ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ప్రొఫిషనల్ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పీజీ పరీక్షల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.ఆదిలక్ష్మి తెలియజే శారు. బుధవారం ఆమె ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, సైన్సు కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఆర్టస్ విభాగంలో తొలిదశలో సెప్టెంబరు 28 నుంచి ఆర్టస్ విభాగంలో ఆంత్రపాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, ఫైన్ ఆర్టస్, హిందీ, సంస్కృతం, యోగా కోర్సులకు, రెండో దశలో అక్టోబరు 7వ తేదీ నుంచి కామర్స్-మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, చరిత్ర, ఆర్కియాలజీ, హెచ్ఆర్ఎం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, సంగీతం, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, థియేటర్ ఆర్టస్, వుమెన్ స్టడీస్, సోషియాలజీ, హెచ్ఆర్డి కోర్సులకు పరీక్షలు జరుగుతాయన్నారు. లా పరీక్షలు అక్టోబరు 7 నుంచి, బిఫార్మరీ పరీక్షలు 21 సెప్టెంబరు నుంచి , బిఇడి పరీక్షలు అక్టోబరు 8 నుంచి నిర్వహిస్తారు. పూర్తి వివరాలను ఏయూ వెబ్సైట్ నుంచి పొందాలని సూచించారు.
దక్షిణ భారత హిందీ ప్రచారసభ చెన్నై నిర్వహించే వివిధ హిందీ పరీక్షలకు సమయం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు వర్తమానం పంపిం ది. ఆశక్తిగల అభ్యర్ధులు పది రూపాయలు అపరాధ రుసుతో ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చని భీముని పట్నంలోని స్థానిక ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షుడు కేఎస్ఆర్ కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందీ ప్రచారసభ పరీక్షలకు గడుపు పూర్తికాగా, అభ్యర్ధుల నుంచి వస్తున్నఅభ్యర్ధన మేరకు 25వ తేదీవరకూ గడువు పొడిగింపు ప్రకటన చేసిందన్నారు. పరీక్షలు కట్టిన విద్యార్ధులకు ఈనెల 31, నవబర్ 1వ తేదీల్లో స్థానిక పండిత్నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల కేద్రంగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆశక్తివున్న అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరీక్షఫీజులు, ధరఖాస్తులు ఇతర వివరాలకు 8985647419లోగానీ స్వయంగా గానీ సప్రదించాలని నిర్వాహకులు కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార–నాగావళి అనుసంధాన హైలెవెల్ ప్రాజెక్టును ప్రాధాన్యతా రంగ ప్రాజెక్టుగా ముఖ్య మంత్రి ప్రకటించారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. బూర్జ మండలం లంకం, చిన్న లంకం వద్ద వంశధార నాగావళి అనుసంధానం జరుగుతున్న హై లెవెల్ కెనాల్ ను సభాపతి మంగళ వారం సందర్శించారు. అనంతరం రైతులతో భూసేకరణపై సభాపతి చర్చించారు. హిర మండలం వద్ద వంశధార నుండి నాగవళి లో నారాయణపురం ఆనకట్ట ఎగువన కలుస్తుందని, చీడివలస నుండి చినలంకం వరకు సుమారుగా 5 వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందుతుందని చెప్పారు. గజ్జల గెడ్డ, దేశయగెడ్డ,ఓని గెడ్డలకు ప్రతి సంవత్సరం వరద సమయంలో ముంపుకు గురవుతున్నాయని ఈ సమస్యకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. కాలువ దిగువన కొల్లివలస - నారాయణపురం రోడ్డు నీరు వెళ్లక ముప్పు గురవుతారని రైతులు సభాపతి దృష్టికి తీసుకు వెళ్ళారు. చీడివలస దిగువ నుండి నీరు పోవటానికి 3 అండర్ టర్నల్ ప్రతిపాదన ఉన్నాయని, వాటి సామర్ధ్యం ను పెంచాలని సభాపత్ తమ్మినేని అధికారులకు సూచించారు. దిగువన ఉన్న రోడ్డు ఎత్తు పెంచి కల్వర్టులు నిర్మిస్తామని రైతులకు తెలిపారు. హై లెవెల్ కాలువ నిర్మాణం వలన రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెట వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. హై లెవెల్ కెనాల్ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు హైలెవెల్ కాలువ నిర్మాణ వివరాలను వివరించారు. భూ సేకరణకు సంబంధించి కొంత మేర చెల్లింపులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, భూ సేకరణ ఉప కలెక్టర్ కాశీవిశ్వనాథ రావు, జలవనరుల శాఖ ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు
శ్రీకాకుళం జిల్లాలో మంచి పర్యాటక ప్రదేశంగా దాలసరి జలపాతంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. మందస మండలం చీపి పంచాయతీ దాలసరి గ్రామం వద్ద కొత్తగా కనుగొన్నజలపాతాన్ని మంత్రి మంగళ వారం సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా ప్రకృతి శోయగాలకు నిలయమని మంత్రి అన్నారు. పలాస నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదని ఇందులో భాగంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని ఆయన అన్నారు. దాలసరి జలపాతం రాబోయే రోజుల్లో ఒక మంచి పర్యాటక స్ధలంగా ఫరిడవిల్లగలదని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలపై వారం రోజుల్లో కార్యాచరణ తయారు చేయుటకు చర్యలు చేపడతామని అన్నారు. అవసరమైతే ఒరిస్సా ప్రభుత్వంతోను, ఐ.టి.డి.ఎ అధికారులతోను మాట్లాడి దాలసరి జలపాతం అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. పలాస నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన జలపాతాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు గొప్ప ఆహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్ గా తయారు చేయుటకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈసందర్భంగా దాలసరి గ్రామస్తులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు.
గ్రామ,వార్డు సచివాలయ రిక్రూట్ మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళ వారం నాడు స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహించే అధికారులు, పరీక్షల ప్రారంభానికి ముందు, జరుగుతున్న సమయంలో , పూర్తయిన తర్వాత చేయవలసిన పనుల మీద పూర్తి అవగాహనతో శ్రధ్ధ తో పని చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సీరియస్ గా తీసుకోవాలని కమిట్ మెంట్ తో పని చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణ లో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా సక్రమంగా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు విద్యుత్,గాలి, వెలుతురు సక్రమంగా అందే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆయన అన్నారు. పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూములకు భద్రత కల్పించాలని, రూట్ అధికారులు మెటీరియల్ తీసుకు వెళ్ళేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలని తెలిపారు. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల నిమిత్తం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలవద్ద పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రతీ అభ్యర్థికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నారు. శానిటైజర్ వేసి, చేతులు శుభ్రం చేసుకున్న తరువాతే లోపలికి పంపించాలని చెప్పారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని, అవసరమైతే ఉపయోగించడానికి ప్రతీ కేంద్రంలో మాస్కులను కూడా రిజర్వులో ఉంచాలని సూచించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు పరీక్షలు రాసేందుకు అనుగుణంగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్దా ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రతీ పరీక్షా కేంద్రంవద్ద 2 ఎఎన్ఎం లను, 2 ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ స్కానర్ లు, పల్స్ ఆక్సీమీటర్, అవసరమైన మందులను కూడా సిద్దంగా ఉంచాలని డిఎంహెచ్ఓ కు సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా ఆర్టిసి అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మెటీరియల్ తీసుకు వెళ్ళేందుకు డిజిటి బస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. మొత్తం 1,50,441 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు, ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతీ అభ్యర్థి కనీసం 45 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉందన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల మధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు అనువుగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెంటర్ల స్పెషల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, ఛీఫ్ సూపరింటిండెంట్లు, అదనపు ఛీప్ సూపరింటిండెంట్లు, హాల్ సూపరింటిండెంట్లను, ఇన్విజిలేటర్లను నియమించినట్లు వారికి సమగ్ర శిక్షణ ను ఇచ్చినట్లు వివరించారు.
