1 ENS Live Breaking News

పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి..

పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు కోరారు. ఖాజీపేట, కిల్లిపాలేం పంచాయతీలకు మంజూరు అయిన నూతన చెత్త సేకరణ వాహనాలను బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ చెత్తను చెత్త సేకరణ వాహనాల్లో వేయాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేస్తూ చెత్త బుట్టలను వాడాలని సూచించారు. వానా కాలంలో మురికి, నిల్వ నీటి ద్వారా అనేక రోగాలు వచ్చే ఆస్కారం ఉందని, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్., ఎండివో ప్రకాష్ రావు, పంచాయతీ సెక్రటరీలు.,సురంగి మోహన్ రావు, స్థానిక నాయకులు తెలుగు సూర్య నారాయణ,కరమ్ చంద్, గైనేటి చిన్ని, గంగు సీతాపతి, తంగి శ్రీపతి, ధర్మాన అనిల్, తంగి చంద్రశేఖర్, గోలివి రమణ, లక్ష్మణ్ అప్పు యాదవ, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-16 13:00:21

కోవిడ్ బాధితునికి ఆర్ధిక సహాయం..

శ్రీకాకుళం జిల్లా పోలాకి  మండలం దండులక్ష్మీపురం గ్రామానికి చెందిన మొయ్యి జగదీష్ నాయుడు కోవిడ్ తో ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులు పెద్ద దిక్కును కోల్పోయి అనాధలుగా మిగిలారు. భార్య కుసుమకుమారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో  వారి పిల్లలు చదువుల నిమిత్తం కుమారుడు రుద్రతేజ(బీటెక్), కుమార్తె చాంధిని (ట్రిపుల్ ఐటీ) ల విద్య కొనసాగించేందుకు రాష్ట్ర తూర్పు కాపు సంఘం తరపున రూ.25 వేలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతులు మీదుగా రాష్ట్ర తూర్పుకాపు బీసీ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ లు అందజేశారు. మబగాం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ  జిల్లా అధ్యక్షులు సురంగి మోహనరావు, కరిమి రాజేశ్వరరావు, కరణం శ్రీనివాసరావు, తూర్పుకాపు డైరెక్టర్ లుకలావు రంజిత్ కుమార్, కద్ధాల శ్యామసుందరరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-16 12:59:23

యస్.బి.ఐ కరోనా కవచ్ రుణాలు..

 దేశంలోనే ప్రప్రధమంగా కరోనా బారిన పడిన స్టేట్ బ్యాంక్  వినియోగదారులకు కరోనా కవచ్ పేరిట వ్యక్తిగత రుణాలను మంజూరుచేస్తున్నట్లు విశాఖపట్నం యస్.బి.ఐ మాడ్యుల్ డెప్యూటీ జనరల్ మేనేజర్ రంగరాజన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన జారీచేసారు. 2021 ఏప్రిల్ 1 తరువాత కరోనా బారిన పడిన స్టేట్ బ్యాంక్ వినియోగదారులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా కరోనా కవచ్ వ్యక్తిగత రుణాలను పొందవచ్చని చెప్పారు. ఈ రుణాన్ని అన్ని స్టేట్ బ్యాంకు బ్రాంచులలో పొందవచ్చని స్పష్టం చేసారు. కావున కరోనా బారిన పడిన వినియోగదారులు, కుటుంబసభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. 

Srikakulam

2021-06-16 12:58:15

నెలాఖరుకి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం..

