1 ENS Live Breaking News

2016లో ఆక్రమణ..నేడు అపార్ట్ మెంట్ల నిర్మాణం..అయినా

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9.27 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా 2016లో ఖబ్జా చేశారు. ఇపుడు అంతస్తుల మీద అంతస్తులు అనధికారికంగా నిర్మించేస్తు న్నా రు. కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వం రక్షించే ప్రయంత్నం చేయలేదు అంటున్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు. మధురవాడ సర్వే నెం 367 లో గల సుమారు 100 కోట్ల విలువైన 9.27 ఏకరముల ప్రభుత్వ భూమిలో దర్జాగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిచిన ఆక్రమణ దారులను తక్షణమే చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమండ్ చేస్తున్నారు. అంతే కాదు..  2016 ఆగష్టు నెలలో ఈభూమి అన్యాక్రాంతం జరిగిన అంశం గుర్తించి సీపీఐ తరుపున అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ చేసిన ఫిర్యాదు అంశాన్ని తాజాగా జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కి చేసిన ఫిర్యాదులో పేర్కొని మెయిల్  సమర్పించినట్టు ఆయన మీడియాకి చెప్పారు. అభూమి ప్రభుత్వ భూమని రెవిన్యూ రికార్డులను మార్చి,అందులో నిర్మిస్తున్న భవనాలు అక్రమంగా నిర్మిస్తున్న వేననితేల్చి,ఆ భవనాలు నిర్మాణానికి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేసి నాలుగు సం"గడిచినప్పటికి నేటికి అవి కార్యరూపం దాల్చకపోవడం అవినీతేనని ఆరోపించారు. ఇటువంటి అంశములు వెలుగులోకి రాగానే అధికారులు కొద్దిగా హడావుడి చేసి వదిలివేయడం చాలా దారుణమన్నారు. అంతేకాదు గడిచిన నాలుగేళ్లుగా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడానికి కారణాలపై కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని పైడిరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం లో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుచేస్తున్న తరుణంలో తక్షణమే ఆ విలువైన ప్రజా ఆస్థిని  స్వాధీనం చేసుకొని ప్రభుత్వ,ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు...

Madhurawada

2020-09-04 13:42:09

లక్షణం ఉంటే అది ఖచ్చితంగా కరోనానే...కలెక్టర్

కరోనా లక్షణాలు ఉన్నప్పటికి కరోనా అవునా ? కాదా ? అనే ఆలోచన వద్దని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రజలను కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శుక్ర వారం ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపా యాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం అత్యంత కీలక సమయంలో ఉన్నామని, రానున్న నెలన్నర రోజులు జిల్లాకు మరింత కీలకమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు 8 వందల నుండి వెయ్యి కేసులు వరకు నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉండి వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలో రోజుకు కనీసం రెండు వందల కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇతర పట్టణాల్లో కూడా పరీక్షలు అధికంగా చేయుటకు నిర్ణయించామని చెప్పారు. జ్వరం, ఆయాసం వంటి ప్రాథమిక లక్షణాలు ఉన్న వాళ్ళు కరోనా కాదు అనే ధీమాతో ఉంటున్నారని, పరిస్ధితులను వాలంటీరుకు వివరింగా తెలియజేసి సరైన చికిత్సను సరైన సమయంలో పొందాలని ఆయన కోరారు. 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్, ఆయాసం, వరుసగా మూడు రోజుల పాటు జ్వరం ఉన్న వారు చికిత్స పొందుటకు ఆలస్యం చేయరాదని ఆయన సూచించారు. సకాలంలో ఆస్పత్రిలో చేరడం వలన ఖచ్చితంగా ప్రాణాలు కాపాడగలమని వైద్యులు తెలియజేస్తున్నారని కలెక్టర్ వివరించారు. చిన్న పాటి లక్షణాలు ఉన్న వారికి చికిత్సను అందించుటకు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5 వేల పడకలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నామని, నిపుణులైన వైద్యులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంచి మందులతోపాటు ప్లాస్మా థెరాఫీని కూడా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో 73 మందికి ప్లాస్మా థెరాఫీ అందించామని, వాళ్ళందరి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధానికి మొదటి నుండి అనేక చర్యలు చేపట్టిన సంగతి ఆయన గుర్తు చేశారు. కంటైన్మెంటు జోన్లను పక్కాగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.  శ్రీకాకుళం పట్టణంలో 66 కంటైన్మెంటు జోన్లు ఉన్నాయని ఆయన తెలియజేస్తూ కంటైన్మెంటు జోన్లలో మొబైల్ వ్యాన్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షలు నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇంటివద్దకే పరిమితం కావాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ  వారికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని, వారితో మాట్లాడినప్పుడు మాస్కు విధిగా ఉపయోగించాలని సూచించారు. పెద్దలు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆయన అన్నారు. ప్రజల జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్వచ్చంద సంస్ధల సహకారంతో ఉచితంగా ఫేస్ షీల్డులు పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఫేష్ షీల్డు ఉపయోగించడం వలన 80 శాతం వరకు కరోనా వైరస్ వ్యాప్తి నుండి సురక్షితంగా ఉండవచ్చని సర్వేలు సూచిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు.  వ్యాపార సంస్థల నిర్వాహకులు, ఆటో రిక్షావారు కరోనా వైరస్ కు హై రిస్కు కలిగి ఉంటారని అన్నారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లు విధిగా మాస్కు ధరించేటట్లు చూడాలని ఆయన సూచించారు. జిల్లా లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.

