1 ENS Live Breaking News

ప్రజా సేవలన్నీ సచివాలయంలోనే అందాలి...

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.  రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు వారంలో రెండు దినములు గ్రామీణ ప్రాంతాల సందర్శనలో భాగంగా గురువారం ఆయన భీమునిపట్నం నియోజక వర్గంలోని పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని గ్రామ సచివాలయాలు, వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు,  వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ ల నిర్మాలను ఆయన సందర్శించి పరిశీలించారు.  గ్రామ సచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో కావలసిన వసతులన్నీ ఉన్నాయా లేదా సిబ్బందిని అడిగి తెలుసుకొని, ఏమైనా అవసరం ఉన్నాయా, ఉంటే ఆ వివరాలను తెలియజేయాలని తెలిపారు.  సిబ్బంది అందరూ ప్రతీరోజు వస్తున్నారా లేదా అని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడుగగా ప్రతీ రోజు వస్తున్నామని కలెక్టర్ కు వివరించారు.  అనంతరం సచివాలయంలోని రిజిష్టర్లను పరిశీలించి, ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు.  గ్రామంలో ఎన్ని వీధులు ఉన్నాయని, పారిశుద్ద్యం పనులు జరుగుతున్నాయా లేదా, ఏమైనా సమస్యలను గుర్తించారా అని పంచాయితీ కార్యదర్శిని ఆయన అడుగగా  గ్రామంలో 9 వీధులు ఉన్నాయని, తడి చెత్త, పొడి చెత్తలను వేరుచేస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి కలెక్టర్ కు వివరించారు.  అన్ని వీధులు, కాలువలను  శుభ్రపరచి బ్లీచింగ్ చల్లుతున్నట్లు కార్యదర్శి తెలిపారు.  ఉదయం 5 గంటలకు వచ్చి 15  దినములు అన్నింటిని గమనించి అక్కడి సమస్యలను ఎంపిడిఓకి తెలియజేయమని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు.  గ్రామ సచివాలయ సిబ్బంది అందరికీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, ఎవరెవరు ఏమి చేయాలో చెప్పాలని ఎంపిడిఓను ఆదేశించారు.  మరోసారి సచివాలయాన్ని సందర్శించిన నాటికి అడిగిన ప్రతి ప్రశ్నలకు సచివాలయ సిబ్బంది సమాధానాలు చెప్పాలన్నారు.  అనంతరం అక్కడ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని సందర్శించి పరిశీలించి ఎన్ని దినాల్లో పూర్తి అవుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ ను అడిగి తెలుసుకున్నారు.  అన్ని సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావాలని ఆదేశించారు.  వాలంటీర్లుగా ఉన్న సిబ్బంది అందరూ మీ మీ విధులను పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండాలన్నారు.  అనంతరం ఆనందపురం మండలం గిడిజాల గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.      అనంతరం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, వై.యస్.ఆర్.రైతు భరోసా కేంద్రాలు, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు  నూతన భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ మూడింటికి స్వంత భవనాలను ఈ యేడాదిలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.  వచ్చే నెల అక్టోబరు 1వ తేది నుండి సి.సి.రోడ్లు, కాలువలు నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  రహదారి సౌకర్యం లేని గిరిజన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, తహసిల్థార్లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.  

Bheemunipatnam

2020-09-17 21:15:48

నేషనల్ హైవే భూసేకరణను సత్వరం పూర్తిచేయాలి..

