1 ENS Live Breaking News

తిరుపతి మరో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు..కమిషనర్

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో  ఎన్ హెచ్ఎం కింద 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. గురు వారం నగర పాలక సంస్థ కార్యాలయం అర్బన్ రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, అర్బన్, నగరపాలక సర్వేలు, ఆరోగ్య విభాగాల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఆరు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలు పరిశీలించి, వాటికి సంబంధించి నివేదికను కలెక్టర్ నివేదించాలన్నారు. నడుచుకుంటూ వెళితే 15 నిమిషాల్లో ఆరోగ్య కేంద్రాల్లో చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్ప టికే నగరపాలక సంస్థ పరిధిలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్న కమిషనర్ కొత్తగా నిర్మించే వాటితో అన్నివర్గాల వారికి వైద్యసేవలు అందుతాయన్నారు. అంతకుముందు అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కమిషనర్ పరిశీలించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం,డిఈ. విజయ్ కుమార్ రెడ్డి, అర్బన్, నగరపాలక సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్, రమేష్, మున్సిపల్ ఉప గణాంక అధికారి నీలకంటేశ్వర రావు, ఆరోగ్య విస్తరణ అధికారి మోహన్ తదిత రులు పాల్గొన్నారు.

Tirupati

2020-09-03 17:05:47

ప్లాస్మాదానం దానానికి ముందుకురావాలి..డిఎంహెచ్ఓ

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 బాదితులకు ప్లాస్మా తెరపీ చేయుటకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకి రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈమేరకు విశాఖలోని గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చి, కోలుకున్న28 రోజుల తర్వాత ఎవరైనా ప్లాస్మా దానం చేయవచ్చునని వివరించారు. కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నవారు ఈ ప్లాస్మా దానం చేయుటకు ముందుకు రావాల న్నారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ. 5,000/- ల నగదు ప్రోత్సాహకం అందజేస్తారని కూడా ఆమె వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వి.వినయ్ ప్రకటించడంతోపాటు, దాతలు మంచి మనసుతో ముందుకి రావాలని కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  ప్లాస్మా దానం చేయదల్చిన వారు డా.సిహెచ్. శ్రీధర్ సర్వేలెన్స్ అధికారి,8790407037వద్ద సంప్రదించాలని కోరారు. ఆపదలో ఉన్న కరోనా రోగులకు ప్లాస్మాదానం చేసి వారికి ప్రాణదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.  

Visakhapatnam

2020-09-03 16:55:07

బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీరని లోటు

ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర్ గౌరవ అధ్యక్షలు, బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీర ని లోటుఅని ఫ్రంట్ రాయలసీమ ప్రధాన కార్యద ర్శి బుట్టా రంగయ్య  ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కీ.శే బొమ్మ న రాజ్ కుమార్ కి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా పొలిటి బ్యూరొ సభ్యులు యం.ఆర్ శ్రీనివాసులు ,రాష్ట్ర కార్యదర్శి డా"గణెష్  మాట్ల డుతూ,  ఫ్రం ట్ ఒక ధార్శికతను కోత్పోయిందన్నారు. చేనేతల కోసం ఎన్నో సామాజిఖ పోరాటాలు చేసి వారికి లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి ఉన్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. రాష్ట్ర వై యస్ ఆర్ నాయకులుగా చేనేత కులాల ఐక్యతకు,  చేనేత కార్మికుల సంక్షేమం కోసం, హర్నిశలు పని చేశారని  శ్రీశైలం ధర్మసత్రం అద్యక్షులు, రాజమండ్రి అర్బన్ బాంక్ చైర్మన్ గా కోన సాగుతూ,  రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్రంలో ఉన్న చేనేత కులా సంఘాల సమన్వయ కర్తగా ఎన్నోసేవలు చేశారన్నారు. అంతకు ముందు బొమ్మన రాజ్ కుమార్ చిత్ర పటానికి పూల మాల వెసి శ్రధ్ధాంజలి ఘటించి ఐదు నిమిషాలు మౌను పాటించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కొశాధి కారి విశ్వనాథ్ రఘు,6వ వార్డు ఇంఛార్జి శివ,టైలర్ శీను తథి తరులు పాల్గొన్నారు.