Srikakulam

2020-09-04 13:26:15

వెబ్ సైట్ లో పారామెడికల్ ఉద్యోగాల మెరిట్ లిస్టు.. dmho

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాప్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టుల పైనల్ మెరిట్ లిస్ట్ జాబితా 3-09-2020 తేదీన http://Visakhapatnam.nic.in వెబ్ సైటు నందు పొందు పరచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారిణి డాక్టర్ విజయలక్ష్మి  తెలియజేయశారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించుకొని, తమ అభ్యంతరాలు ఏమైనా ఉన్నచో 04-09-2020 సాయంత్రం 5.00 గంటల లోపు  రాత పూర్వకముగా, తగు డాక్యుమెంట్ ఆధారాలతో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తెలియజేయాలన్నారు. మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు పరిశీలిస్తామన్నడీఎంహెచ్ఓ.. ఇతర అభ్యర్థుల మెరిట్, సర్విస్ సర్టిఫికేట్, దృవ పత్రాల విషయాలలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో తమ దృష్టికి తీసుకు వచ్చినచో పరిశీలనకు దస్త్రాలను చూపిస్తామన్నారు. జిల్లా కలెక్టరు ఉత్తర్వుల మేరకు మొత్తం ప్రక్రియ నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే నిర్వహించామన్నారు. 

Visakhapatnam

2020-09-03 19:39:54

కెజిహెచ్ సీఎస్ఆర్ బ్లాకులో కోవిడ్ రోగులకు వసతి..

విశాఖ  కె.జి.హెచ్.లో సి.యస్.ఆర్. బ్లాక్ కోవిడ్-19 పేషెంట్లకు రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నదని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించా రు.కె. జి.హెచ్. లో కొత్తగా నిర్మించిన సి.యస్.ఆర్. బ్లాక్ ను గురువారం ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.  బ్లాక్ అంతటినీ క్షణ్ణంగా పరిశీలించారు.  150 ఐ.సి. యు. పడకలతో, ఆక్సిజన్ ఉన్న 500 పడకలతో రెండు మూడు రోజుల్లో కోవిడ్-19 పేషెంట్లకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.  మూడు ఆపరేషన్ థియే టర్లు, ఆ బ్లాక్ లోనే ఒక ల్యాబ్, పేషెంట్ల అటెండెంట్లకు పేషెంట్ల సమాచారం తెలియజేసేందుకు ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రతీ రూంలో ను సి.సి. కెమెరా ఉంటుందని, దీనిని మోనిటరింగ్ చేయడానికి ఒక రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్పించిన సౌకర్యాలు ఎంత ముఖ్యమో సర్వీసు కూడా అంతే ముఖ్యమని వైద్యులను ఆదేశించారు.  కె.జి.హెచ్. ఒక చారిత్రాత్మకత గల ఆసుపత్రి అని, కె.జి.హెచ్.  రాష్ట్రంలో నంబర్ ఒన్ లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మరియు కె.జి.హెచ్ పర్యవేక్షకులు డా. పి.వి. సుధాకర్,  ఎపిఎంఐడిసి ఇఇ ఉమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కెజిహెచ్

