దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి నిరుపేదల కోసం చేసిన మేలుని ప్రతీ గుండె గుర్తుపెట్టుకుంటుందని మను ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మనుపల్లా అన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని సీతంపేటలో నిరుపేదలకు పండ్లు, పిల్లలకు పాఠ్యపుస్తకాలు నోట్సులు పంపిణీ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్ పేదల పెన్నిది, ఆయన సీఎం వైఎస్ జగన్ డైనమిక్ అని కొనియాడారు. బిసి సంఘం యువజన విభాగం మహిళా కార్యదర్శి దనుకోటి రమ మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా నేటికీ ఎందరో నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందుతోందన్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ కూడా తండ్రిని మించిన తనయుడిగా నిరుపేదలకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. అలాంటి మహానేత వర్ధంతి సందర్భంగా మను ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. అధ్యక్షురాలు జయ మాట్లాడుతూ, మహిళలు ఆర్ధికంగా ఎదగడానికి చేయూత పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్ధిక సహాయం చేసిన మనసున్న సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
స్పందన, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాల ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికా రులను ఆదేశించారు. బుధవారం ఈ మేరకు వివిధ విభాగాల అధిపతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరీష మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే వాటిలో వచ్చే సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్న కమిషనర్ స్పందనలో వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తెస్తే నేనే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మేనేజర్ హాసిమ్, ఆరోగ్య శాఖాధికారిని సుధారాణి, రెవిన్యూ అధికారులు సేతుమాదవ్, గాలి సుధాకర్, డి.ఈ. లు, వివిధ శాఖల విభాగాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.
మహానేత మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు విశాఖలో బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్ లో పామ్ బీచ్ హోటర్ దగ్గర వున్నడా.. వైఎస్ఆర్ విగ్రహానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వ ర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూర్తి స్థాయిలో కృషి చేశారని కొనియాడారు. పేదల పక్షపాతి గా నిలిచారని, నిరంతరం వారి కోసమే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత వైస్సార్ కే దక్కుతుంది అన్నారు. ఈతరం రాజకీయ నాయకులకు వైఎస్సార్ ఒక మార్గదర్శి కీర్తించారు. ఆయన ఆశయ సాధను ప్రతీ ఒక్కరూ క్రుషిచేయాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 44 వ వార్డు కు చెందిన జ్ఞానాపురం వైయస్సార్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మురళి, చరణ్, ఫ్రాన్సిస్ సునీల్ ,మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
మహావిశాఖ నగర పరిధిలోని ప్రభుత్వ భూమిని కబ్జాల నుంచి కాపాడాలని సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, నరవ రెవిన్యూ సత్తివానిపాలెం లో రాష్ట్ర ప్రభ్యత్వం 2006 లో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 42.25 ఎకరాల్లో సర్వే నెం 7/4 ఏ3డీ లో సబ్ డివిజన్ చేసి సుమారు 10 ఏకరముల భూమిని కబ్జాచేసి అక్రమంగా లే అవుట్ వేసి ప్రజలకు దర్జాగా అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపించి విలువైన ఆ భూమిని కాపాడాలన్నారు. ఈ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ మెయిల్ పంపినట్టు ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ప్రకటన వెలువడిన తరువాత మరింత వేగవంతంగా నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను భూకబ్జాదారులు హరించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లో ఉన్న పెద్దలు అండదండలు లేకుండా, రెవిన్యూ అధికారులు సహాయ సహకారాలు లేకుండా ఇటువంటి వ్యవహారాలు జరగవన్న అంశాన్ని కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించి విలువైన ప్రభుత్వ ఆస్థిని కాపాడాలని పైడిరాజు విజ్ఞప్తి చేశారు.
తెలుగు ప్రజల ప్రియతమ నేత డా.వైఎస్సార్ చిరస్థాయిగా పేద గుండెల్లో నిలిచిపోతారని రాష్ట్ర రహదాలు, భవనాల శాఖ మాత్యులు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద , ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా హృదయనేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి శంకరనారాయణ అంజలి అర్పించారు. అనంతరం, వైఎస్సార్సీపి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి మంత్రి శంకరనారా యణ వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాలలు అశృనివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నదీం అహ్మద్, ఎడిసిసి బ్యాంకు చైర్మన్ పామిడి వీరాంజనేయులు, పైలా నర్సింహయ్య, రాగే పరశురాం తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎవరైనా ఓ మనిషి దూరమైతే ఆ కుటుంబం మాత్రమే శోకంలో మునుగుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయి దు:ఖించినపుడు కన్నీటిసంద్రంలా మారిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మనసున్న మారాజు నిష్క్రమించి 11 ఏళ్లవుతున్నా ప్రతి తెలుగు వ్యక్తి ఇంకా ఆయన లేని లోటు నుంచి బయటపడలేకపోతున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వైఎస్ జగనక్ మోహన్ రెడ్డి వరకూ వైఎస్ వసుదైక కుటుంబంలో 'మేకపాటి' కుటుంబం కూడా సభ్యులవడానికి మించినదేది లేదని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే పదం వినపడితే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే స్థాయిలో..గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని మేకపాటి తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులు, ఇళ్లు ఇలా కోట్లాది మందికి సంక్షేమాన్ని అందించి వారి భవితను, తలరాతను మార్చడం వైఎస్ వల్లే సాధ్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా అవతరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ స్థాయి భరోసా దొరికిందనడంలో సందేహం లేదని మంత్రి అన్నారు. జననం, మరణం ప్రతి మనిషికి..పుట్టుక తప్ప చావులేని మనీషి వైఎస్ అని మంత్రి మేకపాటి స్మృతించి..ఘనమైన నివాళి పలికారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
విశాఖ ఏజెన్సీ లో వింత వ్యాధులతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. గూడెంకొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ తొక పరాయి గ్రామానికి చెందిన గిరిజన రైతు కుటుంబంలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయం చేసుకొని బతుకు తున్న ఉదయ్ కుమార్ కు, భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల వ్యవధిలో తొలిత మూడు నెలలు పసికందు మృతి చెందింది. అనంతరం మరో రోజు వ్యవధిలో మరో చిన్నారి మృతి చెందింది. ఇది జరిగిన నాలుగు రోజులకి తల్లి సుశీల బుధవారం ఉదయం గ్రామంలో మృతి చెందడంతో గ్రామంలో భయాం దోళనలు నెలకొన్నాయి. ఒకే గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామస్తులు ఆందోలన చెందుతున్నారు. వీరు ముగ్గురూ ఎందువల్ల చనిపోయారో అర్థం కాక ఏం చేయాలో అంతు చిక్కని పరిస్థితి తొకపరాయి గ్రామంలో నెలకొంది. ఈ మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
దివంగ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరెడ్డి తెలుగు ప్రజల గుండె చప్పుడు అని రాజ్య సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు. ఆయన 11వ వర్దంతి సందర్భంగా విశాకలోని పార్కు హోటల్ వద్ద వున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ నిరుపేదల పక్షపాతి అని, అందుకే సంక్షేమ పధకాలన్నీ వారికోసమే ప్రవేశపెట్టారని అన్నారు. నేడు అదే బాటలో ఆయన తన యుడు, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజారంజక పాలన చేపడుతున్నారని కొనియారు. వైఎస్సార్ స్పూర్తితో తామంతా ప్రజాసేవ చేస్తున్నామని చెప్పా రు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ , ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, నగర పార్టీ అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి విభాగం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నెల్లూరులోని సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీల లెక్కింపు మంగళవారం కూడా చేపట్టారు. అమ్మవారి ఆలయంలోని 5 హుండీలు తెరిచి అందులోని నగదును లెక్కించారు. వాటిలో మొత్తం రూ"33,83,648/-లు, బంగారు 0-148 గ్రాములు, వెండి 0-186 గ్రాములు మరియు అన్నదానము రూ"8,350/-లు. నిన్న, ఈ రోజు కలిపి మొత్తం రూ"34,33,648/-లు ఆదాయం చేకూరినట్టు ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి తెలియజేశారు. కరోనా వైరస్ కేసులు అధికంగా వున్నం దున ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం, మాస్కుల ధారణ చేసిన తరువాత ఈ పరకామణి చేపట్టినట్టు చైర్మన్ వివరించారు. హుండీలు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ యం. సుధీర్ బాబు సమక్షంలో, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో లెక్కించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు, పి.సుధ, కామిరెడ్డి రేవతి, వైసిపి నాయకులు కళత్తూరు రామ మోహన్ రెడ్డి, మొదలగు వారు పాల్గొన్నారు.
సింహాచలం దేవస్థానంలో చకా చకా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఈఓగా పనిచేస్తున్న బ్రమరాంబ తనను సింహాచలం ఈఓగా తప్పించా లని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానికి కారణం చైర్ పర్శన్ ఈఓ మధ్య విభేదాలేనని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సింహాచలం ఇన్ఛార్జి ఈవోగా అన్నవరం ఈవో త్రినాధరావు ను నియమిస్తూ, ప్రభుత్వ స్పెషల్ కమిషనర్ పి.అర్జున రావు ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. దేవస్థానంలో చాలా మందిని సిబ్బందిని తప్పిం చడం, ఏకపక్షనిర్ణయాలు చేయడం, అంతముందు పనిచేసిన ఈఓ పలు నిర్మాణాలు, కట్టడాల్లో అవకతవకలకు పాల్పడం వంటి కార్యక్రమాలు జరిగాయి. తరువాత పాత ఈఓను తప్పించి బ్రమరాంబను ఈఓగా ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత కూడా దేవస్థానం చైర్మన్ కి, ఈఓకి మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే విభేదాలు తలెత్తాయి. దీంతో అధికారుల ఆదేశాలతో ఈఓ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో, ఖచ్చితంగా అక్కడ ఈఓ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్నవరం ఈఓను ఇన్చార్జిగా నియమిస్తూ, ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. సింహాచలంలో చైర్ పర్శన్ నియామం దగ్గర నుంచి అనేక మార్పులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది...
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ఆసుపత్రిని రాష్ట్రానికే తలమానికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపి ఎమ్.వి.వి. సత్య నారాయణలతో విమ్స్ ను సందర్శించారు. ఆసుపత్రిలో గల సౌకర్యాలు, వసతులు, అందిస్తున్న చికిత్స లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలోని టిమ్స్, గుంటూరులో వున్న ఎయిమ్స్ ఆసుపత్రులకు మించి అన్నిరకాల చికిత్సలు, ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దివంగత రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ ఆసుపత్రి తరువాతి కాలంలో అలక్ష్యం చేయబడిందని, ప్రైవేటు పరం చేసేందుకు కూడా ఆలోచన చేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన తరువాత విశాఖపట్నాన్ని అభవృద్ధి చేసే క్రమంలో విమ్స్ పై ప్రత్యేక దృష్ఠి పెట్టారని చెప్పారు. ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు విమ్స్ సేవలు తీసుకున్నారంటే, ఆసుపత్రిని అభివృద్ధి చేసినందునే సాధ్యపడిందని పేర్కొన్నారు. విమ్స్ కు అనుబంధంగా మెడికల్ కాలేజి, ఇతర అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోనే గొప్ప వైద్య సంస్థను రూపొందించడమే ముఖ్యమంత్రి ఆశయమని చెప్పారు.
సీఎం విమ్స్ ఆసుపత్రిని పరిశీలించామన్నారు. 305 పడకలు గల వార్డులు తనిఖీ చేశామని. రోగులతో మాట్లాడామని చెప్పారు. వైద్యం సంతృప్తి కరంగా వుందని, మంచి ఆహారం అందిస్తున్నారని, మెరుగైన చికిత్స చేస్తున్నట్లు తెలిపారన్నారు. అధునాతన వైద్య పరికరాలు బాగున్నాయని, డాక్టర్లు, సిబ్బంది సేవలు ఆకట్టుకున్నాయన్నారు. అయితే ఆసుపత్రిలో వైద్యలు, నర్సులు, సిబ్బంది కొరత వుందన్నారు. వార్డుకు 16 పడకలు కలిగిన 12 ఐ.సి. యు. వార్డులు, 10 ఐసోలేషన్ వార్డులు, ఒక డయాలసిస్ సెంటర్ వుందని చెప్పారు. వైద్యులను, సిబ్బందిని, పారామెడికల్ సిబ్బందిని నియమించాల్సి వుందన్నారు.
తక్కువ సిబ్బందితో చక్కటి చికిత్స అందజేస్తున్న డైరక్టర్ డాక్టర్ వరప్రసాద్, ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పిపిఈ కిట్స్ ధరించి 6 గంటలు పనిచేయడం, ఓపికతో చికిత్స చేయడం వంటి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. త్వరలోనే డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎం.పి. ఎమ్.వి.వి. సత్యనారాయణ, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, జాయింట్ కలెక్టరు (అసరా) ఆర్.గోవిందరావు, నగర అధ్యక్షలు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్, కెకెరాజు, అక్కరమాని విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
మానవాళికి భగవద్గీత సందేశాన్ని అందించాలన్న ఉన్నతాశయంతో సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు గీతా పారాయణం శ్లోకపఠనం, వ్యాఖ్యానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఇఓ మాట్లాడుతూ, సుందరకాండ పారాయణం, విరాటపర్వం పారాయణం భక్తులను మంత్రముగ్ధులను చేశాయని, ఇదే తరహాలో గీతా పారాయణం విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఎస్వీబీసీలో ఈ పారాయణం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. ప్రముఖ పండితులు కాశీపతి శ్లోక పారాయణం, కుప్పా విశ్వనాధ శాస్త్రి ప్రవచనం చెబుతారని వివరించారు. శ్లోక పఠనం, వ్యాఖ్యానంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని సూచిస్తూ గీతా పారాయణం చేస్తే సామాన్య భక్తులకు చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పండితుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు. సెప్టెంబరు 3, 5వ తేదీల్లో రెండు విడతల్లో ట్రయల్ రన్ నిర్వహించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారాయణం జరిగేందుకు చర్యలు చేపడతామన్నారు.
తిరుపతిలోని ఎస్ వి వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ మాట్లాడుతూ గీతా పారాయణం తప్పక భక్తుల ఆదరణ చూరగొంటుం దన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికి మాత్రమే గీతోపదేశం చేయలేదని, సమస్త మానవాళికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారని వివరించారు. గీతా పారాయ ణం ట్రయల్ రన్ కార్యక్రమంలో ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, వేద పాఠశాల పండితులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగుల కోసం ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు పిలుపునిచ్చారు. జిల్లాలో రోజురో జుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుందని, దీంతో కరోనా మరణాలను నియంత్రించేందుకు ప్లాస్మాథెరపీ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్లాస్మాలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్ కేవలం కొన్ని రోజులే యాక్టివ్ గా ఉంటాయని, కాబట్టి ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగ తి ఎవరూ మరిచిపోకూడదన్నారు. మంగళవారం రాజాంలో జిల్లా రెడ్ క్రాస్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు హాజరై జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న పెంకి చైతన్య ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇదేస్పూర్తితో కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. తద్వారా కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న వారిని రక్షించేందుకు వీలుకలుగుతుందని ఆయన స్పష్టం చేసారు. రాజాంలో ప్లాస్మాదానం చేయాలనేవారు 9441708120, 9440131160 మొబైల్ నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ మేనేజర్ బి.వి.