1 ENS Live Breaking News

రోగుల కోసం కనీస సౌకర్యాలు మెరుగు పర్చాలి

ఉత్తరాంధ్ర జిల్లాలో  ప్రముఖ వైద్య శాలయిన  కె.జి.హెచ్ కు ప్రతి రోజు అనేక మంది  రోగులు వైద్యం కోసం వస్తుంటారని వారికి కనీస సౌకర్యాలు అందేటట్లు వైద్య సిబ్బంది  చూడాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అన్నారు.  బుధవారం ఉదయం స్థానిక కె.జి.హెచ్ ఆసుపత్రిలో ఒపి  స్లిప్, కేస్ షీట్లు మంజూరు చేయు గదిని, క్యూలైన్లను  పార్కింగ్ ప్రదేశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు.  ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేస్ షీట్లు మంజూరు చేయు గదిని మరమ్మత్తులు చేయాలని అదే విధంగా రోగులు ఒపి  స్లిప్  లు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగులతో పాటు వచ్చే వారికి కూడా  మరుగుదొడ్లు ఇబ్బంది లేకుండా  నిర్మించాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మెరుగు పర్చాలన్నారు .  ఓపి గేటు ఎదురుగా ఉన్న  మినీ పార్కును సుందరీకరించాలని ఆదేశించారు. అనంతరం వైద్యం కోసం వచ్చిన  రోగులతో మాట్లాడి వారికి అందుతున్నవైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో  కె.జి.హెచ్ సూపరింటెండెంట్ మైథిలీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-07 13:00:01

జగనన్న పాలవెల్లువ తక్షణమే పూర్తిచేయాలి


జగనన్న పాలవెల్లువ కార్యక్రమం రెండో విడత ప్రారంభానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో  జగనన్న పాలవెల్లువ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో నరసాపురం , పాలకొల్లు,  యలమంచిలి మండలాలలోని 25 గ్రామాలలో పాలు సేకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాల సేకరణ చేయడానికి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అన్నారు. ఏఎంసి సిబ్బందికి , ప్రమోటర్స్ కి సెక్రెటరీ అసిస్టెంట్ సెక్రటరీలకు శిక్షణ పూర్తి చేయాలన్నారు.బి ఎం సి యు లలో మిషన్లు ఏర్పాటు చేసి కాలిబ్రేషన్ చేయడంతో పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  బీ ఎం సీ యు లకు 2  భవనాలు గుర్తించాలని  ఆదేశించారు. ఈనెల 11వ తారీఖున నరసాపురం మండలంలో బీఎంసీ యు లో జగనన్న పాల వెల్లువ  కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

    జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద గతంలో ప్రారంభించిన 10 గ్రామాలలో  ప్రతిరోజు 1,769 లీటర్లు  పాలు సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు సేకరణ ఇంకా పెంచాలని కలెక్టర్ అన్నారు.   ఈ సమావేశంలో డిఆర్ డి ఏ పిడి వేణుగోపాల్  , పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్  డాక్టర్ .మురళికృష్ణ , డి సి ఓ ఎం. రవికుమార్ , డిపిఓ ఎం. నాగలత,  మార్కెటింగ్ శాఖ అధికారులు  ,ల్యాండ్ సూపర్డెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-07 11:58:34

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

శ్రీకాకుళం జిల్లాలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ హెచ్చరించారు.  సమాజంలో ఉండే లింగ వివక్షకు శాశ్వతంగా ముగింపు పలికి, పురుషులతో సమానంగా సమాజంలో ముందుకువెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలంటే అబలలు కాదని, సబలలని నిరూపించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై అవగాహన ర్యాలీ ( మారథాన్ ) కార్యక్రమం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల వద్ద జరిగింది.  ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మారథాన్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటుచేసి మహిళల లైంగిక వేధింపుల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై గత నెల 26 నుండి ఈ నెల 10వ తేది వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాప సురక్షితంగా ఉండాలని, వారు సమాజంలో ఉన్నపుడు అబల అనే భావన కాకుండా సబల అనే భావం రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైతే తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిచో పై అధికారులను సంప్రదించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లైంగిక వేధింపులకు ఎవరైనా పాల్పడితే జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు. 

జిల్లాలో యస్.పి, డిఎంహెచ్ఓ, మహిళ, శిశు సంక్షేమాధికారులు మహిళలు కావడం మన అదృష్టమని, బాధితులు ఎవరైనా ఉంటే వారికి వివరంగా తెలియజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, చట్టాలకు లోబడి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. మహిళలు ప్రతి విషయంలో పురుషులతో సమానంగా ఉంటూ సమ సమాజంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళల లైంగిక వేధింపుల నివారణపై రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు.  ఈ మారథాన్ కార్యక్రమంలో జిల్లా అదనపు యస్.పి టి.పి.విఠలేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా. డి.వి.విద్యాసాగర్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖాధికారి కె.అనంతలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డా. బి.మీనాక్షి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట రామన్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-07 10:18:46

సాయుధ దళాల ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలందించండి

మాజీ సైనికులు, దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వానుల కుటుంబాల సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టే కార్య‌క్ర‌మాలకు ఉద్దేశించిన సాయుధ ద‌ళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ డా. కృతికా శుక్లా ప్ర‌జ‌ల‌కు, వివిధ సంస్థలకు పిలుపునిచ్చారు. బుధవారం భార‌త సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం సంద‌ర్భంగా కాకినాడ‌ కలెక్టర్ కార్యాలయంలో క‌లెక్ట‌ర్‌.. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వ నిధి-2022ని ప్రారంభించి, తొలి విరాళం అందించారు. ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ దేశ ర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లు కృషిచేసిన సైనికుల త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాల‌కు ప్ర‌తి ఒక్క‌రూ అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. మాజీ సైనికులు, అమ‌ర‌వీరుల కుటుంబాల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌న్న విష‌యాన్ని గుర్తుంచుకొని, ప‌తాక దినోత్స‌వ నిధికి విరాళాలు అందించాల‌ని పిలుపునిచ్చారు. దాత‌లు నేరుగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్ర‌దించిగానీ లేదా Cheque /DD/Cash /Online Transfer చేయొచ్చ‌ని తెలిపారు.  సైనిక సంక్షేమ నిధి అకౌంట్   వివరాలు: ZILLA SAINIK WELFARE OFFICER,  STATE BANK OF INDIA, ZILLA PARISHAD BRANCH   A/C No-  6 2 0 6 4 0 6 0 6 2 3, IFSC CODE– SBIN0020974, MICR CODE – 533002028. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి సెక్షన్ 80 G అనుగుణంగా  మినహాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించారు.  కార్య‌క్ర‌మంలో భాగంగా  మాజీ సైనికులు సి.ఆర్.సి.ప్రసాద్, ఎం.పి. రామారావు, సీహెచ్ పవన్ కుమార్ (పవన్ కంప్యూటర్స్, కాకినాడ) విరాళాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లాకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్య ప్రసాద్, జిల్లాలోని పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-07 09:11:45

సాయుధ దళాల సేవలు నిరుపమానం.. కలెక్టర్

సాయుధ ద‌ళాలు దేశానికి అందిస్తున్న సేవ‌లు నిరుప‌మాన‌మ‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కొనియాడారు. వారి త్యాగాలు అమోఘ‌మ‌ని పేర్కొన్నారు. సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగింది.  క‌లెక్ట‌ర్‌కు  ప‌తాక నిధి ఫ్లాగ్‌ను జిల్లా సైనిక సంక్షేమాధికారి మ‌జ్జి కృష్ణారావు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, సైనిక ద‌ళాల సేవ‌ల‌ను కొనియాడారు.  మంచు కొండ‌ల్లో, ప‌ర్వ‌తాల్లో, ఎడారుల్లో, సముద్రంలో, ఎంతో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం మ‌ధ్య‌, సాయుధ ద‌ళాలు ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా, అనుక్ష‌ణం ప‌హారా కాస్తూ, దేశాన్ని ర‌క్షిస్తున్నాయ‌ని అన్నారు. వారి త్యాగాల ఫ‌లితంగానే, మ‌న‌మంతా దేశంలో ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నామ‌ని చెప్పారు.

ఉక్రెయిన్ యుద్ద ప‌రిస్థితుల్లో, వైద్య విద్యార్థుల‌ను దేశానికి తిరిగి ర‌ప్పించేందుకు ప‌డ్డ ప్ర‌యాస‌ను గుర్తు చేస్తూ,  దేశంలోని పౌరులు అనుభ‌విస్తున్న స్వేచ్చ‌ గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. సాహ‌సోపేత వీర‌జ‌వాన్ల‌కు వంద‌నం స‌మ‌ర్పించేందుకు, వారి కుటుంబాల‌కు చేయూత‌నిచ్చేందుకు సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా, పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి, వారి త్యాగాల‌ను గౌర‌వించాల‌ని  పిలుపునిచ్చారు. దేశ ర‌క్ష‌ణ‌లో అమ‌రులైన‌ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ, గోడ‌ప‌త్రిక‌ల‌ను క‌లెక్ట‌ర్‌ విడుద‌ల చేశారు.