Yemmiganooru

2020-09-03 15:45:32

రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలబాలికలు, సంస్థలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకోసం  ఈ నెల 15లోగా ఆన్ లైన్ లో నామినేషన్ చేసుకోవాలని ఐసిడిఎస్ పిడి డా. జి.జయదేవి తెలియజేశారు. గురువారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యం, సాహస రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలలు, బాలల రక్షణ, అభివృద్ధి సంక్షేమం కొరకు పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేస్తుందన్నారు. ఇందులో బాలశక్తి, బాలకళ్యాణ్, సంస్థల పురస్కారాల కేటగిరీలు ఉంటాయని ఆమె వివరించారు. పురస్కార గ్రహీతలకు 2021 గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి పతకంతో పాటు ఐదు లేదా లక్ష రూపాయల నగదు, ధృవపత్రాలను అందజేస్తారన్నారు. ప్రధానమంత్రితో సన్మాన కూడా చేస్తారన్నారు. అర్హులైన బాలలు, వ్యక్తులు, సంస్థలు ఈ నెల 15లోగా www.nca.wcd.nic.in ఆన్ లైన్ లో నామినేషన్లను సమర్పించాలని ఆమె కోరారు. ఇతర సమాచారం కొరకు పథక సంచాలకులు,  జిల్లా మహిళా, శిశుఅభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని గాని లేదా 08942-240630 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.

Srikakulam

2020-09-03 14:35:07

ఘన, వ్యర్ధ పదార్థా నిర్వహణకు యూజర్ చార్జీలు..

తిరుపతి నగరపాలక సంస్థ పరిధి లోని నివాస గృహాలు, వాణిజ్య సముదాయముల నుంచి చెత్త సేకరణకు ఇకపై యజూర్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుం దని కమిషనర్ గిరీష చెప్పారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, యూజర్ ఛార్జీల వివరాలు తెలియజేశారు. నివాస గృహాలు- రూ  30, వాణిజ్య సముదాయాలు, హాస్టళ్లు, మరియు అతిథి గృహాలు, మొదలగు వాటిపై 100 నుండి500 వరకూ నిర్ణయించామన్నారు. అదే విధంగా ప్లాస్టిక్ వినియ గించినా అమ్మినా, వాడినా 5 వేల నుంచి పదివేల వరకు జరిమానా వేస్తామన్నారు. రోడ్లలో,కాలవలో వ్యర్థాలు  వేసినా కూడా  జరిమానలు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వినియోగదారులు చెత్త సేకరణ కొరకు, యూజర్  చార్జీలు చెల్లించాల్సి వుంటుందన్నారు. నిరంతరాయంగా పారిశుధ్య నిర్వహణ, గన, వ్యర్ధ పదార్ధల కోసం నిర్ణయించిన యూజర్ చార్జీలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. మునిసిపల్ ఘన వ్యర్థాలు మరియు సంబంధిత పారిశుద్ధ్య వ్యర్థాల నిల్వ, సేకరణ, రవాణా, మరియు పారవేయడంతో అనుసంధానించబడిన అన్ని విషయాలను నియంత్రించడానికి వినియోగదారుల నుండి యూజర్ చార్జీలు సేకరించాలని నిర్ణయించామని కమిషనర్ గిరీష వివరించారు.

Tirupati

2020-09-03 14:16:39

సర్వేయర్లకు మూడంచెల అధునాతన శిక్షణ..

రాష్ట్రంలో భూముల పున:సర్వే నిర్వహిస్తున్నట్లు సర్వే శాఖ సంయుక్త సంచాలకులు, రాష్ట్ర సర్వే శిక్షణా అకాడమి వైస్ ప్రిన్సిపాల్, వక్ఫ్ శాఖ కమీషనర్ సి.హెచ్. వి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలో సర్వే శిక్షకుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి భూముల పున:సర్వే చేడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమమన్న ఆయన వ్యక్తిగత కమతాల వారీగా సర్వే జరుగుతుందని ఆయన చెప్పారు. 3 దశలలో సర్వే జరుగుతుందని అందుకు తగిన విధంగా సర్వేయర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం - కంటిన్యుయస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ (సి.ఓ.ఆర్.ఎస్) నెట్ వర్కుతో పున:సర్వే కార్యక్రమం జరుగుతుందన చెప్పారు. ఈ విధానంలో హై ఎక్యూరసి, పారదర్శకత ఉంటుందని , రెవిన్యూ శాఖ సమన్వయంతో సర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే చేయడానికి సర్వేయర్లకు ఆటో కాడ్, జిపిఎస్ తదితర ఆధునిక వ్యవస్ధలలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 9,424 మంది సర్వేయర్లు పనిచేస్తున్నారని అందులో 7 వేల మందికి శిక్షణ పూర్తి అయిందన్నారు. ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమం సంబంధిత జిల్లా సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన చెప్పారు. పున:సర్వే పక్కాగా ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మంచి ప్రామాణికమైన శిక్షణను అందిస్తున్నామని కుమార్ చెప్పారు. ఇప్పటికే సంబంధిత సర్వే పరికరాలు, శిక్షణా మాడ్యూల్స్ సరఫరా చేసామని ఆయన అన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏపి సర్వే ట్రైనింగు అకాడమి సహాయ సంచాలకులు టి.త్రివిక్రమ రావు, శ్రీకాకుళం జిల్లా సహాయ సంచాలకులు కె.ప్రభాకర్ పాల్గొన్నారు.

Srikakulam

2020-09-03 14:02:24

104 వాహనాలే ఫీవర్ క్లినిక్ లు...జిల్లాకలెక్టర్

104 వాహనాన్ని ఫివర్ క్లినిక్ లుగా వినియోగించి కరోనా పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖలో వైద్య, ఆరోగ్యశాఖ, జీవిఎంసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో మొబైల్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ లు ఏర్పాటు చేస్తామని తలిపారు. గ్రామ,  వార్డు సచివాలయ  సిబ్బంది ప్రైమరి కాంటాక్ట్ లు , సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని  తెలిపారు. గర్బీణీలు, 60 సంవత్సరముల పైబడిన , ఇతర రోగాలు  ఉన్న   హైరిస్క్   వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. డేటాను ఎప్పటి కప్పుడు  అప్ లోడ్ చేయాలని తెలిపారు.  జి.వి.ఎం .సి పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్, కంటెన్మెంట్ జోన్ ల మ్యాపింగ్  ఆలస్యం జరుగుతుందని, తొందరగా పూర్తి చేయాలని తెలిపారు.  కంటెన్మెంట్ జోన్ పరిధిలో  శానిటేషన్ చేయించాలని, ఆటోలను వినియోగించి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని  తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో  72 అర్బన్ పి హెచ్ సిలలో  మెడికల్ ఆఫీసర్లు, నర్సుల నియామకం పూర్తయ్యిందని తెలిపారు.  కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో ట్రూనాట్ లాబ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సి హెచ్ సి , ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

