగళవారం  ఉక్కు కర్మాగారం ప్రధాన గేటు వద్ద రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని,  ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జివిఎంసి కౌన్సిల్ ఏర్పడిన వెంటనే ఏప్రిల్ 9వ తేదీన జరిగిన తొలి సమావేశంలోనే మొదటి అజెండాగా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం చేసిందని దేశ చరిత్రలోనే ఇది అపురూపమైన ఘట్టమని తెలిపారు. మే, 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని  తెలిపారు. అరవై నాలుగు గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని ఉక్కు కర్మాగారానికి త్యాగం చేశారని, 32 మంది  కర్మాగారం కోసం ప్రాణత్యాగం చేశారని మేయర్ తెలిపారు. సుమారు లక్ష మంది పైబడి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఈ కర్మాగారం పై ఆధారపడి బతుకుతున్నారని, 20వేల కోట్ల పెట్టుబడితో ఇటీవల ప్లాంట్  విస్తరణ జరిగిందని కరోనా నేపథ్యంలో ప్రాణవాయువు అయిన ఆక్సిజన్    ను  సరఫరా చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిందని, దేశంలో ఏ కార్పొరేట్ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం వలె ఆక్సిజన్    ను సరఫరా చేయలేదని ఇటీవల కరోనా పేషెంట్లు కొరకు 300 పడకల ఆక్సిజన్ బెడ్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు. విశాఖ ఉక్కు  కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని, 98 మంది కార్పొరేటర్లు మీవెంటే ఉన్నారని తెలిపారు. నిర్వాసితులు అందరికీ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జివిఎంసి కార్పొరేటర్లు గంగారావు, లేళ్ళ కోటేశ్వరరావు, మహమ్మద్ ఇమ్రాన్, శ్రీనివాస్, తిప్పల దేవాన్, చిన్న తల్లి, సూర్యకుమారి, మాజీ శాసన సభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య, ఉక్కు కర్మాగార యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్,  డి. ఆదినారాయణ,   జె. అయోధ్యా రామ్, మస్తానఫా , తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2021-06-15 13:45:58

పాదయాత్ర హామీ ప్రతీ ఏడాది అమలు..

వాహన మిత్ర ద్వారా ఎందరో మోటారు డ్రైవర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డితో వీడియో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లతో ఉప రవాణా కమీషనర్ మీరా ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని  కలెక్టరేట్ జెండా ఊపి ప్రారంబించారు.  ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారికి ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహనాలు స్వంతంగా నడుపుకుంటున్న డ్రైవర్లుకు రూ.10,000 ఆర్ధిక సహాయం అందించారన్నారు. జిల్లాలో అర్హత ఉన్న 22,527 మందికి వరుసుగా మూడో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10,000 ఆర్ధిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేశారన్నారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారు సైతం సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకోనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం కల్పించారన్నారు. వాహన మిత్ర పథకం అందించిన ఆర్ధిక సహాయంతో వాహనాల ఇన్స్రెన్సు, రిపేర్లుతో పాటు ఫిట్నెస్ చేసుకునేందుకు వీలు పడుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం  తాగి వాహనాలు నడపరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సూచించారని, దీని వలన రహదారి ప్రమాదాలు సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయన్నారు. ఆటోలలో మహిళలు సురక్షితంగా ప్రయాణించటానికి అభయం యాప్ను అందుబాటులో తీసుకురావటం జరిగిందన్నారు. అభయం యాప్ ద్వారా ఆటోలలో ఒక పరికరాన్ని ఏర్పాటు చేస్తారని, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు ఇబ్బందులకు గురి అయితే గట్టిగా అరిచిన వెంటనే యాప్ యాక్టివ్ అయ్యి ఆటో ఆగిపోవటంతో పాటు, సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందుతుందన్నారు. అభయం యాప్ పైలట్ ప్రాజెక్టు క్రింద విశాఖపట్టణంలో ప్రారంభించటం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆటోలకు అభయం యాప్ పరికరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కరోనా కష్టకాలంలోను అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి  గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
    కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, లక్ష్మణరావు, కల్పలత,  నగరపాలక సంస్థ మేయరు కావటి మనోహర్ నాయుడు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి  పి కొండయ్య, జిల్లా ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-15 13:42:11