1 ENS Live Breaking News

శారదా పీఠాధిపీఠంలో అమాత్యులు...

విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ,  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాజీలను  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ పలువురు దర్శించుకున్నారు. చాతుర్మాస్య దీక్ష ముగించుకుని ఆదివా రం నాడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి,  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి విశాఖ శారదా పీఠానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వామిజీ ని కలసి ఆశీర్వాదం పొందారు. పీఠం సంప్రదాయం ప్రకారం  మేళతాళాల మధ్య వేదపండితులు ఘన స్వాగతం పలికారు. పీఠంలో పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామిజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్వామిజీతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పీఠంలో వల్లిదేవసేన సహిత సుబ్రమణ్యస్వామి, మేధా దక్షిణ మూర్తి స్వామి వార్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.

చినముషిడివాడ

2020-09-13 17:18:23

దళిత ఎమ్మెల్యేని అవమానించిన వారిని శిక్షించాల్సిందే..

విశాఖ జిల్లా పాయకరావుపేట వైఎస్సార్సీపీ కి చెందిన దళిత ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కి సొంతపార్టీ లోనే ఘోర అవమానం జరగడం దారుణమని టీడీపీ విశాఖ జిల్లా ఎస్సీ  సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ అన్నారు. పార్టీలోని ఒక చిన్న నాయకుడు దళిత ఎమ్మెల్యేని వాడు, వీడు, అని దురుసుగా మాట్లాడం దళితులను అణగదొక్కాలనే చేసే ప్రయత్నమేనన్నారు. ఈ సంద్భంగా విశాఖలో ఆయన మీడియాలో మాట్లాడుతూ, ఎస్.రాయవరం మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశం పట్టి మరీ దళితుడైన బాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలు వేరైనా దళితులంతా ఒక్కటే నన్నారు. అగ్రవర్ణాలు దళితులను కించపరిచేలా వ్యవహరిస్తే, ఆ వ్యక్తి ఏ పార్టీ వ్యక్తైనా తార తమ్యం లేకుండా అంభేత్కర్ వారసులుగా స్పందిస్తామన్నారు. అంతేకాకుండా మార్కెట్ చైర్మన్ భర్త పై ఎమ్మెల్యే  ఎదుటే దాడి చెయ్యడమే కాకుండా ఎమ్మెల్యే పైనే అహంకార ధోరణి తో వ్యాఖ్యలు చెయ్యడం వైఎస్సార్సీపీ అధిష్టాన పర్యవేక్షణకు నిలువెత్తు నిదర్శమన్నారు. దళితులపై దాడులు జరుగుతుంటే వైఎస్సార్సీపీ వ్యవహరిస్తున్న తీరు తన సొంత పార్టీ నేతల విషయంలోను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. నా అండ లేకుండా నువ్వు ఎలా ఎమ్మెల్యేగా గెలిచావని పార్టీ కార్యకర్తలు పాల్గొన్న సమావేశంలోనే బహిరంగ వ్యాఖ్యలు చేసి గొల్ల బాబూరావుని అవమానించారంటే ఈయన వెనుక పెద్ద తలకాయలనే ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సాధారణ ఎంపీటీసీగా ఉంటూ 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యే గొల్లకి జరిగిన అవమానం పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి  వెంటనే స్పందించి ఎంపీటీసీ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు టీడీపీ దళిత కుటుంబం అంతా అండగా ఉంటుందని, వారి కోసం చిత్తశుద్ధితో పని చేస్తూ వారి అభ్యుదయం కోసం పనిచేస్తోందని చెప్పారు. తక్షణమే ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయం పై పార్టీలకు అతీతంగా స్పందించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను కోరారు.  

విశాఖపట్నం

2020-09-13 12:54:22

ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకంగానే..భూమన

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ద్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, ఆడపడుచులను  కోటీశ్వరులను చేసేందుకే వై.ఎస్. ఆర్. ఆసరా పథకం తీసుకు వచ్చామని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. వై.ఎస్.ఆర్. ఆసరా వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారంనాడు  స్థానిక చేపల మార్కెట్ వెనుక గల  వార్డు సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి , నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా పాల్గొని ప్రజనుద్దేశించి  ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ ఇంటిలో, మీ వీధిలో ఏ సమస్య ఉన్నా మీరు పరిగెత్తి మునిసిపల్ ఆఫీస్ కు రాకుండా మీ వీధిలోని సచివాలయం ఏర్పాటు చేసి, మీకోసం వాలంటీర్ల ను ఏర్పాటు చేసి మీకు ఏ సమస్య రాకుండా వెంటనే పరిష్కారం చేస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఇండ్లకోసం ఎదురు చూస్తున్న నగరవాసులకు సుమారు 24  వేల మందికి ఇండ్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వంలో వలే ఎదో మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తమకు చేత కాదని, ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే ధీరుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో నే మ్యానిఫెస్టోలో ఇచ్చిన మేరకు అన్ని హామీలను పూర్తి చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న దేనన్నారు.  నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. ఆసరా వారోత్సవాల్లో రెండవరోజు చేపల మార్కెట్ వద్ద 7 వార్డులకు సంభందించి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ని 28 గ్రూపులకు వై.ఎస్.ఆర్. ఆసరా పథకం కింద సుమారు 30 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. మీరు పొదుపు చేసుకున్న నగదు అత్యవసరాల కోసం వాడుకుని, తిరిగి ఏదైనా వ్యాపారం చేసేందుకు ఆలోచిస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మీరు ఆర్థికంగా ఎదిగేందుకు ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా ఈ ప్రభుత్వం మీ అవసరాల కోసం సాయం అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. కాగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 3132 స్వయం సహాయక సంఘాలకు 123.144 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి,  మెప్మా రమణ, వై.సి.పి. నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు, పాల్గొన్నారు.

తిరుపతి

2020-09-13 12:41:11

రేపు డయల్ యువర్ కమిషనర్ ..

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర వాసులు 0877-2227208 కాల్ చేయాలని కమిష నర్ గిరిష సూచిస్తున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తనతో మాట్లాడి చెప్పవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఈ-స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆన్ లైన్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ అర్జీలు ఆన్ లైనులో పెట్టుకోవ చ్చు న్నారు. అర్జీలు పెట్టేవారు సమస్య ఏ ప్రభుత్వ శాఖకు చెందినదో సదరు దరఖాస్తుపై తెలియజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నామన్న కమిషనర్ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ పరధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు విన్నవించాలని కమిషనర్ కోరారు.

Tirupati

2020-09-13 12:30:41

శివయ్య విగ్రహానికి మీవంతు సహాయం చేయండి...

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తులను బ్రోచే చల్లనితల్లి శ్రీశ్రీశ్రీ అన్నవరం నూకాలమ్మతల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మించే శివుని విగ్రహానికి దాతలు సహకరించాలని ధర్మకర్త గంగరాజు కోరారు. ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో భక్తుల కోరిక మేరకు శివుని విగ్రహం నిర్మించతలపెట్టామన్నారు. వాటితోపాటు స్వామివారి విగ్రహం చుట్టూ నాలుగు చిన్ని మండపాల్లో వినాయకుడు, సాయిబాబా, సుబ్రమణ్యస్వామి, సూర్యభగవానుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వామివారి విగ్రహాల నిర్మాణాలకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించాల్సిందిగా కోరారు. భక్తులు, 9492509024 అనే ఫోన్ పే నెంబరు ద్వారా కూడా విరాళాలు పంపించవచ్చునన్నారు. భక్తుల సహకారంతో స్వామివారి విగ్రహాలు ప్రతిష్టించాలనే ఉద్దేశ్యంతో విరాళాలు అడుగుతున్నామని ఆయన చెప్పారు. భక్తులంతా సహకరించాలని ఆయన కోరుతున్నారు.