పేద లందరికి ఇళ్లు క్రింద మొదటి  విడత లో మంజూరు చేసిన గృహాలన్ని ఈ నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.   అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. కోవిడ్-19, ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు,  ఏఎంసియుఎస్ & బిఎంసియుఎస్, అంగన్వాడి సెంటర్స్, వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పురోగతి, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత తదితర అంశాలపై   ముఖ్యమంత్రి సమీక్షించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆప్షన్ 3 ను ఎంచుకున్న లబ్ధిదారుల కోసం కాంట్రాక్టర్ లతో మాట్లాడి బృందాలుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడి గృహ నిర్మాణాల్లో సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలన్నారు. 3వ దశ కోవిడ్ వస్తుందో రాదో ఖచ్చితంగా చెప్పలేము కానీ, అందుకోసం పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉండాలని సూచించారు.  ప్రస్తుతం కేసు లు తగ్గుతున్నాయి కదా అని నిర్లక్ష్యం పనికిరాదని, కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూనే ఉండాలని స్పష్టం చేశారు. రైతుకు మేలు జరగాలంటే ఈ- క్రాప్ బుకింగ్  సమర్ధవంతంగా జరగాలన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగంగా జరగాలన్నారు.  ప్రతి జిల్లాలో కనీసం 2 వేల  కిలో మీటర్ల పరిధి లో అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్  జరగాలన్నారు. జగనన్న భూ హక్కు-భూ రక్ష  క్రింద సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. 
 కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా  కలెక్టర్ ఎం. హరి జవహర్ లాల్,  జాయింట్ కలెక్టర్లు   డాక్టర్  జి.సి కిషోర్ కుమార్,  డా.మహేష్ కుమార్,  మయూర్ అశోక్,   జె.వెంకట రావు జిల్లా  రెవిన్యూ అధికారి గణపతి రావు, జిల్లా  అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-16 12:37:47

గిరిజనులకు ప‌ట్టాల‌తోపాటు సాగుకు సాయం..

అట‌వీభూములను సాగుచేసుకుంటున్న గిరిజ‌నుల‌కు ప‌ట్టాల‌తోపాటు, వారు పంట‌లు సాగు చేసేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా సాయం అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. క‌లెక్ట‌ర్ ఛాంబ‌ర్‌లో బుధ‌వారం జ‌రిగిన జిల్లా స్థాయి క‌మిటీ స‌మావేశంలో 1,016 మంది గిరిజ‌నుల‌కు సుమారు 1,928.87 ఎక‌రాల భూమికి సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీకి ఆమోదం తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, గిరిజనుల‌కు కేవ‌లం ప‌ట్టాల‌ను పంపిణీ చేసి వ‌దిలేయ‌కుండా, వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా ఉద్యాన‌, వ్య‌వ‌సాయ పంట‌ల సాగుకు సాయం అందించాల‌ని సూచించారు. పార్వ‌తీపురం ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్ మాట్లాడుతూ, ఈ విడ‌త‌లో కొమరాడ మండ‌లంలో 120 మంది గిరిజనుల‌కు 317.68 ఎక‌రాలు, కురుపాంలో 485 మందికి 965.16 ఎక‌రాలు, పార్వ‌తీపురంలో 171 మందికి 200.2 ఎక‌రాలు, పాచిపెంట‌లో 72 మందికి 69.85 ఎక‌రాలు, జిఎల్‌పురంలో 168 మందికి 375.98 ఎక‌రాల అట‌వీభూముల‌కు సంబంధించి సాగుహ‌క్కు క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. వీరికి త్వ‌ర‌లో ప‌ట్టాల‌ను అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలో సుమారు 80వేల ఎక‌రాల‌కు ఆర్ఓఎఫ్ఆర్ ప‌ట్టాల‌ను జారీ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో జిల్లా అట‌వీశాఖాధికారి స‌చిన్ గుప్త‌, పార్వ‌తీపురం ఆర్‌డిఓ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, ఇత‌ర అట‌వీశాఖాధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-16 12:35:42

చందన సమర్పణలో భాగస్వాములు కండి..

శ్రీ వరాహ లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానం చేపట్టిన చందన సమర్పణకు దాతలు ఎవరైనా భాగస్వాములు కావచ్చనని సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి,వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు..
బుధవారం సింహాద్రి నాధుడు ని దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, చందన సమర్పణ లో భాగస్వాములు కావడం దాతలు,భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నారు,
అర కేజీ చందన సమర్పణకు 10,116 లు కేజీ చందన సమర్పణకు 20,116 స్వామి దేవస్థానం కు విరాళాలు సమర్పించి చందన ప్రసాదం స్వీకరించాల్సిందిగా శ్రీనుబాబు కోరారు,,ఇప్పటికే రెండు చందన సమర్పణ లు పూర్తి అయ్యాయని,వచ్చే జేష్ఠ పౌర్ణమి, తదుపరి వచ్చే ఆషాడ పౌర్ణమిలలో స్వామికి మూడేసి మణుగుల చొప్పున చందన సమర్పణ గావిస్తారన్నారు, కావున అరుదైన ఈ అవకాశాన్ని భక్తులు,దాతలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు,, దీంతో  పాటు గతంలో చేపట్టిన శా0డ్ బ్లాస్టింగ్ పనులు వల్ల ఆలయంలో వర్షం నీరు కారుతుందని కాబట్టి వాటికి మరమ్మతులు చేపట్టేందుకు దాతల సహకారం తీసుకోవాల్సిందిగా ఇప్పటికే తాను ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ ను కోరడం జరిగిందన్నారు,, ఐతే ఆయా పనులు  పూర్తిస్థాయిలోచేపట్టెందుకు ప్రాజెక్టు సవివర నివేదిక ను ఈఓ సిద్ధం చేయించారన్నారు..

