1 ENS Live Breaking News

సర్వారాయ సాయం మరువలేనిది..

కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు అవసరమైన రూ.18 లక్షల విలువైన 12 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన తమ సేవను చాటుకుందని జెసీ కీర్తి చేకూరి అన్నారు. ఈ మేరకు సంస్థ సిఎం కె.శ్రీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావులతో కలిసి ఆక్సిజన్ మిషన్లను జెసికి అందజేశారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ, కరోనా సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అవసరం ఎంతో వుంటుందని, అలాంటి అత్యవసర మిషన్లు అందించిన సంస్థ సభ్యులను ఈ సందర్భంగా జెసి అభినందించారు. ఇదే స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వచ్చి కరోనా రోగులకు అందించే సేవకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్, సర్వారాయ సుగర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-15 14:15:43

పంటల భీమా రైతుకి ఉపయోగపడాలి..

పంట‌ల విష‌యంలో.. భీమా విష‌యంలో రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే విధానాల‌ను రూపొందించాల‌ని, దాదాపు అన్ని పంట‌ల‌కూ వైఎస్సార్ భీమా వ‌ర్తించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధికారుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో వైఎస్సార్ ఉచిత పంట‌ల భీమా ప‌థ‌కం జిల్లా స్థాయి మానిట‌రింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ముందుగా గ‌త ఏడాది ఖ‌రీఫ్, ర‌బీ సీజన్‌లో అమ‌లు చేసిన విధానాల‌పై చ‌ర్చించారు. ఈ ఏడాది ఖ‌రీఫ్‌లో అమ‌లు చేయాల్సిన విధానాల‌పై స‌మీక్షించారు. ఏయే పంట‌ల‌కు భీమా వ‌ర్తింప జేయాలి, ఏయే పంట‌ల‌ను భీమా పరిధి నుంచి త‌ప్పించాల‌నే అంశాలపై క‌మిటీ స‌భ్యులు, అధికారులు చ‌ర్చించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌లో అమ‌లు చేయ‌బోయే విధానాలు అంతిమంగా రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ఉండాల‌ని పేర్కొన్నారు. జిల్లాలో అధికంగా వ‌రి పంట‌ను వేస్తున్న‌ప్ప‌టికీ దాదాపు అన్ని పంట‌ల‌కూ భీమా వ‌ర్తించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చెప్పారు. ఈ-క్రాప్ సైట్‌లో స‌జ్జ‌ల పంట‌ను జోడించాల‌ని ఈ సంద‌ర్భంగా సూచించారు. విప‌త్తుల స‌మ‌యంలో రైతుల‌ను భీమా ప‌థ‌కం ఆదుకుంటుంద‌ని, కావున రైతుల ఎన్రోల్‌మెంట్ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. మండ‌ల‌, గ్రామ స్థాయి యూనిట్‌గా పంట‌ల‌ను న‌మోదు చేయాల‌ని చెప్పారు. భీమా ప‌థ‌కంలో చిన్న‌, స‌న్న‌కారు రైతులకు ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. పంట న‌ష్టం అంచ‌నా విష‌యంలో సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబించాల‌ని పేర్కొన్నారు. పంట‌ల ర‌కాలను బ‌ట్టి భీమా వ‌ర్తింపు విధానాల‌ను అనుస‌రించాల‌న్నారు. ఆహార‌, వాణిజ్య పంట‌ల‌కు సంబంధించి భీమా వ‌ర్తింపుపై నూత‌న విధానాల‌ను ప్ర‌భుత్వానికి నివేదించాల‌ని సూచించారు.

స‌మావేశంలో వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఆశాదేవి, సీపీవో విజ‌య‌ల‌క్ష్మి, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ వాకాడ నాగేశ్వ‌ర‌రావు, ఎల్‌.డి.ఎం. శ్రీ‌నివాస్‌, కేవీకే శాస్త్ర‌వేత్త డా. కె. తేజేశ్వ‌ర‌రావు, హార్టిక‌ల్చ‌ర్ డీడీ శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-15 14:06:22

జగనన్న కాలనీలు వేగవంతం చేయాలి..

అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జగనన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ జేసీ నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జగనన్న ఇళ్ల నిర్మాణాలపై స్థానిక హౌసింగ్ కార్యాలయంలో హౌసింగ్ జేసీ నిశాంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు అంటే కేవలం ఇళ్లు కట్టి ఇవ్వడం కాదని, ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కలిగిన కాలనీలు అందించడమన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం పలు శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉన్నందున కేవలం ఇళ్ల నిర్మాణాలకోసమే ప్రత్యేకంగా జాయింట్ కలెక్టరును నియమించడం జరిగిందన్నారు. సమావేశంలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని మైనింగ్ ఏడీ కృష్ణమూర్తిని అదేశించారు. నాడు-నేడు పనులు దాదాపు పూర్తయిందున ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పేదల ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించాలని పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాగ్యరాజ్ ను ఆదేశించారు. ప్రతి లేఅవుట్ వద్ద నీటి వసతి కోసం బోర్లు తవ్వాలని, బోరు బావులు తవ్వినప్పటికి నీరు లభించని ప్రదేశాల్లో ప్రత్యామ్నాయాలు చూడాలన్నారు. విద్యుత్ సప్లై పనులను పూర్తి చేసి నిర్మాణ పనులకు ఇబ్బంది రాకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఇళ్ల నిర్మాణాలను గడువులోపు పూర్తి చేసేందుకు సహకరించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, మైనింగ్ ఏడీ కృష్ణమూర్తి, మునిసిపల్ ఆర్డీ నాగరాజు, జెడ్పీ సీఈవో శ్రీనివాసులు, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ భాగ్యరాజ్, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీశ్ చంద్ర, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2021-06-15 13:52:18

ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోండి..