జాతీయ రహదారి భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఆనందపురం, అనకాపల్లి 6 లైన్ల జాతీయ రహదారి భూ సేకరణకు సంబంధించి అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత వరకు చేసిన భూ సేకరణకు సంబంధించి చెల్లింపులు చేసింది లేనిది అడిగి తెలుసుకున్నారు.  పెండింగ్  సమస్యలపైన, జాతీయ రహదారి ప్రగతిపైన ప్రత్యేక ఉప కలెక్టర్ (ఎన్.హెచ్.16) ఎం. సూర్యకళ, తహసిల్థార్లతో చర్చించారు.  భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  ఈ సమావేశంలో  ప్రాజెక్టు డైరక్టర్, ప్రత్యేక ఉప కలెక్టర్ (భూ సేకరణ ఎన్.హెచ్.16) ఎం.సూర్యకళ, సబ్బవరం, అనకాపల్లి, ఆనందపురం మండలాల తహసిల్థార్లు, తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2020-09-17 21:13:50

మచిలీపట్నంలో అత్యధికంగా 5.5 సె.మీ వర్షపాతం

కృష్ణా జిల్లా కేంద్ర నగరం మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం 3.55 గం.ల నుంచి గంటన్నర సేపు  రికార్డ్ స్థాయిలో 5.5 సె.మీ వర్షం  కురవటంతో వర్షపు నీటిలో పట్టణంలో అన్ని ప్రదాన రహదారులు  పూర్తిగా జలమయం అయ్యాయి. కేవలం గంటన్నరలో ఇంత వర్షం కురవడంతో డ్రైనేజీల మురుగు నీరు కూడా రోడ్లపైకి వచ్చింది. ఇక్కడి వరదనీటిని బయటకు పంపే అవకాశం లేకపోవడంతో నీరు మొత్తం రోడ్లపైనా, పంట కాలువల్లోనే ఉండిపోయింది. కాగా ఈనెల 14 ఉదయం నుండి 24 గంటల్లో కురిసిన 6.5 సె.మి వర్షం నీరు ఇంకా నిల్వ ఉండటం, దానికి తోడు ఈ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి తోడై అనేక పల్లపు ప్రాంతాల్లో వాననీరు ప్రవహిస్తోంది. ఇదే ఇటీవల గంటన్నరలో రికార్డ్ అయిన అత్యధిక వర్షపాతం అని  వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు వర్షంతో నగరంలోని రోడ్లలోపై వర్షపు నీరు లో అనేక వాహనాలు నీటమునిగాయి.సాయంత్రం కూడా రాకపోకలకు అనుకూలంగా లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Machilipatnam

2020-09-17 21:12:36

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే..ఇంటికి పంపిస్తా

ప్రభుత్వ సేవల పరిష్కారంలో అలసత్వం వారిని విధుల నుంచి తొలగిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష హెచ్చరించారు. గురువారం నగరపాలక సంస్థలో సెక్టోరల్ ఆఫీసర్స్, అడ్మిన్, వెల్ఫేర్  సెక్రటరీ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్పోరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యలను సమయానికి పూర్తి చేసి, మీ లాగిన్ లో ఉన్న ఫైల్స్ అన్నీ మీ పై అధికారులకు, (ముందుకు) ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. నగరంలో 50 వార్డులలో వార్డ్ సెక్రటరీలు షాపుల నీ సర్వే చేసి వాటికి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా పరిశీలించాలని ఆదేశించారు. లేని వాటికి కొత్తగా దరఖాస్తులు చేయించి కార్యాలయానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలన్నారు. నగరంలో కొత్తగా కడుతున్న గృహాలు వాటి అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించాలని, లేని వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బందిని కలుపుకొని అన్ని పనులు చూడాలని, సమస్యల తో వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి దరఖాస్తులు గడువులోపు పరిష్కరించాలని, వివిధ ప్రభుత్వ పథకాలు సకాలంలో సమర్థవంతంగా ప్రజల ముంగిటకు అందు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, మేనేజర్ హసిమ్,సెక్టోరల్ ఆఫీసర్లు సేతు మాధవ్, గాలి సుధాకర్, రవి, నీలకంటేశ్వర రావు, మధు బాబు, రవికాంత్, ముని రాజా, కరుణాకర్, నరేష్, రమణ, అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

2020-09-17 21:11:06

శభాష్ శ్రీకాకుళం..