కలెక్టరేట్

2020-09-03 11:25:30

రేషన్ డీలర్లకు రెండు రోజుల్లో కమిషన్ చెల్లింపు..జెసి

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్లకు రెండు రోజుల్లోగా చెల్లింపులు జరగాలని, లేనిచో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సంబం ధిత అధికారులను హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత వారం రోజులుగా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో బుధవారం  రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు, డీలర్లతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై సానుకూలంగా స్పందించే అవకాశ ముందని తెలిపారు. అంతవరకు ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. ప్రజలకు బియ్యం, పప్పు వంటి నిత్యావసర సరుకులను సకాలంలో పంపిణీచేయాలని ఆయన సూచించారు. తమకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు సకాలంలో చెల్లిస్తే సమస్యలు ఉండబోవని డీలర్లు జె.సికి వివరించడంతో  రెండు రోజుల్లోగా కమీషన్ చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కమీషన్ చెల్లింపులు జరగని డీలర్లు ఎవరైనా ఉంటే వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని, చెల్లింపులు చేయని ఏ.ఎస్.ఓ ( సహాయ పౌర సరఫరాల అధికారి )లను ఇంటికి పంపిస్తామన్నారు.. ప్రతీ జిల్లాలో ఏ.ఎస్.ఓలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కాని ఈ జిల్లాలో అది కనబడటం లేదని ఏ.ఎస్.ఓలపై జె.సి మండిపడ్డారు.  ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 విడతలు రేషన్ పంపిణీ జరగగా, జిల్లాలో 9 విడతల రేషన్ మాత్రమే పంపిణీ జరిగిందన్నారు. జిల్లాలో పిడిఎస్ 5 విడతల కమీషన్ కు గాను 3 విడతల కమీషన్ల క్రింద 3 కోట్ల 58 లక్షలు మంజూరుచేయడం జరిగిందన్నారు. మిగిలిన వారి నుండి పూర్తిస్థాయిలో వివరాలు లేనందున చెల్లింపులు జరగలేదని చెప్పారు. జిల్లాలో 2015 రేషన్ షాపులకు గాను 829 రేషన్ షాపుల డీలర్లకు కమీషన్ బకాయిలు చెల్లించామని,  మరో 262 డీలర్లకు పాన్ కార్డులు లేని కారణంగా జమకాలేదని, పాన్ నెంబర్ ఇచ్చిన తక్షణమే వారికి చెల్లింపులు చేస్తామని జె.సికి తెలిపారు. అలాగే 462 మంది డీలర్లు నామినీస్ కేటగిరీ అప్షన్ ఇచ్చారని  వారికి కూడా చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకో బోతున్నట్లు చెప్పారు. మిగిలిన 462 మంది వివరాలు పూర్తిగా అందజేయని కారణంగా జమచేయలేదని వాటి వివరాలు అందిన వెంటనే జమచేస్తామని జె.సికి వివరించారు.  జిల్లాలోని రేషన్ డీలర్లందరికీ రెండు రోజుల్లోగా పూర్తి చెల్లింపులు జరగాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసుకొని వివరాలు లేనివారి నుండి వివరాలు సేకరించి చెల్లింపులు చేయాలని జె.సి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుకు సూచించారు. బకాయిలు చెల్లింపుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని జె.సి స్పష్టం చేసారు. అలాగే డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటుచేసి రేషన్ డీలర్ల సమస్యలను ఎప్పటికపుడు తెలుసుకొని తమకు నివేదిక అందించాలని, సాంకేతిక పరమైన అంశాలు, ఇతర సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలని ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా పౌర సరఫరాల అధికారి ( ఇన్ ఛార్జ్ ) శేష శైలజ, శ్రీకాకుళం, పాలకొండ సహాయ పౌర సరఫరాల అధికారులు అడపా ఉదయ్ భాస్కర్, సన్నాయి పంతులు, రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు బొడ్డేపల్లి రవికుమార్, పి.వి.రమేష్, చిట్టి రామారావు, ఈశ్వరరావు, శిమ్మనాయుడు, అప్పారావు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. 

కలక్టరేట్

2020-09-02 20:51:38

ఆ ఇద్దరు శానిటరీ ఇనెస్పెక్టర్లని సస్పెండ్ చేయండి..