అన్నవరం

2020-09-13 07:34:27

ఘోషా ఆసుపత్రిలో ఆహార పొట్లాల పంపిణీ..రామ్ కుమార్

కరోనా వైరస్ వెంటాడుతున్న సమయంలో ఆపదలో ఉన్నవారి ఆకలి తీర్చే లక్ష్యంగా నిర్వగ్నంగా ఆసుపత్రుల్లో ఆహారం పింపిణీ చేస్తున్నట్టు బిజెపి విశాఖ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ కొప్పలరామ్ కుమార్ చెప్పారు. శనివారం ఘోషా ఆసుపత్రిలో రోగుల బంధువులు, సెక్యూరిటీ సిబ్బందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వచ్చి నిరుపేదల జీవితాలకు అతలాకుతలం చేసిందన్నారు. అలాంటి వారికి, రోగులకు సేవలు అందిస్తున్న వారికి తమవంతు సహాయంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరం వెయ్యిరోజులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకు న్నామన్నారు. ఒక్కోసారి ఒక్కోచోట ఈ అన్నదానం చేపట్టనున్నామని ఆయన వివరించారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి నిరాశ్రయులు అయినవారికి, అన్నం లేక అలమటించే వారికి పట్టెడు అన్నం పెట్టడానికి ముందుకి రావాలని ఈ సందర్భంగా రామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈయనతోపాటు నియోజవకర్గంలోని బీజేపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఘోషా ఆసుపత్రి

2020-09-12 20:17:54

సచివాలయ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి...

సచివాలయ పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శనివారం విఎంఆర్డిఎ చిల్డ్రన్స్ ఎరీనాలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల నోడల్ అధికార్లు, క్లస్టర్ ప్రత్యేక అధికార్లు, రూట్ ఆఫీసర్లు, సెంటర్ల ప్రత్యేక అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ ల శిక్షణా కార్యక్రమంలో (రెండవరోజు) ఆయన పాల్గొన్నారు. జివియంసి పరిధిలో నోడల్ అధికారిగా జివియంసి కమీషనర్ జి. సృజన, గ్రామీణ ప్రాంతాలకు నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి ఉంటారని ఆయన వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని, ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలను ముందుగానే సందర్శించి క్షణ్ణంగా పరిశీలించి కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా  విద్యా సంస్థలు  పనిచేయడం లేదని, అందువలన  పరీక్షా కేంద్రాలుగా  ఉపయోగించనున్న  ఆ సంస్థలలో  విద్యుత్, త్రాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, శానిటేషను  సదుపాయాలను  చూసుకోవాలని పేర్కొన్నారు.  అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం  పరీక్షలు నిర్వహించాలని, సిబ్బంది, అభ్యర్థులతో సహా ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు.  కోవిడ్ బాధితులకు  ప్రత్యేక ఐసొలేషను రూంలో పరీక్ష రాయించాలని తెలిపారు.  అవసరమైన  పి.పి.ఈ.కిట్లు, గ్లౌజులు, శానిటైజరు, ధర్మల్ స్కానర్స్, పల్స్ఆక్సీమీటరు లను సరఫరా చేస్తారని తెలిపారు.  పరీక్షా కేంద్రాలను  పరీక్షకు ముందు, తరువాత  తప్పని సరిగా శానిటైజ్ చేయాలని తెలిపారు.  15వ తేదీ సాయంత్రాని కల్లా  పరీక్షాకేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.  అభ్యర్థులకు సౌకర్యంగా ఉండేందుకు పరీక్షా కేంద్రాల మ్యాపులను బహిరంగంగా  ప్రదర్శించాలని తెలిపారు.  అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా  ప్రశాంతంగా పరీక్షకు సిద్దమై  సమయానికంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.    ఈ కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి, జి.వి.యం.సి. కమీషనరు  జి. సృజన, జడ్ప్ సిఇఓ నాగార్జున సాగర్, డి.పి.ఒ. కృష్ణకుమారి, యితర జిల్లా అదికారులు పాల్గొన్నారు.  

