వైజగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా ప్రతిష్టాతకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం, మీడియా అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కోవిడ్19ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 8కి మార్పు చేసినట్టు విజెఎఫ్ అధ్యక్ష, , కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, సోడిశెట్టి దుర్గారావులు తెలియజేశారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రతిఏటా జర్నలిస్టుల పిల్లలను విద్యారంగంలో ప్రోత్సహిస్తూ జాన్ తొలివారంలో స్కాలర్ షిప్ లు కార్యక్రమం నిర్వహిం చేవారమని, కోవిడ్ నేపధ్యంలో దీనిని నవంబర్ ఎనిమిదవ తేదికి వాయిదా వేశామన్నారు. పాఠశాలల్లో మార్కుల జాబితాను (అర్ధిక సంవత్సరం పరీక్ష ఫలితాలు) తీసుకుని రెండు పాస్ పోర్టుపోటోలను జతచేసి ఈనెలాఖరులోగా డాబాగార్డ్స్ ప్రెస్ క్లబ్ లో అందజేయాలన్నారు. ఇతర వివరాలు కోసం స్కాలర్ షిప్స్ కమిటి చైర్మన్, ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును సంప్రదించాలన్నారు. అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ, సబ్ ఎడిటర్, వీడియో ఫోటో జర్నలిస్టులు క్రీడా, క్రైమ్, చిన్న పత్రికలకు సంబందించిన సంఘాలు వారే ఇద్దరు ప్రతినిధులను ఎంపిక చేసిన పేర్లను లెటర్ హెడ్ పై బయోడేటాలతో విజెఎఫ్ కార్యాలయం లో అంద జేయాలన్నారు ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలు, లక్కీడిప్ వంటి ప్రత్యేకత లతో ఈ కార్యమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రతిభకు ప్రోత్సహాం కో - చైర్మన్ లు టి నానాజీ, పి.ఎన్.మూర్తి , దాడి రవికుమార్ కార్యవర్గ ప్రతినిధులు ఇరోతి ఈశ్వరరావు, ఎం ఎస్ ఆర్.ప్రసాద్, పి.వరలక్ష్మీ ,పి.దివాకర్, దొండాగిరిబాబు, కె.ఆర్ శేఖర్ మంత్రి , గయాజ్, డేవిడ్ రాజు, మాధవ్ తదితరులి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులను త్వరలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులను ఉపముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ,అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ స్టేడియంకు ఉందని, జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్టేడియం ఇదని మంత్రి గుర్తుచేసారు. ఒక జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా క్రీడాకారుల సమస్యలు తనకు తెలుసునని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఎప్పటికపుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. రూ.15 కోట్లతో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ఊడా నుండి విడుదల కావలసిన నిధుల జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఊడా కాస్త సుడాగా మారడం వలనే నిధుల జాప్యానికి కారణమయిందని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి సంబంధించి నిధుల సమస్య లేదని, అసంపూర్తిగా ఉన్న స్టేడియం పనులన్నింటినీ త్వరలోనే పూర్తిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, సెట్ శ్రీ సిఇఓ జి. శ్రీనివాసరావు, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, వాకర్స్ క్లబ్ సభ్యులు జి.ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. శ్రీకాకుళంలో రూ.1.98 కోట్లతో నిర్మించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశ ధార ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ మాట్లాడుతూ జిల్లాకు ప్రధానమైనది వంశధార ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత గల జలవనరుల ప్రాజెక్టులలో వంశధార ప్రాజెక్టును చేర్చడం జరిగిందని అన్నారు. జిల్లాకు వంశధార జీవనాడి అని ఆయన పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడమే కాకుండా నిర్వాసితులకు అందాల్సిన నష్టపరి హారం కూడా త్వరలో అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించుటకు ప్రభుత్వం కృత నిశ్చయముగా ఉందని తెలిపారు. వై. యస్.రాజశేఖర రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జలవనరుల ప్రాజెక్టులను చేపడుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ నూతన కార్యాలయ భవనం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నదులకు నిలయమని, ఆ నదీ జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పొందూరు మండలం వి.