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకోవాలిని  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న దీక్షకు ఆమె సంపూర్ణ మద్దతు తెలిపారు.  మంగళవారం  ఉక్కు కర్మాగారం ప్రధాన గేటు వద్ద రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.  ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని,  ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జివిఎంసి కౌన్సిల్ ఏర్పడిన వెంటనే ఏప్రిల్ 9వ తేదీన జరిగిన తొలి సమావేశంలోనే మొదటి అజెండాగా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం చేసిందని దేశ చరిత్రలోనే ఇది అపురూపమైన ఘట్టమని తెలిపారు. మే, 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని  తెలిపారు. అరవై నాలుగు గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని ఉక్కు కర్మాగారానికి త్యాగం చేశారని, 32 మంది  కర్మాగారం కోసం ప్రాణత్యాగం చేశారని మేయర్ తెలిపారు. సుమారు లక్ష మంది పైబడి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఈ కర్మాగారం పై ఆధారపడి బతుకుతున్నారని, 20వేల కోట్ల పెట్టుబడితో ఇటీవల ప్లాంట్  విస్తరణ జరిగిందని కరోనా నేపథ్యంలో ప్రాణవాయువు అయిన ఆక్సిజన్    ను  సరఫరా చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టిందని, దేశంలో ఏ కార్పొరేట్ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం వలె ఆక్సిజన్    ను సరఫరా చేయలేదని ఇటీవల కరోనా పేషెంట్లు కొరకు 300 పడకల ఆక్సిజన్ బెడ్ లను ఏర్పాటు చేసిందని తెలిపారు. విశాఖ ఉక్కు  కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని, 98 మంది కార్పొరేటర్లు మీవెంటే ఉన్నారని తెలిపారు. నిర్వాసితులు అందరికీ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జివిఎంసి కార్పొరేటర్లు గంగారావు, లేళ్ళ కోటేశ్వరరావు, మహమ్మద్ ఇమ్రాన్, శ్రీనివాస్, తిప్పల దేవాన్, చిన్న తల్లి, సూర్యకుమారి, మాజీ శాసన సభ్యులు చింతలపూడి వెంకట్రామయ్య, ఉక్కు కర్మాగార యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్,  డి. ఆదినారాయణ,   జె. అయోధ్యా రామ్, మస్తానఫా , తదితరులు పాల్గొన్నారు.

Gajuwaka

2021-06-15 13:45:58

పాదయాత్ర హామీ ప్రతీ ఏడాది అమలు..

వాహన మిత్ర ద్వారా ఎందరో మోటారు డ్రైవర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డితో వీడియో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లతో ఉప రవాణా కమీషనర్ మీరా ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని  కలెక్టరేట్ జెండా ఊపి ప్రారంబించారు.  ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారికి ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహనాలు స్వంతంగా నడుపుకుంటున్న డ్రైవర్లుకు రూ.10,000 ఆర్ధిక సహాయం అందించారన్నారు. జిల్లాలో అర్హత ఉన్న 22,527 మందికి వరుసుగా మూడో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10,000 ఆర్ధిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేశారన్నారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారు సైతం సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకోనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం కల్పించారన్నారు. వాహన మిత్ర పథకం అందించిన ఆర్ధిక సహాయంతో వాహనాల ఇన్స్రెన్సు, రిపేర్లుతో పాటు ఫిట్నెస్ చేసుకునేందుకు వీలు పడుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. 

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం  తాగి వాహనాలు నడపరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సూచించారని, దీని వలన రహదారి ప్రమాదాలు సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయన్నారు. ఆటోలలో మహిళలు సురక్షితంగా ప్రయాణించటానికి అభయం యాప్ను అందుబాటులో తీసుకురావటం జరిగిందన్నారు. అభయం యాప్ ద్వారా ఆటోలలో ఒక పరికరాన్ని ఏర్పాటు చేస్తారని, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు ఇబ్బందులకు గురి అయితే గట్టిగా అరిచిన వెంటనే యాప్ యాక్టివ్ అయ్యి ఆటో ఆగిపోవటంతో పాటు, సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందుతుందన్నారు. అభయం యాప్ పైలట్ ప్రాజెక్టు క్రింద విశాఖపట్టణంలో ప్రారంభించటం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆటోలకు అభయం యాప్ పరికరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కరోనా కష్టకాలంలోను అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి  గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
    కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, లక్ష్మణరావు, కల్పలత,  నగరపాలక సంస్థ మేయరు కావటి మనోహర్ నాయుడు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి  పి కొండయ్య, జిల్లా ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Guntur

2021-06-15 13:42:11

గుంటూరు జిల్లాలో 22527 మందికి లబ్ధి..

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 22527 మంది లబ్ధిదారులకు రూ. 10,000 చొప్పున రూ.22.527 కోట్లు లబ్దిదారులకు అందజేస్తున్నట్టు కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్యమంత్రికి వివరించారు. మంగళవారం వాహన మిత్ర పధకం సొమ్మును లబ్దిదారుల ఖాతాకు ఆన్ లైన్ ద్వారా మళ్లించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రామానికి గుంటూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో అందిస్తున్న ఆర్ధిక సహాయం చాలా గొప్పది అని , సంక్షేమ పథకాలు అమలులో ఇతర రాష్ట్రాలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.  వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుంటూరుకు చెందిన ఆటో  డ్రైవర్ మురళీ శ్రీనివాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతూ  అన్నా నేను గత 17 ఏళ్ళుగా ఆటో నడుపుతున్నాను, ప్రతీ ఏడాది కూడా ఫిట్నెస్ నెల వస్తుందంటే తెలియని బాధ, భయం ఉండేది, నెలవారీ ఖర్చులు, మెయిన్టెనెన్స్ ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉండేవి. గత ప్రభుత్వంలో రోజుకు రూ. 50 ఫైన్ పెట్టి మా పీక మీద కత్తి పెట్టే పరిస్ధితి ఉండేదన్నారు. మీరు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అన్నట్లుగా ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు ఇస్తున్నారని, మేం ఇంత ధైర్యంగా ఉన్నామంటే మీరే కారణం అన్నారు. మాకు ఫైన్లు వేసే ప్రభుత్వాలను చూశాం కానీ మాకంటూ ఒక పధకం పెట్టిన మొదటి సీఎం మీరే అని, మీరు దేశ రాజకీయ నాయకులకు ఒక రోల్మోడల్,  ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలి అనే దానికి మీరే ఉదాహరణ అని తెలిపారు. 