2020-09-03 17:27:13

తిరుపతి మరో 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు..కమిషనర్

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో  ఎన్ హెచ్ఎం కింద 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. గురు వారం నగర పాలక సంస్థ కార్యాలయం అర్బన్ రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, అర్బన్, నగరపాలక సర్వేలు, ఆరోగ్య విభాగాల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా  కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఆరు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాలు పరిశీలించి, వాటికి సంబంధించి నివేదికను కలెక్టర్ నివేదించాలన్నారు. నడుచుకుంటూ వెళితే 15 నిమిషాల్లో ఆరోగ్య కేంద్రాల్లో చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్ప టికే నగరపాలక సంస్థ పరిధిలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్న కమిషనర్ కొత్తగా నిర్మించే వాటితో అన్నివర్గాల వారికి వైద్యసేవలు అందుతాయన్నారు. అంతకుముందు అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ కమిషనర్ పరిశీలించారు. ఈ సమావేశంలో కమిషనర్ వారితో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసులు, షణ్ముగం,డిఈ. విజయ్ కుమార్ రెడ్డి, అర్బన్, నగరపాలక సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్, రమేష్, మున్సిపల్ ఉప గణాంక అధికారి నీలకంటేశ్వర రావు, ఆరోగ్య విస్తరణ అధికారి మోహన్ తదిత రులు పాల్గొన్నారు.

Tirupati

2020-09-03 17:05:47

ప్లాస్మాదానం దానానికి ముందుకురావాలి..డిఎంహెచ్ఓ

విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 బాదితులకు ప్లాస్మా తెరపీ చేయుటకు కోవిడ్-19 బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకి రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈమేరకు విశాఖలోని గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చి, కోలుకున్న28 రోజుల తర్వాత ఎవరైనా ప్లాస్మా దానం చేయవచ్చునని వివరించారు. కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నవారు ఈ ప్లాస్మా దానం చేయుటకు ముందుకు రావాల న్నారు. ప్లాస్మా దానం చేసిన వారికి ప్రభుత్వం నుంచి రూ. 5,000/- ల నగదు ప్రోత్సాహకం అందజేస్తారని కూడా ఆమె వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ వి.వినయ్ ప్రకటించడంతోపాటు, దాతలు మంచి మనసుతో ముందుకి రావాలని కోరిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.  ప్లాస్మా దానం చేయదల్చిన వారు డా.సిహెచ్. శ్రీధర్ సర్వేలెన్స్ అధికారి,8790407037వద్ద సంప్రదించాలని కోరారు. ఆపదలో ఉన్న కరోనా రోగులకు ప్లాస్మాదానం చేసి వారికి ప్రాణదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు.  

