1 ENS Live Breaking News

గడువులోగా ఎన్ఏడీ ఫ్లైఓవర్ పనులు పూర్తికావాలి..

విఎంఆర్డిఏ చేపట్టిన ఎన్ఏడి ఫ్లై-ఓవర్ ( ఫై వoతేన) నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్  పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఈమేరకు అదనపు కమిషనర్ మనజిర్ జీలని సామూన్ తో కలిసి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ, ప్రణాళిక ప్రకారం ఈ నెల సెప్టెంబర్ 15 లోపు గోపాలపట్నం వైపు నుంచి వచ్చే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యవలసి ఉండగా నిర్ణీత సమయానికే పనులు పూర్తయ్యాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 15 లోపు మర్రిపాలెం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ 15 లోపు ఎన్ఎస్టీఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే రహదారి పనులు పూర్తి చేసి, అప్పర్ రోటరీ మొత్తాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలని చీఫ్ ఇంజనీర్ కె.రామ్మోహ నరావుని ఆదేశించారు. వంతెన కాంట్రాక్టర్ తో సంప్రదింపులు జరిపి అనుకున్న తేదీల్లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  ఉమా శంకర్ , జనరల్ మేనేజర్  క్రిహ్ష్ణమోహన్, ఈపిసి కాంట్రాక్టర్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఏడీ ఫ్లై ఓవర్

2020-09-16 20:23:54

కరోనా వైరస్ నిర్మూలన కోరుతూ ఎమ్మెల్యే వాసుపల్లి పూజలు

కరోనా వైరస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ సంపత్ వినాయగర్ కు ప్రత్యేక పూజలు చేసినట్టు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పా రు. బుధవారం ఆశీల్ మెట్టలోని శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయగర్ ని దర్శించుకున్న ఎమ్మెల్యే స్వామికి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ వలన రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు మ్రుత్యువాత పడటం తనను ఎంతో బాధకలిగించిందని చెప్పారు. విశాఖలోని ప్రముఖ దేవాలయాలన్నీ తిరిగి కరోనా మహమ్మారి నిర్మూలన జరిగేలా పూజలు చేస్తున్నామన్నారు. నగర ప్రజలు కూడా ఈ వైరస్ నుంచి రక్షణ పొందడానికి సామాజిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4.0 అన్ లాక్ నిబందనలు పాటించాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే దగ్గర్లోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ లో ఖచ్చితంగా 14 రోజులు జాగ్రత్తగా ఉండి మందులు వాడాలన్నారు. ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని ఎమ్మెల్యే వాసుపల్లి సూచించారు.

సంపత్ వినాయగర్ ఆలయం

2020-09-16 20:09:00

సెప్టెంబరు 17 నుంచి 25 వరకూ ఎంసెట్...

శ్రీకాకుళం జిల్లాలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధ వారం మీడియాకి వివరించారు. సెప్టెంబరు 17,18 తేదీలతో సహా  21 నుండి 25 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాల, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాల, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాల, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు జరుగుతాయని ఆయన వివరించారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాలలో 2,725 మంది, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాలలో 3,473 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో 2,213 మంది, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలలో 2,042 మంది 25వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసామని చెప్పారు. పూర్తి స్ధాయి బందోబస్తు ఉందని, 144వ సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత తహశీల్దార్లకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగా హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా కూడా అనుమతించేది లేదని గమనించాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి ఉన్నందున తగిన ఏర్పాట్లు, సురక్షిత చర్యలతో పరీక్షలకు హాజరు కావాలని ఆయన కోరారు.

Srikakulam

2020-09-16 20:07:22

సచివాలయ పరీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలి..

గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్థి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేది వరకు నిర్వహించనున్న గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలపై విజయవాడ నుండి బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లుగానే ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.  ఇప్పటికే ప్రశ్నా పత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయన్నారు.  సరిపడిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.  వైద్య ఆరోగ్య శాఖాధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు.  పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణాకు అంతరాయం లేకుండా రవాణా శాఖ, ఎపిఎస్.ఆర్టి.సి తగు చర్యలు తీసుకుంటారని, విద్యుత్,  గ్రామీణ ప్రాంతంలో డిపిఓ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమీషనర్లు పరీక్ష కేంద్రాల వద్ద శానిటేషన్, తాగునీరు చూడాలని ఆయన సూచించారు.   పరీక్షకు  హాజరయ్యే విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ ఉంటే వారికి పరీక్ష కేంద్రం వద్ద ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలని, ఇన్విజిలేటర్ కు పిపిఇ కిట్ ఇవ్వాలన్నారు.  ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ లు, పిపిఇ కిట్లు ఉండాలని పేర్కొన్నారు.  ఎక్కడా పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.      రాష్ట్ర పట్టణాభివృద్థి మరియు పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో మంచి పేరు వచ్చిందని, కోవిడ్ -19 ఉన్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలను  విజయవంతంగా నిర్వహించాలని కోరారు.  ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు.  మున్సిపల్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలని సూచించారు.  అభ్యర్థులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ  కోవిడ్-19 పాజిటివ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేసి అందులో పరీక్ష పెట్టాలన్నారు.  ప్రతీ పరీక్షకేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలన్నారు.  కోవిడ్ అభ్యర్థులకు మందులు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరఫరా చేస్తారని తెలిపారు.  పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలని చెప్పారు.  పరీక్ష కేంద్రాల వద్ద అవసరం అయితే ఐసిడిఎస్ సిబ్బందిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.   పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు  ముందుగానే చేరుకోవాలని, అక్కడ ధర్మల్ స్కాన్  ఉంటుందని, అక్కడ ఆలస్యం జరుగుతుందని చెప్పారు.  పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్క్ లు ఉండాలన్నారు.  గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.     జిల్లా జాయింట్ కలెక్టర్-1  వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ  పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు.  ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.  జివియంసి కమీషనర్ జి. సృజన మాట్లాడుతూ ఈ మధ్యన ఒక పరీక్షకు అభ్యర్థులకు మాత్రమే ఆర్.టి.సి. బస్సులను నడిపినట్లు చెప్పారు.  ఆలాగే గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలకు ఆర్.టి.సి. బస్సులను అభ్యర్థులకు కోసం మాత్రమే నడిపేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.    ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. కృష్ణారావు, జిల్లా పరిషత్ సిఇఓ నాగార్జున సాగర్, డిపిఒ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-09-16 19:24:05

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు..

విశాఖ జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టరు ఆర్. గోవిందరావు అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వాహనదారులకే కాకుండా ప్రజలందరికీ రహదా రి భద్రతపై  పూర్తి అవగాహన కలిగించాలన్నారు.  ప్రమాదాలకు కారణమౌతున్న అతివేగం, అవగాహనా రాహిత్యం, అలసత్వాల మూలంగా జరిగే ప్రమాదాలు, వాటి వలన కుటుంబాలకు జరిగే నష్టాలపైన తెలియజేయాలన్నారు.  ప్రమాదాలు  జరిగేందుకు అవకాశం వున్న ప్రదేశాలను రవాణా, పోలీసు, ఇంజనీరింగ్ శాఖల అధికా రులు జాయింట్ ఇనస్పెక్షన్ చేయాలన్నారు.  అటువంటి ప్రదేశాలలో తక్షణ చర్యలు, నిర్మాణాలు చేపట్టాలన్నారు. రవాణాశాఖ ఉప కమీషనరు  రాజరత్నం మాట్లా డుతూ గత సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు.  కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడక ముందే జిల్లాలో ప్రమాదాల రేటు 20.95 శాతం తగ్గందని, రాష్ట్ర తగ్గుదల సగటు   కంటే  ఎక్కువగా వుందన్నారు.  కోవిడ్19 మూలంగా వాయిదా పడిన నిర్మాణాలను  వేగంగా పూర్తిచేయాలని వివిధ శాఖల అధికారులకు ఆయన విజ్ఖప్తి చేశారు.  నగరంలో జాతీయరహదారి పై నున్న డివైడర్ల పై పెంచే మొక్కలు ఎత్తుగా పెరిగి నందున క్రాసింగ్స్ వద్ద పాదచారులకు  వాహనాలు కనబడక ప్రమాదాలకు కారణమౌతున్నాయని  పోలీసు శాఖ వారు తెలియజేశారు.  దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జివియంసి వారిని కోరారు. ఈ సమావేశం లో అడిషనల్ ఎస్.పి. బి.అచ్యుతరావు, ఎసిపిలు ఎమ్.ఆర్.కె రాజు, సిహెచ్.పాపారావు, జివియంసి  ఎసి.ఈ. కె.శాంసన్ రాజు, ఆర్.అండ్ బి ఎస్.ఈ.  వి.కేశవరావు, ఎపిఎస్ ఆర్టిసి  డివియం బి.ఎ.నాయుడు,  పంచాయితీరాజ్  ఎస్.ఈ.  జి.సుధాకరరెడ్డి,  కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్  పి.వి.సుధాకర్ , డిఎంఅండ్.హెచ్.వో డాక్టర్  కె.విజయలక్ష్మి , డి.సి.హెచ్.    వి.లక్ష్మణరావు  ఆర్టీవోలు జి.ఆర్.రవీంద్రనాధ్, ఐ.శివప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-09-16 19:21:09

డిగ్రీ అధ్యాపక పరీక్షలకు 60.78 శాతం హాజరు..

శ్రీకాకుళం జిల్లాలో  రెండు రోజులు పాటు జరిగిన  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక (లెక్చరర్)  పోస్టుల నియామక పరీక్షలకు 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజ రైనట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 మరియు 16వ తేదీల్లో నిర్వహించిన డిగ్రీ అధ్యాపక పరీక్షలు  ప్రశాంతంగా ముగిసా యని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసారు. ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, మధ్యా హ్నం 3.00గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు రెండు విడతలుగా రాజాంలోని జి.యం.ఆర్.ఐ.టి, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరిగిన సంగతి విదితమే. ఇందుకు జిల్లావ్యాప్తంగా 487 మంది అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా 296 అభ్యర్ధులు హాజరయ్యారని, 191 మంది అభ్యర్ధులు హాజరుకాలేదని ఆయన వివరించారు. దీంతో 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజరు అయినట్లు డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన కళాశాలల యాజమాన్యాలు, ఏ.పి.పి.యస్.సి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీశ్వరరావు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పద్మప్రియ, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, ఉప తహశీల్ధారులు, ఇతర సిబ్బంది తదితరులకు డి.ఆర్.ఓ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Srikakulam

2020-09-16 19:16:21

ఈ తేదీల్లోనే పీజీ, ప్రొఫిషనల్‌ ‌కోర్సుల పరీక్షలు..

ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ప్రొఫిషనల్‌ ‌కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పీజీ పరీక్షల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్ ‌జె.ఆదిలక్ష్మి తెలియజే శారు. బుధవారం ఆమె ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, సైన్సు కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఆర్టస్ ‌విభాగంలో తొలిదశలో సెప్టెంబరు 28 నుంచి ఆర్టస్ ‌విభాగంలో ఆంత్రపాలజీ, ఎకనామిక్స్, ఇం‌గ్లీషు, ఫైన్‌ ఆర్టస్, ‌హిందీ, సంస్కృతం, యోగా కోర్సులకు,  రెండో దశలో అక్టోబరు 7వ తేదీ నుంచి కామర్స్-‌మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, ‌చరిత్ర, ఆర్కియాలజీ, హెచ్‌ఆర్‌ఎం, ‌జర్నలిజం, లైబ్రరీ సైన్స్, ‌సంగీతం, ఫిలాసఫీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ‌పొలిటికల్‌ ‌సైన్స్-‌పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ‌తెలుగు, థియేటర్‌ ఆర్టస్, ‌వుమెన్‌ ‌స్టడీస్‌, ‌సోషియాలజీ, హెచ్‌ఆర్‌డి కోర్సులకు పరీక్షలు జరుగుతాయన్నారు. లా పరీక్షలు అక్టోబరు 7 నుంచి, బిఫార్మరీ పరీక్షలు 21 సెప్టెంబరు నుంచి , బిఇడి పరీక్షలు అక్టోబరు 8 నుంచి నిర్వహిస్తారు. పూర్తి వివరాలను ఏయూ వెబ్‌సైట్‌ ‌నుంచి పొందాలని సూచించారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-09-16 19:12:36

హిందీ పరీక్షలకు దరఖాస్తు గడువు 25..

దక్షిణ భారత హిందీ ప్రచారసభ చెన్నై నిర్వహించే వివిధ హిందీ పరీక్షలకు సమయం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు వర్తమానం పంపిం ది. ఆశక్తిగల అభ్యర్ధులు  పది రూపాయలు అపరాధ రుసుతో ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చని భీముని పట్నంలోని స్థానిక ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షుడు కేఎస్‌ఆర్‌ ‌కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందీ ప్రచారసభ పరీక్షలకు గడుపు పూర్తికాగా, అభ్యర్ధుల నుంచి వస్తున్నఅభ్యర్ధన మేరకు 25వ తేదీవరకూ గడువు పొడిగింపు ప్రకటన చేసిందన్నారు. పరీక్షలు కట్టిన విద్యార్ధులకు ఈనెల 31, నవబర్‌ 1‌వ తేదీల్లో స్థానిక పండిత్‌నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల కేద్రంగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆశక్తివున్న అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరీక్షఫీజులు, ధరఖాస్తులు ఇతర వివరాలకు 8985647419లోగానీ స్వయంగా గానీ సప్రదించాలని నిర్వాహకులు కోరారు.

Bheemunipatnam

2020-09-15 20:09:10

ప్రాధాన్యత ప్రాజెక్టుగా హై లెవెల్ కెనాల్..

శ్రీకాకుళం జిల్లాలోని వంశధార–నాగావళి అనుసంధాన హైలెవెల్ ప్రాజెక్టును ప్రాధాన్యతా రంగ  ప్రాజెక్టుగా  ముఖ్య మంత్రి ప్రకటించారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. బూర్జ మండలం లంకం, చిన్న లంకం వద్ద వంశధార నాగావళి అనుసంధానం జరుగుతున్న హై లెవెల్ కెనాల్ ను సభాపతి మంగళ వారం సందర్శించారు. అనంతరం రైతులతో భూసేకరణపై సభాపతి చర్చించారు. హిర మండలం వద్ద వంశధార నుండి నాగవళి లో నారాయణపురం ఆనకట్ట ఎగువన  కలుస్తుందని, చీడివలస నుండి చినలంకం వరకు సుమారుగా 5 వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందుతుందని చెప్పారు. గజ్జల గెడ్డ, దేశయగెడ్డ,ఓని గెడ్డలకు ప్రతి సంవత్సరం వరద  సమయంలో ముంపుకు గురవుతున్నాయని ఈ సమస్యకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. కాలువ దిగువన కొల్లివలస - నారాయణపురం రోడ్డు  నీరు వెళ్లక ముప్పు గురవుతారని రైతులు సభాపతి దృష్టికి తీసుకు వెళ్ళారు. చీడివలస దిగువ నుండి నీరు పోవటానికి 3 అండర్ టర్నల్ ప్రతిపాదన ఉన్నాయని, వాటి సామర్ధ్యం ను పెంచాలని సభాపత్ తమ్మినేని అధికారులకు సూచించారు. దిగువన ఉన్న రోడ్డు ఎత్తు పెంచి కల్వర్టులు నిర్మిస్తామని రైతులకు తెలిపారు. హై లెవెల్ కాలువ నిర్మాణం వలన రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెట వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. హై లెవెల్ కెనాల్ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు హైలెవెల్ కాలువ నిర్మాణ వివరాలను వివరించారు. భూ సేకరణకు సంబంధించి కొంత మేర చెల్లింపులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, భూ సేకరణ ఉప కలెక్టర్ కాశీవిశ్వనాథ రావు, జలవనరుల శాఖ ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు

Srikakulam

2020-09-15 19:57:18

పర్యాటక కేంద్రంగా దాలసరి జలపాతం..

