విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి భారతరత్న ప్రకటించాలని డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అభిమానుల ఐక్యవేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టామన్నారు. ఎన్టీఆర్ అభిమాని ప్రతీఒక్కరూ ఆయనకు భారత రత్నఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కళారాధన పీఠం ద్వారా 25 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, అభిమానులకు ఆయన సినిమాలు, కళారంగం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వస్తున్నామని వివరించారు. అంతేకాకుండా విశాఖలో ఎన్టీఆర్ శ్రీక్రిష్ణుడి విగ్రహం కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగువారు వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరు కళాకారులు అభిమానించే ఏకైకన నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నేటికి భారత రత్న ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ పోస్టుకార్డు ఉద్యమంలో అభిమానులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాసరావు, ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ అధ్యక్షుడు శంకర్రావు, రామక్రిష్ణ, గంగరాజు, శాంభశివరావు తదితరులు పాల్గొన్నారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ లేని లోటు వైఎస్సార్సీపీకి ఇక తీరదని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ద్రోణంరాజు శ్రీనివాస్ పార్ధీవ శరీరానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశాఖ అధ్యక్షలు వంశీక్రిష్ణశ్రీనివాస్, ఎమ్మెల్యే అమర్నాద్, అదీప్ రాజ్, నార్త్ ఇన్చార్జి కెకెరాజు ఇతర పార్టీ నాయకులతో కలిసి మౌనం పాటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో తన తండ్రి తరువాత నిత్యం ప్రజల్లో వుంటూ సేవలు అందించిన శ్రీనివాస్ లేరనే విషయం చాలా బాధను కలిగిస్తోందన్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు మన మధ్య లేకపోవడం చాలా విచారంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మొల్లి అప్పారావు, పీతల గోవింద్,పల్లా దుర్గారావు, శీలం లక్ష్మణ్ , ట్రేడ్ యూనియన్ బాబా , పైడి శ్రీనివాస్, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
విశాఖ మాజీ ఎమ్మెల్యే, వి.ఎం.అర్.డి.ఎ పూర్వపు చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి ఉత్తరాంధ్ర కు తీరని లోటు గా జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అభివర్ణించారు. సోమవారం ద్రోణంరాజు పార్థివ దేహేన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలం ప్రాంతం కు చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి బాటలో ముందుకు సాగేవారన్నారు. రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా అందరితో కలిసి మెలిసి ప్రజలకు సేవచేసే ద్రోణంరాజు మృతి ఎంతో మందిని కలచి వేసిందన్నారు. విశాఖ ప్రజా సమస్యలు పరిస్కారమే లక్ష్యం గా ముందుకు సాగే మహోన్నత వ్యక్తి ని కోల్పోవడం చాలా విచారకరమన్నారు. ప్రధానంగా జర్నలిస్ట్ లు అంటే ఆయన కు ఎంతో మక్కువ అన్నారు. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా ముందు ద్రోణంరాజు వచ్చి ఆ కార్యక్రమం నడిపించే వారని గుర్తుచేశారు. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసారు.భవిష్యత్తు లో వారి కుటుంబం కి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని తాను కోరుకుంటున్నట్టు గంట్ల చెప్పారు.
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో మృతుని కుటుంబానికి రూ.10లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు ఆర్ధిక సహాయం ప్రభుత్వం తరపున అందచేస్తామని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో తక్షణమే మృతి చెందిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిమాని, APHMIDC ఎండీ చంద్ర శేఖర్ రెడ్డిని త్వరలోనే నివేదిక ఇస్తారని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా చూడాలని స్విమ్స్ డైరెక్టర్ ను ఆదేశించిన ఆళ్ల.. ఈ ప్రమాదంలో ఉద్యోగిని మ్రుతిచెందడం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రి భవనాలు పరిస్తితి ఎలావుందో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయించి, తాజానివిదికు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
ఉత్తరాంధ్రాలో ప్రభుత్వ అధికారులను ఆత్మీయులుగా స్వయంగా పేరుపెట్టి పిలిచే ఏకైక నాయకుడు ద్రోణంరాజుశ్రీనివాస్ మాత్రమేనని విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వ ఉద్యోగల ఫెడరేషన్ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు అన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మరణం తమను ఎంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే మంచి నాయకులు ఇక లేరనే విషయం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయనతో తనకు చాలా సన్నిహిత సంబంధం వందని ఈ సందర్భంగా పోలాకి గుర్తు చేసుకున్నారు. తండ్రిబాటలోనే ప్రజలకోసం సేవచేసిన మహా మనిషి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి తనతోపాటు విద్యుత్ ఉద్యోగుల తరపున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పోలాకి శ్రీనివారసరావు తెలియజేశారు.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆదివారం ధర్మవరం తహశీల్దార్ కార్యాలయంలోని ఎపి.ఎన్.జిఓ భవనంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద ముంపునకు గురయ్యే గ్రామాల పరిహారంనకు సంబంధించి అధికారులు చేపట్టిన ప్రక్రియను మరియు అందుకు సంబంధించిన రికార్డులను ధర్మవరం ఆర్ డి ఓ మధుసూదన్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీబీఆర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం కోసం రూ. 240.53 కోట్లను మంజూరు చేసిందన్నారు. తాడిమర్రి ,ముదిగుబ్బ మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో పరిహారం చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. .చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం సిసి రేవు, మర్రిమాకులపల్లి గ్రామాలకు, ముదిగుబ్బ మండలం పిసీరేవు, రాఘవపల్లి గ్రామాలకు చెందిన 1729 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నామన్నారు.
నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నామని, రెండు రోజుల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియని పూర్తి చేస్తామన్నారు. పరిహారం అందజేసిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీరు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ నేతృత్వంలోని అధికారుల బృందం రాత్రింబవళ్ళు టీం వర్క్ తో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జిల్లాలో పాల్గొనాల్సి వున్న కార్యక్రమాలన్నీ రద్దయినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. భోగాపురం, గజపతినగరం, కొత్తవలస మండలాల్లో మంత్రి పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నీ రద్దయినట్లు పేర్కొన్నారు. వి.ఎం.ఆర్.డి.ఏ. ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి సంతాప సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో భీమసింగి చక్కెర కర్మాగారాన్ని సందర్శించాల్సి వున్న మంత్రుల బృందం పర్యటన కూడా వాయిదా పడిందని వెల్లడించారు. అయితే మధ్యాహ్నం 3-00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో గ్రామాల్లో నిర్మాణంలో వున్న సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రం, ఆరోగ్యకేంద్రాల భవన నిర్మాణాల ప్రగతిపై సమీక్షించేందుకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మంత్రి ఒక సమీక్ష సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఆయా ఇంజనీరింగ్ శాఖల ఎస్.ఇ., ఇ.ఇ., డి.ఇ., ఏ.ఇ.లంతా ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుతోందని, 97 శాతంపైగా రికవరీ రేటు నమోదు అయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే అతి తక్కువగా 1362 పాజిటివ్ కేసులు మాత్రమే యాక్టివ్ లో ఉన్నాయని, అన్ని జిల్లాల కంటే జిల్లాలో యాక్టివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఓవరాల్ గా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా రికవర్ రేటు అత్యధికంగా ఉండడంతో యాక్టివ్ కేసులు అతి తక్కువగా ఉన్న జిల్లా మనదన్నారు. జిల్లాలో 97 శాతంపైగా రికవరీ రేటు నమోదు కాగా, కేవలం 2 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎంతమందికి టెస్టులు చేస్తే ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనే దానిపై కూడా పరిశీలన చేయడం జరిగిందన్నారు. అన్ని పట్టణ ప్రాంతాలలో కలిపి ఇప్పటివరకు దాదాపుగా 16 శాతం పాజిటివిటి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాలలో 9 శాతం పాజిటివిటి వచ్చిందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రెండూ కలుపుకుంటే 12 శాతం పాజిటివిటి జిల్లాలో నమోదైందన్నారు. ఇది మార్చి నుంచి ఇప్పటి వరకూ ఓవరాల్ గా నమోదయిన పాజిటివిటి శాతం అని, ఆగస్టు నెలలో 19 శాతానికి పైగా పాజిటివ్ నమోదుకాగా, గడిచిన ఒక నెల పాజిటివిటి తీసుకుంటే సెప్టెంబర్ నెలలో 10 లోపలే పాజిటివిటి వచ్చిందన్నారు. అక్టోబర్ మొదటి నుంచి తీసుకుంటే 5, 6 శాతం లోపలే పాజిటివిటి ఉందన్నారు. జిల్లాలో కరోనా కేసులు చాలామటుకు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రం యావరేజి కన్నా జిల్లాలో మరణాల శాతం కూడా 1 శాతంకన్నా తక్కువగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం జిల్లాలో పాఠశాలలను ప్రారంభం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4 సెంటర్లను ఏర్పాటు చేయగా, అందులో అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన వెన్యూ కేంద్రాలకు అత్యధికంగా అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు కోసం కడప, కర్నూలు జిల్లాల నుంచి అనంతపురం పరీక్ష కేంద్రానికి ప్రత్యేక ట్రైన్ లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతోనే అభ్యర్థుల హాజరు శాతం పెరిగిందని తెలిపారు. ఆదివారం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు 3311 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు అనంతపురం జిల్లా కేంద్రంలోని 8 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 1807 మంది అభ్యర్థులు హాజరు కాగా, మరో 1504 మంది అభ్యర్థులు పరీక్ష కు గైర్హాజరయ్యారని, 54.57 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1795 మంది అభ్యర్థులు హాజరు కాగా, మరో 1516 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని, 54.21 శాతం హాజరు నమోదైందన్నారు. రాష్ట్రంలోని తిరుపతి కేంద్రంలోని 14 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 6790 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్ష కు 3234 మంది అభ్యర్థులు హాజరు కాగా, 47.63 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 3207 మంది అభ్యర్థులు హాజరు కాగా, 47.23 శాతం హాజరు నమోదైందన్నారు.
రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంలోని 27 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 12, 533 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 5,421 మంది అభ్యర్థులు హాజరు కాగా, 7,091 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 43.33 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,376 మంది అభ్యర్థులు హాజరు కాగా, 7,136 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 42.97 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే విశాఖపట్నం కేంద్రంలోని వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 10, 779 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 4,863 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5,916 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 45.12 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4,811 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5,968 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 44.63 శాతం హాజరు నమోదైందన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించి అనంతపురం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అభ్యర్థులకు ప్రత్యేక ట్రైన్ లు, బస్సులను ఏర్పాటు చేశామని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోగలిగారని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రంలో పరీక్షలకు అభ్యర్థులు అత్యధిక శాతం హాజరయ్యారన్నారు. ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించామని, కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో యూపీఎస్సీ కమిషన్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించి ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వీఎంఆర్డీఏ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మ్రుతి వైఎస్సార్సీపీ కి తీరని లోటని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ద్రోణం అకాల మ్రుతి సందర్భంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం లో మాజీ శాసనసభ్యులు, మాజీ వి.ఆర్.డి.ఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ గారి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించే నేతను కోల్పోవడం ఎంతో బాధను కలిగించిందన్నారు. వారికి, వారి కుటుంబానికి ఈ సందర్భంగా తమన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ద్రోణం రాజు శ్రీనివాస్ చిత్ర పటానికి పూల వేసి నివాళి అర్పించి... రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ , శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ , అన్నం రెడ్డి అదీప్ రాజు, పార్లమెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు బేహర్ భాస్కర్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగాలి జగన్నాధం , శనపల చంద్ర మౌలి, రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి , మొల్లి అప్పారావు, పార్టీ ముఖ్య నాయుకులు మంత్రి రాజశేఖర్, అనుబంధ విభాగం ల అధ్యక్షులు బర్కత్ అలీ, శ్రీమతి రాధ, పిలా వెంకట లక్ష్మి, అల్ప్ఫా కృష్ణ, పార్టీ మహిలు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖలోని వీఎంఆర్డీఏ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజుశ్రీనివాస్ అకాల మ్రుతిపట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబా బు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆదివారం పినాకిల్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ, మ్రుతిచెందడం తనను ఎంతో బాధ కలిగిచిందని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడూ, జర్నలి స్టులతో ద్రోణంరాజు శ్రీనివాస్ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, అన్ని కార్యక్రమాలు పిలిచిన వెంటనే హాజరయ్యే వారన్నారు. అలాంటి మంచి మనిషి మ్రుతిచెం దారనే వార్త తనను చాలా కలచివేసిందన్నారు. పార్టీలోనూ, ప్రజలతోనూ ఎంతో ఆప్యాయతా ఉండే ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేక పోతు న్నామని అన్నారు. జర్నలిస్టులకు కూడా ఆయన సహచర కుటుంబ సభ్యులుగా ఉండేవారన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలనికి గంట్లశ్రీనుబాబు, తన విచారాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో ఆతిథ్య రంగంలో పలు కోర్సుల్లో 2020-21 సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి శివరామకృష్ణ తెలిపారు. హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ లో మూడేళ్ల బి.ఎస్సీ కోర్సు, ఫుడ్ ప్రొడక్షన్, పెట్టిసరీలో క్రాఫ్టు కోర్సు, ఫుడ్ అండ్ బెవరేజెస్ లో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. మూడేళ్ల బి.ఎస్సీ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత కలిగి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్.సి.హెచ్.ఎం.సి.టి. ఉమ్మడి ప్రవేశపరీక్ష-2020లో ర్యాంకు వచ్చి వుండాలని, అభ్యర్ధుల వయస్సు 22 ఏళ్లలోపు వుండాలని పేర్కొన్నారు. ఫుడ్ ప్రొడక్షన్, పెట్టిసరిలో క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణత కలిగి వుండాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల వయస్సు 25 ఏళ్లలోపు వుండాలన్నారు. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసు కోర్సుకు కూడా పదో తరగతి ఉత్తీర్ణత కలిగి అభ్యర్ధుల వయస్సు 25 ఏళ్లలోపు వుండాలన్నారు. బాల బాలికలకు వేర్వేరుగా హస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి రాష్ట్ర పర్యాటక సంస్థ నిర్వహించే హోటళ్లు, ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు పర్యాటక సంస్థ వెబ్ సైట్ www.sihmtpt.org లో నమూనా దరఖాస్తు వుంటుందని, ఈ ప్రొఫార్మాలో అక్టోబరు 10వ తేదీలోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం శివరామకృష్ణ 9700440604, 9701343846 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు.