1 ENS Live Breaking News

నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతులు...

విశాఖజిల్లాలో ఈరోజు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్రం వెలువరించిన 4.0 మార్గ దర్శకాలను అనుసరించి ఈ వెసులుబాటు కల్పించినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో విశాఖలోని పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకు లతో నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాంగంగా అరకులోని బొర్రాగుహలు, మ్యూజియం, పార్కు, కాఫీ సెంటర్, విశాఖలోని కైలాసగిరి, రోప్ వే, రుషి కొండ, కంబాల కొండ, టూరిజం మ్యూజియంతో అన్ని పర్యాటక ప్రాంతాలు తెరవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ఆదేశాలు రావడానికి వారం రోజుల ముందు నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ పరిశుభ్రం చేయించారు అధికారులు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లించడంతోపాటు, అన్ని ప్రాంతాలను శానిటైజ్ చేశారు. అదే సమయంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు కూడా మాస్క్ ఖచ్చితంగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడలని కూడా పర్యాటక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా వుంటే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా పర్యాటక ప్రాంతాలకు పెద్దగా జనాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు..

Visakhapatnam

2020-09-05 11:12:19

నాడు నేడు పనులు వేగవంతం చేయాలి..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  జె.నివాస్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం మండలం సింగుపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నాడు నేడు పనులతో పాఠశాలల ముఖ చిత్రం మారుతుందని ఆయన పేర్కొన్నారు. మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని, కార్పొరేట్ స్ధాయిలో సౌకర్యాలు కల్పించడం జరుగుతోందని ఆయన అన్నారు. తాగు నీరు, నిత్యం నీటిసరఫరాతో మరుగుదొడ్లు, మంచి విద్యుత్ దీపాలు, ప్యాన్ లు తదితర సౌకర్యాలు ఉండాలని చెప్పారు. విద్యార్ధులు ఆహ్లాదకర వాతావరణంలో విద్యను అభ్యసించాలని, తద్వారా మంచి విద్యాభ్యాసం కలుగుతుందని, మానసిక వికాసం వస్తుందని కలెక్టర్ అన్నారు. సింగుపురం ప్రాథమిక పాఠశాల డెమో పాఠశాలగా రూపొందించడం వలన ఇతర పాఠశాలలను అభివృద్ధి పరచుటకు చక్కని వేదికగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, ఇడబ్య్లుఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు కె.భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు. 

సింగుపురం

2020-09-04 21:23:26

గడువులోగా గరుడ వారధి నిర్మాణం పూర్తికావాలి...

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుగున్న గరుడవారధి పనులను సత్వరమే పూర్తిచేయాలని కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు ఎక్కువ కాలం చేయడం వాహన చోదకులకు చాలా ఇబ్బందులుంటాయని, వాటిని నిరోధించాలంటే పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం కరకంబాడీ మార్గంలోని బొంతాలమ్మ ఆలయం సమీపంలో జరుగుతున్న వినాయకసాగర్ నిర్మాణ పనులను కూడా కమిషనర్ పరిశీలించారు. అక్కడి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకు న్నారు. గడువులోపల కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను పూర్తిచేయాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా చూడాలన్నారు. పనులు పూర్తయిన తరువాత ఖచ్చితంగా విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