శ్రీకాకుళం జిల్లాలో మంచి పర్యాటక ప్రదేశంగా దాలసరి జలపాతంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశుసంవర్ధక,  మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. మందస మండలం చీపి పంచాయతీ  దాలసరి గ్రామం వద్ద కొత్తగా కనుగొన్నజలపాతాన్ని మంత్రి మంగళ వారం సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా ప్రకృతి శోయగాలకు నిలయమని మంత్రి అన్నారు. పలాస నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదని ఇందులో భాగంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని ఆయన అన్నారు. దాలసరి జలపాతం రాబోయే రోజుల్లో ఒక మంచి పర్యాటక స్ధలంగా ఫరిడవిల్లగలదని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలపై వారం రోజుల్లో కార్యాచరణ తయారు చేయుటకు చర్యలు చేపడతామని అన్నారు. అవసరమైతే ఒరిస్సా ప్రభుత్వంతోను, ఐ.టి.డి.ఎ అధికారులతోను మాట్లాడి దాలసరి జలపాతం అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. పలాస నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన జలపాతాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు గొప్ప ఆహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్ గా తయారు చేయుటకు ప్రయత్నిస్తామని అన్నారు.  ఈసందర్భంగా దాలసరి గ్రామస్తులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు.

దాలసరి

2020-09-15 19:51:48

ఆ ఉద్యోగాలకు విశాఖజిల్లాలో పోటీపడేది 1.55లక్షలు

గ్రామ,వార్డు సచివాలయ  రిక్రూట్ మెంట్ పరీక్షలు  పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళ వారం  నాడు స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ  మందిరం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రిక్రూట్ మెంట్  పరీక్షలు నిర్వహించే అధికారులు, పరీక్షల ప్రారంభానికి ముందు, జరుగుతున్న సమయంలో , పూర్తయిన తర్వాత చేయవలసిన పనుల మీద పూర్తి అవగాహనతో శ్రధ్ధ తో పని చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సీరియస్ గా  తీసుకోవాలని కమిట్ మెంట్ తో పని చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణ లో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా సక్రమంగా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా  పరిశీలించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు విద్యుత్,గాలి, వెలుతురు  సక్రమంగా అందే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆయన అన్నారు. పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూములకు భద్రత కల్పించాలని, రూట్ అధికారులు మెటీరియల్ తీసుకు వెళ్ళేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలని తెలిపారు. ఈనెల 20 నుంచి  ప్రారంభం కానున్న స‌చివాల‌య ఉద్యోగాల రాత‌ప‌రీక్ష‌ల నిమిత్తం కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప‌రీక్షా కేంద్రాల‌వ‌ద్ద ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. కేంద్రాల్లోకి ప్ర‌వేశించే ప్ర‌తీ అభ్య‌ర్థికీ థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించి, శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను త‌నిఖీ చేయాల‌న్నారు. శానిటైజ‌ర్ వేసి, చేతులు శుభ్రం చేసుకున్న త‌రువాతే లోప‌లికి పంపించాల‌ని చెప్పారు.  