Visakhapatnam

2020-09-12 19:23:07

రేపు శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్ డౌన్..జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగు తున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ఆది వారం లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందించారని చెప్పారు. మందుల దుకాణాలు లభ్యంగా ఉంటాయని, వాటితోపాటు వాటికి ఆనుకుని పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని  ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియోగించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేసారు. అంబులైన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని పేర్కొంటూ అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు. అయితే అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు.

Srikakulam

2020-09-12 19:21:38

పేదలకు అండగా సీఎం వైఎస్ జగన్..మంత్రి సీదిరి

రాష్ట్రంలో పేదలకు అండగా ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఉంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. పలా స కాశీబుగ్గ మున్సిపాలిటి పరిధిలో గల చిన్నబాడం గ్రామనికి చెందిన డిక్కల వేదవతి ఇటీవల అనారోగ్యం భారీన పడ్డారు. అనారోగ్యం నుండి కోలుకోవడానికి అవస రమగు ఖర్చు పెట్టే స్ధోమత లేక దయనీయ స్ధితిలో  ఉన్న వేదవతికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి సహాయం లభిస్తుందని తెలియడంతో దరఖాస్తు చేసుకు న్నారు. ముఖ్యమంత్రి సహాయనిదికి వేగవతి దరఖాస్తు చేయగా శాసన సభ్యులుగా ఉన్న అప్పల రాజు చొరవ తీసుకుని ఆమెకు రూ.25 వేలు మంజూరు కావడానికి కృషి చేసారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి విడుదల అయిన రూ.25 వేల చెక్కును మంత్రి  శనివారం వేదవతికి పలాసలో అందించారు. పేదలకు అండగా ముఖ్య మంత్రి ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Srikakulam

2020-09-12 19:19:08

హై లెవెల్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి..

శ్రీకాకుళం జిల్లాలోని హైలెవల్ కెనాల్ పనులు వేగవంతం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు.  కెనాల్ పనుల ప్రగతిపై శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రాధాన్యతా ప్రాజెక్టులలో వంశధార – నాగావళి అనుసంధాన హై లెవెల్ కెనాల్ పనులు ఉన్నాయని సభాపతి అన్నారు. పెండింగు బిల్లులు త్వరగా విడుదల చేయుటకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. భూ సేకరణలో రైతులతో సమస్యలు ఉన్న చోట రైతులతో మాట్లాడతామని సీతారాం తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భూసేకరణ పెండింగు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వంశధార – నాగావళి అనుసంధానం వలన అదనంగా కొంత ఆయకట్టుకు నీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సి.హెచ్.శివరాం ప్రసాద్, వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు, కార్యనిర్వాహక ఇంజనీరు జి.సుశీల్ కుమార్, ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ కాశీవిశ్వనాథ్, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-12 19:17:04

సూపర్ 60 బ్యాచ్ గిరిజన విద్యార్ధికి 346 ర్యాంకు..

