1
ఓటరు తిరస్కరణకు గల కారణాలను అప్లోడ్ చేసి ఓటరుకు తెలియజేయాలని ఓటరు నమోదుపరిశీలకులు ఎ.బాబు తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఓటరు నమోదు అధికారులు, సహాయ ఓటరు నమోదు అధికారులు, వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ అధికారులను బూత్ స్థాయి అధికారులు, పోలింగ్ కేంద్రాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులు, విఆర్ఓలు మంచి సామర్థ్యం గల యువత ఉన్నారని, అలాంటి వారిని వినియోగించుకొని శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అర్హత గల వారని నమోదు చేయడం, అనర్హత గల వారిని తొలగించడం వంటి ప్రోసెస్ గూర్చి తెలియజేయాలన్నారు. మండలాల వారీగా సచివాలయాల సిబ్బంది ఎంత మంది ఉన్నదీ తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
డూప్లికేట్లను తొలగించడం, ఇంట్లో కూర్చుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. డూప్లికేట్ అంటే డబుల్ ఎంట్రీ, వయసు తక్కువ ఉండటం వంటి వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటరు నమోదు, తొలగింపు వంటి వాటిపై సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తనకు తెలియజేయాలని 9441412121,
ababu@ias.nic.in చెప్పారు. బూత్ స్థాయి అధికారులు అర్హతగల ఓటరు నమోదు కొరకు ఇంటింటికీ ప్రచారం నిర్వహించాలని, ఫారం 1 నుంచి 8 వరకు ఫారాలు దగ్గరే ఉంచుకోవాలన్నారు. ఒకే వ్యక్తి ఫొటోతో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటరు నమోదు జరిగినట్లయిటే అటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు అంగీకారంతో ఒకటి ఉంచి మిగతా వాటిని రద్దు చేయాలన్నారు.
బూత్ స్థాయి నుండే ఓటర్లు నమోదు గూర్చి తహసీల్దార్లు, బూత్ స్థాయి అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. 18-19 వయసు వారిపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెటీరియల్ ను వినియోగించు కోవాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డు, ఓటరు జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తులు పెట్టుకోవాలని తెలపాలన్నారు. ఓటరు నమోదు పై గ్రామ సచివాలయాల ద్వారా తెలియజేయాలని పరిశీలకులు సూచించారు. బిఎల్ఓ స్థాయిలో సమావేశాలు జరగాలని, మండల స్థాయిలో సహాయ ఓటరు నమోదు అధికారులు ఓటరు నమోదుపై సమీక్షలు జరగాలన్నారు. చేర్పులు, మార్పులు, తొలగింపులకు గలు కారణాలు తెలిపేది అప్ లోడ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు కింద స్థాయి అధికారులే ప్రభుత్వానికి స్తంబాల్లాంటి వారని కొనియాడారు. ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేదీ ఆఖరని, అర్హత గల ఓటర్లను, ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఓటరు నమోదు అధికారి శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు గూర్చి తెలియజేసి, జిల్లా నుండి పాలకొండ, రాజాం నియోజకవర్గాలు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో ఓటర్లు నమోదు, మైగ్రేషన్ ఓటర్లు, కొత్తగా నమోదు అవుతున్న ఓటర్లు, తదితర వాటి గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటరు నమోదు పరిశీలకులకు వివరించారు. గ్రామాల్లో టంటం వేయించి తెలియజేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు నమోదుపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 18-19 వయసు గల వారి నుండి 20 వేల దరఖాస్తులను ఓటరు నమోదుకు స్వీకరించినట్లు వివరించారు.
టిడిపి ఉపాధ్యక్షులు పిఎంజె బాబు మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదు కార్యక్రమల్లో పాల్గొంటున్నారని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధారాలు అందజేస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలగింపులు, వలసలు, తదితర సమస్యలుపై మాట్లాడారు. ప్రతీ తొలగింపునకు కారణాలను అప్లోడ్ చేయాలని పరిశీలకులు ఎ. బాబు ఆదేశించారు. సిపిఎం పార్టీ నుండి కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో 18-19 వయసు గల యువత ఉన్నారని ఓటర్లు నమోదుకు విఆర్ఓను పంపాలని కోరారు. ఓటరు నమోదుపై వాలంటీర్లు పాత్ర గూర్చి తెలపగా ఏ బూత్ లో ఉన్నారో ఆధారాలు అందజేస్తే సంబంధిత విఆర్ఓపై తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బిజెపి నుండి రవి బాబ్జీ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కు ఇంత వరకు ఎవరూ రాలేదని చెప్పగా పోలింగ్ స్టేషన్ల వారీగా పార్టీలకు సంబంధించి జాబితా రాజకీయ పార్టీల ప్రతినిధుల జాబితూ అందజేస్తే ఆ జాబితాలను బిఎల్ఓలకు అందజేస్తామని కలెక్టర్ వివరించారు. బిజెపి నుండి బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బిఎల్ఎ, బిఎల్ఓలకు వర్క్ షాప్ నిర్వహించాలని కోరారు.
వైయస్ఆర్ సిపి రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదుపై అవగాహన పరుస్తున్నారని తప్ప ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన లేదని చెప్పగా ఓటరు నమోదు పై వాలంటీర్లు ఏ విధమైన పాత్ర ఉండకూడదని ఓటరు నమోదు పరిశీలకులు ఎ. బాబు చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, ఓటరు నమోదు అధికారులు ఎ. రాజేశ్వరి, జి. జయదేవి, సీతారామమూర్తి, బి. శాంతి, వెంకటరామన్, ఎ.ఇ.ఆర్.ఓ లు, వివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజె బాబు, సిపిఐ పార్టీ నుండి బాబ్జీ, వై.యస్ఆర్ సిపి నుండి రామకృష్ణ, బిజెపి నుండి ఉమామహేశ్వరరావు, రవి బాబ్జీ, తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక సారాంశ సవరణపై నేడు సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 కొరకు రోల్ అబ్జర్వర్ గా రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎపి అమూల్ ప్రత్యేక అధికారి శ్రీ అహ్మద్ బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ సమావేశంలో అబ్జర్వర్ పాల్గొంటారని, ఈ నెల 6వ తేదీన ఉదయం 9.30 గం.ల నుండి ఉ.11.00 గం.ల కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇఆర్ఓలతో ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంనకు ప్రజా ప్రతినిదులు, అధికారులు హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.