2020-09-04 18:39:48

అమృత్ పనులు వేగంగా పూర్తిచేయాలి...కమిషనర్ గిరీష

తిరుపతి నగరపాలక పరిధిలో జరుగుతున్న అమృత్ పథకం పనులు వేగవంతం గా పూర్తి చేయాలని నగరపాలక సంస్త కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,  పనుల్లో ఆలస్యం చేస్తే కాంట్రాక్టు రద్దు చేస్తామని కమిషనర్ గిరీషా  కాంట్రాక్టర్లను హెచ్చరించారు.  నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు నీటి సరపరాకై అమృత్ పథకంలో పైపులైన్, ట్యాంకుల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ పనుల్లో ఆలస్యం చేయడంవలన ప్రజలకు మంచినీటి కష్టాలు తీరకపోగా పెరుగుతాయన్నారు.  సకాలంలో కాంట్రా క్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నా,  ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలు చూపుతూ పనులు ఆలస్యం చేస్తే సహించే ది లేదని అధికారులను హెచ్చరించారు. అన్ని చోట్లా ట్యాంకులకు నీటి సరఫరా చేస్తున్నామన్న కమిషనర్ పెండింగ్ పైప్ లైన్ పనులు   వారంలోపు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా త్రాగునీటి కొత్త కనెక్షన్లు కావాలంటే వారికి ఇవ్వాలన్నారు. కొన్ని చోట్ల యూ.డి.జి. పైప్ లైన్ అడ్డుగా ఉండడంతో వాటర్ పైప్ లైన్ ఆలస్యం అవుతోందని కాంట్రాక్టర్లు చెప్పారు. ఏది ఏమైనా పనులు సర్దుబాటు చేసుకుని పనులు పూర్తి చేయలన్నారు. పైప్ లైన్ ఆలస్యం వలన రాజీవ్ నగర్ లో సి.సి.రోడ్ పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు చెప్పడంతో ఎక్కువ మందిని పెట్టి పనులు పూర్తి చేయాలని కమిషనర్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. పైప్ లైన్ నిర్మాణం పూర్తి అయిన వెంటనే అక్కడ గుంతలు పూడ్చి వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్.ఈ. చంద్రశేఖర్, ఎం.ఈ.2 వెంకట్రామిరెడ్డి, డి.ఈ లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రఘుకుమార్, గోమతి, రవీంద్ర రెడ్డి, ఏ,ఈ. లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Tirupati

2020-09-04 14:18:15

2016లో ఆక్రమణ..నేడు అపార్ట్ మెంట్ల నిర్మాణం..అయినా

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా 2016లో ఖబ్జా చేశారు. ఇపుడు అంతస్తుల మీద అంతస్తులు అనధికారికంగా నిర్మించేస్తు న్నా రు. కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వం రక్షించే ప్రయంత్నం చేయలేదు అంటున్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు. మధురవాడ సర్వే నెం 367 లో గల సుమారు 100 కోట్ల విలువైన 9.27 ఏకరముల ప్రభుత్వ భూమిలో దర్జాగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిచిన ఆక్రమణ దారులను తక్షణమే చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమండ్ చేస్తున్నారు. అంతే కాదు..  2016 ఆగష్టు నెలలో ఈభూమి అన్యాక్రాంతం జరిగిన అంశం గుర్తించి సీపీఐ తరుపున అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ చేసిన ఫిర్యాదు అంశాన్ని తాజాగా జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కి చేసిన ఫిర్యాదులో పేర్కొని మెయిల్  సమర్పించినట్టు ఆయన మీడియాకి చెప్పారు. అభూమి ప్రభుత్వ భూమని రెవిన్యూ రికార్డులను మార్చి,అందులో నిర్మిస్తున్న భవనాలు అక్రమంగా నిర్మిస్తున్న వేననితేల్చి,ఆ భవనాలు నిర్మాణానికి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేసి నాలుగు సం"గడిచినప్పటికి నేటికి అవి కార్యరూపం దాల్చకపోవడం అవినీతేనని ఆరోపించారు. ఇటువంటి అంశములు వెలుగులోకి రాగానే అధికారులు కొద్దిగా హడావుడి చేసి వదిలివేయడం చాలా దారుణమన్నారు. అంతేకాదు గడిచిన నాలుగేళ్లుగా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలపై కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని పైడిరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం లో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేస్తున్న తరుణంలో తక్షణమే ఆ విలువైన ప్రజా ఆస్థిని  స్వాధీనం చేసుకొని ప్రభుత్వ,ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు...