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ 60 బ్యాచ్ గిరిజన విద్యార్ధి అఖిల భారత స్ధాయిలో ఎస్.టి కేటగిరిలో 346 వ ర్యాంకు సాధిం చారని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వై.టిసి)లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావే శంలో జెఇఇ మెయిన్స్ లో సూపర్ 60 బ్యాచ్ సాధించిన విజయాలను ప్రాజెక్టు అధికారి ప్రకటించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచనల మేరకు అప్పటి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.యం సాయికాంత్ వర్మ గిరిజన విద్యార్ధులకు సూపర్ 60 బ్యాచ్ ప్రారంభించి జెఇఇ, ఐఐటి, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ప్రారంభిం చారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి కృషికి ఫలితాలు దక్కాయని ఆయన పేర్కొంటూ కలెక్టర్, పి.ఓలకు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 60 బ్యాచ్ లో 55 మంది విద్యార్ధులను ఎంపిక చేసి తీసుకోవడం జరిగిందని వారికి అత్యుత్తమ కోచింగు ఏర్పాటు చేసామన్నారు. కోవిడ్ 19 కారణంగా తరగతి గదిలో కోచింగును నిలిపివేయడం జరిగిందని, ఆన్ లైన్ ద్వారా బోధించామని పేర్కొన్నారు. విద్యార్ధులకు లాప్ టాప్ లు, రౌటర్ లు పంపిణీ చేసామని శ్రీధర్ చెప్పారు. 55 మందిలో 33 మంది జెఇఇలో అర్హత సాధించారని, అందులో 21 మంది విద్యార్ధులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి)లలో సీట్లు లభిస్తాయని చెప్పారు. 33 మందిలో 26 మంది ఆదివాసీ తెగ (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్)కు చెందిన సవర తెగకు చెందిన వారని వివరించారు. అఖిల భారత స్ధాయిలో 95.77 పెర్సంటైల్ సాధించి ఎస్.టి కేటగిరిలో 346 ర్యాంకును ఎం.ఎర్తా సింగ్ సాధించారని చెప్పారు. సూపర్ 60 బ్యాచ్ కు చెందిన ఎన్.సునిల్ 88.74 పెర్సంటైల్ సాధించి అఖిల భారత స్ధాయి ఎస్.టి కేటగిరిలో 1368 ర్యాంకు సాధించారని చెప్పారు. ఈ నెల 27వ తేదీన జెఇఇ అడ్వాన్సుడు పరీక్ష ఉందని, అందుకు విద్యార్ధులను సిద్ధం చేయడం జరుగుతోందని ప్రాజెక్టు అధికారి చెప్పారు. కనీసం 8మంది విద్యార్ధులకు ఐఐటిలలో సీట్లు లభిస్తాయని ఆశిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. జెఇఇ మెయిన్స్ లో 90 పర్సంటైల్ దాటిన విద్యార్ధి ఒకరు కాగా, 80 పర్సంటైల్ దాటిన విద్యార్ధులు ముగ్గురు, 70 పర్సంటైల్ దాటిన విద్యార్ధులు 11 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఐటిడిఏల పరిధిలో పరిశీలిస్తే సీతంపేట ఐటిడిఏ పరిధి విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించి విజయదుందుభి మోగించారని పి.ఓ అన్నారు.

Seethampeta

2020-09-12 19:15:39

కల్యాణకట్ట క్షుర‌కుల‌కు యూనిఫాం విరాళం..

తిరుమల కల్యాణకట్టలో విధులు నిర్వ‌హిస్తున్న పురుష‌, మహిళా క్షుర‌కుల‌కు రూ.10 ల‌క్ష‌లు విలువ గ‌ల రెండు జ‌త‌ల పంచ‌లు, ష‌ర్టులు, చీర‌ల‌ను శ‌నివారం ఉద‌ యం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళంగా అందించారు. తిరుమ‌ల ప్ర‌ధాన కల్యాణ‌క‌ట్ట‌లో 1050 మంది పురుష‌ క్షుర‌కు ల‌కు రెండు జ‌త‌ల పంచ‌లు, షర్టులు (2,100 పంచ‌లు, షర్టులు),  275 మంది మహిళా క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల చీర‌లను (550 చీరలు ) టిటిడి అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి పంపిణీ చేశారు.  ఈ సంద‌ర్భంగా క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియ‌జేశారు.  ఈ కార్య‌క్ర ‌మంలో డెప్యూటీ ఈవో  సెల్వం, ఏఈవో  జగన్మోహ‌నాచారి,  ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