            జిల్లా సైనిక సంక్షేమాధికారి మ‌జ్జి కృష్ణారావు మాట్లాడుతూ, పతాక దినోత్స‌వ నిధికి ఇచ్చే విరాళాల‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉద‌ని తెలిపారు. సైనికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున విరాళాల‌ను అందించాల‌ని కోరారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి, విజ‌య‌న‌గ‌రం ఎస్‌బిఐ ఖాతా నెంబ‌రు 52065221666, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎస్‌బిఐఎన్‌0020931 కు గానీ, లేదా డైరెక్ట‌ర్‌, సైనిక్ వెల్ఫేర్‌, విజ‌య‌వాడ పేరుమీద చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా కూడా త‌మ‌కు విరాళాల‌ను అంద‌జేయ‌వ‌చ్చ‌ని సూచించారు.

           ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల‌నాయుడు, స‌హాయ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, కెప్టెన్ ఎం.స‌త్య‌వేణి,  కెప్టెన్ ఎ.క‌ల్యాణ్ ఆహోక్‌, లెఫ్టినెంట్ వి స‌న్యాసినాయుడు, హ‌వ‌ల్దార్ మ‌హ‌బూబ్ క‌ట్నాట్‌, మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయ‌కులు, ప‌లువురు విశ్రాంత సైనిక యోధులు, ఎన్‌సిసి కేడెట్లు, స‌చివాల‌య సిబ్బంది, బిఎల్ఓలు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-07 08:50:54

ఆదర్శంగా నిలిచిన మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్

పార్వతీమన్యం జిల్లాకి ఆయన జాయింట్ కలెక్టర్..చిటికేస్తే ప్రైవేటు ఆసుపత్రిలో కార్పోరేట్ వైద్యం కాళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది.. కానీ తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రికే పురుడు పోయడానికి తీసుకెళ్లారు.. అదీ తల్లీబిడ్డా వాహనంలోనే.. ప్రభుత్వ ఆసుపత్రిలో చక్కటి కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతుందని.. దానిని 
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తానే స్వయంగా ఆసుపత్రి సేవలను వినియోగించుకున్నారు జెసి ఓ.ఆనంద్. ఆసుపత్రి సిబ్బంది కూడా పరిశుభ్ర వాతావరణంలో పురుడు పోసి చక్కగా మళ్లీ అధే వాహంలో ఇంటికి దగ్గర దించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగానే కార్పోరేట్ వైద్యం  ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్నదన్నారు. ముఖ్యంగా ప్రసవాల సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగించేసుకోవాలని సూచించారు. తల్లీ బిడ్డను ప్రభుత్వ తల్లీబిడ్డ వాహనంలో తీసుకువచ్చిన సిబ్బందిని జెసి ఈ సందర్భంగా అభినందించారు.

Parvathipuram

2022-12-07 08:40:56

మన్యం జిల్లాలో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ

అంటరానితనం,  షెడ్యూలు కులాలు, జాతుల వారిపై  దాడులను నివారించుటకు  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ  సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ,  అంటరానితనం, అత్యాచారం, దాడులకు గురయిన బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించాలన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు సేవాభావంతో పనిచేయాలని తెలిపారు.  కేసులు నమోదులో జాప్యం ఉండకూడదని, కేసు నమోదుకు అవసరమైన ధృవపత్రాలు వెంటనే భాదితులకు అందించాలని అధికారులను ఆదేశించారు.  కేసు చార్జిషీటు ఉన్నతాధికారులకు వెంటనే పంపించాలన్నారు.  డివిజినల్ స్థాయి సమావేశాలు నిర్వహించి కేసులపై సమీక్ష నిర్వహించాలన్నారు. భాధితులకు అత్యదిక పరిహారం అందించాలని, రెండు లేక అంతకంటే ఎక్కువ సెక్షన్ల ప్రకారం పరిహారం అందేఅవకాశం ఉంటే అందించాలని తెలిపారు. సరైన సెక్షన్ల ప్రకారం  కేసునమోదు  చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారం తో పాటు, కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన డా. అంబేద్కర్ సహాయ నిధినుండి కూడా పరిహారం అందించుటకు ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు.  నెలలో ఆఖరి వారంలో ఒకరోజు తహశీల్దార్లు  ఒక గ్రామాన్ని సందర్శించి అంటరానితనంపై  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలతో మాట్లాడి వారికి  సమస్యలు ఉంటే తెలుసుకోవాలన్నారు.    పెండింగులో గల కేసుల వారీ వివరాలు, బాదితులకు  అందించిన పరిహారం పై సమీక్షించారు.  బాధితులు మైనర్లయితే బాలల సంక్షేమ కమిటీ వారిని పరామర్శించాలని, తరచు వారిని కలుసుకొని వారికి మనోధైర్యాన్ని కలిగించాలని తెలిపారు. 

అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డా. ఒ. దిలీప్ కిరణ్ మాట్లాడుతూ  జిల్లాలో నమోదైన కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చార్జిషీటు కాపీలను కలెక్టరు కార్యాలయంనకు మరియు సంబందిత అదికారులకు వెంటనే పంపించాలని తెలిపారు. రిపోర్టును పంపిన పిదప రశీదులను తీసుకొని రికార్డులలో పొందుపరచాలన్నారు. కుల దృవీకరణ సర్టిఫికెట్ నిర్ణీత ప్రొఫార్మా 3 ద్వారా తీసుకోవాలని తెలిపారు. 
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మహమ్మద్ గయాజుద్దీన్ మాట్లాడుతూ జి.ఒ. నంబరు 99 ప్రకారం జిల్లాలో జిల్లా కలెక్టరు అద్యక్షత జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇరవై నాలుగు కేసులు నమోదైనాయని, పదహారు కేసులు విచారణ దశలోను, రెండు కేసులు కోర్టులో ట్రైల్ దశలోను ఉన్నాయని, ఆయ కేసులు సంబంధిత అదికారలకు విచారణ నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. బాధితులకు అందించిన  పరిహారం వివరాలను తెలియజేసారు. 

ఈ సమావేశంలో సబ్ కలెక్టరు నూరుల్ కమర్, ఆర్.డి.ఒ. కె.హేమలత, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, సబ్ డివిజినల్ పోలీసు అదికారులు ఎ. సుబాష్, జి.వి.కృష్ణారావు, మురళీధర్, సివిల్ సప్లయి జిల్లా మేనేజరు ఎం. దేవుల నాయక్, జిల్లా పశుసంవర్థక అధికారి ఎ. ఈశ్వరరావు, జిల్లా అగ్నిమాపకఅదికారి కె.శ్రీనుబాబు, కమిటీ సభ్యులు గునగంజి చంద్రయ్య, పిరపాక శ్రీనివాసరావు, మెయి లక్మీకుమారి, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-07 07:34:55

మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి -జెసి

మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ అన్నారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం సంబంధిత శాఖల అధికారులు , బోర్డు సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనిక కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవల్లో మాజీ సైనికులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు . ఇళ్ల స్థలాలు, జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించే భూ పంపిణీ త్వరితగతిన జరిగేలా కృషి చేస్తామన్నారు.  జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రూపొందించిన ఎజెండా అంశాలపై చర్చించారు. సైనిక వితంతులు/ కుటుంబ ఆధారితులకు / వికలాంగ సైనికులకు ఇంటి స్థలాల మంజూరు కి సంబంధించి త్వరలోనే కేటాయిస్తామని అన్నారు. మహారాణిపేట లో నున్న సైనిక భవన్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని రోడ్లు , భవనాలు డి.ఈ కి సూచించారు.మాజీ సైనికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ వివరాలు గుర్తించాలని అన్నారు.

 నగదు బహుమతి పొందిన సైనికులకు సంబంధించి నిధులు మంజూరుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. జీవీఎంసీ దుకాణాల మంజూరులో 2% రిజర్వేషన్ మాజీ సైనికులకు కల్పించేందుకు కృషి చేయాలని జీవీఎంసీ అధికారికి సూచించారు. అదేవిధంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో విధిలో నున్న సైనికుల కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖకు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్రీనివాస్ మూర్తి, ప్రత్యేక ఆహ్వానితుడు కల్నల్ ఎ . వెంకట రామన్ , అదనపు అధికారి ,స్టేషన్ హెడ్, జి ఎం డి ఐ సి రామలింగేశ్వరరాజు ,  జిల్లా ఉపాధి అధికారి సుబ్బిరెడ్డి , జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. సత్యానందం, ఆర్ & బి డిఈ ఫణేశ్వరరావు , అధికారిక , అనధికారిక సభ్యులు కల్నల్ ఎస్. భాషా తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-06 14:06:08

ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని జిల్లాకు రాక

శ్రీకాకుళం జిల్లాలోని పాత్రికేయులతో జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై ఈ నెల 12న అవగాహన సదస్సు జరుగనుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 12న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించనున్నారన్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 12తేదీ సోమవారం స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 11:00 గంటలకు జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అవగాహనా సదస్సులో పాల్గొన్న వారికి పార్టిషిపేషన్ ధృవపత్రం అందజేయడం జరుగుతుంది జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో జరిగే ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయ అతిథులుగా హాజరుకానున్నారన్నారు. వీరితో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2022-12-06 13:59:27

భూగర్భజల నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి

అక్విఫెర్ మ్యాపింగ్ అనేది భూగర్భ, భూభౌతిక, జలసంబంధమైన అంశమని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం జిల్లాస్థాయి భూగర్భ జలాల సమన్వయ  కమిటీ సమావేశం నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జల శాస్త్రవేత్త రవికుమార్ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భూగర్భ జలాల లభ్యత స్థితిగతులను ఆయన సమీక్షిం చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్విపైర్ మ్యాపింగ్ అనేది భూగర్భ జల సంబంధమైన రసాయన క్షేత్ర ప్రయోగశాల విశ్లేషణల కలయికతో జలాశయాలలో భూగర్భ జలాల పరిమాణం, నాణ్యత మరియు స్థిరత్వాన్ని వర్గీకరించడానికి వర్తించే ప్రక్రియ అని తెలిపారు. వివిధ హైడ్రోజి యోలాజికల్ సెట్టింగ్‌లలో అక్విఫర్ మ్యాపింగ్ ద్వారా భూగర్భ జలాల యొక్క ఖచ్చితమైన మరియు సమగ్రమైన సూక్ష్మ-స్థాయి చిత్రం ఈ సాధారణ-పూల్ వనరుకోసం తగిన స్థాయిలో బలమైన భూగర్భజల నిర్వహణ ప్రణాళికలను రూపొందించడానికి వాటి అమలుకు అనుమతిస్తుందన్నారు. 

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి భద్రత, మెరుగైన నీటిపారుదల సౌకర్యం మరియు నీటి వనరుల అభివృద్ధిలో స్థిరత్వాన్ని సాధిం చడంలో ఎంత గానో సహాయ పడుతుందన్నారు సంఘం భాగస్వామ్యంనోడల్ అధికారులు అక్విఫెర్ మ్యాప్‌ల తయారీలో పూర్తిగా పాల్గొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మరియు మద్దతుతో  జలాశయ నిర్వహణ ప్రణాళికలను అభివృద్ధి చేయా లన్నారు  ఆక్విఫర్ మ్యాపింగ్ వ్యాయామం యొక్క లక్ష్యాలు  ప్రయో జనాల గురించి శాస్త్రవేత్త రవికు మార్ విశదీకరించారు ఈ అంశాలపై సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజల ద్వారా వారి క్రియాశీల భాగస్వామ్యం ప్రాజెక్ట్ అమలులో ప్రాథమికంగా ఉండా లని ,స్థానిక విద్యావంతులలో కొందరిని గుర్తించి, భూగర్భ జలాలు, ఆక్విఫర్ మ్యాపింగ్ యొక్క ఔచిత్యం , భాగస్వామ్య నిర్వహ ణపై ప్రాథమిక శిక్షణను ఇవ్వాలన్నారు. 

జిల్లాలో ఎక్కడ ఉప్పునీరు ఎక్కడ మంచి నీరు లభ్యత ఉందో ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా సులభంగా గుర్తించవచ్చునన్నారు. కార్యక్రమం అమలుకై  భూగర్భ జలాలు, నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, అడవులు మొదలైన సంబంధిత శాఖల ప్రతినిధులతో జిల్లా ప్రభుత్వ భూగర్భ జలాల అధికారులు సమన్వయ కమిటీ లుగా ఉంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు,భూగర్భ జల శాఖ డిడి రాధాకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ సూప ర్టెండెంట్ ఇంజనీర్, ఎన్ వి కృష్ణా రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి శివశంకర్ ప్రసాద్, జెడి మత్స్య శాఖ షేక్ లాల్ మహమ్మద్, డిఎఫ్ఓ ఎంవి ప్రసాద్ రావు కమిటీ సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-06 11:47:16

ఆక్వాకల్చర్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి చెందాలి, కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై తో రిజిష్టర్ కానివి తొలగించవచ్చు అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ, శ్రీకాకుళం, టెక్కలి మరియు పలాస డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో మత్స్య శాఖ, అటవీశాఖ, రెవెన్యూ , ఇరిగేషన్, వ్యవసాయ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జాతీయ హరిత  ట్రిబునల్  స్పెషల్ బెంచ్, చెన్నై వారి యొక్క ఆదేశములు మేరకు జిల్లా లోని  అనుమతి లేకుండా 1401 ఎకరాలు రొయ్యలు సాగు చేస్తున్న 464 మంది  రైతులను గుర్తించడమైనది. సదరు రైతులకు  కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై రూల్స్ ప్రకారం క్రమబద్దీకరణ చేయుటకు గల అవకాశాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలకు జిల్లా కలెక్టర్ ఆదేశించడమైనది.

జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లాలో  2953 ఎకరాలు  ఆక్వాకల్చర్ జరుగుతుందని. అందులో  1552 ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయని,  1401 ఎకారాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఆక్వాకల్చర్ నిర్వహిస్తున్నారని, సంబంధిత మండల తహశీల్దార్లు 1401 ఎకరాలకు సంబంధించిన నివేదికలు అందజేయాలి అన్నారు. ఆక్వాకల్చర్ చేస్తున్నావారికి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయాల్సింది, లేని వాటిని రద్దు చేయాలన్నారు. ఇది మంచి అవకాశం. జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచాల్సి ఉందని అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్వాకల్చర్ కు సంబంధించిన వివరాలు తెలియజేసారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ ఉన్న వారికి మాత్రమే రాయితీలు వర్తిస్తాయని అందుకే రిజిస్ట్రేషన్ తప్పక కలిగి ఉండాలన్నారు. 5 హెక్టార్లు కన్నా తక్కువ విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను డివిజినల్ స్థాయి కమిటీ ఛైర్మన్ గారైన రెవెన్యూ డివిజినల్ అధికారి వారి ఆమోదంతో కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి నేరుగా పంపవచ్చును 5 హెక్టార్లు కన్నాపై బడి విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను మాత్రం జిల్లా కలెక్టర్ , జిల్లా స్థాయి కమిటీద్వారా కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి పంపడమగునని తెలిపినారు.

ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జి. హారిక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, డి.ఆర్.డి.ఎ ప్రోజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి సితారాముర్తి, మండల రెవెన్యూ అధికారులు,  మత్స్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

Srikakulam

2022-12-06 11:15:32

తుఫాను కేంద్రాలకు మరమ్మతులు చేపట్టాలి..

తుఫాను కేంద్రాల మరమ్మతులు పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సంబంబంధిత అధికారులను ఆదేశించారు.  జిల్లాలోని తుఫాను కేంద్రాల మరమ్మతులు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కేంద్రాల మెంటెనెన్స్ లను పరిశీలించాలని, ఇందుకు కొంత నిధులను కేటాయించడమైనదని,  సమస్యలు ఏమైనా ఉంటే తహసీల్దార్లు గుర్తించాలని ఆదేశించారు.  కార్పస్ ఫండ్ గా ఒక్కో తుఫాను కేంద్రానికి నిధులు మంజూరు చేయడమైనదని డిఆర్డిఎ పిడి విద్యాసాగర్ వివరించారు. తుఫాను కేంద్రాలు, తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఎక్వూప్ మెంట్, సైరన్లు చూడాలని కలెక్టర్ చెప్పారు. 

నిధులు అవసరమైతే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మండలాల్లో అత్యవసర కేంద్రాలు ఉన్నాయని, సైరన్ లు కేటాయించడమైనదని, మరమ్మతులు ఉంటే గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. తహసీల్దార్లు కోస్టల్ మండలాలపై దృష్టి సారించాలని చెప్పారు. తుఫాను కేంద్రాలకు అవసరమైతే అదనపు నిధులు పంచాయతీ రాజ్ ఇంజనీర్లుతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, సిపిఒ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

 

Srikakulam

2022-12-06 11:11:30

ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేది ఆఖరు

ఓటరు తిరస్కరణకు గల కారణాలను అప్లోడ్ చేసి ఓటరుకు తెలియజేయాలని ఓటరు నమోదుపరిశీలకులు ఎ.బాబు తెలిపారు.  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి  ఓటరు నమోదు అధికారులుసహాయ ఓటరు నమోదు అధికారులువివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ అధికారులను బూత్ స్థాయి అధికారులుపోలింగ్ కేంద్రాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులువిఆర్ఓలు మంచి సామర్థ్యం గల యువత ఉన్నారనిఅలాంటి వారిని వినియోగించుకొని శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అర్హత గల వారని నమోదు చేయడంఅనర్హత గల వారిని తొలగించడం వంటి ప్రోసెస్ గూర్చి తెలియజేయాలన్నారు. మండలాల వారీగా సచివాలయాల సిబ్బంది ఎంత మంది ఉన్నదీ తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.