Visakhapatnam

2020-09-03 16:55:07

బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీరని లోటు

ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర్ గౌరవ అధ్యక్షలు, బొమ్మన రాజ్ కుమార్ మరణం చేనేత జాతికి తీర ని లోటుఅని ఫ్రంట్ రాయలసీమ ప్రధాన కార్యద ర్శి బుట్టా రంగయ్య  ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలపు మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కీ.శే బొమ్మ న రాజ్ కుమార్ కి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా పొలిటి బ్యూరొ సభ్యులు యం.ఆర్ శ్రీనివాసులు ,రాష్ట్ర కార్యదర్శి డా"గణెష్  మాట్ల డుతూ,  ఫ్రం ట్ ఒక ధార్శికతను కోత్పోయిందన్నారు. చేనేతల కోసం ఎన్నో సామాజిఖ పోరాటాలు చేసి వారికి లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరిపి వారి ఉన్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. రాష్ట్ర వై యస్ ఆర్ నాయకులుగా చేనేత కులాల ఐక్యతకు,  చేనేత కార్మికుల సంక్షేమం కోసం, హర్నిశలు పని చేశారని  శ్రీశైలం ధర్మసత్రం అద్యక్షులు, రాజమండ్రి అర్బన్ బాంక్ చైర్మన్ గా కోన సాగుతూ,  రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్రంలో ఉన్న చేనేత కులా సంఘాల సమన్వయ కర్తగా ఎన్నోసేవలు చేశారన్నారు. అంతకు ముందు బొమ్మన రాజ్ కుమార్ చిత్ర పటానికి పూల మాల వెసి శ్రధ్ధాంజలి ఘటించి ఐదు నిమిషాలు మౌను పాటించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కొశాధి కారి విశ్వనాథ్ రఘు,6వ వార్డు ఇంఛార్జి శివ,టైలర్ శీను తథి తరులు పాల్గొన్నారు.

Yemmiganooru

2020-09-03 15:45:32

రాష్ట్రీయ బాల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం..

శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలబాలికలు, సంస్థలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకోసం  ఈ నెల 15లోగా ఆన్ లైన్ లో నామినేషన్ చేసుకోవాలని ఐసిడిఎస్ పిడి డా. జి.జయదేవి తెలియజేశారు. గురువారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యం, సాహస రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలలు, బాలల రక్షణ, అభివృద్ధి సంక్షేమం కొరకు పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు భారత ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేస్తుందన్నారు. ఇందులో బాలశక్తి, బాలకళ్యాణ్, సంస్థల పురస్కారాల కేటగిరీలు ఉంటాయని ఆమె వివరించారు. పురస్కార గ్రహీతలకు 2021 గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి పతకంతో పాటు ఐదు లేదా లక్ష రూపాయల నగదు, ధృవపత్రాలను అందజేస్తారన్నారు. ప్రధానమంత్రితో సన్మాన కూడా చేస్తారన్నారు. అర్హులైన బాలలు, వ్యక్తులు, సంస్థలు ఈ నెల 15లోగా www.nca.wcd.nic.in ఆన్ లైన్ లో నామినేషన్లను సమర్పించాలని ఆమె కోరారు. ఇతర సమాచారం కొరకు పథక సంచాలకులు,  జిల్లా మహిళా, శిశుఅభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని గాని లేదా 08942-240630 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు.

Srikakulam

2020-09-03 14:35:07

ఘన, వ్యర్ధ పదార్థా నిర్వహణకు యూజర్ చార్జీలు..

తిరుపతి నగరపాలక సంస్థ పరిధి లోని నివాస గృహాలు, వాణిజ్య సముదాయముల నుంచి చెత్త సేకరణకు ఇకపై యజూర్ ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుం దని కమిషనర్ గిరీష చెప్పారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, యూజర్ ఛార్జీల వివరాలు తెలియజేశారు. నివాస గృహాలు- రూ  30, వాణిజ్య సముదాయాలు, హాస్టళ్లు, మరియు అతిథి గృహాలు, మొదలగు వాటిపై 100 నుండి500 వరకూ నిర్ణయించామన్నారు. అదే విధంగా ప్లాస్టిక్ వినియ గించినా అమ్మినా, వాడినా 5 వేల నుంచి పదివేల వరకు జరిమానా వేస్తామన్నారు. రోడ్లలో,కాలవలో వ్యర్థాలు  వేసినా కూడా  జరిమానలు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వినియోగదారులు చెత్త సేకరణ కొరకు, యూజర్  చార్జీలు చెల్లించాల్సి వుంటుందన్నారు. నిరంతరాయంగా పారిశుధ్య నిర్వహణ, గన, వ్యర్ధ పదార్ధల కోసం నిర్ణయించిన యూజర్ చార్జీలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. మునిసిపల్ ఘన వ్యర్థాలు మరియు సంబంధిత పారిశుద్ధ్య వ్యర్థాల నిల్వ, సేకరణ, రవాణా, మరియు పారవేయడంతో అనుసంధానించబడిన అన్ని విషయాలను నియంత్రించడానికి వినియోగదారుల నుండి యూజర్ చార్జీలు సేకరించాలని నిర్ణయించామని కమిషనర్ గిరీష వివరించారు.

Tirupati

2020-09-03 14:16:39

సర్వేయర్లకు మూడంచెల అధునాతన శిక్షణ..

రాష్ట్రంలో భూముల పున:సర్వే నిర్వహిస్తున్నట్లు సర్వే శాఖ సంయుక్త సంచాలకులు, రాష్ట్ర సర్వే శిక్షణా అకాడమి వైస్ ప్రిన్సిపాల్, వక్ఫ్ శాఖ కమీషనర్ సి.హెచ్. వి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలో సర్వే శిక్షకుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి భూముల పున:సర్వే చేడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమమన్న ఆయన వ్యక్తిగత కమతాల వారీగా సర్వే జరుగుతుందని ఆయన చెప్పారు. 3 దశలలో సర్వే జరుగుతుందని అందుకు తగిన విధంగా సర్వేయర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం - కంటిన్యుయస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ (సి.ఓ.ఆర్.ఎస్) నెట్ వర్కుతో పున:సర్వే కార్యక్రమం జరుగుతుందన చెప్పారు. ఈ విధానంలో హై ఎక్యూరసి, పారదర్శకత ఉంటుందని , రెవిన్యూ శాఖ సమన్వయంతో సర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే చేయడానికి సర్వేయర్లకు ఆటో కాడ్, జిపిఎస్ తదితర ఆధునిక వ్యవస్ధలలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 9,424 మంది సర్వేయర్లు పనిచేస్తున్నారని అందులో 7 వేల మందికి శిక్షణ పూర్తి అయిందన్నారు. ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమం సంబంధిత జిల్లా సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన చెప్పారు. పున:సర్వే పక్కాగా ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మంచి ప్రామాణికమైన శిక్షణను అందిస్తున్నామని కుమార్ చెప్పారు. ఇప్పటికే సంబంధిత సర్వే పరికరాలు, శిక్షణా మాడ్యూల్స్ సరఫరా చేసామని ఆయన అన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏపి సర్వే ట్రైనింగు అకాడమి సహాయ సంచాలకులు టి.త్రివిక్రమ రావు, శ్రీకాకుళం జిల్లా సహాయ సంచాలకులు కె.ప్రభాకర్ పాల్గొన్నారు.