జీవిఎంసీ పరిధిలో ప్రతీ ఇంటినుండి విభజన చేసిన చెత్తనే విధిగా సేకరించాలని, చెత్తను వేరు చేసి ఇవ్వని ఇంటినుండి పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించ రాదని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన సూచించారు. బుధవారం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనితీరుపై కమీషనర్ సమీక్షా నిర్వహించారు. నగరంలో ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ ఆన్ లైన్ వేస్ట్ మేనేజ్మెంటు వ్యవస్థ ద్వారా జరుగుతున్న పనితీరుపై కమీషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై సమీక్షించిన కమీషనర్ 10 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు బాగులేదని అందులో ఇద్దరు  శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు నిర్లక్ష్యంగా ఉందని, వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం చేయవలసినదిగా అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావును కమీషనర్ ఆదేశించారు. మిగిలిన 8 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చే వారం జరుగబోయే సమీక్షకు వారి పనితీరును మెరుగుపరచుకోని పక్షంలో వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అదనపు కమీషనరుకు సూచించారు. ఈ ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. వ్యవస్థ ఏజన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఆ సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ వార్డులో పేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికులు హాజరు విధానంకూడా సరిగా లేదని శానిటరీ ఇన్ స్పెక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో, అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, ఎగ్జెక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ వైద్యాధికారులు, ఏ.సి.పి. లు, శానిటరీ సూపెర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఉడా చిల్డ్రన్స్ థియేటర్

2020-09-02 20:25:39

స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై అధికారులు ద్రుష్టి పెట్టాలి..

స్వచ్ఛ సర్వేక్షన్-2021 పనులలో భాగంగా ప్రతీ వార్డులో వారానికొక సారి  నివాసిత సంక్షేమ సంఘాలు, సోషల్ ఆర్గనైజషన్లతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమీషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. బుధవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువులు నిషేదించడమైనదని, 50 మైక్రాన్లలోపు ప్లేస్టిక్ క్యారీ బ్యాగులు ఉపయోగించరాదని, ప్లేస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా స్టీలు, గాజు, పేపరు, గుడ్డ లేదా నారతో తయారు చేసిన మొదలగు వస్తువులను ఉపయోగించేటట్లు ప్రజలకు అవగాహన పరచాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు కమీషనర్ ఆదేశించారు.  అనంతరం, స్వచ్ఛ సర్వేక్షన్-2021 అంశాలలో భాగంగా అన్ని జోన్లలో అత్యుత్తమ సేవలు కనబరిచిన 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను అందించి వారిని కమీషనర్ అభినందించారు. అక్టోబరు 2వ తేదీన, ఒక లక్ష డస్ట్ బిన్లు ఉచితంగా పేదవారికి సరఫరా చేయటకుగానూ, డస్ట్ బిన్లు కొనుగోలు చేసుకోలేని పేదవారి వివరాలను సిద్ధం చేయమని సహాయ వైద్యాధికారులను కమీషనర్ సూచించారు. కోవిద్ వ్యాధి సోకిన వారి ఇంటిలో శానిటైజ్ చేయాలని, ఆ ఇంటి బయట సోడియం హైపో క్లోరైట్ ద్రావకం, బ్లీచింగ్ చల్లించే ఏర్పాట్లు తప్పని సరిగా జరగాలని ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో, అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, ఎగ్జెక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ వైద్యాధికారులు, ఏ.సి.పి. లు, శానిటరీ సూపెర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఉడా చిల్డ్రన్స్ థియేటర్

2020-09-02 20:21:40

సీజనల్ వ్యాధులపై కార్యదర్శిలు అవగాహన కల్పించాలి..

