1 ENS Live Breaking News

దివంగత వైఎస్సార్ నిరుపేదల గుండె చప్పుడు...

దివంగ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరెడ్డి తెలుగు ప్రజల గుండె చప్పుడు అని రాజ్య సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు. ఆయన 11వ వర్దంతి సందర్భంగా విశాకలోని పార్కు హోటల్ వద్ద వున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ నిరుపేదల పక్షపాతి అని, అందుకే సంక్షేమ పధకాలన్నీ వారికోసమే ప్రవేశపెట్టారని అన్నారు. నేడు అదే బాటలో ఆయన తన యుడు, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజారంజక పాలన చేపడుతున్నారని కొనియారు. వైఎస్సార్ స్పూర్తితో తామంతా ప్రజాసేవ చేస్తున్నామని చెప్పా రు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ , ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, నగర పార్టీ అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి విభాగం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి,  వైసీపీ శ్రేణులు , కార్యకర్తలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Visakhapatnam

2020-09-02 11:06:56

శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ.33.38లక్షలు

నెల్లూరులోని సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీల లెక్కింపు మంగళవారం కూడా చేపట్టారు. అమ్మవారి ఆలయంలోని  5 హుండీలు తెరిచి అందులోని నగదును లెక్కించారు. వాటిలో మొత్తం  రూ"33,83,648/-లు, బంగారు 0-148 గ్రాములు, వెండి 0-186 గ్రాములు మరియు అన్నదానము రూ"8,350/-లు. నిన్న, ఈ రోజు కలిపి మొత్తం రూ"34,33,648/-లు ఆదాయం చేకూరినట్టు ఛైర్మన్ దువ్వూరు  బాలచంద్రారెడ్డి తెలియజేశారు. కరోనా వైరస్ కేసులు అధికంగా వున్నం దున ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం, మాస్కుల ధారణ చేసిన తరువాత ఈ పరకామణి చేపట్టినట్టు చైర్మన్ వివరించారు. హుండీలు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ యం. సుధీర్ బాబు సమక్షంలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు,  పి.సుధ, కామిరెడ్డి రేవతి, వైసిపి నాయకులు కళత్తూరు రామ మోహన్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు. 

Sullurupeta

2020-09-01 21:46:49

సింహాచలం దేవస్థానంలో జూలకటక.. అన్నవరం ఈఓకి అధనపు బాధ్యతలు

సింహాచలం దేవస్థానంలో చకా చకా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఈఓగా పనిచేస్తున్న బ్రమరాంబ తనను సింహాచలం ఈఓగా తప్పించా లని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి కారణం చైర్ పర్శన్ ఈఓ మధ్య విభేదాలేనని తెలుస్తుంది. ఈ క్రమంలోనే  సింహాచలం ఇన్ఛార్జి ఈవోగా అన్నవరం ఈవో త్రినాధరావు ను నియమిస్తూ, ప్రభుత్వ స్పెషల్ కమిషనర్ పి.అర్జున రావు ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. దేవస్థానంలో చాలా మందిని సిబ్బందిని తప్పిం చడం, ఏకపక్షనిర్ణయాలు చేయడం, అంతముందు పనిచేసిన ఈఓ పలు నిర్మాణాలు, కట్టడాల్లో అవకతవకలకు పాల్పడం వంటి కార్యక్రమాలు జరిగాయి. తరువాత పాత ఈఓను తప్పించి బ్రమరాంబను ఈఓగా ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కూడా దేవస్థానం చైర్మన్ కి, ఈఓకి మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే విభేదాలు తలెత్తాయి. దీంతో అధికారుల ఆదేశాలతో ఈఓ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో, ఖచ్చితంగా అక్కడ ఈఓ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్నవరం ఈఓను ఇన్చార్జిగా నియమిస్తూ, ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. సింహాచలంలో చైర్ పర్శన్ నియామం దగ్గర నుంచి అనేక మార్పులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది...

Simhachalam

2020-09-01 20:30:25

రాష్ట్రానికే తలమానికంగా విమ్స్ హాస్పటిల్...

విశాఖ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆసుపత్రిని రాష్ట్రానికే తలమానికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు.  మంగళవారం ఆయన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపి  ఎమ్.వి.వి. సత్య నారాయణలతో  విమ్స్ ను సందర్శించారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వసతులు, అందిస్తున్న చికిత్స లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలోని టిమ్స్, గుంటూరులో వున్న ఎయిమ్స్ ఆసుపత్రులకు మించి అన్నిరకాల చికిత్సలు, ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.  దివంగత రాజశేఖరరెడ్డి  ప్రారంభించిన ఈ ఆసుపత్రి తరువాతి కాలంలో అలక్ష్యం చేయబడిందని, ప్రైవేటు పరం చేసేందుకు కూడా ఆలోచన చేశారన్నారు.  జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన తరువాత విశాఖపట్నాన్ని అభవృద్ధి చేసే క్రమంలో   విమ్స్ పై ప్రత్యేక దృష్ఠి పెట్టారని చెప్పారు.  ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు విమ్స్ సేవలు తీసుకున్నారంటే, ఆసుపత్రిని అభివృద్ధి చేసినందునే సాధ్యపడిందని పేర్కొన్నారు.  విమ్స్ కు అనుబంధంగా మెడికల్ కాలేజి, ఇతర అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు.  దేశంలోనే గొప్ప వైద్య  సంస్థను రూపొందించడమే ముఖ్యమంత్రి ఆశయమని చెప్పారు.   సీఎం  విమ్స్ ఆసుపత్రిని పరిశీలించామన్నారు. 305 పడకలు గల వార్డులు తనిఖీ చేశామని. రోగులతో మాట్లాడామని చెప్పారు. వైద్యం సంతృప్తి కరంగా వుందని, మంచి ఆహారం అందిస్తున్నారని, మెరుగైన చికిత్స చేస్తున్నట్లు తెలిపారన్నారు. అధునాతన వైద్య పరికరాలు బాగున్నాయని, డాక్టర్లు, సిబ్బంది సేవలు ఆకట్టుకున్నాయన్నారు.  అయితే ఆసుపత్రిలో వైద్యలు, నర్సులు, సిబ్బంది కొరత వుందన్నారు.   వార్డుకు 16 పడకలు కలిగిన 12 ఐ.సి. యు. వార్డులు, 10 ఐసోలేషన్ వార్డులు, ఒక డయాలసిస్ సెంటర్ వుందని చెప్పారు.  వైద్యులను, సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని  నియమించాల్సి వుందన్నారు.    తక్కువ  సిబ్బందితో  చక్కటి చికిత్స అందజేస్తున్న డైరక్టర్ డాక్టర్ వరప్రసాద్, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.  పిపిఈ కిట్స్ ధరించి 6 గంటలు పనిచేయడం, ఓపికతో చికిత్స చేయడం వంటి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.  త్వరలోనే డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తారని, మాస్టర్  ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎం.పి. ఎమ్.వి.వి. సత్యనారాయణ, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి,  జాయింట్ కలెక్టరు (అసరా) ఆర్.గోవిందరావు, నగర అధ్యక్షలు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్, కెకెరాజు, అక్కరమాని విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.  

విమ్స్ హాస్పటిల్

2020-09-01 19:36:54

సెప్టెంబరు 10వ తేదీ నుంచి గీతా పారాయణం..

మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న  ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గీతా పారాయణం శ్లోకపఠనం, వ్యాఖ్యానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ, సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను మంత్రముగ్ధులను చేశాయని, ఇదే తరహాలో గీతా పారాయణం విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. ప్రముఖ పండితులు కాశీపతి శ్లోక పారాయణం, కుప్పా విశ్వనాధ శాస్త్రి ప్రవచనం చెబుతారని వివరించారు. శ్లోక పఠనం, వ్యాఖ్యానంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తూ గీతా పారాయణం చేస్తే సామాన్య భక్తులకు చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పండితుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. సెప్టెంబరు 3, 5వ తేదీల్లో రెండు విడతల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారాయణం జరిగేందుకు చర్యలు చేపడతామన్నారు.  తిరుపతిలోని ఎస్ వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మాట్లాడుతూ గీతా పారాయణం తప్పక భక్తుల ఆదరణ చూరగొంటుం దన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి మాత్రమే గీతోపదేశం చేయలేదని, సమస్త మానవాళికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారని వివరించారు.  గీతా పారాయ ణం ట్రయల్ రన్ కార్యక్రమంలో  ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్  కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పాఠశాల పండితులు పాల్గొన్నారు.

తిరుమల

2020-09-01 19:34:15

ప్లాస్మాదానం చేయండి ప్రాణదాతలు కండి..

శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగుల కోసం ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు పిలుపునిచ్చారు. జిల్లాలో రోజురో జుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుందని, దీంతో కరోనా మరణాలను నియంత్రించేందుకు ప్లాస్మాథెరపీ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్లాస్మాలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్ కేవలం కొన్ని రోజులే యాక్టివ్ గా ఉంటాయని, కాబట్టి ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగ తి ఎవరూ మరిచిపోకూడదన్నారు. మంగళవారం  రాజాంలో జిల్లా రెడ్ క్రాస్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు హాజరై జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న పెంకి చైతన్య ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇదేస్పూర్తితో కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. తద్వారా కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న వారిని రక్షించేందుకు వీలుకలుగుతుందని ఆయన స్పష్టం చేసారు. రాజాంలో ప్లాస్మాదానం చేయాలనేవారు 9441708120, 9440131160 మొబైల్ నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  సెట్ శ్రీ మేనేజర్ బి.వి.ప్రసాదరావు, రాజాం సబ్ బ్రాంచ్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ , కె.శంకర్రావు, కె సత్యనారాయణ, బి శ్రీధర్, విజయ్ బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం

2020-09-01 19:16:17

నెలన్నర రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి...కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ దృష్ట్యా రానున్న నెలన్నర రోజులు అతి కీలకమని భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. మంగళవారం నగరంలో కంటెంట్మెంట్ జోన్లలో పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి జిల్లా కలెక్టర్ నివాస్ పర్యటించారు. హాయతినగర్, ఫోజుల్ బేగ్ పేట, హడ్కో కాలనీ, చల్లవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు చేపడుతున్న సర్వే లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, ప్రతి రోజు శ్రీకాకుళం నగరంలో రెండు వందల నుండి 250 కేసులు పాజిటివ్ వస్తున్నాయని అన్నారు. జిల్లాలో గత రెండు రోజులు రోజుకు వెయ్యి కేసులు నమోదు అయ్యా యన్నారు. 25 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కాగలదని భావిస్తున్నామని, ఈ తరుణంలో రానున్న ఒకటిన్నర నెలలు అతి కీలకంగా భావిస్తూ అందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాంటైన్మెంట్ జోన్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు తిరగవద్దని కోరారు. మొబైల్ వాన్ల ద్వారా కూరగాయలు, తాగునీరు వంటి సౌకర్యాలు అందించే చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా  ప్రత్యేక  దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు.   ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వైరస్ నివారణ లో భాగంగా స్లమ్ ప్రాంతాల్లో 20 వేల మందికి ఫేస్ షీల్డ్  లను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వాలంటీర్లు అందరికీ ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశామని ఆయన అన్నారు. రోజుకు 9 వందల వరకు రాపిడ్ టెస్టులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 24 గంటల్లో ఫలితాలు వెల్లడికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు తిరగవద్దని కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే తెలియజేయాలని, త్వరగా రావడం వలన ప్రాణాపాయ స్థితి ఉండదని గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించామని నలుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడా ఉండరాదని చెప్పారు. శ్రీకాకుళం, పలాస, సోంపేట, మెలియాపుట్టి, పొందూరు, రాజాం ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు చెప్పారు. ఇంట్లో పెద్ద వయసు వారికి ప్రమాదమని యువత గ్రహించాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో లో నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్, ప్రత్యేక అధికారులు టి వివి ప్రసాద్,  ప్రసాద్, తాహసిల్దార్ వై వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-01 16:11:34

కపిలతీర్ధం కాలువకు ప్రణాళికలు సిద్ధం చేయాలి..