Srikakulam

2020-09-03 14:02:24

104 వాహనాలే ఫీవర్ క్లినిక్ లు...జిల్లాకలెక్టర్

104 వాహనాన్ని ఫివర్ క్లినిక్ లుగా వినియోగించి కరోనా పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. విశాఖలో వైద్య, ఆరోగ్యశాఖ, జీవిఎంసి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, త్వరలో మొబైల్ డిజిటల్ ఎక్స్ రే యూనిట్ లు ఏర్పాటు చేస్తామని తలిపారు. గ్రామ,  వార్డు సచివాలయ  సిబ్బంది ప్రైమరి కాంటాక్ట్ లు , సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని  తెలిపారు. గర్బీణీలు, 60 సంవత్సరముల పైబడిన , ఇతర రోగాలు  ఉన్న   హైరిస్క్   వ్యక్తులను గుర్తించాలని తెలిపారు. డేటాను ఎప్పటి కప్పుడు  అప్ లోడ్ చేయాలని తెలిపారు.  జి.వి.ఎం .సి పరిధిలో కాంటాక్ట్ ట్రేసింగ్, కంటెన్మెంట్ జోన్ ల మ్యాపింగ్  ఆలస్యం జరుగుతుందని, తొందరగా పూర్తి చేయాలని తెలిపారు.  కంటెన్మెంట్ జోన్ పరిధిలో  శానిటేషన్ చేయించాలని, ఆటోలను వినియోగించి జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని  తెలిపారు. జి.వి.ఎం .సి పరిధిలో  72 అర్బన్ పి హెచ్ సిలలో  మెడికల్ ఆఫీసర్లు, నర్సుల నియామకం పూర్తయ్యిందని తెలిపారు.  కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులలో ట్రూనాట్ లాబ్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సి హెచ్ సి , ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

కలెక్టరేట్

2020-09-03 11:25:30

రేషన్ డీలర్లకు రెండు రోజుల్లో కమిషన్ చెల్లింపు..జెసి

శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్లకు రెండు రోజుల్లోగా చెల్లింపులు జరగాలని, లేనిచో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సంబం ధిత అధికారులను హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత వారం రోజులుగా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో బుధవారం  రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు, డీలర్లతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై సానుకూలంగా స్పందించే అవకాశ ముందని తెలిపారు. అంతవరకు ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. ప్రజలకు బియ్యం, పప్పు వంటి నిత్యావసర సరుకులను సకాలంలో పంపిణీచేయాలని ఆయన సూచించారు. తమకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు సకాలంలో చెల్లిస్తే సమస్యలు ఉండబోవని డీలర్లు జె.సికి వివరించడంతో  రెండు రోజుల్లోగా కమీషన్ చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కమీషన్ చెల్లింపులు జరగని డీలర్లు ఎవరైనా ఉంటే వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని, చెల్లింపులు చేయని ఏ.ఎస్.ఓ ( సహాయ పౌర సరఫరాల అధికారి )లను ఇంటికి పంపిస్తామన్నారు.. ప్రతీ జిల్లాలో ఏ.ఎస్.ఓలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కాని ఈ జిల్లాలో అది కనబడటం లేదని ఏ.ఎస్.ఓలపై జె.సి మండిపడ్డారు.  ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 విడతలు రేషన్ పంపిణీ జరగగా, జిల్లాలో 9 విడతల రేషన్ మాత్రమే పంపిణీ జరిగిందన్నారు. జిల్లాలో పిడిఎస్ 5 విడతల కమీషన్ కు గాను 3 విడతల కమీషన్ల క్రింద 3 కోట్ల 58 లక్షలు మంజూరుచేయడం జరిగిందన్నారు. మిగిలిన వారి నుండి పూర్తిస్థాయిలో వివరాలు లేనందున చెల్లింపులు జరగలేదని చెప్పారు. జిల్లాలో 2015 రేషన్ షాపులకు గాను 829 రేషన్ షాపుల డీలర్లకు కమీషన్ బకాయిలు చెల్లించామని,  మరో 262 డీలర్లకు పాన్ కార్డులు లేని కారణంగా జమకాలేదని, పాన్ నెంబర్ ఇచ్చిన తక్షణమే వారికి చెల్లింపులు చేస్తామని జె.సికి తెలిపారు. అలాగే 462 మంది డీలర్లు నామినీస్ కేటగిరీ అప్షన్ ఇచ్చారని  వారికి కూడా చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకో బోతున్నట్లు చెప్పారు. మిగిలిన 462 మంది వివరాలు పూర్తిగా అందజేయని కారణంగా జమచేయలేదని వాటి వివరాలు అందిన వెంటనే జమచేస్తామని జె.సికి వివరించారు.  జిల్లాలోని రేషన్ డీలర్లందరికీ రెండు రోజుల్లోగా పూర్తి చెల్లింపులు జరగాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసుకొని వివరాలు లేనివారి నుండి వివరాలు సేకరించి చెల్లింపులు చేయాలని జె.సి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుకు సూచించారు. బకాయిలు చెల్లింపుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని జె.సి స్పష్టం చేసారు. అలాగే డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటుచేసి రేషన్ డీలర్ల సమస్యలను ఎప్పటికపుడు తెలుసుకొని తమకు నివేదిక అందించాలని, సాంకేతిక పరమైన అంశాలు, ఇతర సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలని ఆయన సూచించారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా పౌర సరఫరాల అధికారి ( ఇన్ ఛార్జ్ ) శేష శైలజ, శ్రీకాకుళం, పాలకొండ సహాయ పౌర సరఫరాల అధికారులు అడపా ఉదయ్ భాస్కర్, సన్నాయి పంతులు, రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు బొడ్డేపల్లి రవికుమార్, పి.వి.రమేష్, చిట్టి రామారావు, ఈశ్వరరావు, శిమ్మనాయుడు, అప్పారావు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. 