Visakhapatnam

2021-06-16 07:06:04

మాన్సాస్ మరో మలుపు తిరుగుతుందా..

విజయనగర రాజ వంశంలో కీలకంగా వున్న మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇపుడు మాన్సాస్ ఏ మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది.. ఇప్పటి వరకూ ఆ ట్రస్టుకి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆ ట్రస్టు సంచయిత గజపతిరాజు చేతిలోకి వచ్చింది. చాలా ఏళ్ల తరువాత ట్రస్టు చేతులు మారిందని, దాని రూపు రేఖలు మారుతాయనుకున్న తరుణంలో మళ్లీ హైకోర్టులో అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాధి వాదలను వినిపించడంతో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఉత్తరాంధ్రాలోని కీలకమైన అంశంలో ఒక కుదుపు కుదిపిన మాన్సాస్ వ్యవహారంలో ఒకే కుటుంబంలో కూతురు, చిన్నాన్నలు కోర్టుకెళ్లి నువ్వా నేనా అని తలపడిన సమయంలో హైకోర్టు చిన్నాన్న వైపే తీర్పు వెలువడింది. ఈ తీర్పును సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాన్సాస్ లో చాలా అవినీతి జరిగిందని, భూములు పక్కదారిపట్టాయని వాటి పరిరక్షిస్తామని చెప్పి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడంతో ఇపుడు మళ్లీ ప్రతిపక్షాలకు ఈ అంశం ప్రధానం అయిపోయింది. అంతేకాదు ఈ విషయంలో ప్రభుత్వాని వ్యతిరేకంగా వున్న మీడియా దీనినే ప్రధాన అంశంగా కూడా చూపిస్తున్న ప్రజలకు రక రకాల ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఈ తరుణంలో మాన్సాస్ మరో మలుపు తిరిగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందానే అనుమానాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చాలా ఏళ్ల నుంచి మాన్సాస్ ట్రస్టును టిడిపి నాయకులు మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహిస్తూ వస్తున్నారు. అదేసమయంలో సింహాచలం ట్రస్టుబోర్టులో కూడా ఈ కుటుంబం నుంచే అనువంశికంగా ధర్మకర్తలు కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన సంచయిత గజపతిరాజుని ప్రభుత్వం ప్రమోట్ చేయడం..ప్రత్యేక జీఓల అధికారం చేతిలో పెట్టినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది నెలల్లోనే ఆశల సౌధంపై హైకోర్టు తీర్పుఅనే పిడుగు పడటంతో మళ్లీ సింహాచలం ట్రస్టుబోర్టు, మాన్సాస్ వ్యవహారం మొదటికి వచ్చాయి. ఈ విషయం ఏ మలుపు తిరుగుతుందోనని అంతా భావిస్తున్న తరుణంలో ప్రభుత్వంలో ఈ విషయంపై ప్రత్యేక అంశంగా మారింది. ఇపుడు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లి పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలోనే  ప్రభుత్వానికి  కోర్టు వ్యవహారాలు అచ్చిరాలేదని అంశం మాన్సాస్ ట్రస్టు మరోసారి రుజువుచేసిందని చెబుతుతన్నారు. ఈ రసవత్తర సమయంలో మాన్సాస్ విషయంలో సంచయిత గజపతిరాజుకి సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుందా తిరిగి మళ్లీ మాన్సాస్ కి మహారాణి అవుతుందా..లేదంటే అక్కడ కూడా చుక్క ఎదురై చిన్నాన్న చేతికే మాన్సాస్ ను అప్పగిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు మాన్సాస్, సింహాచలం ట్రస్టుబోర్టు..చివరిగా సుప్రీంకోర్టు ఏం జరుగుతుందనేది వేచూడాలి..!