కోవిడ్ ఆసుపత్రుల నిర్వహణలో శ్రీకాకుళం జిల్లాకు ప్రధమ స్ధానం లభించింది. రాష్ట్రంలో కోవిడ్ సేవలు అందిస్తున్న 229 ఆసుపత్రుల్లో నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకోగా 2109.89 సగటు రేటింగు పాయింట్లతో జిల్లా ప్రధమ స్ధానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా 1812.80 సగటు పాయింట్లతో ద్వితీయ స్దానంలోను, కృష్ణా జిల్లా 1806.37 సగటు పాయింట్లతో తృతీయ స్ధానంలో నిలిచింది. జిల్లాలో 14 ఆసుపత్రులు కోవిడ్ సేవలు అందించుటకు గుర్తించగా ఇప్పటి వరకు 13 ఆసుపత్రులు సేవలు అందిస్తున్నాయి. టెక్కలి జిల్లా ఆసుపత్రి, జెమ్స్ ఆసుపత్రి, లైఫ్ ఆసుపత్రి, శాంతి ఆసుపత్రి జిల్లా స్ధాయి ఆసుపత్రుల పాయింట్ల పట్టికలో నంబరు 1 రేటింగు పాయింట్లు సాధించాయి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, కిమ్స్, అమృత, పాలకొండ ఏరియా ఆసుపత్రి, సింధూర ఆసుపత్రి నంబరు 2 రేటింగు పాయింట్లు సాధించగా, యునీక్ ఆసుపత్రి నంబరు 4, డా.గొలివి, కమల, పి.వి.ఎస్.రామ్మోహన్ ఆసుపత్రులు నంబరు 5 రేటింగు పాయింట్లు సాధించాయి. 

Srikakulam

2020-09-17 21:01:49

మహిళలు మరింత ఆర్ధికంగా ఎదగాలి..సభాపతి

మహిళలను మహోన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడమే ముఖ్య మంత్రి లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస జూనియర్ కళాశాల ప్రాంగణంలో వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనతో మహిళా సాధికారిత దిశగా పయనించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నుండి నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో వివిధ పథకాల క్రింద ఆర్ధిక సహాయం జమ చేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ కార్యక్రమాలలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని సభాపతి చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలని ఉవ్విళ్ళూరుతున్నారని తెలిపారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి,   వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం పుట్టారని కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో ఇచ్చిన హామీలను నవరత్నాలలో చేర్చి ఒకటిన్నర సంవత్సరంలో 90 శాతం వరకు  అమలుపరిచిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. సూర్యోదయం రాకుండా ముందుగానే ఇళ్ళ వద్దకు వాలంటీర్లు వచ్చి పింఛను అందిస్తున్నారని తెలిపారు. పేదలకు 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చుటకు అన్ని ఏర్పాట్లు చేసారని, అయితే కోర్టులో వ్యాజ్యం ఉండటంతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ పాలన మన వద్దకే తీసుకువచ్చారని సీతారాం అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. అదే యువత కోవిడ్ కు ఎదురొడ్డి సేవలు అందించారని ప్రశంసించారు. మహిళలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్య మంత్రికి దక్కుతుందని అన్నారు. వెనుకబడిన వర్గాలను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందని తెలిపారు.    ఈ కార్యక్రమంలో జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, శ్రీరామ్మూర్తి , జెజె మోహన్ రావు, జెకే వెంక బాబు, బొడ్డేపల్లి రమేష్ కుమార్, గురుగుబెళ్ళి శ్రీనివాసరావు, బెండి గోవిందరావు, బెవర మల్లేష్, ఖండపు గోవిందరావు, సువ్వారి గాంధీ ,లోలుగు కాంతారావు, అధికారులు అనధికారు,  కార్యకర్తలు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-17 20:54:42

పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగాలకి దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల సంస్ధలో  టెక్నికల్ అసిస్టెంట్స్ ( గ్రేడ్-౩ ), ఛార్టర్డు అకౌంటెంట్ పోస్టులకు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్న ట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు  గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో కాంట్రా క్ట్ పద్ధతిలో 9 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఒక అకౌంటెంట్ పోస్టును భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టునకు బియస్సీ  అగ్రీకల్చర్/హార్టీకల్చర్/డ్రైలాండ్ అగ్రికల్చర్ లలో ఉత్తీర్ణులై ఉండాలని లేదా బయో టెక్నాలజీ/బోటనీ స్పెషల్ సబ్జెక్టు కలిగిన సైన్స్ గ్రాడ్యుయేట్ గాని లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ / ఆర్గానిక్ పాలిటెక్నిక్ / లాండ్ ప్రొటెక్షన్ నందు డిప్లమో ఉత్తీర్ణులైన వారుగానీ  దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సి.ఏ ఫైనల్ పూర్తి అయినవారు అకౌంటెంట్ పోస్టునకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ అసిస్టెంటు పోస్టునకు నెలకు రూ.22 వేలు, అకౌంటెంట్ పోస్టునకు నెలకు రూ.45 వేలు జీతం ఉంటుందని, ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. అభ్యర్ధులను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ప్రతిభ, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుందని, జనరల్ కేటగిరీకి 35 సంవత్సరాలు, రిజర్వడ్ కేటగిరీ అభ్యర్ధులు 40 సంవత్సరాలు లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్ధులు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతల ప్రతులు, ఇతర వివరాలతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 05.00గం.లలోగా dmskk.apscsc@gov.in మెయిల్ కు పంపాలని అన్నారు. ఇతర వివరాల కొరకు సంస్థ కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 7702003579, 9963479139, 9963479141 సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. నిర్ధేశిత దరఖాస్తును  www.apscscl.in వెబ్ సైట్ నందు డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

Srikakulam

2020-09-17 20:52:34

ఏయూ సిఇఎస్‌సిసి సంచాలకులుగా ఆచార్య బాల ప్రసాద్‌

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నెలకొల్పిన సెంటర్‌ ‌ఫర్‌ ఇన్విరాన్‌మెంట్‌, ‌సస్టైనబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ అం‌డ్‌ ‌క్లైమేట్‌ ‌చేంజ్‌ (‌సిఇఎస్‌సిసి) కేంద్రం సంచాలకునిగా ఏయూ సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ఆచార్యులు ఎస్‌.‌బాల ప్రసాద్‌ ‌నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ పరంగా పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై విస్తృత పరిశోధ నలు జరిపే దిశగా ఈ కేంద్రం పనిచేయాలని సూచించారు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, ప్రపంచ వ్యాప్తగా జరుగుతున్న పర్యావరణ మార్పులు, సమస్యలపై పరిశోధనలు జరిపి తగిన పరిష్కారాలు చూపే దిశగా కేంద్రం పనిచేయాలన్నారు. తద్వారా ఏయూకి దేశంలోనే మరింత గుర్తింపు ఏర్పాడుతుందన్నారు. పరిశోధన అంటనే ఆంధ్రాయూనివర్శిటీ అనే స్థాయికి తీసుకురావాలని విసి సూచించారు. 

విశాఖపట్నం

2020-09-17 19:53:54

థర్మల్ స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతి...

సచివాలయ పరీక్షా కేంద్రాల్లో తప్పని సరిగా అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాత మాత్రమే లోపలికి అనుమతించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి జరగనున్న సచివాలయ  పరీక్షల నిర్వహణపై  గురువారం వై.ఎస్.ఆర్. భవన్ నోడల్ ఆఫీసర్స్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గట్టి బందోబస్తు మధ్య పకడ్బందీగా ఈ పరీక్షలు  నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షకు వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలు వెలుపలే ఉండేలా చూడాలన్నారు. ప్రతి సెంటర్ లో సెల్ ఫోన్ నిషేధించి  ప్రతి సెంటర్లో ఒక వీడియో గ్రాఫర్ ని గ్రాఫర్ ఏర్పాటుచేసి  పరీక్ష మొత్తం వీడియోలు తీయించాలన్నారు.  శానిటరీ సిబ్బంతితో ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. భౌతిక దూరం తోనే పరీక్షలు నిర్వహించాలన్న ఆయన ఈ రెండు రోజులు 37 సెంటర్లును పరిశీలించి సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక చూడాలని ఆదేశించారు. ప్రతి సెంటర్లో మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, వెలుతురు వుండాలని మరియు మీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు ఉన్నా మీ మీద చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, ఎంఈఓ సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ సుధారాణి, మేనేజర్ హసీమ్, డీ ఈ లు విజయ్ కుమార్ రెడ్డి, గోమతి, శానిటరీ సూపర్వైజర్ గోవర్ధన్, ఏర్పేడు, కెవిబిపురం, చిన్నగొట్టిగల్లు తాసిల్దార్ లు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Tirupati