కలక్టరేట్

2020-09-02 20:51:38

ఆ ఇద్దరు శానిటరీ ఇనెస్పెక్టర్లని సస్పెండ్ చేయండి..

జీవిఎంసీ పరిధిలో ప్రతీ ఇంటినుండి విభజన చేసిన చెత్తనే విధిగా సేకరించాలని, చెత్తను వేరు చేసి ఇవ్వని ఇంటినుండి పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించ రాదని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన సూచించారు. బుధవారం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనితీరుపై కమీషనర్ సమీక్షా నిర్వహించారు. నగరంలో ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ ఆన్ లైన్ వేస్ట్ మేనేజ్మెంటు వ్యవస్థ ద్వారా జరుగుతున్న పనితీరుపై కమీషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై సమీక్షించిన కమీషనర్ 10 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు బాగులేదని అందులో ఇద్దరు  శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు నిర్లక్ష్యంగా ఉందని, వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం చేయవలసినదిగా అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావును కమీషనర్ ఆదేశించారు. మిగిలిన 8 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చే వారం జరుగబోయే సమీక్షకు వారి పనితీరును మెరుగుపరచుకోని పక్షంలో వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అదనపు కమీషనరుకు సూచించారు. ఈ ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. వ్యవస్థ ఏజన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఆ సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ వార్డులో పేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికులు హాజరు విధానంకూడా సరిగా లేదని శానిటరీ ఇన్ స్పెక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో, అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, ఎగ్జెక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ వైద్యాధికారులు, ఏ.సి.పి. లు, శానిటరీ సూపెర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఉడా చిల్డ్రన్స్ థియేటర్

2020-09-02 20:25:39

స్వచ్ఛ సర్వేక్షణ్ పనులపై అధికారులు ద్రుష్టి పెట్టాలి..

స్వచ్ఛ సర్వేక్షన్-2021 పనులలో భాగంగా ప్రతీ వార్డులో వారానికొక సారి  నివాసిత సంక్షేమ సంఘాలు, సోషల్ ఆర్గనైజషన్లతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమీషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. బుధవారం వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ వస్తువులు నిషేదించడమైనదని, 50 మైక్రాన్లలోపు ప్లేస్టిక్ క్యారీ బ్యాగులు ఉపయోగించరాదని, ప్లేస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా స్టీలు, గాజు, పేపరు, గుడ్డ లేదా నారతో తయారు చేసిన మొదలగు వస్తువులను ఉపయోగించేటట్లు ప్రజలకు అవగాహన పరచాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు కమీషనర్ ఆదేశించారు.  అనంతరం, స్వచ్ఛ సర్వేక్షన్-2021 అంశాలలో భాగంగా అన్ని జోన్లలో అత్యుత్తమ సేవలు కనబరిచిన 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలను అందించి వారిని కమీషనర్ అభినందించారు. అక్టోబరు 2వ తేదీన, ఒక లక్ష డస్ట్ బిన్లు ఉచితంగా పేదవారికి సరఫరా చేయటకుగానూ, డస్ట్ బిన్లు కొనుగోలు చేసుకోలేని పేదవారి వివరాలను సిద్ధం చేయమని సహాయ వైద్యాధికారులను కమీషనర్ సూచించారు. కోవిద్ వ్యాధి సోకిన వారి ఇంటిలో శానిటైజ్ చేయాలని, ఆ ఇంటి బయట సోడియం హైపో క్లోరైట్ ద్రావకం, బ్లీచింగ్ చల్లించే ఏర్పాట్లు తప్పని సరిగా జరగాలని ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో, అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, ఎగ్జెక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ వైద్యాధికారులు, ఏ.సి.పి. లు, శానిటరీ సూపెర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఉడా చిల్డ్రన్స్ థియేటర్