Madhurawada

2020-09-04 13:42:09

లక్షణం ఉంటే అది ఖచ్చితంగా కరోనానే...కలెక్టర్

కరోనా లక్షణాలు ఉన్నప్పటికి కరోనా అవునా ? కాదా ? అనే ఆలోచన వద్దని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రజలను కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శుక్ర వారం ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపా యాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం అత్యంత కీలక సమయంలో ఉన్నామని, రానున్న నెలన్నర రోజులు జిల్లాకు మరింత కీలకమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు 8 వందల నుండి వెయ్యి కేసులు వరకు నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉండి వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలో రోజుకు కనీసం రెండు వందల కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇతర పట్టణాల్లో కూడా పరీక్షలు అధికంగా చేయుటకు నిర్ణయించామని చెప్పారు. జ్వరం, ఆయాసం వంటి ప్రాథమిక లక్షణాలు ఉన్న వాళ్ళు కరోనా కాదు అనే ధీమాతో ఉంటున్నారని, పరిస్ధితులను వాలంటీరుకు వివరింగా తెలియజేసి సరైన చికిత్సను సరైన సమయంలో పొందాలని ఆయన కోరారు. 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్, ఆయాసం, వరుసగా మూడు రోజుల పాటు జ్వరం ఉన్న వారు చికిత్స పొందుటకు ఆలస్యం చేయరాదని ఆయన సూచించారు. సకాలంలో ఆస్పత్రిలో చేరడం వలన ఖచ్చితంగా ప్రాణాలు కాపాడగలమని వైద్యులు తెలియజేస్తున్నారని కలెక్టర్ వివరించారు. చిన్న పాటి లక్షణాలు ఉన్న వారికి చికిత్సను అందించుటకు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5 వేల పడకలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నామని, నిపుణులైన వైద్యులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంచి మందులతోపాటు ప్లాస్మా థెరాఫీని కూడా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో 73 మందికి ప్లాస్మా థెరాఫీ అందించామని, వాళ్ళందరి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధానికి మొదటి నుండి అనేక చర్యలు చేపట్టిన సంగతి ఆయన గుర్తు చేశారు. కంటైన్మెంటు జోన్లను పక్కాగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.  శ్రీకాకుళం పట్టణంలో 66 కంటైన్మెంటు జోన్లు ఉన్నాయని ఆయన తెలియజేస్తూ కంటైన్మెంటు జోన్లలో మొబైల్ వ్యాన్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షలు నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇంటివద్దకే పరిమితం కావాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ  వారికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని, వారితో మాట్లాడినప్పుడు మాస్కు విధిగా ఉపయోగించాలని సూచించారు. పెద్దలు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆయన అన్నారు. ప్రజల జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్వచ్చంద సంస్ధల సహకారంతో ఉచితంగా ఫేస్ షీల్డులు పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఫేష్ షీల్డు ఉపయోగించడం వలన 80 శాతం వరకు కరోనా వైరస్ వ్యాప్తి నుండి సురక్షితంగా ఉండవచ్చని సర్వేలు సూచిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు.  వ్యాపార సంస్థల నిర్వాహకులు, ఆటో రిక్షావారు కరోనా వైరస్ కు హై రిస్కు కలిగి ఉంటారని అన్నారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లు విధిగా మాస్కు ధరించేటట్లు చూడాలని ఆయన సూచించారు. జిల్లా లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.

Srikakulam

2020-09-04 13:26:15

వెబ్ సైట్ లో పారామెడికల్ ఉద్యోగాల మెరిట్ లిస్టు.. dmho

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాప్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల పైనల్ మెరిట్ లిస్ట్ జాబితా 3-09-2020 తేదీన http://Visakhapatnam.nic.in వెబ్ సైటు నందు పొందు పరచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారిణి డాక్టర్ విజయలక్ష్మి  తెలియజేయశారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించుకొని, తమ అభ్యంతరాలు ఏమైనా ఉన్నచో 04-09-2020 సాయంత్రం 5.00 గంటల లోపు  రాత పూర్వకముగా, తగు డాక్యుమెంట్ ఆధారాలతో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలన్నారు. మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు పరిశీలిస్తామన్నడీఎంహెచ్ఓ.. ఇతర అభ్యర్థుల మెరిట్, సర్విస్ సర్టిఫికేట్, దృవ పత్రాల విషయాలలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో తమ దృష్టికి తీసుకు వచ్చినచో పరిశీలనకు దస్త్రాలను చూపిస్తామన్నారు. జిల్లా కలెక్టరు ఉత్తర్వుల మేరకు మొత్తం ప్రక్రియ నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే నిర్వహించామన్నారు. 

Visakhapatnam

2020-09-03 19:39:54

కెజిహెచ్ సీఎస్ఆర్ బ్లాకులో కోవిడ్ రోగులకు వసతి..