కరోనా కారణంగా కుటుంబం గడవని పరిస్ధితుల్లో ఉన్న మాకు వాహన మిత్ర పథకం  ముందుగానే ఇస్తున్నారని చెప్పారు. ఏ సంక్షేమ పధకం ఆగకూడదని మీరు మూడో విడత ఇంత కష్టకాలంలో ఇస్తున్నారు. మీకు మేమంతా రుణపడి ఉంటామన్నారు. నా కుటుంబంలో అమ్మ ఒడి వచ్చింది, మా అమ్మకు కాపునేస్తం వచ్చింది, మా నాన్నకి వృద్దాప్య ఫించన్ వచ్చింది, తెల్లవారకముందే పెన్షన్ ఇస్తున్నారు. మీ ఆలోచనకు హ్యట్సాఫ్. నేను నా కుటుంబం కోసం ఆటోడ్రైవర్ అయ్యాను, కానీ రాష్ట్రాన్ని అభివృద్ది, సంక్షేమ బాటలో నడిపే డ్రైవర్ మీరు అయ్యారు అని తెలిపారు. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఇద్దరూ ఆడపిల్లలు అయి ఉంటే బావుండు అనిపించింది. మహిళాబిల్లు కోసం పార్లమెంట్లో గొడవలు చూశాం కానీ మీరు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం చూస్తుంటే నా పిల్లులు ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేవి, మగపిల్లాడిని ఎలా సెటిల్ చేయాలా అన్న ఆలోచన పట్టుకుంది. మహిళా అభ్యుదయం కోసం మీరు చేస్తున్న కృషి మరువలేం. రాష్ట్ర హోంమంత్రిగా ఒక మహిళ ఉండటం గర్వకారణం. 

మేం సామాన్యుడిగా ఒకటే కోరుకుంటున్నాం, మాకు మేడలు, మిద్దెలు వద్దు, మేం పస్తులు లేకుండా కడుపు నింపుకోవడానికి పని ఉండాలి, మా పిల్లలకు మంచి భవిష్యత్ కోసం మంచి చదువు, ఏదైనా అనారోగ్యం వస్తే మంచి వైద్యం ఉండాలి. ఇవి మీరు చేస్తున్నారు. బ్లాక్ఫంగస్ లాంటి దాన్ని కూడా నాలుగు రోజులకే మీరు ఆరోగ్యశ్రీలో చేర్చారు, మేం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే మీరే కారణం అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఆటోడ్రైవర్తో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం మాకు గర్వంగా ఉంది, ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని మేం నమ్ముతున్నామన్నారు. మేం ధైర్యంగా చెబుతున్నాం, మా జగనన్న కూడా మా ఖాకీ చొక్కా తొడుక్కున్నారు. మేమంటే అంత ప్రేమ, గౌరవం మీకు ఉన్నాయి. మీ వల్లే మేం సంతోషంగా జీవించగలుగుతున్నామన్నారు.

    జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధిదారులు 22527 మందికి రూ.22.527 కోట్లు చెక్కును రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులతో కలిసి లబ్ధిదారులకు అందించారు.

Guntur

2021-06-15 13:38:52

భవనాలు నిర్మాణాలు వేగం పెంచండి..

శ్రీకాకుళం  జిల్లాలో గ్రామ స్థాయిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను పూర్తి చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో భవన నిర్మాణాల పక్షోత్సవాలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ మంగళవారం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి పక్షోత్సవాలు ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయం, ఆర్.బి.కె, బి.ఎం.సి.యు, వై.యస్.ఆర్. క్లినిక్ లు, అంగన్వాడీ కేంద్రాల పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందుబాటులో పరిగెత్తి పని చేయుటకు సిద్ధంగా ఉన్నారని వారి సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. భవనాల నిర్మాణం ఆరు నెలలుగా వివిధ స్థాయిల్లో ఉన్నాయని వాటిని పూర్తి చేయడం వలన గ్రామాల రూపురేఖలు మారుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవనాలు అందుబాటులోకి రావడం వలన  గ్రామ స్థాయిలో మంచి  ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. భవనాల నిర్మాణం చేయలేదు అంటే రైతులకు సౌకర్యం లేదని, ఆయా వర్గాలకు అన్యాయం చేస్తున్నామని గ్రహించాలని స్పష్టం చేసారు. రైతు భరోసా కేంద్రాలు జూలై 8న ప్రారంభించాలని అందుకు కనీసం 25 శాతం భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పక్షోత్సవాల 15 రోజుల్లో మిషన్ మోడ్ లో పనులు చేపట్టి ప్రారంభాలకు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. భవనాలు గ్రామస్తులకు శాశ్వత ప్రయోజనం కలిగిస్తాయని, అందరూ సమష్టిగా పనిచేయడం వలన సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తి చేయుటకు శాయశక్తులా కృషి చేయాలని, మన స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదని ఆయన ఉద్బోధించారు. వేగవంతంగా, సక్రమంగా జరగాలని అన్నారు. క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. కాంట్రాక్టర్లకు పెండింగులో ఉన్న మొత్తాల్లో రూ. 42 కోట్లు సోమవారం జమ అయిందని కలెక్టర్ తెలిపారు. జగనన్న కాలనీలు కూడా పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉందని ఆయన చెప్పారు.

       జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ ప్రతి మండలంలో జూలై 8న ఆరు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కుర్మారావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ బి.లక్ష్మీపతి, డిపిఓ వి.రవి కుమార్, డి.ఆర్.డి.ఏ పిడి బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-15 13:26:16

నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి..

వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకానికి అర్హత గల లబ్దిదారులు ఎవరైనా ఉంటే నెల రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి 3వ విడత వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద రాష్ట్రంలో 2.48 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.   పది వేల రూపాయలు భీమా, ఫిట్ నెస్ సర్టిఫికేట్, మరమ్మత్తులు, తదితర ఖర్చులకు ఉపయోగపడుతోందని వారికి ఆర్థిక సహాయంగా అందించినట్లు పేర్కొన్నారు.  సలహాలు, సందేహాలు, ఫిర్యాదులకు 1902 ఫోన్ నంబర్ కు తెలియజేయవలసినదిగా ఆయన కోరారు.  అందరూ ట్రాఫిక్ నింబంధనలు పాటించాలని, అన్నీ కండీషన్ లో పెట్టుకోవాలని చెప్పారు.  ఏ ఒక్కరూ మధ్యం సేవించి వాహనం నడుపరాదని ఆయన సూచించారు.  అనంతరం 3వ విడత వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకాన్ని లబ్దిదారుల ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేశారు.

          జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, ఉప రవాణా కమీషనర్ డా.వడ్డి సుందర్, డిఎస్పి సి.హెచ్.జి.వి.ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, రవాణా శాఖ అధికారులు శివరాం, వేణుగోపాల్, చౌదరి సతీష్, రాజాపు అప్పన్న, తదితర అధికార, అనాధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. అనంతరం  రూ. 14.69 కోట్ల రూపాయల చెక్కును లబ్దిదారులకు అందజేశారు.

Srikakulam

2021-06-15 13:23:13

సీఎం వైఎస్ జగన్ అందర్నీ ఆదుకున్నారు..

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి ఆదుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.  మంగళవారం 3వ విడత వై.యస్.ఆర్. వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఈ పథకం కింద రాష్ట్రంలో 2.48 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని, జిల్లాలో 14 వేల 695 మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని వెల్లడించారు.  లబ్దిదారుల బాధలను అర్థం చేసుకొని కరోనా సంక్షోభం సమయం సందర్భంగా నెల రోజులు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి 10 వేల రూపాయలను ముఖ్యమంత్రి జమ చేసినట్లు చెప్పారు.  దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణ ఇస్తుందని, దిశ చట్టం వలన మహిళలు నిర్భయంగా ఆటోలపై ప్రయాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు.  అన్నింటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, కేబినెట్ లో మహిళా ఉప ముఖ్యమంత్రులను నియమించినట్లు తెలిపారు.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 96 శాతం వరకు నేరవేర్చినట్లు పేర్కొన్నారు.  రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వైద్య కళాశాలలకు ఈ నెలలో శంకు స్థాపన చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపా రాణి, రవాణా శాఖ అధికారులు శివరాం, వేణుగోపాల్, చౌదరి సతీష్, రాజాపు అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-15 13:21:22

కోవిడ్ నివారణలో మీడియా కీలకం..

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ నివారణకు మీడియా ఘణనీయమైన పాత్రను పోషించిదని, మీడియా ప్రసారం చేసే వార్తల వలన నోడల్ అధికారులుగా మండలస్థాయిలో కరోనాను నియంత్రించేందుకు అవకాశం కలిగిందని పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు జి.నారాయణరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన జర్నలిస్టుల రక్షణ కొరకు ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ తో కలిసి పాత్రికేయులకు ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీచేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో ప్రతీ ఒక్కరూ మానవత్వాన్ని చాటుకోవడం చాలా అవసరమని అన్నారు. వార్తల సేకరణలో రేయింబవళ్లు పనిచేసేది మీడియా అని, అటువంటి మీడియాకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సేవాతత్పరతతో ముందుకువచ్చి పాత్రికేయులకు ఫేష్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీచేసేందుకు ముందుకు వచ్చిన బెండి తారకేశ్వరరావు, మిత్రులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఇదేస్పూర్తితో ప్రతీ వ్యక్తి పాత్రికేయుల సంక్షేమానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతీ విషయాన్ని మీడియా మాత్రమే ప్రజల ముందుకు తీసుకురాగలదని చెప్పారు. కరోనా సమయంలో ప్రతీ విషయాన్ని మీడియా తమ దృష్టికి తీసుకువచ్చి కరోనా నివారణకు కృషిచేసిందని గుర్తుచేసారు.

సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు లోచర్ల రమేష్ మాట్లాడుతూ రేయింబవళ్లు ప్రాణాలకు తెగించి వార్తల సేకరణలో ఉంటున్న మీడియావ్యవస్థను ఆదుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రపంచానికి మేల్కోలేపేది మీడియా అని, ప్రపంచంలో జరిగిన విషయాలను మనముందుకు తీసుకువచ్చేది మీడియా మాత్రమేనన్న  విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలని చెప్పారు.  అటువంటి మీడియా కరోనా కారణంగా నేడు తీవ్రమైన కష్టాల్లో ఉందని, ఇటువంటి తరుణంలో దాతలు ముందుకు వచ్చి మీడియాకు వీలైనంత సహాయం చేయడం మంచి కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రతీ నిమిషానికి కోవిడ్ బాధితుల వివరాలను తెలియజేస్తూ, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడంలో  మీడియా కీలకపాత్ర వహించదని కొనియాడారు. కోవిడ్ నియంత్రణలో కూడా మీడియా ఘణనీయమైన పాత్ర పోషించిందని, కోవిడ్ వంటి కష్టకాలంలో మీడియాను ఆదుకునేందుకు ముందుకువచ్చిన దాతలను ఆయన అభినందించారు.  

ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి.ఇందిరా ప్రసాద్, కూన వెంకటరమణమూర్తి, ఎస్.జోగినాయుడు, సిహెచ్.సూర్యారావు, ఎం.మల్లిబాబు, మీడియా ప్రతినిధులు ఎం.ఏ.వి.సత్యనారాయణ, ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి, జి.వి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-06-15 13:18:53

ఇళ్ల నిర్మాణాన్ని య‌జ్ఞంలా చేపడతాం..

 రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని య‌జ్ఞంలా చేప‌ట్టి పూర్తిచేస్తామ‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ‌రంగ‌నాధ‌రాజు చెప్పారు. ఇళ్ల నిర్మాణం ల‌బ్దిదారుల‌కు భారం కాకుండా చూసేందుకు మార్కెట్ ధ‌ర‌ల కంటే 30 నుంచి 40శాతం త‌క్కువ ధ‌ర‌ల‌కే ఇంటి నిర్మాణ సామాగ్రిని ల‌బ్దిదారుల‌కు అందించేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు మంత్రి వెల్ల‌డించారు. ఇళ్లు నిర్మించుకొనే ల‌బ్దిదారుల‌కు ఇసుక అందుబాటులో వుండేలా వారి సొంత గ్రామానికి స‌మీపంలో వుండే న‌ది లేదా గెడ్డ‌ల నుంచి ఇసుక‌ను తీసుకువెళ్లేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గానికి స‌మీపంలోనే ఇసుక నిల్వ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. జిల్లాలో పేదలంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంలో ఇళ్ల నిర్మాణం, వై.ఎస్‌.ఆర్‌. జ‌గ‌న‌న్న కాల‌నీల్లో అవ‌స‌ర‌మైన మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌పై జిల్లాస్థాయి స‌మీక్ష స‌మావేశం మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో నిర్వ‌హించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ఛాంబ‌రులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, జిల్లాకు చెందిన ఎం.పి.లు, శాస‌న‌స‌భ్యులు, శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌తో గృహ‌నిర్మాణంలో వున్న స‌మ‌స్య‌లు వాటి ప‌రిష్కారానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు, శాస‌న‌స‌భ్యుల‌తో క‌ల‌సి మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వాగులు, గెడ్డ‌ల నుంచి ట్రాక్ట‌ర్ల‌పై కూడా ఇసుక తీసుకువెళ్లేందుకు శాస‌న స‌భ్యులు అనుమ‌తించాల‌ని కోరార‌ని ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా జిల్లా క‌లెక్ట‌ర్ కు సూచించామ‌ని చెప్పారు.
విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 80 వేల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌తి మండ‌లానికి ఒక జిల్లా స్థాయి అధికారిని, మండ‌లంలోని ప్ర‌తి గ్రామానికి ఒక మండ‌ల‌స్థాయి అధికారిని, ప్ర‌తి ఇర‌వై ఇళ్ల‌కు గ్రామ‌స్థాయి ఉద్యోగి ఒక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించి ఇళ్ల నిర్మాణాన్నిప‌ర్య‌వేక్షించాల‌ని జిల్లా అధికారుల‌కు సూచించిన‌ట్టు చెప్పారు. జిల్లాలో చేప‌డుతున్న గుంక‌లాం వంటి భారీ హౌసింగ్ కాల‌నీల్లో భూగ‌ర్భంలోనే విద్యుత్ లైన్లు, ఇంట‌ర్నెట్‌, టెలిఫోన్‌, కేబుల్‌టీవీ కేబుళ్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా పైప్‌లైన్లు వేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని హౌసింగు కాల‌నీల్లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం రూ.30 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. వ‌చ్చే రెండేళ్ల‌లో ప్ర‌భుత్వానికి ఇదే ప్ర‌ధాన కార్య‌క్ర‌మ‌మ‌ని మంత్రి పేర్కొన్నారు.
పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ చేప‌ట్ట‌డం ద్వారా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌రోనా స‌మ‌యంలో ఉపాధి క‌ల్పించ‌డంతో పాటు పేద‌ల‌కు ల‌క్ష‌ల విలువైన ఆస్తిని స‌మ‌కూర్చ‌డం, సంప‌ద సృష్టించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని, దీనివ‌ల్ల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌న్నారు. రాష్ట్రంలో 15 ల‌క్ష‌ల గృహాల‌ను నిర్మించ‌డం ద్వారా 4 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద సృష్టించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. జిల్లాలో గృహ‌నిర్మాణ పురోగ‌తిని ప‌రిశీలించేందుకు వ‌చ్చే నెల‌లో మ‌ళ్లీ తాను జిల్లాకు వ‌స్తాన‌ని, అప్పుడు నియోజ‌క‌వ‌ర్గ స్థాయికి వెళ్లి ఇళ్ల నిర్మాణాల‌ను ప‌రిశీలిస్తాన‌న్నారు.

జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ సంక్షేమ ప‌థ‌కాల  అమ‌లుకు క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి ఏ ప‌థ‌కం ఏరోజు ల‌బ్దిదారుల‌కు అందజేస్తామో ముందుగా ప్ర‌క‌టిస్తామో చెప్పి ఆ ప్ర‌కారంగా ప‌థ‌కాలు అందిస్తున్న ఏకైక‌ ప్ర‌భుత్వం దేశంలో ఒక్క వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మేన‌ని చెప్పారు. వాహ‌న‌మిత్ర కింద‌ ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి ఈ ప‌థ‌కాన్ని అందించ‌డం ద్వారా రాష్ట్రంలోనే ఈ ప‌థ‌కం అమ‌లులో విజ‌య‌న‌గ‌రం జిల్లా ముందంజ‌లో నిలిచింద‌ని మంత్రి పేర్కొన్నారు. మూడో విడ‌త వాహ‌న‌మిత్ర కింద‌ జిల్లాలో 14,500 ఆటో, టాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఈ ప‌థ‌కంలో రూ.15 కోట్లు అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు.

మాన్సాస్ అంశంపై మంత్రి పాత్రికేయుల ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ హైకోర్టు తీర్పు ప్ర‌తి ఇంకా అంద‌వ‌ల‌సి వుంద‌న్నారు. మాన్సాస్‌, సింహాచ‌లం దేవ‌స్థానం అంశాల‌పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని తాను భావిస్తున్న‌న‌ని, ఈ విష‌యంలో ప్ర‌భుత్వ వాద‌న‌లు వినిపిస్తామ‌ని మ‌హిళ‌ల‌కు న్యాయం చేస్తామ‌ని మంత్రి చెప్పారు. దేవాల‌యాల భూములు కాపాడాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి చెప్పారు. అవి  అన్యాక్రాంత‌మైన చోట వెనక్కి తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.
మాన్సాస్‌లో అక్ర‌మాలు త‌ప్ప‌కుండా  బ‌య‌ట‌పెడ‌తామ‌ని మంత్రి చెప్పారు. ఈ సంస్థ‌లో కొన్నివేల ఎక‌రాలు అన్యాక్రాంత‌మైతే దీని ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించిన అశోక్‌గ‌జ‌ప‌తి వాటి ప‌రిర‌క్షణ‌కు ఏంచేశార‌ని మంత్రి ప్ర‌శ్నించారు. సింహాచ‌లం ట్ర‌స్టు బోర్డుకు ఛైర్మ‌న్‌గా, మాన్సాస్ సంస్థ ఛైర్మ‌న్‌గా ఆయా సంస్థ‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చేసిందేమీ లేద‌ని మంత్రి పేర్కొన్నారు.  
బొబ్బిలిలోని వేణుగోపాల‌స్వామి ఆల‌యానికి సంబంధించి 4,011 ఎక‌రాల భూమి అన్యాక్రాంత‌మైన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌న్నారు. ఈ భూములు ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో వున్నాయో తేల్చాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఈ ఆల‌యానికి ఉన్న న‌గ‌లు ఏయే బ్యాంకుల్లో ఎంత‌మేర‌కు ఉన్నాయో, కోట‌లో ఎంత వున్నాయో లెక్క‌లు తేల్చాల్సి వుంద‌న్నారు. కొద్ది రోజుల్లోనే అన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పారు.

Vizianagaram

2021-06-15 11:27:35

25794 మందికి వాహన మిత్ర పథకం లబ్ది..

వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా జిల్లాలో 2021-22కు గాను 25,794 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.25.79 కోట్ల మేర ఆర్థిక స‌హాయం అందుతున్న‌ట్లు జిల్లా కలెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి రాష్ట్ర ర‌వాణా; స‌మాచార‌, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య‌, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ త‌దిత‌రుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి.. వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ద్వారా ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక స‌హ‌కారం అందించే కార్య‌క్ర‌మాన్ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ ప‌థ‌కం ద్వారా సొంత వాహ‌నం క‌లిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు బీమా, ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌, మ‌ర‌మ్మ‌తులు, ఇత‌ర అవ‌స‌రాల కోసం ఒక్కొక్క‌రికీ ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందుతోంది. వ‌రుస‌గా మూడో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 2,48,468 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.248.47 కోట్ల ఆర్థిక స‌హాయాన్ని బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి, కాకినాడ ఎంపీ వంగా గీత‌; కాకినాడ అర్బ‌న్‌, రాజోలు, పి.గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు, కొండేటి చిట్టిబాబు; ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవ‌ర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ గ‌తంలో న‌మోదైన 23,987 ద‌ర‌ఖాస్తుల‌కు అద‌నంగా ఈ ఏడాది కొత్త‌గా 4,678 ద‌ర‌ఖాస్తులు అందిన‌ట్లు తెలిపారు. మొత్తం 28,665 ద‌ర‌ఖాస్తుల‌కు గాను 25,794 ద‌ర‌ఖాస్తులు ప‌థ‌కం కింద ల‌బ్ధిపొందేందుకు ఆమోదం పొందాయ‌ని వెల్ల‌డించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో ల‌బ్ధిదారుల ఎంపిక అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో జ‌రిగింద‌ని, ల‌బ్ధిదారుల జాబితాను స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలిపారు. ఇంకా ఎవ‌రైనా అర్హ‌త ఉన్న‌వారు మిగిలిపోతే వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ద్వారా అందుతున్న ఆర్థిక స‌హాయాన్ని పూర్తిస్థాయిలో స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని.. స్వీయ‌, ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని మ‌ద్యం తాగి వాహ‌నం న‌డ‌పొద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. కార్య‌క్ర‌మంలో డీటీసీ ఎ.మోహ‌న్‌, జిల్లా ర‌వాణా శాఖ అధికారులు ఆర్.రాజేంద్ర‌ప్ర‌సాద్, బి.శ్రీనివాస్‌, ఎం.అప్పారావు, ఆర్‌.సురేశ్ త‌దిత‌రుల‌తో పాటు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ యూనియ‌న్ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-15 09:50:48

పేదల కోసం17వేల గ్రామాలను నిర్మిస్తున్నాం..