Tirumala

2020-09-12 19:10:51

వడ్లమాని కుటుంభానికి ప్రగాడ సానుభూతి..గంట్ల

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం  విశ్రాంత అధర్వణ వేద పండితులు, వేద రత్నాకర  బ్రహ్మశ్రీ వడ్లమాని వెంకటేశ్వరశర్మ అవధాని పరమపదించారు. ఇటీవల ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచారు. కాశీ పంతులుగా సుపరిచితులైన వడ్లమాని 1976లో సింహాచ లం దేవాలయం అధర్వణ వేద పండితునిగా ఉద్యోగంలో చేరారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన వేద పారాయణతో సింహాచలేశునికి సేవలందించారు. ఈయన వద్ద వేద విద్యను నేర్చుకున్న సుమారు 250 విద్యార్థులు  పండితులుగా భారతదేశంలోనే కాక ప్రపంచంలోని వివిధ దేశాలలో మహా పండితుల హోదాల్లో తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు.  విశిష్టాద్వైత సిద్దాంత ప్రకాశకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి చేత కూడా గురువుగారూ అని పిలిపించుకుని గురువులకే గురువుగా కీర్తించబడ్డ పండితోత్తముడయన.దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా,అధర్వవేద రత్నాకరుడిగా, వేదోద్ధార, అధర్వవేదనిధి వంటి అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నా నిరాడంబరతే ఆభరణంగా సాధారణ జీవితాన్ని గడిపిన మహోన్నతమైన వ్యక్తిత్వం వడ్లమాని సోతం. వెంకటేశ్వరశర్మ అవధాని మరణం పండిత లోకానికి తీరని లోటని పలువురు నివాళులర్పించారు. వడ్లమాని మరణ వార్త విని శిష్య బృందం కన్నీటి పర్యంతయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న శిష్యులు శనివారం ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నట్లు    సమాచారం. వడ్లమానికి భార్య వున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేకమంది పండితులు, శిష్యులు, దేవస్థానం అధికారులు, వైదికులు..జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి ..వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తదితరులు  వడ్లమాని పార్ధీవ దేహాన్ని దర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Simhachalam

2020-09-12 12:19:03

ఆ దళిత ఎమ్మెల్యేని పట్టుకొని వాడు,వీడు అన్నాడంటే..