ఈ సమావేశంలో రూరల్ పోలీసు సూపరింటెండెంట్ కృష్ణా రావు, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జీవియంసి కమీషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ గోవింద రావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, డి ఆర్ ఓ ఎ.ప్రసాద్, ఆర్డీఓ కిషోర్, జిల్లా పరిషత్ సిఈఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ విజయ లక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డిటిసి రాజారత్నం, ఈపీసీడీఎల్ ఎస్ ఈ సూర్య ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గా ఘనంగా నిర్వహించారు. మంగళవారం వంశధార సర్కి ల్ కార్యాలయం వద్ద ఇంజనీర్లు అందరూ విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడా రు. ఈ సందర్భంగా తోటపల్లి ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమల రావు మాట్లాడుతూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తి, అంకితభావంతో ఇంజినీర్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. మోక్షగుండం ఆలోచనా విధానం ఇంజనీర్లకు ఎంతో ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. ఇంజినీర్లు దేశ ప్రగతిలో ముఖ్య భూమిక పోషించారని, దానిని కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఉన్నాయని వాటిని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క ఇంజనీరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు, తోటపల్లి ఆధునీకరణ పనులు, ఆఫ్ షోర్ ప్రాజెక్టులతో పాటు ఇతర జలవనరులను ప్రజలకు ప్రయోజనకరంగా తీర్చిదిద్ధి చిరస్మరణీయంగా ఉండాలని ఆయన కోరారు. మోక్షగుండం పనితనం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన ఎంతో నీతి నిజాయితీలతో పనిచేశారని కొనియాడారు.
శ్రీకాకుళం జిల్లాలో జగనన్న తోడు దరఖాస్తులు త్వరితగతిన పరిశీలించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి విభాగం సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. జగనన్న తోడు, వై,యస్.ఆర్ బీమా పథకాలపై జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. జిల్లాలో జగనన్న తోడు పథకానికి 34,552 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంబంధిత బ్యాంకులకు పంపిస్తారని చెప్పారు. బ్యాంకులు వారం రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. జగనన్న తోడు, ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల పథకం (పి.యం. స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) క్రింద చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డు జారీ చేయడమే కాకుండా సున్నా వడ్డీకి రూ.10 వేలు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తాయని వివరించారు. అక్టోబరు 4వ తేదీన జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సంయుక్త కలెక్టర్ చెప్పారు.
బ్యాంకులు సత్వరం ఈ ప్రక్రియను పూర్తి చేసి సహకారాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకానికి ప్రాధాన్యతను ఇస్తూ చిరు వ్యాపారులకు తోడుగా ఉండాలని సంకల్పించాయని చెప్పారు. వై.యస్.ఆర్ బీమా నమోదు ప్రక్రియ చేపట్టాలి : వై.యస్.ఆర్ బీమా క్రింద అర్హులైన అందరూ నమోదు కావాలని సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. జిల్లాలో బియ్యం కార్డు ఉన్న వారందరూ అర్హులేనని ఆయన పేర్కొన్నారు. వై.యస్.ఆర్ బీమా ప్రీమియంగా పేదల తరపున ప్రభుత్వమే 15 రూపాయలు చెల్లిస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో గతంలో భారీ ఎత్తున జన్ ధన్ ఖాతాలను ప్రారంభించడం జరిగిందని ఆ ఖాతాల పరిస్థితిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.నగేష్, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి.హరి ప్రసాద్, డిసిసిబి డిజిఎం ప్రసాద్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని విశాఖ దక్షణిణ నియోజకవర్గం బీజెపీ కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ అన్నారు. మంగళవారం విశాఖలోని గోషా ఆసుప త్రిలో రోగుల బంధువులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు 200 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ విజ్రుం భిస్తున్న సమయంలో తమవంతుగా నిరుపేదలకు సహాయం చేయాలనే ప్రధాని మోడి ఇచ్చిన పిలుపుతో తాను ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా చేపడుతు న్నట్టు చెప్పారు. ఆసుపత్రి కష్టాలతో వున్న రోగులకు తమవంతుగా చేసే ఈ చిన్న ఆహార సహాయం చేయడం ద్వారా వారికి కొద్దిగా స్వాంతన కలుగుతుందన్నారు. తాను చూపట్టే ఈ అన్నసంతర్ఫణ కార్యక్రమాల్లో బీజేపి నాయకులు, కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటున్నారని అన్నారు. ఘోషా ఆసుపత్రికి నిత్యం ఎందరో నిరుపేద రోగులు వస్తారని, అందుకే తమ సేవకు ఈ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నట్టు రామ్ కుమార్ వివరించారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖజిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా.బూసి వెంటకరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విశా ఖలో మీడియాతో మాట్లాడుతూ, దళిత ఎమ్మెల్యే అయిన బాబూరావుపై ఒక మాజీ ఎంపీటీసీ ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే బొలిశెట్టి గోవిందరావుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ప్రోటోకా ల్ పాటించకుండా ఎమ్మెల్యేపై కులపెత్తనం చేయడం దారుణమన్నారు. ఇలాంటి వైఎస్సార్సీపీ నాయకులపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ వ్యవహారాలుంటే ఆవిధంగా చూసుకోవాలి తప్పితే దళితుడనే చిన్నచూపుతో, పార్టీ కార్యకర్తల ముందు పరువుతీసినట్టుగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అధికాపార్టీ దళిత ఎమ్మెల్యేపై చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంభేత్కర్ వారసులంతా ముక్త కంఠంతో ఖండించాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసు కునేలా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే రేపు మంత్రులు, ఆ పై ఎంపీలు ఇలా ఎవరినైనా ఇదే తరహాలో మాట్లాడేందుకు అవ కాశం వుంటుందని అన్నారు. దళితులంతా ఒక్కటేనని విషయాన్ని ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలన్నారు. కార్యక్రమంలో సమాఖ్య కో కన్వీనర్ చింతాడ సూర్యం, బహుజన సేన కార్యదర్శి కొమ్మువీర్రాజు, కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, జి.రాంబాబు, సుధాకర్, మునపర్తి తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న కళ్యాణ మిత్రలకు 14 నెలల పారితోషికాల బకాయిలు వెంటనే చెల్లించాలని, పని భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.కమల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో కళ్యాణ మిత్రలతో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కళ్యాణ మిత్రులకు పారితోషకాలు రెట్టింపు చేసి చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలోహామీ ఇచ్చారని, కానీ నేటి వరకూ దానిని అమలు చేయాలేదన్నారు. బకాయి పడ్డ14నెలల పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.ధనశ్రీ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న కళ్యాణ మిత్రలకు ఉద్యోగ భద్రత, తగిన గుర్తింపు నివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శిబూర.సుబ్రహ్మణ్యం ధర్నాకు మద్దతు తెలియజేస్తూ కళ్యాణ మిత్రులకు 14 నెలల నుంచి పారితోషికాలు బకాయి ఉండటం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని వెంటనే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పి రాజేశ్వరి, జి అరుణ, సిహెచ్. సుమలత, సిహెచ్ అశ్విని, పి దివ్య, శ్రీదేవి, వి. స్వాతి, ఎస్ భవాని ఆర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు నూతన్ నాయుడు లీలలు ఒక్కొక్కటీగా బయటకు వస్తున్నాయి. ఇతనిపై ఇప్పటికే పలు కేసులు బయటపడగా.. తాజాగా మరో మోసం విశాఖలో వెలుగుచూసింది. ఉద్యోగం పేరిట నూతన్ నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణి పేట పోలీస్ స్టేషన్లో ఈరోజు కేసు రిజస్టరైంది. ఎస్బీఐలో రీజినల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదుపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతామని మీడియాకి చెప్పారు. అంతేకాకుండా మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని కూడా వివరించారు... కాగా సీనియర్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్పై కేసులు నమోదయ్యాయి. నూతన్నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్ను సెల్ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించి సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు...