ఒకటి కాదు రెండ కాదు...రాష్ట్రంలో ఏకంగా 17వేల ఊర్లు నిర్మిస్తున్నాం. అన్ని ర‌కాల మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించి, జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను మోడ‌ల్‌గా తీర్చిదిద్దాల‌న్నది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, రాష్ట్ర గృహ‌నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ‌రంగ‌నాధ‌రాజు అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖ‌లూ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఇళ్ల నిర్మాణాన్ని స‌కాలంలో పూర్తి చేయాల‌ని కోరారు. న‌వ‌ర‌త్నాలు లో భాగంగా, జిల్లాలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మంపై, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌తో క‌లిసి మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షించారు.ఈ సంద‌ర్భంగా  గృహ‌నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద‌ల‌కు ఏకంగా 30ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి సంక‌ల్ప‌మ‌ని అన్నారు. ఇది దేశంలోనే అతి గొప్ప కార్య‌క్ర‌మ‌మ‌ని పేర్కొన్నారు. కుల‌, మ‌త‌, రాజ‌కీయాల‌కు అతీతంగా అర్హులైన ప్ర‌తీ పేద‌వాడికి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. తొలిద‌శ‌లో రాష్ట్రంలో సుమారు 15ల‌క్ష‌ల ఇళ్ల‌ను మార్చి 31 నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. జ‌గ‌నన్న కాల‌నీల్లో సుమారు రూ.30వేల కోట్ల‌తో అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తుల‌నూ క‌ల్పించి, వాటిని మోడ‌ల్ కాల‌నీలుగా అభివృద్ది చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇది కేవ‌లం సంక్షేమ కార్య‌క్ర‌మ‌మే కాద‌ని, అతిపెద్ద‌ అభివృద్ది కార్య‌క్ర‌మమని స్ప‌ష్టం చేశారు. ఒకేసారి వేలాది ఇళ్ల‌ను నిర్మించ‌డం వ‌ల్ల‌, జ‌గ‌న‌న్న కాల‌నీలు గ్రామీణ ఉపాదికి కేంద్ర‌బిందువుగా మార‌నున్నాయ‌ని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణం వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా సుమారు 90 మందికి, ప‌రోక్షంగా మ‌రో 40 మందికి ఉపాది ల‌భిస్తుంద‌ని అన్నారు. పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని అధికారులంతా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల‌ని మంత్రి చెరుకువాడ కోరారు. దీనిలో భాగంగా నిర్మించే ఇళ్ల‌కు ఇసుక‌ను ఉచితంగా అంద‌జేస్తామ‌ని, నిర్మాణ సామ‌గ్రిని కూడా త‌క్కువ ధ‌ర‌కు అంద‌జేస్తామ‌ని  తెలిపారు. అందువ‌ల్ల ఇది ల‌బ్దిదారుడికి భారం కాబోద‌ని అన్నారు. గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌తీ గ్రామానికి ఒక మండ‌ల స్థాయి అధికారిని, నియోజ‌క‌వ‌ర్గానికి జిల్లా స్థాయి అధికారిని ఇన్‌ఛార్జిగా నియ‌మించాల‌ని ఆదేశించారు. ప్ర‌తీ 20 ఇళ్ల‌కు ఒక స‌చివాల‌య ఉద్యోగిని బాధ్యులుగా నియ‌మించి, ప‌ర్య‌వేక్ష‌ణ పెంచాల‌న్నారు. ఒకేసారి పునాదుల‌ను ప్రారంభింప‌జేయ‌డం, సామ‌గ్రిని కూడా న‌లుగురైదుగురు ల‌బ్దిదారులు క‌లిపి తెప్పించుకోవ‌డం వ‌ల్ల ఖ‌ర్చులు క‌లిసి వ‌స్తాయ‌ని సూచించారు. స‌క్రమంగా త‌క్కువ ధ‌ర‌కు ఇసుక‌ను అందించ‌డానికి కాల‌నీల‌కు స‌మీపంలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల‌ని జెసిని ఆదేశించారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణ ప్ర‌క్రియ‌లో ల‌బ్దిదారుడిని పూర్తిగా భాగ‌స్వామిని చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అవుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. విజ‌య‌న‌గ‌రం ఎంపి బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి ప్ర‌జాప్ర‌తినిధులంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు. ముఖ్యంగా గ్రామాల్లో స‌ర్పంచ్‌లు, ప‌ట్ట‌ణాల్లో కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు ముందుకు వ‌చ్చి, ఇళ్ల నిర్మాణం త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించాల‌ని సూచించారు. నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నీటి వ‌స‌తి, విద్యుత్‌, ఇసుక‌ను అంద‌జేయాల‌ని కోరారు.

                హౌసింగ్ ఎండి భ‌ర‌త్ నారాయ‌ణ‌మూర్తి గుప్తా మాట్లాడుతూ, గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం ఎంతో ప్రాధాన్య‌త‌నిస్తోంద‌ని చెప్పారు.  అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లూ దీనిలో భాగ‌స్వాములు కావాల‌ని, స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని కోరారు. పెద్ద‌పెద్ద కాల‌నీల‌ను సెక్టార్లుగా విభ‌జించి, ప్ర‌తీ 20 ఇళ్ల‌కు ఒక ఇన్‌ఛార్జిని నియ‌మించాల‌ని సూచించారు. వివిధ స్థాయి అధికారుల‌తో క‌మిటీల‌ను రూపొందించి, వాటి ద్వారా ల‌బ్దిదారులను చైత‌న్య‌ప‌రిచేందుకు కృషి చేయాల‌ని కోరారు.