అధికారపార్టీ వైఎస్సార్సీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గొల్లబాబురావు అంటే తెలియని వారుండరు రాష్ట్ర వ్యాప్తంగా... అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ వెల్పేర్  కమిటీ సభ్యునిగా మంచివ్యక్తిగా, దళిత వర్గానికి చెందిన ఉన్నత చదువరిగా, పార్టీ విధేయునిగా, మంచి నాయకుడిగా పార్టీలోనే ఎంతోపేరు..అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎస్.రాయ వారా నికి చెందిన ఒక మాజీ ఎంపీటిసి బొలిశెట్టిగోవిందరావు అనే వ్యక్తి పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ పేరు చెబుతూనే, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావుని వాడు, వీడు అనడంతోపాటు...తాను లేకపోతే నియోజకవర్గంలో ఏ జిరిగేదో అంటూ తారాస్థాయిలో మాట్లాడిన మాటల ఆడియో టేప్ రికార్డింగ్ వాయిస్ విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బొలిశెట్టి గోవిందరావుని కాదని పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్(ఉన్నత చదువులు కలిగిన మామిడి మంగతాయారుకి) పదవిని కట్టబెట్టి.. మరో వర్గానికి(మామిడి చంటి)కి పార్టీ వ్యవహరాలు దగ్గరుండి చూసుకునే అవకాశం ఇచ్చారనే అక్కసుతో ఆ వర్గారినికి చెందిన వ్యక్తితో ఎమ్మెల్యే గొల్లబాబూరావు ముందే సోమవారం రాత్రి అడ్డురోడ్డులో జరిగిన సమావేశంలో తన్నుకున్నారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా గోవిందరావు స్థానిక మీడియాని బెదిరించి మరీ అడ్డుకట్టవేశారని సమాచారం.. కానీ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్  వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆ గొడవ జరిగిన తరువాత అక్కడ ఎమ్మెల్యేతో ఛాలెంజ్ చేసి వచ్చి మరీ తన ఇలాకాలోని తోటలో పలువురు కార్యకర్తలు, నాయకులతో సమావేశం పెట్టి...చేసిన వ్యాఖ్యల ఆడియోను కూడా ఈఎన్ఎస్ నెట్వర్క్  అత్యంత కీలక వ్యక్తుల ద్వారా  సంపాదించింది. ఆ సమావేశంలో తనకు ఉపయోగ పడకపోతే ఎవ్వరైనా ఒక్కటే అంటూ తన ఆవేశాన్ని వెల్లగక్కుతూనే కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పదేళ్లుగా పనిచేసిన వారిని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి పనులు చేసిపెడితే..మీ పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో నాలానే వుంటుంది అన్నారు. అంతేకాదు, పార్టీలో పదేళ్ల నుంచి ఉన్నాను వైఎస్ జగన్ నాకు ఏమిచ్చాడు అని ఆవేశంగా ఊగిపోయాడు. పైగా తాను ఖర్చుపెట్టకపోతే ఎమ్మెల్యేగా బాబూరావు గెలిచేవాడు కాదని, ఎమ్మెల్యేని వాడు అనడానికి తాను వెనుకాడటం లేదని కూడా సంబోధించాడు. అంతేకాదు మనల్నికాదని, మనకు పనిచేయని ఎమ్మెల్యే ఈ నియెజవర్గంలోకి రావడానికే భయపడాలంటూ కార్యకర్తలను తప్పుదోవ పట్టించాడు. గతంలో బొలిశెట్టి గోవిందరావు చేస్తున్న వ్యవహారాలకు విసిగి పోయిన ఎమ్మెల్యే గొల్లబాబూరావు, తన నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో ఎక్కడికి వెళ్లినా తన పనిని తాను చేసుకోనివ్వకుండా, కొందరు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడునెలలుగా సాగుతున్న ఈ చాపకింద నీటి రబస సెప్టెంబరు నెలలో గానీ బయట పడలేదు. బొలిశెట్టి తనకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తూ, దళిన సామాజిక వర్గ ఎమ్మెల్యేకి ప్రజలకు సేవచేసుకునే బాగ్యం ఇవ్వకుండా చేస్తున్నని, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తన ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేస్తున్నారనే ఈయననె ఎమ్మెల్యే పక్కన పెట్టినట్టు నియోజవర్గ కేడర్ బహిరంగంగానే చెబుతోంది. ఇదే సమయంలో గోవిందరావుని కాదని మామిడి చంటిని వెనుకేసుకు వస్తూ అన్ని పనులు ఆయనతోనే చేయిస్తే...ఇన్నేళ్లు పనిచేసిన మనం ఏమవ్వాలో అర్ధం చేసుకోవాలని కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. కొందరినైతే ఏకంగా నాలుగు మండలాల్లో ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొన నీయకుండా కూడా చేశారని వారని కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇదంతా వెనుక విధేయుడిగా వుంటూనే గోవిందరావు చేశారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ కేవలం...బొలిశెట్టిగోవిందరావు కార్యకర్తలతో సమావేశం పెట్టి, ఆగ్రహంతో, తనకు అనుకూలంగా ఎమ్మెల్యే లేరనే విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు అర్ధమయ్యేలా చేసిన వ్యాఖ్యలు. పూర్తివివరాలు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ లో పూర్తి సంభాషణ వినవచ్చు...ఒక ఎమ్మెల్యే దళిత సీనియర్ ఎమ్మెల్యేని కనీసం ఎలాంటి పదవి లేని ఒక మాజీ ఎంటిసి ఈ విధంగా బెదిరిస్తున్నారంటే ఈయన వెనుక ఏ స్థాయి వ్యక్తులున్నారోననే అదనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజవర్గ నాయకులను శాసించే స్థాయిలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది..!