సీజనల్ వ్యాదుల నివారణపై ప్రజలలో అవగాహన కలిగించాలని వార్డు సెక్రటరీ ప్రతీ రోజూ ఇంటింటి సర్వే జరపాలని జివిఎంసీ కమీషనర్ డా.స్రిజన ఆదేశించారు. బుధవారం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషర్ పలు అంశాలను సమీక్షించారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు శతశాతం జరగాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు ఆదేశించారు. అనంతరం సచివాలయం వారిగా ప్రతీ ఇంటినుండి చెత్త విభజన, సేకరణ ఎంత జరుగుతున్నదో, ఎన్ని ఇళ్ల వద్ద ఎరువును తయారు చేస్తు న్నారని వివరాలను, ఒక్కరోజుకు ఏ యే చెత్త ఎంత ఉత్పత్తి అవుతున్నదీ, సూయజ్ ఫారంలో ఎంత డిపాజిట్ అయిందనే వివరాల నివేదికను సిద్ధం చేయవల సిన దిగా అదనపు కమీషనరుకు ఆదేశించారు. అనంతరం నగరంలో ఎన్ని డంపర్ బిన్నులు, కాంపేక్టరు బిన్నులు, ట్విన్ బిన్నులు ఉన్నాయి? ఎన్ని రిపేరు చేసి ఉన్నా యి? ఎన్ని శిధిలావస్థలో ఉన్నాయి ? ఎన్ని తోపుడు బళ్ళు ఉన్నాయనే వివరాలను ఎగ్జెక్యూటివ్ ఇంజినీరు చిరంజీవిని కమీషనర్ అడిగితెలుసుకున్నారు. 6 నెలల క్రితం రిపేరు చేయించినవి మరలా రిపేరు స్థితికి వచ్చిన వాటిపై ఆరా తీశారు. వాటి వివరాలను నివేదిక రూపంలో వెంటనే అందించాలని ఎగ్జెక్యూటివ్ ఇంజినీరు చిరంజీవిని  ఆదేశించారు. అనంతరం నగరంలో ఇళ్లకు ఉన్న సెప్టిక్  ట్యాంకు వివరాలు, యు.జి.డి. కనెక్షన్ వివరాల విషయమై, సెప్టిక్ ట్యాంకు ఉన్న ఇంటివద్ద యు.జి.డి. కనెక్షన్ వ్యవస్థ కలిగిఉంటే వెంటనే అటువంటి ఇళ్లకు యు.జి.డి. కనెక్షన్లు నెల రోజులలో ఇవ్వాలని, అలా లేని ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ చేయించుకునే ఏర్పాట్లు చేయాలని సూపెరింటెండింగ్ ఇంజినీరు వేణుగోపాల్ ను  ఆదేశించారు. 

వుడా చిల్డ్రన్స్ థియేటర్

2020-09-02 20:16:30

వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు తుగ్లక్ ఆలోచన...

వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు మరో తుగ్లక్ నిర్ణయమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తీవ్రంగా విమర్శించారు.  రైతులపై మోయలేని భారం వేసేందుకు జగన్ పథకం రూపొందించారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం వీడియో సందేశం పంపారు. రైతులకు మేలు చేయాలని ఎన్టీ రామారావు ఆరోజుల్లోనే ఆస్పవర్ కు రూ.50లు విద్యుత్ బిల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రతి మోటారుకు మీటరు పెట్టాలన్న దౌర్బాగ్యపు ఆలోచన జగన్ తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ నగదు బదిలీ అంటూ చేసే ఆలోచన అర్థం కావడంలేదన్నారు. 30 ఏళ్లలో లేని నిర్ణయాలు ఇప్పుడెందుకని, మళ్లీ అప్పులు చేయడానికా? అని ప్రశ్నించారు.  రైతులతో చర్చించకుండా ఇలాంటి నిర్ణాయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. 18 లక్షల మోటార్లకు ఎంత బిల్లులు అవుతుందో ప్రభుత్వానికి తెలుసునని,  ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లింస్తే బాగుంటుదని సూచించారు. రైతులకు అకౌంట్లలో నగదు వేస్తామని  చెప్తున్నారు..వేయకుంటే పరిస్థితేంటని ప్రశ్నించారు. రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి ఆ వడ్డీని తానే చెల్లిస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకు బ్యాంకులకు చెల్లించలేదని దుయ్యబట్టారు. దీంతో బ్యాంకులు రైతులపై ఒత్తిడి  తెస్తున్నాయని, విద్యుత్  బిల్లులు కూడా చెల్లించకపోతే రైతుల పరిస్థతి ఏమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. రైతు సంఘాలు కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతులు అప్పుల్లో కూరుకుపోయారని, యూరియా దొరక్క, గిట్టుబాటు ధరల్లేక పంటలను కొనేనాదుడు లేరన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టని పథకాన్ని రద్దు చేసి మళ్లీ జగన్ ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. రైతులు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్రంలో 55 శాతం మంది  రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Narsipatnam