ఆర్.గూడెం వద్ద ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ రానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జలవనరుల శాఖ నార్త్ కోస్ట్ సిఇ సి హెచ్.శివరామ ప్రసాద్, ఎస్ ఇ లు పి.రంగారావు, డోల తిరుమల రావు., మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ప్రకాష్, తదితర అధికార అనాధికారులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో వర్గవిభేదాలు ఎమ్మెల్యే ముందు బగ్గు మన్నాయి. రైతు భరోసా కేంద్రం విషయమై రెండు వర్గాలు సోమవారం రాత్రి జరిగినా మంగళవారం సాయంత్రానికి బయటకు పొక్కింది. అడ్డురోడ్డులోని ఎమ్మెల్యే నివాసంలోనే గొడవడినట్టు, కాదు కాదు తన్నుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే వారిస్తున్నా ఆ ప్రాంతంలో యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే మాటలను లెక్కచేయకుండా మరో వర్గానికి చెందిన వ్యక్తులపై చేయి చేసుకోవడంతో తిరిగి ఆవర్గం వ్యక్తులు కూడా గొడవకి దిగారు. కరోనా ముందు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో తన మాటకు విలువలేకుండా నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రకటించడం, తరువాత ఇసుక రవాణాలో ఆ నేత మీడియా ఎదుటక తన ప్రతాపాం చూపడం, రాష్ట్ర, జిల్లా నాయకుల నుంచి వార్నింగ్ తీసుకున్నారు కూడా. సోమవారం రాత్రి జరిగిన సంఘటన కొందను నాయకులు ఫోటోలు వీడియోలు తీయడంతో వారిని బెదిరించి మరీ వాటిని డిలీట్ చేయించారని సమాచారం. అంతేకాకుండా ఈవిషయాన్ని బయటకు రానీయకుండా తన అనుకూల మీడియాని వార్తలు రాకుండా కట్టడి చేసినట్టుగా తెలుస్తుంది. కొందరినైతే ఏకంగా బెదిరించి మరీ వార్నింగ్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. కానీ ఈలోగా సమాచారం నిఘా వర్గాలకు తెలిసి ఆరాతీయడంతో ఆ విషయం కాస్త ఆఇద్దరికి(అడిగిన వారికి, అడగని వారికి) మాత్రమే చెప్పారు. అవతలి వర్గం కార్యకర్తల నుంచి ఆ తన్నుకున్న తంతు వీడియోలు, ఫోటోలు కోసం తీవ్రంగా వెతుకులాట జరుగుతోందని సమాచారం. కాగా గతంలో ఇసుక అక్రమ రవాణాలో పార్టీ నుంచి అక్షింతలు వేయించుకున్న ఆ నేతలో మార్పురాకపోగా, తన వెనుక వున్న బలగాన్ని రెచ్చగొట్టి మరీ ఎమ్మెల్యే వెనుక వున్న వారిని తన్నడానికి, కయ్యానికి కాలుదువ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈవిషయం బటయకి పొక్కకుండా అత్యంత జాగ్రత్త పడటంలో అవతలి వర్గం బాగా సఫలీ క్రుతులయ్యారు. ఇదిలా వుండగా ఎమ్మెల్యే స్వయంగా తన మాట ఎవరూ వినడం లేదని, ఎవరికి నచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారని మీడియా ముందు బహిరంగంగా చెప్పిన మూడు నెలల్లోనే ఈ తన్నులాట జరగడం పార్టీలోనూ, అటు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద చర్చమొదలైంది. మరి ఈ విషయం పార్టీ జిల్లా నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి...వాస్తవాలు కూడా రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం వుంది. డిలీట్ చేసిన వీడియోలు బయటకు తీయించే పనిలో కొందరు కార్యకర్తలు నిమగ్నమైనట్టు తెలుస్తుంది...
తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిలో వేంచేసియున్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దగ్దమైంది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో చోటు చేసుకుంది. షెడ్డులో ప్రత్యేకంగా భద్రపరిచిన రథం ప్రాంగణ నుంచి తీవ్రమైన మంటలు రావడంతో ప్రమాదవశాత్తు జరిగిందా, లేక విద్రోహుల దుశ్చర్యా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామస్తులు మాత్రం ఇది దుశ్చర్య అని,గత ఆరు నెలలుగా సి సి టి వి కెమెరాలు పనిచేయకపోయినా ఎందుకు మరమ్మత్తు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా 40 అడుగులు ఎత్తు ఉన్న ఈ రథాన్ని 62 ఏళ్ల క్రితం పూర్తీగా టేకు కలపతో ఆగమ శాస్త్ర ప్రకారం తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు.ఈ రధోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సత్వర విచారణ జరుగుతోంది..