డూప్లికేట్లను తొలగించడంఇంట్లో కూర్చుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. డూప్లికేట్ అంటే డబుల్ ఎంట్రీవయసు తక్కువ ఉండటం వంటి వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటరు నమోదుతొలగింపు వంటి వాటిపై సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తనకు తెలియజేయాలని 9441412121,

ababu@ias.nic.in చెప్పారు.   బూత్ స్థాయి అధికారులు అర్హతగల  ఓటరు నమోదు కొరకు ఇంటింటికీ ప్రచారం నిర్వహించాలనిఫారం 1 నుంచి 8 వరకు ఫారాలు దగ్గరే ఉంచుకోవాలన్నారు.   ఒకే వ్యక్తి ఫొటోతో రెండు  లేదా అంతకంటే ఎక్కువ ఓటరు నమోదు జరిగినట్లయిటే అటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి  ఓటరు అంగీకారంతో ఒకటి ఉంచి మిగతా వాటిని రద్దు చేయాలన్నారు. 


బూత్ స్థాయి నుండే ఓటర్లు నమోదు గూర్చి తహసీల్దార్లుబూత్ స్థాయి అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. 18-19 వయసు వారిపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.  ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెటీరియల్ ను వినియోగించు కోవాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుఓటరు జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తులు పెట్టుకోవాలని తెలపాలన్నారు.  ఓటరు నమోదు పై గ్రామ సచివాలయాల ద్వారా తెలియజేయాలని పరిశీలకులు సూచించారు. బిఎల్ఓ స్థాయిలో సమావేశాలు జరగాలనిమండల స్థాయిలో సహాయ ఓటరు నమోదు అధికారులు ఓటరు నమోదుపై సమీక్షలు జరగాలన్నారు. చేర్పులుమార్పులుతొలగింపులకు గలు కారణాలు తెలిపేది అప్ లోడ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు కింద స్థాయి అధికారులే ప్రభుత్వానికి స్తంబాల్లాంటి వారని కొనియాడారు. ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేదీ ఆఖరనిఅర్హత గల ఓటర్లనుఓటర్లుగా నమోదు చేయించుకోవాలని చెప్పారు.


         జిల్లా కలెక్టర్జిల్లా ఓటరు నమోదు అధికారి శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు గూర్చి తెలియజేసిజిల్లా నుండి పాలకొండరాజాం నియోజకవర్గాలు పార్వతీపురం మన్యంవిజయనగరం జిల్లాల్లో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో ఓటర్లు నమోదుమైగ్రేషన్ ఓటర్లుకొత్తగా నమోదు అవుతున్న ఓటర్లుతదితర వాటి గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటరు నమోదు పరిశీలకులకు వివరించారు. గ్రామాల్లో టంటం వేయించి తెలియజేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు నమోదుపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ఇటీవల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 18-19 వయసు గల వారి నుండి 20 వేల దరఖాస్తులను ఓటరు నమోదుకు స్వీకరించినట్లు వివరించారు. 


     టిడిపి ఉపాధ్యక్షులు పిఎంజె బాబు మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదు కార్యక్రమల్లో పాల్గొంటున్నారని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధారాలు అందజేస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలగింపులువలసలుతదితర సమస్యలుపై మాట్లాడారు. ప్రతీ తొలగింపునకు కారణాలను అప్లోడ్ చేయాలని పరిశీలకులు ఎ. బాబు ఆదేశించారు.   సిపిఎం పార్టీ నుండి కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో 18-19 వయసు గల యువత ఉన్నారని ఓటర్లు నమోదుకు విఆర్ఓను పంపాలని కోరారు. ఓటరు నమోదుపై వాలంటీర్లు పాత్ర గూర్చి తెలపగా ఏ బూత్ లో ఉన్నారో ఆధారాలు అందజేస్తే సంబంధిత విఆర్ఓపై తక్షణ చర్యలు  తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బిజెపి నుండి రవి బాబ్జీ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కు ఇంత వరకు ఎవరూ రాలేదని చెప్పగా పోలింగ్ స్టేషన్ల వారీగా పార్టీలకు సంబంధించి జాబితా రాజకీయ పార్టీల ప్రతినిధుల జాబితూ అందజేస్తే ఆ జాబితాలను బిఎల్ఓలకు అందజేస్తామని కలెక్టర్ వివరించారు. బిజెపి నుండి బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బిఎల్ఎబిఎల్ఓలకు వర్క్ షాప్ నిర్వహించాలని కోరారు.