              అంత‌కుముందు జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(హౌసింగ్‌) కె.మ‌యూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లాలో గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మం ప్ర‌గ‌తిని వివ‌రించారు. జిల్లాలో  98,286 ఇళ్లు మంజూరయ్యాయ‌ని, అయితే వివిధ కార‌ణాల‌వ‌ల్ల 15,676 ఇళ్లు మంజూరు ఆగింద‌ని, మిగిలిన 82,610 ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని తెలిపారు.  వీటిలో 51,710 మందికి లేఅవుట్ల‌లో ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేసి, ఇళ్ల‌ను నిర్మిస్తామ‌ని, 30,900 మందికి పొజిష‌న్ ప‌ట్టాలతో ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని వివ‌రించారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక ల‌భ్య‌త‌, స్టాక్‌పాయింట్లు, స‌ర‌ఫ‌రాకు చేసిన ఏర్పాట్ల‌ను వివ‌రించారు.  వివిధ మున్సిపాల్టీల ఛైర్ ప‌ర్స‌న్లు, క‌మిష‌న‌ర్లు, త‌మ మున్సిపాల్టీల్లోని స‌మ‌స్య‌ల‌ను తెలిపి, ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

              ఈ స‌మీక్షా స‌మావేశంలో ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు, ఎంఎల్ఏలు శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, అల‌జంగి జోగారావు, క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వి.విజ‌య‌లక్ష్మి,  హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట‌క్చ‌ర్ సిఇఓ శివ‌ప్ర‌సాద్‌, జిల్లా హౌసింగ్ పిడి ఎన్‌వి ర‌మ‌ణ‌మూర్తి, వివిధ శాఖ‌ల అధికారులు, హౌసింగ్ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-15 09:31:58

మహావిశాఖ వైపే ఆ.. ఐఏఎస్ ల చూపు..

విశాఖ ఈ పేరు వినగానే అందమైన నగరం గుర్తొస్తుంది..ఇది ఒకప్పటి వరకూ ఇపుడైతే అంతే అందమైన నగరం కాబోయే పరిపాలనా రాజధాని  కాబోతుండటం, రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్, రెండో అతి పెద్ద జిల్లా కూడా కావడంతో అందరి ఐఏఎస్ ల చూపు ఇపుడు విశాఖ వైపే పడిండి..ఇక్కడ ఏదో ఒక పోస్టులోకి వస్తే ఎంత కాదనుకున్నా ఓ ఐదారేళ్లు అలా అలా గడిపేయవచ్చుననేది ఒక బావన అంతేకాదు.. కొందరు ఐఏఎస్ లు ఇపుడు విశాఖను పట్టుకొని వదలక పోవడం, ప్రభుత్వ పెద్దలను ప్రశన్నం చేసుకొని ఇక్కడే తిష్టవేసుకొని కూర్చోవడంతో ఓ నలుగురు ఐఏఎస్ ల చూపు ఇపుడు విశాఖవైపునకు తిరిగింది.. అందులో ఇద్దరు ఐఏఎస్ లకు స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకొని లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు.. కీలక స్థానంలో రెండేళ్లుకు పైగా అధికారులు పనిచేశారో ఆ ప్రదేశాలకు రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట..  ఇదే క్రమంలో ప్రజాప్రతినిధులకు ఎవరైతే సహకారం అందించడం లేదో..ఆ స్థానాల్లోకి వచ్చి తమ కోరికతోపాటు ప్రజాప్రతినిధులకు తన మనిషిని అనే భావన కల్పించి ఇక్కడే ఉండిపోతే..రేపు పరిపాలనా రాజధాని ఏర్పడిన తరువాత కూడా ఇక్కడే మరో పదేళ్లు ఉండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఐఏఎస్ లకు రెండు మూడేళ్లు దాటినా స్థాన చలనం రావడం లేదు..పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం ఒక్కొ ఐఏఎస్ అధికారిని జిఏడికి రిపోర్టు చేయాలని ఆదేశించినా చక చకా పావులు కదిపి మరీ విశాఖ వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలోని ఐఏఎస్ అధికారి పనిచేసే స్థానానికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో తమకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో అలాంటి అధికారులను విశాఖ రప్పించుకోవాలని కూడా ప్రజాప్రతినిధులు చూస్తున్నారట. ఇప్పటికే ఆ దిశగా ఐఏఎస్ అధికారులు మంతనాలు కూడా సాగిస్తున్నారని సమాచారం. కాగా ఇప్పటికే ఒక దఫా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. మరోసారి ఐఏఎస్ లబదిలీలు జరిగినపుడు విశాఖకు తమను తీసుకు రావాల్సిందిగా సదరు అధికారులు ప్రజాప్రతినిధులను కోరినట్టు ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో తమను విశాఖనుంచి కదపొద్దని ఇక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ లు కూడా మంత్రులను కలిసి మరీ వేడుకున్నారట. కొందరు ప్రజాప్రతినిధుల మాటకు విలువ ఇవ్వని వారిని బదిలీ చేయించి.. తమ మాటలకు విలువ ఇచ్చే అధికారులను విశాఖ తీసుకు రావడానికి ఒక మార్గం సుగమం అయ్యిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలోని కీలక నేతలను పట్టుకొని తమ ప్రయత్నాలకు పదును ఆ నలుగురు ఐఏఎస్ లు పదును పెడుతున్నట్టు తెలుస్తుంది..విశాఖలోని మంత్రుల సిఫార్సులు పట్టించుకోని ఐఏఎస్ లు ఇక్కడ ఉంటారా..లేదంటే విశాఖ రావడానికి ఆశక్తి చూపుతున్న ఆ ఐఏఎస్ లను ప్రజాప్రతినిధులు ఈ జిల్లాకి తెచ్చుకుంటారా అనేది ఆశక్తి కరంగా మారింది.. ఏం జరుగుతుందనేది వేచిచూడాలి..!

Visakhapatnam

2021-06-15 01:47:56