ప్రతి నిత్యం యోగా చేయడం వలన మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ, జిల్లా యోగా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతుల్లో నగరప్రజలతో పాటు కమిషనర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా, మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. యోగ వలన కలిగే ప్రయోజనాలను నగరప్రజలకు కూడా తెలియజేసి, వారు ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు పార్కులో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ యోగా నేర్చుకుని మీ ఇంటిలోనే రోజు గంటపాటు యోగా చేసుకోవచ్చునన్నారు. దైనందిన జీవితంలో యోగా ను ఒక అలవాటుగా మార్చుకోవడం వలన మనం అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోవచ్చునన్నారు. మనలో చాలా మంది ఉద్యోగ రీత్యా ఎనిమిది తొమ్మిది గంటల పాటు కూర్చుని పనిచేయాల్సి ఉంటుందన్నారు. అటువంటి సమయంలో మనము ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే యోగ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వయసు పెరిగే కొద్దీ మనం ఒక చోట కొంతసేపు నిలకడగా కూర్చోలేని పరిస్థితి వస్తుందని, యోగా వలన ఈ సమస్యను అధిగమించ వచ్చునన్నారు. కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ యోగాలో చేసే ప్రాణాయామం, కాపాలభాతి వంటి కొన్ని ఆసనాలు చేయడం వలన ఊపిరితిత్తుల పై చేడు ప్రభావం పడకుండా మనల్ని కాపాడుతాయన్నారు. నేను కూడా నేల రోజులుగా ప్రతి రోజు యోగా చేస్తున్నానని, నా శరీరం ఎంతో రిలాక్స్ ఉంటోందన్నారు. యోగా పై చాలా మందికి అవగాహన లేదని వారందరికి అవగాహన కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. నగరప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఆంఫీ థియేటర్ నందు మనిషికి మనిషికి ఎనిమిది అడుగుల భౌతికదూరం పాటించినా సుమారు 150 మంది యోగా శిక్షణ పొందేందుకు వీలుంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా యోగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మెడ, నడుము ఆసనాలు, ప్రాణాయామం, బ్రీతింగ్, హాండ్ స్ట్రిచింగ్, చక్రాసన, పాద హస్తాసన, అర్ధ కటి చక్రాసన, తాడాసన, వజ్రాసన, సమవృతి కాపాలభాతి, బసరిక, నాడీశుద్ది వంటి ఆసనాలు చేయించారు. ఈ యోగ తరగతుల్లో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. చంద్రశేఖర్, నగరప్రజలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ఆది వారం లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందించారని చెప్పారు. మందుల దుకాణాలు లభ్యంగా ఉంటాయని, వాటితోపాటు వాటికి ఆనుకుని పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియోగించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేసారు. అంబులైన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని పేర్కొంటూ అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు. అయితే అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు. శ్రీకాకుళంలో లాక్ డౌన్ ఉన్నందు వలన ఇతర ప్రాంతాలలో మార్కెటింగుకు వెళ్ళకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్రమద్యం తరలింపు వ్యాపారం ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూళ్లురుపేట సిఐ ఆర్యూవిఎస్ ప్రసాద్ అన్నారు.ఈ మేరకు తన బ్రుందాలతో అక్రమ తమిళ మద్యంపై దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శనివారం తడ బస్టాండు నుంచి తమిళ మద్యం ఎస్ కే సాదిక్ భాషా నుండి తమిళ మద్యం బాటిళ్లను 20 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కారిపాకం గ్రామానికి చెందిన రాసగొల్ల నాగేంద్రబాబు అనే నిందితుని అదుపులోకి తీసుకొని అతని వద్ద 20 అక్రమ తమిళ మద్యం బాటిళ్లను స్వాధీనపర్చుకున్నారు. ఎస్ కె సాదిక్ అనే వ్యక్తి నుండి 41 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 81 బాటిళ్లు వీరి నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట సి ఐ తో పాటు హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, హరిబాబు వెంకటేశ్వర్లు వెంకటసుబ్బయ్య లు పాల్గొన్నారు.