2020-09-02 20:03:51

విశాఖ జిల్లాకి కూడా కరోనాకి సెప్టెంబరు నెల కీలకమే

విశాఖపట్నం జిల్లా  కోవిడ్ నియంత్రణలో సెప్టెంబరు నెల కీలకంగా మారనున్నదని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.  బుధవారం  కలెక్టర్ కార్యాలయం నుంచి  జిల్లాలోని  అర్బన్, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో  కోవిడ్ నివారణ చర్యలపై  ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన  కాంట్రాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్ జోన్ ల నియంత్రణ  పకడ్బందీగా చేయాలని తెలిపారు.  నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు  ఆ నియోజక వర్గంలో  అందుబాటులో ఉండి ప్రతిరోజు  పర్యవేక్షించాలని తెలిపారు.  హోం ఐసోలేషన్ లో ఉన్నరోగుల ఇంటికి వెళ్లి పరీక్షించిన తుమ్మపాల , మధురవాడ, ఆర్. తాళ్లవలస, మునగపాక , కశింకోట, చౌడువాడ ప్రాదమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.  జిల్లాలో  జి.వి.ఎం .సి పరిధిలో  ఎక్కువ కేసులు వస్తున్నాయని, ఎక్కడైనా పాజిటివ్ కేసును గుర్తించగానే  200 మీటర్ల పరిదిలో కంటైన్మెంట్ జోన్ గా మార్కింగ్ చేసి  డోర్ టు డోర్ సర్వే చేయాలని తెలిపారు.  104 వాహనాన్ని ఫివర్ క్లినిక్ లుగా వినియోగించి పరీక్షలు చేయాలని తెలిపారు.    గ్రామ,     వార్డు సచివాలయ  సిబ్బంది ప్రైమరి కాంటాక్ట్ లు , సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని  తెలిపారు. గర్బీణీలు, 60 సంవత్సరముల పైబడిన , ఇతర రోగాలు  ఉన్న   హైరిస్క్   వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. డేటాను ఎప్పటి కప్పుడు  అప్ లోడ్ చేయాలని తెలిపారు.  జి.వి.ఎం .సి పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్, కంటెన్మెంట్ జోన్ ల మ్యాపింగ్  ఆలస్యం జరుగుతుందని, తొందరగా పూర్తి చేయాలని తెలిపారు.  కంటెన్మెంట్ జోన్ పరిధిలో  శానిటేషన్ చేయించాలని, ఆటోలను వినియోగించి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని  తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో  72 అర్బన్ పి హెచ్ సిలలో  మెడికల్ ఆఫీసర్లు, నర్సుల నియామకం పూర్తయ్యిందని తెలిపారు.  కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో ట్రూనాట్ లాబ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సి హెచ్ సి , ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. త్వరలో మొబైల్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ లు ఏర్పాటు చేస్తామని తలిపారు.  హోంఐసోలేషన్ నిర్వహణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నదని, హోం ఐసోలేషన్ లో ఉన్నరోగుల ఆరోగ్య పరిస్థితిని  ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. హోం ఐసోలేషన్ లో ఉన్నరోగుల మానిటరింగ్ కు జిల్లా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   పి.హెచ్ సి ల మెడికల్ ఆఫీసర్లు, ఆశా లు , ఏ ఎన్ ఎం లు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.  హోం ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులకు శ్వాస ఇబ్బందిగా ఉండటం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం జరిగితే  తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే  ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి కమ్యూనిటి హెల్త్ సెంటర్, ఏరియా ఆసుపత్రిలో  ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసారని తెలిపారు. అవసరమైన మాస్క్ లు , పి పిఈ కిట్ లు, ఇతర మెటీరియల్ లు అందుబాటులో ఉన్నాయని   తెలిపారు.   ట్రయాజింగ్ యాప్ లో మెడికల్ ఆఫీసర్లు డేటాను  అప్ డేట్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జాయింట్ కలెక్టర్ గోవిందరావు , ఎయం సి ప్రిన్సిపాల్ సుధాకర్, ఇన్ చార్జి  డి ఎం హెచ్ ఓ విజయలక్ష్మి, డి సి హెచ్ ఎస్ లక్ష్మణరావు , ఇతర అధికార్లు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2020-09-02 19:32:30