2020-09-02 20:21:40

సీజనల్ వ్యాధులపై కార్యదర్శిలు అవగాహన కల్పించాలి..

సీజనల్ వ్యాదుల నివారణపై ప్రజలలో అవగాహన కలిగించాలని వార్డు సెక్రటరీ ప్రతీ రోజూ ఇంటింటి సర్వే జరపాలని జివిఎంసీ కమీషనర్ డా.స్రిజన ఆదేశించారు. బుధవారం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషర్ పలు అంశాలను సమీక్షించారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు శతశాతం జరగాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లకు ఆదేశించారు. అనంతరం సచివాలయం వారిగా ప్రతీ ఇంటినుండి చెత్త విభజన, సేకరణ ఎంత జరుగుతున్నదో, ఎన్ని ఇళ్ల వద్ద ఎరువును తయారు చేస్తు న్నారని వివరాలను, ఒక్కరోజుకు ఏ యే చెత్త ఎంత ఉత్పత్తి అవుతున్నదీ, సూయజ్ ఫారంలో ఎంత డిపాజిట్ అయిందనే వివరాల నివేదికను సిద్ధం చేయవల సిన దిగా అదనపు కమీషనరుకు ఆదేశించారు. అనంతరం నగరంలో ఎన్ని డంపర్ బిన్నులు, కాంపేక్టరు బిన్నులు, ట్విన్ బిన్నులు ఉన్నాయి? ఎన్ని రిపేరు చేసి ఉన్నా యి? ఎన్ని శిధిలావస్థలో ఉన్నాయి ? ఎన్ని తోపుడు బళ్ళు ఉన్నాయనే వివరాలను ఎగ్జెక్యూటివ్ ఇంజినీరు చిరంజీవిని కమీషనర్ అడిగితెలుసుకున్నారు. 6 నెలల క్రితం రిపేరు చేయించినవి మరలా రిపేరు స్థితికి వచ్చిన వాటిపై ఆరా తీశారు. వాటి వివరాలను నివేదిక రూపంలో వెంటనే అందించాలని ఎగ్జెక్యూటివ్ ఇంజినీరు చిరంజీవిని  ఆదేశించారు. అనంతరం నగరంలో ఇళ్లకు ఉన్న సెప్టిక్  ట్యాంకు వివరాలు, యు.జి.డి. కనెక్షన్ వివరాల విషయమై, సెప్టిక్ ట్యాంకు ఉన్న ఇంటివద్ద యు.జి.డి. కనెక్షన్ వ్యవస్థ కలిగిఉంటే వెంటనే అటువంటి ఇళ్లకు యు.జి.డి. కనెక్షన్లు నెల రోజులలో ఇవ్వాలని, అలా లేని ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ చేయించుకునే ఏర్పాట్లు చేయాలని సూపెరింటెండింగ్ ఇంజినీరు వేణుగోపాల్ ను  ఆదేశించారు. 

వుడా చిల్డ్రన్స్ థియేటర్

2020-09-02 20:16:30