ప్రాధమిక వైద్యకేంద్రాల పరిధిలో ప్రసవాలు అధికంగా చేయడానికి పారామెడికల్ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ వైద్యా ధికారులను ఆదేశించారు. శనివారం అచ్చుతాపురంలో మండలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోజుకు ఎన్ని శ్యాంపిల్స్ తీస్తున్నారని, ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పి.హెచ్.సి.లో గల ల్యాబ్, ఫార్మశీని పరిశీలించారు. ఫార్మశీ లో గల మందుల వివరాలు, స్టాక్ ఎంత ఉన్నదీ, రిజిస్టర్ సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదాఅని రిజిస్టర్ను పరిశీలించారు. ల్యాబ్ ను పరిశీలించి అందులో కొన్ని పరికరాలు మరమ్మత్తులకు గురైనవని, అవసరమైన పరికరాల జాబితా పంపాలని డా. రజనిని ఆదేశించారు. పి.హెచ్.సి.లో ప్రసవాలు ఎన్ని జరిగాయని, సౌకర్యాలు అన్ని ఉన్నాయని, ప్రసవాలు తగ్గకూడదని డాక్టర్ ను ఆదేశించారు. పి.హెచ్.సి.లో లైటింగ్, పెయింటింగ్, తదితరమైనవి వారం రోజుల్లో రూపు రేఖలు మారిపోవాలని ఆదేశించారు. ఆ బాధ్యతను అనకాపల్లి ఆర్డీఓ సీతారామరావుకు అప్పగించారు. కొండకర్ల ఆవ ను సందర్శించారు. పర్యాటకులు వస్తున్నది లేనిది తహసిల్థార్ ను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఆహాలదంగా తయారు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పర్యాటకులు సందర్శించే విధంగా ఉండాలని, సైనేజస్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు స్వీకరించిన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఏ. మధు బాబును శనివారం కలెక్టరేట్ లో శాలువాతో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సన్మానించారు. ఈసారి రాష్ట్రం నుంచి జాతీయ అవార్డుకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయునిగా మధుబాబు నిలవడం పట్ల మంత్రి మధుబాబుకు అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, జిల్లా పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో మరింత మంది విద్యార్ధులను మంచి ఉన్నత విద్యార్ధులుగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించినందున ప్రభుత్వ పాఠశాలలంటే పిల్లల్లో మంచి భావన కలిగే ఉపాధ్యాయులు తయారు చేయాల్సి వుందన్నారు. మధుబాబు జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసారని కితాబిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో దేశ విపత్తు నిర్వహణ సంస్థ ( ఎన్.డి.ఎం.ఎ ) సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార అవార్టులను ప్రధానం చేయనున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రధాన పురస్కార అవార్డులు – 2021 సంవత్సరానికి పౌరులు,వివిధ సంస్థల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30 లోగా ఆన్ లైన్ లో సమర్పించాల్సి వుంటుందన్న ఆయన ఈ https://dmawards.ndma.gov.in వెబ్ సైట్ యందు అప్ చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్వో కోరారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరోనా మహమ్మారి విస్తరించకుండా, వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు ప్రకాశం పార్కులో యోగా శిక్షణా తరగతులు నిర్వహిం చనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా తెలిపారు. నగరపాలక సంస్థలో ఈమేరకు శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా యోగా అసోసియే షన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రకాశం పార్కులోని ఆంఫీ థియేటర్ దగ్గర ఈ యోగా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కమిషనర్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు యోగా శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఈ ఆసక్తి కలిగిన నగరప్రజలు ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రకాశం పార్కులో ఆంఫీ థియేటర్ కు రావాలని కమీషనర్ పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రపంచంలో గురు శిష్య అనుభంధం మానవ జాతికి శ్రీరామ రక్ష అని ఏయూ ఆచార్యులు కొనియాడారు. ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు,ఈ సందర్బంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఆచార్యులు పూలమాలలు వేసి, అనంతరం గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం సైకాలజీ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం వి ఆర్ రాజు మాట్లాడుతూ, గురువులతోనే నవసమాజ ప్రగతి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. విద్యతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేది గరువులు మాత్రమేనన్నారు. నిరంతరం ఏదో ఒకటి తాము నేర్చుకుంటూ తమ విద్యార్థులకు కూడా తెలియజేయాలని మంచి సంకల్పం ఒక్క గురువులకు మాత్రమే సొంతమన్నారు. నేటి ఆధునిక యుగంలో కూడా గురువుల జ్ఞానమార్గం ఎంతో మందిక విద్యార్ధులకు ఆదర్శనీయమన్నారు. ప్రపంచాన్ని నడిపించేది గురు మార్గం ఒక్కటేనన్న ఆయన ఆంధ్ర యూనివర్సిటీ లోడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలు మరపురానివన్నారు. ప్రస్తుతం తెలుగుభాషను కొనసాగిస్తూనే మరోవైపు ఇంగ్లీషుభాషపై కూడా విద్యార్ధులు పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుప్రాయం నుంచి ఇంగ్లీష్ పై పట్టు సాధిస్తే అది భవిష్యత్ తరాలకు పునాది వేస్తుంది అన్నారు. తదుపరి సైకాలజీ విభాగం అధ్యాపకులు డాక్టర్ సునీత, సుభాషిని, తదితరులును విద్యార్డులు ఘనంగా సత్కరించారు. ఏయూ సైకాలజీ సీనియర్ విభాగం విద్యార్థి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వేణు, కృష్ణ,దివిజ,కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ నిభందనల తరువాత చాలాకాలానికి విశాఖలో సినిమా షూటింగ్ లు సందడి మొదలైంది. లాక్డౌన్ తరువాత 4.0 అన్ లాక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి నగరంలో సినిమా షూటింగ్ సందడి ప్రారంభమైంది. ఆర్కే బీచ్ రోడ్డులో సినిమా షూటింగ్ను ప్రారంభించారు. కరోనా నేప థ్యంలో ఐదు నెలలుగా విశాఖలో సినీ షూటింగ్లు ఆగిపోయాయి. ప్రభుత్వ నిబంధనల సడలింపుల అనంతరం శనివారం బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ‘ఐపీఎల్’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులు మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ జరిపారు. దీంతో విశాఖలో మళ్లీ షూటింగ్ సందడి నెలకొంది. ఇప్పటికే పలు హీరోల పెద్ద ప్రాజెక్టులు కూడా కరోనా కారణంగానే నిలిచిపోయాయి. ప్రభుత్వం షూటింగ్ లకు కూడా అనుమతులు ఇవ్వడంతో మళ్లీ వెండితెర పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని సినిమా దర్శకులు భావిస్తున్నారు.
కేంద్రం ప్రభుత్వం బ్యాంకుల్లోని అన్నిరకాల రుణాలపై మారటోరియంపై తీర్పు ఇచ్చినప్పటికీ, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ విశాఖ ఏజెన్సీలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. కరోనా సమ యంలో అందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల వద్ద నుంచి బ్యాంకులు అన్ని రకాల లోన్లుకి ఈఎంఐలు కట్టించుకున్నాయి. అన్ని లోన్లకు ఈసీఎస్ (ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్) ఉండటంతో జీతాలు పడిన వెంటనే లోన్లకు ఈఎంఐలు కట్ చేసుకున్నాయి. ఇవేవో ఆధారాలు లేకుండా అన్నమాటలు కాదు. విశాఖ ఏజెన్సీలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఖచ్చితంగా ఈఎంఐలు కట్టించుకున్నాయి. అవి వాస్తవమో కాదో ఏజెన్సీలోని 11 మండలాల్లోని బ్యాంకు నివేదికలు చూస్తే అర్ధమవుతుంది. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలలు సగం జీతం ఇచ్చిన సమయంలో కూడా బ్యాంకులు ఈఎంఐలు కట్టించుకోవడం కట్ చేసుకోవడం గమనార్హం. ప్రస్తుం సుప్రీం కోర్టు మరో రెండు నెలలు ఈఎంఐలపై గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈనెల అంటే ఆగస్టులో కూడా ఈఎంఐలు కట్టించుకున్నాయి ఏజెన్సీలోని బ్యాంకులు..అదేమంటే రుణాలకు ఈఎంఐలు ప్రతీనెలా కట్టాల్సిందేనని ఖరా ఖండీగా చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే ఈఎంఐ క్లియర్ అయ్యేంత వరకూ అకౌంట్లను ఫ్రీజ్ చేసి పెడుతున్నాయి. . అలాంటి సమయంలో కోర్టు తీర్పులను బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం మారటోరియం ప్రకటించినా, సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా బ్యాంకులు మాత్రం ఈ విధంగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులు సైతం నోరు మెదపడం లేదు..