Simhachalam

2021-06-16 03:13:36

సింహాచలంలో ఆ నియామకాలేమవుతాయ్..

మన్సాస్ తో పాటు సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్టును హైకోర్టు రద్దు చేసిన తరువాత కొత్తగా మరో కొత్త చిక్కు వచ్చిపడింది. ట్రస్టుబోర్డు ఏర్పాటు అయిన తరువాత ఆ హోదాతో ట్రస్టు చైర్మన్, అధికారులు కలిపి ఎక్కడా లేనివిధంగా దేవస్థానంలో కొన్ని నియామకాలు చేపట్టారు. దీనితో ఇపుడు అందరి మదినీ ఆ అనుమానం తొలిచేస్తుంది. కోర్టు ఉత్తర్వులు రద్దు అయినపుడు బోర్డు అనుమతితో చేపట్టిన నియామకాలను కూడా ప్రభుత్వం రద్దు చేయాల్సి వుంటుందని చెబుతున్నారు.. కానీ అలా జరగలేదు..కేవలం ట్రస్టుబోర్డు మాత్రమే రద్దైంది..దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందనే ధీమాతో ట్రస్టు బోర్డు చేపట్టిన నియామకాల జోలికి మాత్రం ఎవరూ వెళ్లలేదు. కనీసం అర్హత లేకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారనే వాదన కూడా బలంగా వినిస్తుంది. ఇపుడు ఆ కోర్టు ఉత్తర్వులు ట్రస్టుబోర్డు రద్దుతోపాటు, వాటిపై కూడా జరుగుతాయనే అనేది హాట్ టాపిక్ గా మారింది. అధికారులు మాత్రం ఆ నియామకాలన్నీ ప్రభుత్వం చేపట్టందని చెబుతున్నా..ట్రస్టుబోర్డు చైర్మన్ అనుమతి, బోర్డు తీర్మాణంతోనే వాటిని చేపట్టారని సమాచారం అందుతుంది. హైకోర్టు తీర్పుపై ట్రస్టుబోర్డు రద్దు అయిన నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీం కోర్టు వెళ్లి కేసు గెలిచేవరకూ ట్రస్టుబోర్డు అనుమతితో చేపట్టిన నియాకాలన్నీ గాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేలా వుంది. అయితే ఈ విషయమై ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ, కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ట్రస్టు చేపట్టిన నియామకాలన్నింటినీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకూ అలా హోల్డ్ లో పెడతాయా..లేదంటే కొనసాగిస్తాయా అనేది తేలాల్సి వుంది.. 

Simhachalam

2021-06-16 02:46:15

నదుల అనుసంధానం వేగవంతం చేయాలి..

శ్రీకాకుళం  జిల్లాలోని వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు.  శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలో ఉన్న వేలాది ఎకరాలకు అవసరమైన సాగునీరు అందించే అనుసంధాన ప్రక్రియ పూర్తి కావాలని ఆకాంక్షించారు.   మంగళవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, వంశధార ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ డోల తిరుమలరావులు భేటీ అయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగునీటి ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఇందుకుగాను ఈనెల 19న శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో సాగునీటి ప్రాజెక్టుల సలహాసంఘ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సలహాసంఘ ప్రతినిధులైన డుమా పీడి, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, శాసనసభ్యులు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. జూలై నెలలో వంశధార కాలువల ద్వారా సాగునీటి విడుదలకు ఈ సమావేశంలో తేదీని ఖరారు చేస్తారు. ప్రస్తుతం సాగునీటి కాలువల్లో గుర్రపుడెక్క బాగా పెరిగిపోయినందున అది నీటి పారుదలకు ప్రధాన అవరోధం కాగలదని వంశధార ఎస్ఇ డోల తిరుమలరావు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ ఉపాధిహామీ ద్వారా గుర్రపుడెక్కని తొలిగించే పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కు సూచించారు.