2020-09-17 16:29:41

మానవజన్మ సాకారమవ్వాలంటే నిండైన సేవ ఒక్కటే మార్గం.. కొప్పల రామ్ కుమార్

విశాఖ బిజేపి దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ జన్మదిన వేడకలు పూర్తిసేవా కార్యక్రమాలు చేస్తూనే నిర్వహించారు. రెండు రోజులగా నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు పళ్లు, రొట్టెల, ఆహార పొట్లాలు అందించి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు రామ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడు తల్లిదండ్రుల ద్వారా జన్మనిచ్చినా, మన జన్మ సాకారం కావాలంటే నిండైన హ్రుదయంలో ఎదుటివారికి నిశ్వార్ధంగా సేవలు చేసినపుడే అది సాకారం అవుతుందని అన్నారు.  ప్రతీఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తన సేవా కార్యక్రమాలు నిరుపేదలు, ఆసుపత్రులు, అనాద ఆశ్రమాల్లోనే నిర్వహించామన్నారు. కరోనావైరస్ విజ్రుంభిస్తున్న తరుణంలో ఎందరో అభాగ్యులు పట్టెడు అన్నం కోసం అలమటిస్తున్నారని, అలాంటి వారికి నావంతు సహాయంగా నిరవధికంగా సేవలు చేస్తున్నట్టుచెప్పారు. ఈ కార్యక్రమంలో అలసట ఎరుగకుండా తనపోటు సేవలు అందించిన బిజెపి కార్యకర్తలకుకూడా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన రామ్ కుమార్ కరోనా వైరస్ నియంత్రణ జరిగి జనజీవనానికి మార్గం సుగమం చేయాలని ప్రార్ధించినట్టు చెప్పారు.

Visakhapatnam

2020-09-17 16:09:42

మహిళల ఆర్ధిక స్వావలంబనకు వైఎస్సార్ ఆసరా..