ప్రజలకు అనుకూలంగా పార్కులను తీర్చిదిద్దాలి...

పచ్చని చెట్లు, రంగు రంగుల పుష్పాలు, విశాలమైన క్రీడా మైదానంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉన్న తిరుపతిలోని ప్రకాశం పార్కును ప్రజల సందర్శనార్థం బుధవారం నుంచి తెరిచారు. లాక్ డౌన్ 4 నిబంధనల మేరకు తెరిచిన పార్కును  బుధవారం సాయంత్రం నగరపాలక సంస్థ కమిషనర్  గిరీషా సందర్శించారు. పార్కులో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరు సానీటైజర్ వినియోగించేలా ప్రవేశ మార్గం వద్ద సానీటైజర్ స్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు. జనం గుంపులు గంపులుగా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏపుగా పెరిగిన మొక్కలను కట్ చేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అంతేకాకుండా పాచికను కట్ చేసి లాన్ ను బాగా ఏర్పాటు చేయాలన్నారు. పచ్చిక ఉన్నచోట ఎవరు ఎటువంటి ఆటలు ఆడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆటల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఆడుకునేలా అందరికీ తెలియజేయాలన్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలన్న కమిషనర్ సందర్శకులు అక్కడక్కడా చెట్ల కింద కూర్చుని సేద తీరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పార్కుకు ఎక్కువగా వచ్చే వారికి నెలవారీ కార్డు ఇచ్చేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే  మునిసిపల్ సిబ్బందికి యోగ క్లాస్ లు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. కమిషనర్ వెంట ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డి.ఈ. లు విజయకుమార్ రెడ్డి, గోమతి, రెవిన్యూ ఆఫీసర్ సేతుమాదవ్, బాలాజీ, తదితరులు ఉన్నారు.

Tirupati

2020-09-02 19:14:09

రేపు రాష్ట్రవ్యాప్తంగా బొమ్మన రాజ్ కుమార్ కి నివాళులు..

చేనేత కులాల ఐక్యతకు, చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగం అభివృద్ధికి కీ.శే బొమ్మన రాజ్ కుమార్  ఎంతగానో క్రుషి చేశారని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యధర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్  అన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరేలా, సేవలను స్మరిస్తు రేపు తేది 03.09.2020 ఉదయం 11 గంలకు 5 నిమిషాలు రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని చేనేత కుల సంఘాలు, ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ కార్యవర్గం, అనుభంద సంఘాలు కొవోత్తులు వెలిగించి మౌనం పాటించి నివాళులు అర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బొమ్మన రాజ్ కుమార్ వలన చేనేత రంగం ఎంతగానో అభివ్రుద్ధి చెందిందని, ఆయన లేని లోటు తమ రంగానికి ఎన్నటికీ తీరదన్నారు.  ప్రతీ చేనేత కార్మికుడు అభివ్రుద్ధి చెందాలనే లక్ష్యంతో పనిచేసిన ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయ సాధనకు ప్రతీ నేత కుటుంబం క్రుషి చేయాలని అన్నారు. 

Eluru

2020-09-02 18:47:07