మాస్కులు ధ‌రించిన వారిని మాత్ర‌మే లోప‌లికి అనుమ‌తించాలని, అవసరమైతే ఉపయోగించడానికి ప్ర‌తీ కేంద్రంలో మాస్కుల‌ను కూడా రిజ‌ర్వులో ఉంచాల‌ని సూచించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు ప‌రీక్ష‌లు రాసేందుకు అనుగుణంగా ప్ర‌తీ ప‌రీక్షా కేంద్రం వ‌ద్దా ప్రత్యేక గదులను  ఏర్పాటు చేస్తామన్నారు.  ప్ర‌తీ ప‌రీక్షా కేంద్రంవ‌ద్ద 2 ఎఎన్ఎం లను, 2 ఆశా కార్యకర్తలను  ఏర్పాటు చేయాల‌ని, శానిటైజ‌ర్లు, మాస్కులు, థ‌ర్మ‌ల్ స్కానర్ లు, ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌, అవ‌స‌ర‌మైన‌ మందుల‌ను కూడా సిద్దంగా ఉంచాల‌ని  డిఎంహెచ్ఓ కు సూచించారు.  అభ్య‌ర్థులు ప‌రీక్షా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా ఆర్‌టిసి అధికారులు బ‌స్సులు ఏర్పాటు చేయాల‌ని ఆయన సూచించారు. మెటీరియల్ తీసుకు వెళ్ళేందుకు డిజిటి బస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. మొత్తం 1,50,441 మంది  అభ్యర్థులు ఈ ప‌రీక్షల‌కు హాజ‌రు కానున్నారని చెప్పారు.  ఈ నెల 20 నుంచి 26వ తేదీ వ‌ర‌కు,  ఉద‌యం 10 నుంచి 12.30, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌లు వ‌ర‌కూ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌న్నారు.  ప్ర‌తీ అభ్య‌ర్థి క‌నీసం 45 నిమిషాల‌ ముందు ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంద‌న్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా అభ్యర్థుల మ‌ధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు అనువుగా  ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. సెంట‌ర్ల స్పెష‌ల్ ఆఫీస‌ర్లు, రూట్ ఆఫీస‌ర్లు,  ఛీఫ్ సూప‌రింటిండెంట్లు,  అద‌న‌పు ఛీప్ సూప‌రింటిండెంట్లు,  హాల్ సూప‌రింటిండెంట్లను, ఇన్విజిలేట‌ర్లను నియమించినట్లు  వారికి సమగ్ర శిక్షణ ను ఇచ్చినట్లు వివ‌రించారు.  ఈ స‌మావేశంలో  రూరల్ పోలీసు సూపరింటెండెంట్ కృష్ణా రావు,  జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి,  జీవియంసి కమీషనర్ జి.సృజన,  జాయింట్ కలెక్టర్ గోవింద రావు,  నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య,  డి ఆర్ ఓ  ఎ.ప్రసాద్, ఆర్డీఓ కిషోర్,  జిల్లా పరిషత్ సిఈఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ విజయ లక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డిటిసి రాజారత్నం, ఈపీసీడీఎల్ ఎస్ ఈ సూర్య ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్