మహిళల ఆర్ధిక స్థితిగతులను పెంచి ఆర్ధిక స్వాతంత్య్రం రావాలనే ఉద్దేశ్యంతో వై.యస్.ఆర్.ఆసరా పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం చాపురం పంచాయతీ, గోవింద్ నగర్ కాలనీ లో  వై.యస్.ఆర్. ఆసరా వారోత్సవాల కార్యక్ర మం జరిగింది.  ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా  ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్ధిక స్వావలంబన దిశగా తీసుకువెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆర్థికస్థితి గతులు పెంచి, ఆర్థిక స్వతంత్రం రావాలని ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. ఒక కుటుంబంలోని మహిళలు బాధ్యతగా వ్యవహరి స్తారని, అటువంటివారికి అవసరమైన శక్తిని అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అలాంటి భావజాలానికి అనుకూలంగానే ప్రభుత్వం ఇన్నిరకాల పథకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు. 45 ఏళ్ళు పైబడిన మహిళలకు  వై.ఎస్.ఆర్ చేదోడు ద్వారా రూ.18,750 డబ్బు ఇచ్చినా, ఇప్పటి వరకు వ్యాపారం చేస్తున్న వారికి రూ.75,000/-లను తక్కువ వడ్డీకే అందించి డీ సెంట్రలైజ్ చేసి దానితో మల్టీ నేషనల్ కంపెనీలతో టైఅప్ అయ్యి వారి దగ్గర కొన్న సరుకులు, తక్కువ ధరకే అందించి ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా చేసే ఏర్పాట్లన్నీ దీనిలో భాగమేనని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఏ బలమైన సమాజానికి మహిళలే ఆయువుపట్టు అని గుర్తించి, వారికి ఆర్థిక స్వతంత్రం కలిగి ఉండేలా చేయడం, వారి సామాజిక స్థితిగతులు మెరుగుపరచడం, పేదలకు ఆదుకునే ప్రభుత్వం ఉంది అనే ధైర్యాన్ని అందించేందుకు ఇలాంటి పథకాలు అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. సంపాదన చేసుకోడానికి మహిళలు ముందుకు రావడం ద్వారా కుటుంబంలో ప్రముఖ పాత్ర  నిర్వహిస్తున్నారని తెలిపారు.  పెద్ద ఎత్తున ఇంత ధనాన్ని ప్రభుత్వ పధకాల ద్వారా పేదలకు అందచేసే ప్రక్రియ ఇలానే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు కోసం ధనాన్ని కేటాయించిన కార్యక్రమాలు  లేవని, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని కితాబిచ్చారు. దీర్ఘ కాలంలో దీని తాలుకా ప్రయోజనాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. సమాజాభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి మరింత ఆర్థిక స్వాతంత్య్రానికి, సామాజిక స్థితిగతులు పెరగడానికి ముఖ్యంగా మహిళకు ప్రయోజనంగా ఈ పథకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు  బి.నగేష్ , ఏరియా కో ఆర్డినేటర్  కొండలరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి కొటేశ్వరమ్మ, కోశాధికారి హేమలత, ఏ.పి.ఎం త్రినాధమ్మ ,  అల్లు లక్ష్మీనారాయణ ,ముకళ్ల తాతబాబు ,గుడ్ల దాము ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-17 15:49:56

సచివాలయ అభ్యర్ధులూ ఈ సూచనలు మీకోసమే..

 గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు జిల్లాలో పూర్తి స్ధాయిలో ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌళికసదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అభ్యర్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్.టి.సి బస్సులు ఏర్పాట్లు చేసామని అన్నారు. దూర ప్రాంత కేంద్రాలకు వెళ్ళే అభ్యర్ధులకు కూడా రవాణా సౌకర్యంగా ఉండే విధంగా వాహనాలను అధిక ట్రిప్పులు ఏర్పాట్లు చేసామని కలెక్టర్ పేర్కొన్నారు. సచివాలయ పరీక్షార్ధులను ఉద్దేశించి గురు వారం ఒక వీడియో మెసేజ్ ను కలెక్టర్ నివాస్ విడుదల చేస్తూ ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలని ఆకాంక్షించారు. సూచనలు ఈ విధంగా ఉన్నాయి. · పరీక్షల కోసం అభ్యర్ధులకు ఇచ్చిన సూచనలు పక్కాగా పాటించాలి · రైటింగ్ పాడ్ తీసుకు రావాలి  · అభ్యర్ధులు విధిగా పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు,  ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగు లైసెన్సు వంటి ఏదో ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి. ·ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, బాగా చిన్నదిగా ఉన్నా, ఫోటోపై సంతకం లేకపోయినా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన మూడు (3) పాస్ పోర్టు సైజు ఫోటోలను తీసుకు రావాలి. ఫోటోలు తీసుకు రాని వారికి పరీక్షలకు అనుమతించరు. ·అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగు చేయుటకు ఉదయం 8 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షలకు ఒంటి గంట నుండే అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి. · మోబైల్, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్స్, ఐ పాడ్, బ్లూ టూత్, పేజర్స తదితర ఏ ఎలక్ట్రానిక్ పరికరం అనుమతించడం జరగదు. నిబంధనలు అతిక్రమించిన వారిని పరీక్షలకు అనర్హులుగా చేయడం జరుగుతుంది. ·అభ్యర్ధులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తో మాత్రమే ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్ పై రాయాలి. ఇతర పెన్నులు వినియోగం చెల్లదు. అటువంటి జవాబు పత్రాలు అనర్హమైనవిగా గుర్తిస్తారు. ప్రశ్నాపత్రం బుక్ లెట్ సిరీస్ (ఏ,బి,సి,డి)ను ఓఎంఆర్ షీట్ లో నిర్ధేశిత ప్రదేశంలో విధిగా నింపాలి. ·అభ్యర్ధులు నిర్ధేశిత ప్రదేశంలో హాల్ టికెట్ నంబరు రాయాలి. కేటాయించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఇన్విజిలేటర్ తో సంతకం చేయించుకోవాలి. · ఓఎంఆర్ షీట్ ఒరిజినల్, డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులకు అందించడం జరుగుతుంది. డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులు తీసుకొని వెళ్ళవచ్చును. ·ప్రశ్నాపత్రంపై ఎటువంటి రాతలు ఉండరాదు. జవాబులను సైతం మార్కు చేయరాదు. ·ఓఎంఆర్ షీట్ పై వైట్ నర్ (కరెక్షన్ ఇంక్) లేదా ఇతర మార్కర్లు వినియోగించితే అటువంటి ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కావు ·పరీక్షా రూమ్ లో ఇతర అభ్యర్ధులతో మాట్లాడటం, ఇతర అభ్యర్ధులను డిస్టర్బ్ చేసే వారిని పరీక్షల నుండి అనర్హులుగా పరిగణిస్తారు. ·పరీక్షా కేంద్రంలో ఎటువంటి అసభ్యకర ప్రవర్తనను అనుమతించేది లేదు. అటువంటి అభ్యర్ధులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరుగుతుంది. ·తరచూ మరుగుదొడ్లకు వెళ్ళడానికి అనుమతించడం జరగదు. అత్యవసరమైతే మినహా వెళ్ళరాదు. చూచిరాతలు, ఇతరత్రా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఎడల అనర్హులుగా చేయడం జరుగుతుంది. ·పరీక్షా సమయం 150 నిమిషాలుగా మాత్రమే.  ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, తెలుగు మాద్యమాల్లో ఉంటుంది. ·నెగిటివ్ మార్కులు : తప్పుగా రాసిన జవాబులకు నెగిటివ్ మార్కులు ఉంటాయని అభ్యర్ధులు గమనించాలి. తప్పుగా నాలుగు జవాబులు రాస్తే ఒక మార్కు పోతుంది. ·పరీక్ష పూర్తి అయ్యే వరకు ఏ అభ్యర్ధిని బయటకు విడిచిపెట్టడం జరగదు. ·సహాయకలులు (స్కైబ్) అవసరమని ముందుగా కోరిన విభిన్న ప్రతిభావంతులకు సహాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికప్పుడు సహాయకులు అవసరమని కోరితే సమకూర్చడం జరగదు. · పరీక్షా కేంద్రం వివరాలను https://vsws.ap.gov.in లేదా http://gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించి అభ్యర్ధులు పొందవచ్చును. ·కోవిడ్ దృష్ట్యా సురక్షిత చర్యలు తీసుకోవాలి · ప్రతి అభ్యర్ధి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి ·మాస్కు విధిగా ధరించాలి. మాస్కు లేకపోతే పరీక్షా హాల్ లోకి ప్రవేశం లేదు. సొంతంగా శానిటైజర్ తెచ్చుకోవాలి ·ఎవరి తాగు నీరు వారు తీసుకు రావడం ఉత్తమం. ఇతర వ్యక్తులు ఉపయోగించిన వస్తువులు వినియోగించకుండా ఉండవచ్చు. పారదర్శకంగా ఉన్న నీళ్ళ బాటిల్స్ తెచ్చుకోవచ్చు. · కోవిడ్ లక్షణాలు ఉన్న అభ్యర్ధులు తమ పరిస్ధితిని తెలియజేయాలి. అటువంటి వారికి ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు ·పరీక్ష రాసే సమయంలో ఎటువంటి అస్వస్తత కనిపించిన పరీక్షల నిర్వాహకులకు తెలియజేయాలి.

Srikakulam

2020-09-17 15:20:53

ఆప్కోలో ఈ సూపర్ ఆఫర్లు మీకోసమే...

దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా ఆప్కో చేనేత వస్ర్తాలపై ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బి.ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దసరా, దీపావళి సందర్భంగా ఎంపిక చేసిన చేనేత వస్త్రాలకు ఒకటి కొంటే రెండు లేదా ఒకటి ఉచితంగా , అలాగే అన్నిరకాల చేనేత వస్త్రాలపై 30శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదవకాశాన్ని చేనేత వస్త్రప్రియులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధర్మవరం, వెంకటగిరి, మాధవరం, ఉప్పాడ, గుంటూరు, బందరు, రాజమండ్రి, మంగళగిరి పట్టు మరియు కాటన్ చీరలు , దుప్పట్లు, బెడ్ షీట్స్, లుంగీలు, టవల్స్, షర్టింగ్ క్లాత్ మొదలైన వస్త్రాలు లభించనున్నాయని, విరివిగా వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఈ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్టు ఆయన తెలియజేశారు.

Srikakulam

2020-09-17 15:14:30

ఓజోన్ పొర కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరిది..

ఓజోన్ పొరను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు పెంచాలని గాయత్రీ విద్యాపరిషత్‌ ఉపాధ్యక్షులు డి.దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. ప్రపంచ ఓజోన్‌ ‌దినోత్సవాన్నిపురష్కరించుకొని గాయత్రీ విద్యాపరిషత్‌ ‌డిగ్రీ, పీజీ కళాశాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఏటా ఓజోన్ దినోత్సవా న్ని క్రమం తప్పకుండా నిర్వహించి ప్రాంగణంలో మొక్కలు నాటతమాన్నారు. అంతేకుండా వాటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంచుతామని కూడా వివరించారు.  . పర్యావరణ హితమైన కార్యక్రమాలు తాము నిత్యం నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో జీవీపీ , ఇతర యాజమాన్య సభ్యులు డీవీఎస్‌ ‌కామేశ్వర రావు, ఆచార్య ఎ.నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.‌రజని, యూజీ డైరక్టర్‌ ఆచార్య ఐ.ఎస్‌.‌పల్లవి, పర్యావరణ విభాగాధిపతి డాక్టర్‌ ‌జి.లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో వాలంటీర్లు వ్యక్తుల మధ్య దూరం పాటిస్తూ పాల్గొన్నారు. 

Visakhapatnam

2020-09-16 20:36:47

విశాఖ జిల్లాలో గ్రూప్3 విజేతలకు పోస్టింగులు ఇవ్వాలి..

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ 3(‌పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4) ‌పరీక్షల్లో  ఉత్తీర్ణత సాధించిన జిల్లాలోని పలువురు అభ్యర్థులు పోస్టింగ్‌ ‌కోసం నిరీక్షిస్తున్నారు. విశాఖలో బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ,  2018 డిసెంబర్‌లో గ్రూప్‌ 3 ‌నోటిఫికేషన్‌ ‌వెలువడడం,  2019 ఏప్రిల్‌  ‌లో ప్రాథమిక పరీక్షను ప్రభుత్వం నిర్వహించిందన్నారు.  ఆగస్టు 2019లో మెయిన్స్ ఎగ్జామ్‌ ‌నిర్వహించి,  ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారన్నారు.  సర్టిఫికెట్‌ ‌వెరిఫికేషన్‌ ఆగస్టు 10న నగరంలోని డీపీఓ కార్యాలయంలో నిర్వహించారని చెప్పారు. ఇతర జిల్లాల్లో అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వడం, వారు  మూడు నెలలకు పైగా జీతాలు కూడా తీసుకున్నారని, విశాఖజిల్లాలో  మాత్రం పోస్టింగ్‌ ‌కోసం ఎదురు చూస్తునే ఉన్నామన్నారు.  తాము  ఇప్పటికే ఏడు నెలలుగా పైగా సర్వీసును కోల్పోయామని, ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామని, ఇప్పటికైనా తమకు పోస్టింగు ఇప్పించాలని కోరారు. 

Visakhapatnam

2020-09-16 20:25:42