విశాఖ  కె.జి.హెచ్.లో సి.యస్.ఆర్. బ్లాక్ కోవిడ్-19 పేషెంట్లకు రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నదని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించా రు.కె. జి.హెచ్. లో కొత్తగా నిర్మించిన సి.యస్.ఆర్. బ్లాక్ ను గురువారం ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.  బ్లాక్ అంతటినీ క్షణ్ణంగా పరిశీలించారు.  150 ఐ.సి. యు. పడకలతో, ఆక్సిజన్ ఉన్న 500 పడకలతో రెండు మూడు రోజుల్లో కోవిడ్-19 పేషెంట్లకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.  మూడు ఆపరేషన్ థియే టర్లు, ఆ బ్లాక్ లోనే ఒక ల్యాబ్, పేషెంట్ల అటెండెంట్లకు పేషెంట్ల సమాచారం తెలియజేసేందుకు ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రతీ రూంలో ను సి.సి. కెమెరా ఉంటుందని, దీనిని మోనిటరింగ్ చేయడానికి ఒక రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్పించిన సౌకర్యాలు ఎంత ముఖ్యమో సర్వీసు కూడా అంతే ముఖ్యమని వైద్యులను ఆదేశించారు.  కె.జి.హెచ్. ఒక చారిత్రాత్మకత గల ఆసుపత్రి అని, కె.జి.హెచ్.  రాష్ట్రంలో నంబర్ ఒన్ లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు కె.జి.హెచ్ పర్యవేక్షకులు డా. పి.వి. సుధాకర్,  ఎపిఎంఐడిసి ఇఇ ఉమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కెజిహెచ్

2020-09-03 17:27:13

తిరుపతి మరో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు..కమిషనర్

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో  ఎన్ హెచ్ఎం కింద 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. గురు వారం నగర పాలక సంస్థ కార్యాలయం అర్బన్ రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, అర్బన్, నగరపాలక సర్వేలు, ఆరోగ్య విభాగాల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఆరు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలు పరిశీలించి, వాటికి సంబంధించి నివేదికను కలెక్టర్ నివేదించాలన్నారు. నడుచుకుంటూ వెళితే 15 నిమిషాల్లో ఆరోగ్య కేంద్రాల్లో చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్ప టికే నగరపాలక సంస్థ పరిధిలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్న కమిషనర్ కొత్తగా నిర్మించే వాటితో అన్నివర్గాల వారికి వైద్యసేవలు అందుతాయన్నారు. అంతకుముందు అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కమిషనర్ పరిశీలించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం,డిఈ. విజయ్ కుమార్ రెడ్డి, అర్బన్, నగరపాలక సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్, రమేష్, మున్సిపల్ ఉప గణాంక అధికారి నీలకంటేశ్వర రావు, ఆరోగ్య విస్తరణ అధికారి మోహన్ తదిత రులు పాల్గొన్నారు.

Tirupati

2020-09-03 17:05:47

ప్లాస్మాదానం దానానికి ముందుకురావాలి..డిఎంహెచ్ఓ

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 బాదితులకు ప్లాస్మా తెరపీ చేయుటకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకి రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈమేరకు విశాఖలోని గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చి, కోలుకున్న28 రోజుల తర్వాత ఎవరైనా ప్లాస్మా దానం చేయవచ్చునని వివరించారు. కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నవారు ఈ ప్లాస్మా దానం చేయుటకు ముందుకు రావాల న్నారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ. 5,000/- ల నగదు ప్రోత్సాహకం అందజేస్తారని కూడా ఆమె వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వి.వినయ్ ప్రకటించడంతోపాటు, దాతలు మంచి మనసుతో ముందుకి రావాలని కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  ప్లాస్మా దానం చేయదల్చిన వారు డా.సిహెచ్. శ్రీధర్ సర్వేలెన్స్ అధికారి,8790407037వద్ద సంప్రదించాలని కోరారు. ఆపదలో ఉన్న కరోనా రోగులకు ప్లాస్మాదానం చేసి వారికి ప్రాణదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.  