ప్రసాదరావు, రాజాం సబ్ బ్రాంచ్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ , కె.శంకర్రావు, కె సత్యనారాయణ, బి శ్రీధర్, విజయ్ బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ దృష్ట్యా రానున్న నెలన్నర రోజులు అతి కీలకమని భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. మంగళవారం నగరంలో కంటెంట్మెంట్ జోన్లలో పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి జిల్లా కలెక్టర్ నివాస్ పర్యటించారు. హాయతినగర్, ఫోజుల్ బేగ్ పేట, హడ్కో కాలనీ, చల్లవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు చేపడుతున్న సర్వే లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, ప్రతి రోజు శ్రీకాకుళం నగరంలో రెండు వందల నుండి 250 కేసులు పాజిటివ్ వస్తున్నాయని అన్నారు. జిల్లాలో గత రెండు రోజులు రోజుకు వెయ్యి కేసులు నమోదు అయ్యా యన్నారు. 25 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కాగలదని భావిస్తున్నామని, ఈ తరుణంలో రానున్న ఒకటిన్నర నెలలు అతి కీలకంగా భావిస్తూ అందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాంటైన్మెంట్ జోన్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు తిరగవద్దని కోరారు. మొబైల్ వాన్ల ద్వారా కూరగాయలు, తాగునీరు వంటి సౌకర్యాలు అందించే చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు.
ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వైరస్ నివారణ లో భాగంగా స్లమ్ ప్రాంతాల్లో 20 వేల మందికి ఫేస్ షీల్డ్ లను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వాలంటీర్లు అందరికీ ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశామని ఆయన అన్నారు. రోజుకు 9 వందల వరకు రాపిడ్ టెస్టులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 24 గంటల్లో ఫలితాలు వెల్లడికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు తిరగవద్దని కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే తెలియజేయాలని, త్వరగా రావడం వలన ప్రాణాపాయ స్థితి ఉండదని గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించామని నలుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడా ఉండరాదని చెప్పారు. శ్రీకాకుళం, పలాస, సోంపేట, మెలియాపుట్టి, పొందూరు, రాజాం ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు చెప్పారు. ఇంట్లో పెద్ద వయసు వారికి ప్రమాదమని యువత గ్రహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లో నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్, ప్రత్యేక అధికారులు టి వివి ప్రసాద్, ప్రసాద్, తాహసిల్దార్ వై వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీనిధి అపార్ట్మెంట్ కు దక్షిణం వైపు పు ప్రహరీ గోడ మీదుగా శివ జ్యోతి నగర్ లో ప్రవహించుచున్న కపిల్ తీర్థం కాలువ కలిపేందుకు ప్రణాళికలను తయారు చేయమని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గిరీష ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని శివ జ్యోతి నగర్, కొత్తపల్లి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, హరిశ్చంద్ర స్మశాన వాటిక మొదలగు ప్రదేశాలలో ఇంజనీరింగు, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి మంగళవారం ఉదయం కమిషనర్ గిరీష పర్యటించారు. ఆ ప్రాంతాల్లో గుంతలు, మురుగునీరు పోయే దానికి పైప్ లైన్లు, యుడిఎస్ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనిధి అపార్ట్మెంట్ యజమానులతో మాట్లాడారు. ప్రధాన రోడ్డులో, ఇసుక, కమ్మి, ఇటుక మొదలగు వ్యర్ధాలు రోడ్ లో ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేసే వారిపై ఫైన్ లు విధిస్తామని హెచ్చరించారు. కొత్తపల్లి లో పర్యటించి, ఎక్కడ ఎంతమేరకు రోడ్డు అవసరమో అధికారులు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ఎంత వరకు అవసరమో ప్లాన్ ద్వారా రెండు రోజుల లోపల తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం దేవేంద్ర థియేటర్ రోడ్డు హరిశ్చంద్ర స్మశాన వాటిక లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్లు ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,ఎయికామ్ ప్రతినిధులు బాలాజీ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.