2020-09-15 19:24:52

ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి...

శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గా ఘనంగా నిర్వహించారు. మంగళవారం వంశధార సర్కి ల్ కార్యాలయం వద్ద ఇంజనీర్లు అందరూ విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడా రు. ఈ సందర్భంగా తోటపల్లి ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమల రావు మాట్లాడుతూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తి, అంకితభావంతో ఇంజినీర్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. మోక్షగుండం ఆలోచనా విధానం ఇంజనీర్లకు ఎంతో ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. ఇంజినీర్లు దేశ ప్రగతిలో ముఖ్య భూమిక పోషించారని, దానిని కొనసాగించాలని కోరారు.  ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఉన్నాయని వాటిని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క ఇంజనీరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు, తోటపల్లి ఆధునీకరణ పనులు, ఆఫ్ షోర్ ప్రాజెక్టులతో పాటు ఇతర జలవనరులను ప్రజలకు ప్రయోజనకరంగా తీర్చిదిద్ధి చిరస్మరణీయంగా ఉండాలని ఆయన కోరారు. మోక్షగుండం పనితనం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన ఎంతో నీతి నిజాయితీలతో పనిచేశారని కొనియాడారు.

Srikakulam

2020-09-15 15:38:46

జగనన్న తోడు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలో జగనన్న తోడు దరఖాస్తులు త్వరితగతిన పరిశీలించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి విభాగం సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. జగనన్న తోడు, వై,యస్.ఆర్ బీమా పథకాలపై జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. జిల్లాలో జగనన్న తోడు పథకానికి 34,552 దరఖాస్తులు అందాయని ఆయన పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంబంధిత బ్యాంకులకు పంపిస్తారని చెప్పారు. బ్యాంకులు వారం రోజుల్లో పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. జగనన్న తోడు, ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల పథకం (పి.యం. స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) క్రింద చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డు జారీ చేయడమే కాకుండా సున్నా వడ్డీకి రూ.10 వేలు రుణం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తాయని వివరించారు. అక్టోబరు 4వ తేదీన జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సంయుక్త కలెక్టర్ చెప్పారు.  బ్యాంకులు సత్వరం ఈ ప్రక్రియను పూర్తి చేసి సహకారాన్ని అందించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకానికి ప్రాధాన్యతను ఇస్తూ చిరు వ్యాపారులకు తోడుగా ఉండాలని సంకల్పించాయని చెప్పారు. వై.యస్.ఆర్ బీమా నమోదు ప్రక్రియ చేపట్టాలి : వై.యస్.ఆర్ బీమా క్రింద అర్హులైన అందరూ నమోదు కావాలని సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. జిల్లాలో బియ్యం కార్డు ఉన్న వారందరూ అర్హులేనని ఆయన పేర్కొన్నారు. వై.యస్.ఆర్ బీమా ప్రీమియంగా పేదల తరపున ప్రభుత్వమే 15 రూపాయలు చెల్లిస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో గతంలో భారీ ఎత్తున జన్ ధన్ ఖాతాలను ప్రారంభించడం జరిగిందని ఆ ఖాతాల పరిస్థితిని పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.నగేష్, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి.హరి ప్రసాద్, డిసిసిబి డిజిఎం ప్రసాద్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-15 14:34:39

ఘోషా ఆసుపత్రిలో 200 మందికి ఆహార పొట్లాల పంపిణీ...

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని విశాఖ దక్షణిణ నియోజకవర్గం బీజెపీ కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ అన్నారు. మంగళవారం విశాఖలోని గోషా ఆసుప త్రిలో రోగుల బంధువులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు 200 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ విజ్రుం భిస్తున్న సమయంలో తమవంతుగా నిరుపేదలకు సహాయం చేయాలనే ప్రధాని మోడి ఇచ్చిన పిలుపుతో తాను ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా చేపడుతు న్నట్టు చెప్పారు. ఆసుపత్రి కష్టాలతో వున్న రోగులకు తమవంతుగా చేసే ఈ చిన్న ఆహార సహాయం చేయడం ద్వారా వారికి కొద్దిగా స్వాంతన కలుగుతుందన్నారు. తాను చూపట్టే ఈ అన్నసంతర్ఫణ కార్యక్రమాల్లో బీజేపి నాయకులు, కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటున్నారని అన్నారు. ఘోషా ఆసుపత్రికి నిత్యం ఎందరో నిరుపేద రోగులు వస్తారని, అందుకే తమ సేవకు ఈ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నట్టు రామ్ కుమార్ వివరించారు.

ఘోషా ఆసుపత్రి

2020-09-15 13:37:54

బొలిశెట్టిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాల్సిందే..

పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖజిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా.బూసి వెంటకరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విశా ఖలో మీడియాతో మాట్లాడుతూ, దళిత ఎమ్మెల్యే అయిన బాబూరావుపై ఒక మాజీ ఎంపీటీసీ ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే బొలిశెట్టి గోవిందరావుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా  ప్రోటోకా ల్ పాటించకుండా ఎమ్మెల్యేపై కులపెత్తనం చేయడం దారుణమన్నారు. ఇలాంటి వైఎస్సార్సీపీ నాయకులపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ వ్యవహారాలుంటే ఆవిధంగా చూసుకోవాలి తప్పితే దళితుడనే చిన్నచూపుతో, పార్టీ కార్యకర్తల ముందు పరువుతీసినట్టుగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అధికాపార్టీ దళిత ఎమ్మెల్యేపై చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంభేత్కర్ వారసులంతా ముక్త కంఠంతో ఖండించాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసు కునేలా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే రేపు మంత్రులు, ఆ పై ఎంపీలు ఇలా ఎవరినైనా ఇదే తరహాలో మాట్లాడేందుకు అవ కాశం వుంటుందని అన్నారు. దళితులంతా ఒక్కటేనని విషయాన్ని ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలన్నారు. కార్యక్రమంలో సమాఖ్య కో కన్వీనర్ చింతాడ సూర్యం, బహుజన సేన కార్యదర్శి కొమ్మువీర్రాజు, కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, జి.రాంబాబు, సుధాకర్, మునపర్తి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-09-15 13:19:53