వైయస్ఆర్ సిపి రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదుపై అవగాహన పరుస్తున్నారని తప్ప ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన లేదని చెప్పగా ఓటరు నమోదు పై వాలంటీర్లు ఏ విధమైన పాత్ర ఉండకూడదని ఓటరు నమోదు పరిశీలకులు ఎ. బాబు చెప్పారు.

     ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డిఓటరు నమోదు అధికారులు ఎ. రాజేశ్వరిజి. జయదేవిసీతారామమూర్తిబి. శాంతివెంకటరామన్,  ఎ.ఇ.ఆర్.ఓ లువివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజె బాబుసిపిఐ పార్టీ నుండి బాబ్జీవై.యస్ఆర్ సిపి నుండి రామకృష్ణబిజెపి నుండి ఉమామహేశ్వరరావురవి బాబ్జీతదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-06 11:04:00

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు కీలకం..

పోలీసు శాఖలో హోంగార్డుల విధులు చాల కీలకమని,జిల్లా హోమ్ గార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక పేర్కొన్నారు. మంగళవారం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో నిర్వహించిన 60వ హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమెండేర్ హోమ్ గార్డు శసికుమార్ ఎస్పీనకు గౌరవ వందనం సమర్పించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శాంతికి చిహ్నంగా పావురాలును గాలిలోకి విడిచిపెట్టారు. హోమ్ గార్డుల  ప్లేటునులు నిర్వహించిన పరేడును ఎస్పీ తిలకించారు.ఈ  సందర్భంగా ఎస్పీ హోమ్ గార్డులనుద్దేశించి మాట్లాడుతూదేశంలో చైనా దేశం తో యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేయుటకు హోంగార్డు అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో హోంగార్డులు సేవలు అందిస్తున్నారు తెలిపారు. జిల్లాలో 1965లో హోమ్ గార్డ్ వ్యవస్థ ప్రారంభమై నేటికి 739 హోంగార్డులలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

హోమ్ గార్డుల సంక్షేమం దృష్ట్యా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమ్ గార్డ్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియా లేరు వారికిచ్చే గౌరవ వేతనం తక్కువ అయినప్పటికీ పోలీసు సిబ్బందితోపాటు సరిసమానంగా విధులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పకృతి వైపరీత్యాల్లోనూ, శాంతభద్రతలు పరిరక్షణలో, రాత్రి గస్తీలతో పాటు వివిధ విఐపిల బందోబస్తు విధులులో  సమయపాలనతో విధులు నిర్వర్తించి మన్నాలను పొందుతున్నారుని కొనియాడారు.హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం నకు చాల ప్రాముఖ్యత ఉందిని కావున ప్రతి ఒక్కరూ బాద్యత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జెడి వి.ఎన్.మణికంఠ అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వరరావు,  డీఎస్పీలు ఎస్ బాలరాజు,జి. శ్రీనివాసరావు,సిహెచ్ ప్రసాద్ రావు, ఆర్ఐలు ప్రేదిపు,ఉమా మహేశ్వరరావు,హోమ్ గార్డులు,తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-06 11:00:26

పర్యాటక జిల్లా వాణిజ్య నమోదు తప్పనిసరి

శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార సంస్థలు జిల్లా పర్యాటక శాఖ వాణిజ్యంలో నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్. నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యాటక శాఖ కమీషనరు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటు వంటి హెూటల్స్, రిసార్ట్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, హెూమ్ లు, ఫార్మ్ స్టేలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ బోట్ ఆపరేటర్స్, అడ్వెంచర్ గేమ్స్ ఆపరేటర్స్, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్, ఎంఐసిఐ కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, సర్వీస్ అపార్ట్మెంట్లకు టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. పర్యాటక వాణిజ్యంలో నమోదు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాతి నిధి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ నమోదు ప్రక్రియ ఆన్లైన్ లో www.atourism.gov.in వెబ్ సైట్ ద్వారా చేయాలని చెప్పారు. నమోదుకు సంబంధించిన దరఖాస్తులు, ఫీజు వివరాలు వెబ్ సైట్ లో లభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు నమోదు, ఇతర సందేహాలకు 6309942033 నంబరుకు ఫోన్ లో సంప్రదించ వచ్చని సూచించారు.

Srikakulam

2022-12-05 11:50:00