యువతకు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ (సెట్ శ్రీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం, అదే విధంగా వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిచ డానికి, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 15-35 సం. మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులకు మహత్తరమైన అవకాశాన్ని కల్పిస్తూ నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యువ నాయకత్వాలపై అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి సంకల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమము ప్రతి శనివారం నిర్వహించబడం జరుగుతుందని ఆయన వివరించారు. విజయవాడ రమకృష్ణ మఠానికి చెందిన స్వామి సవ్యానంద వంటి ప్రముఖులు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని ఆన్ లైన్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు వంటి కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారని వివరించారు. ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస రావు కోరారు. http://tiny.cc/personalitydevelopment వెబ్ సైట్ లో యవత వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆప్ లైన్ ద్వారా నమోదు చేసుకొన్న అభ్యర్థులకు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ఆన్ లైన్ లో "నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యువ నాయకత్వం" పై ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. వివరములకు కార్యాలయం పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావును 8341478815, 08942240601 నంబరు ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి, సమస్య పరిష్కరించాలని జెడి విజయభారతి( అమృత్) అన్నారు. సోమవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03, 2వ జోనుకు సంబందించి 03, 3వ జోనుకు సంబందించి 03, 4వ జోనుకు సంబందించి 02, 5వ జోనుకు సంబందించి 03, 6వ జోనుకు సంబందించి 03, పి.డి.(యు.సి.డి) సంబందించి 01, మొత్తము 18 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఆమె ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ, ఫిర్యాదులు 03రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
ప్లాస్మా దానకర్తలకు ప్రతి ఒక్కరూ సలాం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ప్రస్తుతం ప్లాస్మా దానకర్తలు కోవిడ్ ను పారద్రోలుతున్నారని, అనేక మంది ప్రాణాలు నిలుపుతున్నారని కొనియాడారు. ప్లాస్మా దానానికి కోవిడ్ వారియర్స్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసిన యువత నిర్ణీత గడువు తరువాత కూడా దానం చేయుటకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. కరోనా భారీన పడిన వారు మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులే అని గుర్తించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేసిన యువత - వి.మురళి కృష్ణ, ప్రశాంత్ పాత్రో,దుప్పల సతీష్ కుమార్,ఇతికర్లపల్లి మహేష్ కుమార్, ఆడిదెల శామ్యూల్,వంటకుల సూర్య నారాయణ మూర్తి,బొర్రా నాగరాజు,ఆర్ వెంకటరమణ, పి వెంకటేష్, ఎస్ చంద్రశేఖర్,కింజరాపు భాస్కర రావులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేసారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రామ్మోహన్, కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సోమేశ్వర రావు,డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ జెమ్స్ ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత, ఆర్ఎంఓ డాక్టర్ బాలమురళి, డిప్యూటీ అర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలో సచివాలయ ఉద్యోగ పోటీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలని నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశిం చా రు. సోమవారం 2 వ క్లస్టర్ లోని భీముని పట్నం మండలం లోని 6 పరీక్షా కేంద్రాల ను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన భీమిలి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ ఆన్స్ పబ్లిక్ స్కూలు, అమేయ పబ్లిక్ స్కూలు, చిట్టి వలస లోని శారదా పబ్లిక్ స్కూలు, జిల్లా పరిషత్ హైస్కూలు, కుమ్మ రిపాలెం లోని తిరుమల హైస్కూలు పరీక్షా కేంద్రాల ను సందర్శించారు. ఈ కేంద్రాలలో ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, శానిటేషన్ లను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. అభ్యర్థుల ను తనిఖీ చేసే గదులను, సామానులు భద్రపరిచే గదులను పరిశీలించారు. అనంతరం భీమిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును సందర్శించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సిసిటీవీ ల నిఘా పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి జోనల్ కమీషనర్ సీహెచ్ గోవింద రావు, తహసీల్దార్ వెంకటేశ్వర రావు, యంపీడీఓ వెంకట రమణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.