తిరుపతిలోని శ్రీనిధి అపార్ట్మెంట్ కు దక్షిణం వైపు పు ప్రహరీ గోడ మీదుగా శివ జ్యోతి నగర్ లో ప్రవహించుచున్న కపిల్ తీర్థం కాలువ కలిపేందుకు ప్రణాళికలను తయారు చేయమని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గిరీష  ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని శివ జ్యోతి నగర్, కొత్తపల్లి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, హరిశ్చంద్ర స్మశాన వాటిక మొదలగు ప్రదేశాలలో ఇంజనీరింగు, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి  మంగళవారం ఉదయం కమిషనర్ గిరీష పర్యటించారు. ఆ ప్రాంతాల్లో గుంతలు, మురుగునీరు పోయే దానికి పైప్ లైన్లు, యుడిఎస్ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా  శ్రీనిధి అపార్ట్మెంట్ యజమానులతో మాట్లాడారు. ప్రధాన రోడ్డులో, ఇసుక, కమ్మి, ఇటుక మొదలగు వ్యర్ధాలు రోడ్ లో ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేసే వారిపై ఫైన్ లు విధిస్తామని హెచ్చరించారు. కొత్తపల్లి లో పర్యటించి, ఎక్కడ ఎంతమేరకు రోడ్డు అవసరమో అధికారులు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ఎంత వరకు అవసరమో ప్లాన్ ద్వారా రెండు రోజుల లోపల తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం దేవేంద్ర థియేటర్ రోడ్డు హరిశ్చంద్ర స్మశాన వాటిక లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్లు ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,ఎయికామ్ ప్రతినిధులు బాలాజీ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2020-09-01 15:55:52

బాల శక్తి, బాల కళ్యాణ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

జాతీయ స్థాయిలో 2021 సంవత్సరానికి “బాల శక్తి పురస్కార్, బాల కళ్యాణ్ పురస్కార్” అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పీడి ఎన్.సీతా మహాలక్ష్మి తలెలియజేశారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన బాలలకు “బాల శక్తి పురస్కార్” అవార్డు , బాలలపై పనిచేసే స్వచ్చంధ సంస్థలు మరియు వ్యక్తులకు “బాల కళ్యాణ్ పురస్కార్” అవార్డు ఇస్తారన్నారు.  జాతీయ స్థాయిలో ఎంపికైన బాలలకు, స్వచ్చంధ సంస్థలకు జనవరి 26, 2021 సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలలో  రాష్ట్రపతి ,  ప్రధానమంత్రి ఈ అవార్డు అంతజేస్తారన్నారు. దీనితోపాటు పాటు నగదు ప్రోత్సాహకం అందజేస్తారని చెప్పారు. ఆశక్తి వున్నవారు  సెప్టెంబరు 15వ తేదిలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం  www.nca-wcd.nic.in  వెబ్ సైట్ లో సంప్రదించాలని కోరారు. 

Visakhapatnam

2020-09-01 14:55:23

తిరుపతిలో అన్ లాక్ 4.0 నిబంధలు అమలు...

కేంద్ర ప్రభుత్వం నిబంధన  అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు పాటిస్తూ, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నేటి నుంచి యదావిధి గా అన్నిషాపులు తెరుచుకోవడా నికి అనుమతిస్తున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,  జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న మున్సిపల్ పార్కులన్నింటికీ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే పార్క్ లోకి అనుమ తించేలా ఆదేశాలు జారీచేశామన్నారు. సంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు 100 మందికి లోపల, తిరుపతి అర్బన్ పోలీస్ విభాగం నుంచి అనుమ తులు తీసుకోవచ్చని తెలియజేశారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన పెద్ద వారు, గర్భిణీలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇంటి వద్దే ఉండాలని కమిషనర్ కోరారు. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణమే వార్డు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. లేదంటే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్ సూచించారు.

Tirupati

2020-09-01 14:50:44

భారతదేశం ఓ రాజనీతిజ్ఞుడుని కోల్పోయింది..ఏఐఎన్ఈఎఫ్

భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ పాత్రికేయుడు భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (AINEF) ప్రగాఢ సంతాపం తెలయజేసింది. ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్.పూర్ణచంద్ర రావు నేడిక్కడ  ఒక ప్రకటన లో.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజకీయ విలువులున్న నేత అని,అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఎదురైన సమస్యల ను పరిష్కరించి ట్రబుల్ షూటర్ గా ప్రసిద్ధి  గాంచారన్నారు.  ప్రణబ్ దాదాగా జర్నలిస్ట్ కూడా అయి నందున జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేవారన్నారు. జర్నలిస్టులను గౌరవించడం బాగా తెలిసిన గొప్ప నీతిజ్ఞుడని పూర్ణచంద్ర రావు ప్రస్తుతించారు. ఒక ఆర్థిక వేత్త,రాజనీతిజ్ఞుడు,జర్నలిస్టుని బారతదేశం కోల్పోయిందన్న ఆయన దాదా ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు దేవుడు మనో దైర్యాన్ని ప్రశాదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Machilipatnam

2020-09-01 14:00:04

ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీతకు మంత్రి సత్కారం...