Visakhapatnam

2020-09-03 16:55:07

బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీరని లోటు

ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర్ గౌరవ అధ్యక్షలు, బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీర ని లోటుఅని ఫ్రంట్ రాయలసీమ ప్రధాన కార్యద ర్శి బుట్టా రంగయ్య  ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కీ.శే బొమ్మ న రాజ్ కుమార్ కి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా పొలిటి బ్యూరొ సభ్యులు యం.ఆర్ శ్రీనివాసులు ,రాష్ట్ర కార్యదర్శి డా"గణెష్  మాట్ల డుతూ,  ఫ్రం ట్ ఒక ధార్శికతను కోత్పోయిందన్నారు. చేనేతల కోసం ఎన్నో సామాజిఖ పోరాటాలు చేసి వారికి లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి ఉన్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. రాష్ట్ర వై యస్ ఆర్ నాయకులుగా చేనేత కులాల ఐక్యతకు,  చేనేత కార్మికుల సంక్షేమం కోసం, హర్నిశలు పని చేశారని  శ్రీశైలం ధర్మసత్రం అద్యక్షులు, రాజమండ్రి అర్బన్ బాంక్ చైర్మన్ గా కోన సాగుతూ,  రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్రంలో ఉన్న చేనేత కులా సంఘాల సమన్వయ కర్తగా ఎన్నోసేవలు చేశారన్నారు. అంతకు ముందు బొమ్మన రాజ్ కుమార్ చిత్ర పటానికి పూల మాల వెసి శ్రధ్ధాంజలి ఘటించి ఐదు నిమిషాలు మౌను పాటించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కొశాధి కారి విశ్వనాథ్ రఘు,6వ వార్డు ఇంఛార్జి శివ,టైలర్ శీను తథి తరులు పాల్గొన్నారు.

Yemmiganooru

2020-09-03 15:45:32

రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలబాలికలు, సంస్థలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకోసం  ఈ నెల 15లోగా ఆన్ లైన్ లో నామినేషన్ చేసుకోవాలని ఐసిడిఎస్ పిడి డా. జి.జయదేవి తెలియజేశారు. గురువారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యం, సాహస రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలలు, బాలల రక్షణ, అభివృద్ధి సంక్షేమం కొరకు పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేస్తుందన్నారు. ఇందులో బాలశక్తి, బాలకళ్యాణ్, సంస్థల పురస్కారాల కేటగిరీలు ఉంటాయని ఆమె వివరించారు. పురస్కార గ్రహీతలకు 2021 గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి పతకంతో పాటు ఐదు లేదా లక్ష రూపాయల నగదు, ధృవపత్రాలను అందజేస్తారన్నారు. ప్రధానమంత్రితో సన్మాన కూడా చేస్తారన్నారు. అర్హులైన బాలలు, వ్యక్తులు, సంస్థలు ఈ నెల 15లోగా www.nca.wcd.nic.in ఆన్ లైన్ లో నామినేషన్లను సమర్పించాలని ఆమె కోరారు. ఇతర సమాచారం కొరకు పథక సంచాలకులు,  జిల్లా మహిళా, శిశుఅభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని గాని లేదా 08942-240630 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.

Srikakulam

2020-09-03 14:35:07

ఘన, వ్యర్ధ పదార్థా నిర్వహణకు యూజర్ చార్జీలు..

తిరుపతి నగరపాలక సంస్థ పరిధి లోని నివాస గృహాలు, వాణిజ్య సముదాయముల నుంచి చెత్త సేకరణకు ఇకపై యజూర్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుం దని కమిషనర్ గిరీష చెప్పారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, యూజర్ ఛార్జీల వివరాలు తెలియజేశారు. నివాస గృహాలు- రూ  30, వాణిజ్య సముదాయాలు, హాస్టళ్లు, మరియు అతిథి గృహాలు, మొదలగు వాటిపై 100 నుండి500 వరకూ నిర్ణయించామన్నారు. అదే విధంగా ప్లాస్టిక్ వినియ గించినా అమ్మినా, వాడినా 5 వేల నుంచి పదివేల వరకు జరిమానా వేస్తామన్నారు. రోడ్లలో,కాలవలో వ్యర్థాలు  వేసినా కూడా  జరిమానలు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వినియోగదారులు చెత్త సేకరణ కొరకు, యూజర్  చార్జీలు చెల్లించాల్సి వుంటుందన్నారు. నిరంతరాయంగా పారిశుధ్య నిర్వహణ, గన, వ్యర్ధ పదార్ధల కోసం నిర్ణయించిన యూజర్ చార్జీలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. మునిసిపల్ ఘన వ్యర్థాలు మరియు సంబంధిత పారిశుద్ధ్య వ్యర్థాల నిల్వ, సేకరణ, రవాణా, మరియు పారవేయడంతో అనుసంధానించబడిన అన్ని విషయాలను నియంత్రించడానికి వినియోగదారుల నుండి యూజర్ చార్జీలు సేకరించాలని నిర్ణయించామని కమిషనర్ గిరీష వివరించారు.

Tirupati

2020-09-03 14:16:39

సర్వేయర్లకు మూడంచెల అధునాతన శిక్షణ..

రాష్ట్రంలో భూముల పున:సర్వే నిర్వహిస్తున్నట్లు సర్వే శాఖ సంయుక్త సంచాలకులు, రాష్ట్ర సర్వే శిక్షణా అకాడమి వైస్ ప్రిన్సిపాల్, వక్ఫ్ శాఖ కమీషనర్ సి.హెచ్. వి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలో సర్వే శిక్షకుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి భూముల పున:సర్వే చేడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమమన్న ఆయన వ్యక్తిగత కమతాల వారీగా సర్వే జరుగుతుందని ఆయన చెప్పారు. 3 దశలలో సర్వే జరుగుతుందని అందుకు తగిన విధంగా సర్వేయర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం - కంటిన్యుయస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ (సి.ఓ.ఆర్.ఎస్) నెట్ వర్కుతో పున:సర్వే కార్యక్రమం జరుగుతుందన చెప్పారు. ఈ విధానంలో హై ఎక్యూరసి, పారదర్శకత ఉంటుందని , రెవిన్యూ శాఖ సమన్వయంతో సర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే చేయడానికి సర్వేయర్లకు ఆటో కాడ్, జిపిఎస్ తదితర ఆధునిక వ్యవస్ధలలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 9,424 మంది సర్వేయర్లు పనిచేస్తున్నారని అందులో 7 వేల మందికి శిక్షణ పూర్తి అయిందన్నారు. ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమం సంబంధిత జిల్లా సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన చెప్పారు. పున:సర్వే పక్కాగా ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మంచి ప్రామాణికమైన శిక్షణను అందిస్తున్నామని కుమార్ చెప్పారు. ఇప్పటికే సంబంధిత సర్వే పరికరాలు, శిక్షణా మాడ్యూల్స్ సరఫరా చేసామని ఆయన అన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏపి సర్వే ట్రైనింగు అకాడమి సహాయ సంచాలకులు టి.త్రివిక్రమ రావు, శ్రీకాకుళం జిల్లా సహాయ సంచాలకులు కె.ప్రభాకర్ పాల్గొన్నారు.

Srikakulam

2020-09-03 14:02:24

104 వాహనాలే ఫీవర్ క్లినిక్ లు...జిల్లాకలెక్టర్

104 వాహనాన్ని ఫివర్ క్లినిక్ లుగా వినియోగించి కరోనా పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖలో వైద్య, ఆరోగ్యశాఖ, జీవిఎంసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో మొబైల్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ లు ఏర్పాటు చేస్తామని తలిపారు. గ్రామ,  వార్డు సచివాలయ  సిబ్బంది ప్రైమరి కాంటాక్ట్ లు , సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని  తెలిపారు. గర్బీణీలు, 60 సంవత్సరముల పైబడిన , ఇతర రోగాలు  ఉన్న   హైరిస్క్   వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. డేటాను ఎప్పటి కప్పుడు  అప్ లోడ్ చేయాలని తెలిపారు.  జి.వి.ఎం .సి పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్, కంటెన్మెంట్ జోన్ ల మ్యాపింగ్  ఆలస్యం జరుగుతుందని, తొందరగా పూర్తి చేయాలని తెలిపారు.  కంటెన్మెంట్ జోన్ పరిధిలో  శానిటేషన్ చేయించాలని, ఆటోలను వినియోగించి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని  తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో  72 అర్బన్ పి హెచ్ సిలలో  మెడికల్ ఆఫీసర్లు, నర్సుల నియామకం పూర్తయ్యిందని తెలిపారు.  కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో ట్రూనాట్ లాబ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సి హెచ్ సి , ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

కలెక్టరేట్

2020-09-03 11:25:30