శిధిలావస్థకు చేరిన షట్టర్లను మరమ్మత్తులు చేయడం, కొత్తవి మార్చడం వంటి పనులకు గతంలో బయటపడిన షట్టర్ల కుంభకోణం ప్రతిబంధకంగా మారిందని, ఈ స్కామ్ పై దర్యాప్తు జరిగినా, చర్యలు  పెండింగ్ లో ఉండడం వల్ల వీటికి సంబంధించి ఏ పనీ జరగడం లేదని డోల తిరుమలరావు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉన్నతస్థాయిలో అధికారులతో మాట్లాడి తగిన క్లియరెన్స్ తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ ఏడాదిలోగా వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో 88, 87 ప్యాకేజీల పనులు, హిరమండలం రిజర్వాయర్ పని చివరిదశకు వచ్చేశాయని ఎస్ఐ తెలిపారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నారాయణపురం ఆనకట్టకు వంశధార జలాలను తీసుకువెళ్లడం.. అక్కడి నుంచి వాటిని నాగావళితో అనుసంధానం చేయడం వంటి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని చర్చించారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు, వంశధార ఎడమ ప్రధానకాలువలను పటిష్టపర్చడానికి తగిన నిధులు మంజూరుకై పంచాయతీరాజ్ కమిషనర్ కె గిరిజాశంకరు లేఖరాయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ కి డిప్యూటీ సీఎం ధర్మాన సూచించారు. కాలువలను మరమ్మతు చేయడం, కాలువల పనులు వెంటనే పూర్తి చేయడానికి దీనివల్ల తగిన అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం జరిగే సాగునీటి సలహా సంఘ సమావేశంలో వీటితో పాటు సాగునీటికి సంబంధించిన పలు అంశాలను చర్చించి తగిన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

Srikakulam

2021-06-15 16:14:48

అనంత చీకట్లోనే మగ్గిపోవాలా..

అనంతపురం నగరంలో వీధి దీపాలు నిర్వహణ కూడా సరిగా లేకుంటే ఎలా అంటూ మేయర్ వసీం అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని  ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ లలో వీధి దీపాలు నిర్వహణను మంగళవారం రాత్రి మేయర్  ఆకస్మికంగా పరిశీలించారు. పలు చోట్ల వీధి దీపాలు వెలగక పోవడంతో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన వీధులలోనే లైట్లు వెలగక పోయినా పట్టించుకోని మీరు ఇక చిన్న విధులలో ఎంత మాత్రం పర్యవేక్షణ చేస్తున్నారో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. రాజు రోడ్ లో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన లైట్లు కూడా వెలగక పోయినా నిర్వహణ ఎంతమాత్రం చేస్తున్నారో మీ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై లైట్ల నిర్వహణపై రిజిస్టర్ తప్పని సరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు బాలాంజినేయులు,కమల్ భూషణ్,అనీల్ కుమార్ రెడ్డి, డి ఈ  బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

అనంత సిటీ

2021-06-15 15:09:51

పైడితల్లమ్మ తల్లీ కరుణించమ్మా..

శ్రీశ్రీశ్రీ  వరాహలక్ష్మీనృసింహస్వామి వారి సోదరి, ఏడు గ్రామాల ప్రజల ఆరాధ్యదేవత శ్రీ పైడితల్లమ్మ వారి వార్షిక పండగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సదకంపట్టు వద్ద పూజార్ల వంశీయులు  లండ వెంకటరమణ, చిన్న వెంకట రమణలు అమ్మవారికి సంప్రదాయ పూజలు చేసి మంగళ హారతులిచ్చారు. కరోనా నేపథ్యంలో  దేవస్థానం పిలుపు మేరకు భక్తులంతా ఇళ్ల వద్దనే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవికలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు దేవాలయానికి వచ్చారు. తలుపులు వేసి ఉండడంతో అమ్మవారిని బయటనుంచి కూడా దర్శించుకునే భాగ్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవస్థానం అధికారులతో చర్చించడంతో లోపల తలుపులు తెరిచి ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. దీంతో భక్తులంతా ఆరుబయట నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. గేట్ల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం ఏ ఈవోలు తిరుమలేశ్వరరావు, ఆనందకుమార్ , ఇజ్జురోతు శ్రీనివాసరావు, సూపరెంటెండెంట్  పర్యవేక్షణలో ఉద్యోగులు దేవాలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయం వద్ద దేవస్థానం ఆంక్షల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు గాంధీనగర్ వద్ద ఉన్న అమ్మవారి సదకంపట్టు వద్ద మొక్కులు చెల్లించుకున్నారు.   స్థానిక కార్పొరేటర్ పిసిని వరహానరసింహం, అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వనితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్  జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, వైసీపీ నాయకులు కొలుసు ఈశ్వరరావు, కర్రి సత్తి బాబు, గంట్ల కిరణ్ బాబు, దొంతల సంతోష్ . ఆకుల నాగరాజు. కొలుసు శ్రీను. బంటు బిల్లి త్రినాధ్.. తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Simhachalam