 క్రీడాకారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలసిన అంతర్జాతీయ క్రీడాకారిణి (బాక్సింగ్, మహిళా విభాగం) ఎన్. ఉషానుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. మహిళా విభాగం నుండి బాక్సింగ్‌ లో గత నెల 29వ తేదీన భారత రాష్ట్రపతి చే ఆన్ లైన్ లో ద్యాన్ చంద్ అవార్డు ను ఎన్. ఉషా ఆన్ లైన్ లో స్వీకరించిన సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సార్లు బంగారు పథకం, నాలుగు సార్లు సిల్వర్, మూడు సార్లు బ్రాంజ్ పథకాలను సాధించినట్లు ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో బంగారు, సిల్వర్, బ్రాంజ్ పథకాలను సాధించినట్లు ఆయన చెప్పారు.  ఐ. వెంకటేశ్వరరావు కోచ్ గా విశాఖలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా లోనే కోచింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె రైల్వే లో బాక్సింగ్ కోచ్ గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సిఇఓ బి. శ్రీనివాసరావు, జిల్లా క్రీడా అధికారి ఎన్. సూర్యారావు,  రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. లక్ష్మణ్ దేవ్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. అప్పన్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, బాక్సింగ్ కోచ్  ఐ. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Seethammadara

2020-09-01 13:17:22

వైఎస్సార్ సంపూర్ణ పోషణ సెప్టెంబరు 7 కి వాయిదా..

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  మృతికి సంతాప సూచకంగా "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" కార్యక్రమాన్ని ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు సీతామహాలక్ష్మీ తెలియజేశారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. అయితే ఇప్పటికే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంగన్ వాడీలకు తెలియజేయడం జరిగిందన్న ఆమె సెప్టెంబరు 7వ తేదీ లోపు అన్ని కేంద్రాల్లో కార్యక్రమం చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధాంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషణ కు సంబంధించిన పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో ఒక్కోచోట ఒక్కో విధంగా ఈ కార్యక్రమం జరిగేదని ఇపుడు పథకం అందరికీ పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం తీర్చిదిద్దినట్టు ఆమె వివరించారు.

Visakhapatnam

2020-09-01 12:50:15

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ

రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని కరోనా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేలా చూడాలని ఆ దుర్గమ్మను మొక్కుకున్నట్టు ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వున్న దుర్గమ్మను దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయం ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా చేరుకున్న మంత్రి శంకరనారాయణ, కనక దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలని ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేయడానికి ఉంటుంది తప్పా, టిడిపి చేస్తున్నట్టు రాజయకీయం చేయ దన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా హామీలన్ని 90శాతం ఏడాదిన్నర పాలనలోనే అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ విషయంలో సీఎం ఎంతో నిబద్దతో ఉన్నారని చెప్పిన మంత్రి టిడిపి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎల్లో మీడియా ద్వారా ఎలాంటి విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

Vijayawada

2020-09-01 10:44:39

స్పందనకు 114 ఫిర్యాదులు

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 114 మంది ఫోన్ కాలర్స్ ఫోన్ చేసి తమ వినతులు వచ్చినట్టు జిల్లా రెవిన్యూ అధికారి బి.దయా నిధి తెలియజేశారు. ఇందులో రెవిన్యూ శాఖవి 24 కాగా, పౌర సరఫరాల సంస్థవి 11, ఇతర శాఖలకు సంబంధించి 79 వినతులు ఉన్నాయన్నారు.  సోమవారం ఉద యం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. కరోనా నేపధ్యంలో ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా ప్రజల నుండి వినతులు ( డయల్ యువర్ కలెక్టర్, స్పందనకు బదులుగా ) స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 114 మంది తమ ఫిర్యాదులను జిల్లా రెవిన్యూ అధికారికి తెలిపి నట్లు ఆయన చెప్పారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికపుడు సంబంధిత అధికారులకు పంపి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, స్పందన విభాగం భాస్కరరావు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-08-31 19:42:07