S.Rayavaram

2020-09-12 12:11:03

ఏడాదిలోగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవనం పూర్తి

శ్రీకాకుళంజిల్లాలో ఏడాదిలోగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తికావాలని, ఇందుకు అన్ని క్రీడాసంఘాలు కలిసిరావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు మరియు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణ కార్యక్రమంపై ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధుల సమావేశం శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కొదవలేదని, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ లలో రాణించిన జాతీయ క్రీడాకారులు ఎందరో ఉన్నారని అన్నారు. అయితే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఇక్కడ తక్కువగా ఉన్నాయని, అందుకే జిల్ల్లాలో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులతో పాటు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవనం ఒకటి నిర్మించాలనేది తన తపన అని అన్నారు. భవన నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు ఖర్చుకాగలదని అంచనా వేయడం జరిగిందని, దాతలు, ప్రభుత్వ సహకారంతో వీలైనంత తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 13 లక్షల రూపాయలను తన వంతుగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  క్రీడారంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, వీలైనంత త్వరలో శంకుస్థాపన పనులు చేపట్టాలని సూచించారు. శంకుస్థాపన మొదలు భవనం ప్రారంభమయ్యేంత వరకు  పనులు నిరంతరంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. భవన నిర్మాణం పూర్తయితే అన్ని క్రీడాసంఘాలు ఒకే గొడుగు కిందకు వస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి అవసరమైన కమిటీలు ఏర్పాటుచేసుకొని ముందుకువెళ్లాలని అసోసియేషన్ సభ్యులను కోరారు. ఈ భవన నిర్మాణానికి ఛైర్మన్ గా  మాజీమంత్రి , శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఒలింపిక్ అసోసియేషన్ భవనాలు తక్కువగా ఉన్నాయని, ఇటువంటి తరుణంలో జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం వలన రాష్ట్రానికి, జిల్లాకు గౌరవం వచ్చేవిధంగా తీర్చిదిద్దాలని, ఇందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మీరిచ్చిన గౌరవంతోనే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నానని, ఇదేస్పూర్తితో మీ అందరి అండదండలతో ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తికావాలని ఆకాంక్షించారు. అనంతరం తన వంతుగా లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని నగదు రూపంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.సుందరరావుకు ఉపముఖ్యమంత్రి అందజేసారు. అనంతరం ఈ సందర్భంగా భవన నిర్మాణానికి కమిటీలను ఏర్పాటుచేస్తూ, సావనీర్ ను కూడా రూపొందించాలని, దానికి నల్లి ధర్మారావు కన్వీనర్ గా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి ప్రతినిధులకు సూచించారు.   రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య శాఖామాత్యులు డా. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారులు ఉన్నారని, తన నియోజక వర్గంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన క్రీడాకారులున్నారని గుర్తుచేసారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన  క్రీడాకారులను అన్నిరకాలుగా ఆదుకోవాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని, ఆ దిశగా ఆలోచన చేయాలని  సూచించారు. కరోనా నేపధ్యంలో జిల్లాలో ఎటువంటి క్రీడలను నిర్వహించడం లేదని, రాబోయే రోజుల్లో  ప్రతీ మాసం ఒక క్రీడ చొప్పున 12 మాసాలకు   12 రకాల క్రీడలను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్ కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, శాసనసభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్,  జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శిమ్మ రాజశేఖర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరి కృష్ణ, జూడో అసోసియేషన్ అధ్యక్షులు మెంటాడ స్వరూప్, ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు చిట్టి నాగభూషణరావు, హాకీ అసోసియేషన్ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సురిబాబు, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డా. చక్క నారాయణరావు, ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కొమర భాస్కరరావు, సాంబమూర్తి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.రమణ, సాధు శ్రీను, కలగ శ్రీనివాస్ యాదవ్,ఎం.ఎస్.శేఖర్, కె.రాజారావు తదితరులు పాల్గొన్నారు

Srikakulam

2020-09-11 21:54:54