2021-06-15 15:05:16

గంగమ్మ తల్లికి వాసుపల్లి పూజలు..

గంగపుత్రులు కడుపునింపేలా మత్స్యసంపద దొరికేలా దీవించాలంటూ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేశారు. చేపల వేట విరామం అనంతరం గంగమ్మతల్లికి పూజలు చేసిన తరువాత మత్స్యకారులు మళ్లీ చేపల వేటను ప్రారంభింస్తారు. ఈ సందర్భంగా మంగళవారం ఫిషింగ్ హార్బర్ లోని గంగమ్మతల్లి ఆలయంలో నిర్వహించిన పండుగ కార్యక్రమంలో పాల్గొని తల్లికి పూజలు చేశారు. అనంతరం జాలర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, మత్స్యసంపదలో అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ కేసులు ఉద్రుతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు, నిబంధనలు కూడా పాటించాలని మత్స్యకారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాటు 37వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, ఫిషింగ్ బోట్ అసోసియేషన్ సభ్యులు పి.సి అప్పారావు, నర్సింగ్, బుజ్జి, కొండబాబు, ఎల్లాజి, అమ్మోరు, రామరాజు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-06-15 14:56:33

ఆక్సిజన్ సిలెండర్ల వితరణ హర్షదాయకం..

కరోనా కష్టకాలంలో 40 ఆక్సిజన్ సిలిండర్ లను అందజేయడం ఎంత గొప్ప విషయమని, నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నేపథ్యంలో ఆలూరు ఫౌండేషన్ తరఫున హైదరాబాద్ నుంచి తెప్పించిన ఒక్కోటి 45 వేల రూపాయల విలువ చేసే 40 ఆక్సిజన్ సిలిండర్ లను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ నగరంలోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని, కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందించేందుకు సిలిండర్లను ఉపయోగించాలని సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడం పట్ల ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు.

Anantapur

2021-06-15 14:44:09

ఘనంగా మిధున సంక్రమణం..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ  వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం మిధున సంక్రమణం వైభవం నిర్వహించారు. మహా పర్వదినం, వడాయితీ సంప్రోక్షణ, స్థలశుద్ధి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం మధ్యాహ్నం 3:30కు ఆస్థాన మండపంలోని గోవిందరాజస్వామి ,శ్రీదేవి, భూదేవి ఆళ్వారులకు ఆరాదణ కార్యక్రమం నిర్వహించి సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహించి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మిధున సంక్రమణం రోజున తిరువీధిలో స్వామిని దర్శించుకుంటే సకల పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మిక..

Simhachalam

2021-06-15 14:43:16

ఘనంగా పైడితల్లి అమ్మవారి పండుగ..

విశాఖలోని సింహాచలం దేవస్థానం ఉపాలయమైన గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మంగళవారం ఘనంగా జరిగింది.  ఉదయాన్నే శ్రీఅమ్మవారి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన సమర్పించారు. అనంతరం భక్తుల సందర్శనార్ధం ఆలయం తలుపులు తీసి భక్తులకు దర్శనాలు కల్పించారు. కరోనా నేపథ్యంలో ముందుగానే దేవస్థాన ఈఓ ఎంవీ సూర్యకళ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు. సాయంత్రం మరోసారి అమ్మవారి దీపారాదన చేపట్టి నివేదన చేశారు.

Simhachalam

2021-06-15 14:33:03