1 ENS Live Breaking News

మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి -జెసి

మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ అన్నారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం సంబంధిత శాఖల అధికారులు , బోర్డు సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనిక కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవల్లో మాజీ సైనికులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు . ఇళ్ల స్థలాలు, జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించే భూ పంపిణీ త్వరితగతిన జరిగేలా కృషి చేస్తామన్నారు.  జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రూపొందించిన ఎజెండా అంశాలపై చర్చించారు. సైనిక వితంతులు/ కుటుంబ ఆధారితులకు / వికలాంగ సైనికులకు ఇంటి స్థలాల మంజూరు కి సంబంధించి త్వరలోనే కేటాయిస్తామని అన్నారు. మహారాణిపేట లో నున్న సైనిక భవన్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని రోడ్లు , భవనాలు డి.ఈ కి సూచించారు.మాజీ సైనికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ వివరాలు గుర్తించాలని అన్నారు.

 నగదు బహుమతి పొందిన సైనికులకు సంబంధించి నిధులు మంజూరుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. జీవీఎంసీ దుకాణాల మంజూరులో 2% రిజర్వేషన్ మాజీ సైనికులకు కల్పించేందుకు కృషి చేయాలని జీవీఎంసీ అధికారికి సూచించారు. అదేవిధంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో విధిలో నున్న సైనికుల కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖకు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్రీనివాస్ మూర్తి, ప్రత్యేక ఆహ్వానితుడు కల్నల్ ఎ . వెంకట రామన్ , అదనపు అధికారి ,స్టేషన్ హెడ్, జి ఎం డి ఐ సి రామలింగేశ్వరరాజు ,  జిల్లా ఉపాధి అధికారి సుబ్బిరెడ్డి , జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. సత్యానందం, ఆర్ & బి డిఈ ఫణేశ్వరరావు , అధికారిక , అనధికారిక సభ్యులు కల్నల్ ఎస్. భాషా తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-06 14:06:08

ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని జిల్లాకు రాక

శ్రీకాకుళం జిల్లాలోని పాత్రికేయులతో జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై ఈ నెల 12న అవగాహన సదస్సు జరుగనుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 12న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించనున్నారన్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 12తేదీ సోమవారం స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 11:00 గంటలకు జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అవగాహనా సదస్సులో పాల్గొన్న వారికి పార్టిషిపేషన్ ధృవపత్రం అందజేయడం జరుగుతుంది జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో జరిగే ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయ అతిథులుగా హాజరుకానున్నారన్నారు. వీరితో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

Srikakulam

2022-12-06 13:59:27

భూగర్భజల నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి

అక్విఫెర్ మ్యాపింగ్ అనేది భూగర్భ, భూభౌతిక, జలసంబంధమైన అంశమని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం జిల్లాస్థాయి భూగర్భ జలాల సమన్వయ  కమిటీ సమావేశం నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జల శాస్త్రవేత్త రవికుమార్ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భూగర్భ జలాల లభ్యత స్థితిగతులను ఆయన సమీక్షిం చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్విపైర్ మ్యాపింగ్ అనేది భూగర్భ జల సంబంధమైన రసాయన క్షేత్ర ప్రయోగశాల విశ్లేషణల కలయికతో జలాశయాలలో భూగర్భ జలాల పరిమాణం, నాణ్యత మరియు స్థిరత్వాన్ని వర్గీకరించడానికి వర్తించే ప్రక్రియ అని తెలిపారు. వివిధ హైడ్రోజి యోలాజికల్ సెట్టింగ్‌లలో అక్విఫర్ మ్యాపింగ్ ద్వారా భూగర్భ జలాల యొక్క ఖచ్చితమైన మరియు సమగ్రమైన సూక్ష్మ-స్థాయి చిత్రం ఈ సాధారణ-పూల్ వనరుకోసం తగిన స్థాయిలో బలమైన భూగర్భజల నిర్వహణ ప్రణాళికలను రూపొందించడానికి వాటి అమలుకు అనుమతిస్తుందన్నారు. 

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి భద్రత, మెరుగైన నీటిపారుదల సౌకర్యం మరియు నీటి వనరుల అభివృద్ధిలో స్థిరత్వాన్ని సాధిం చడంలో ఎంత గానో సహాయ పడుతుందన్నారు సంఘం భాగస్వామ్యంనోడల్ అధికారులు అక్విఫెర్ మ్యాప్‌ల తయారీలో పూర్తిగా పాల్గొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మరియు మద్దతుతో  జలాశయ నిర్వహణ ప్రణాళికలను అభివృద్ధి చేయా లన్నారు  ఆక్విఫర్ మ్యాపింగ్ వ్యాయామం యొక్క లక్ష్యాలు  ప్రయో జనాల గురించి శాస్త్రవేత్త రవికు మార్ విశదీకరించారు ఈ అంశాలపై సమాజానికి అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజల ద్వారా వారి క్రియాశీల భాగస్వామ్యం ప్రాజెక్ట్ అమలులో ప్రాథమికంగా ఉండా లని ,స్థానిక విద్యావంతులలో కొందరిని గుర్తించి, భూగర్భ జలాలు, ఆక్విఫర్ మ్యాపింగ్ యొక్క ఔచిత్యం , భాగస్వామ్య నిర్వహ ణపై ప్రాథమిక శిక్షణను ఇవ్వాలన్నారు. 

జిల్లాలో ఎక్కడ ఉప్పునీరు ఎక్కడ మంచి నీరు లభ్యత ఉందో ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా సులభంగా గుర్తించవచ్చునన్నారు. కార్యక్రమం అమలుకై  భూగర్భ జలాలు, నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, అడవులు మొదలైన సంబంధిత శాఖల ప్రతినిధులతో జిల్లా ప్రభుత్వ భూగర్భ జలాల అధికారులు సమన్వయ కమిటీ లుగా ఉంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు,భూగర్భ జల శాఖ డిడి రాధాకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ సూప ర్టెండెంట్ ఇంజనీర్, ఎన్ వి కృష్ణా రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ పిడి శివశంకర్ ప్రసాద్, జెడి మత్స్య శాఖ షేక్ లాల్ మహమ్మద్, డిఎఫ్ఓ ఎంవి ప్రసాద్ రావు కమిటీ సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-12-06 11:47:16

ఆక్వాకల్చర్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి చెందాలి, కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై తో రిజిష్టర్ కానివి తొలగించవచ్చు అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ, శ్రీకాకుళం, టెక్కలి మరియు పలాస డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో మత్స్య శాఖ, అటవీశాఖ, రెవెన్యూ , ఇరిగేషన్, వ్యవసాయ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జాతీయ హరిత  ట్రిబునల్  స్పెషల్ బెంచ్, చెన్నై వారి యొక్క ఆదేశములు మేరకు జిల్లా లోని  అనుమతి లేకుండా 1401 ఎకరాలు రొయ్యలు సాగు చేస్తున్న 464 మంది  రైతులను గుర్తించడమైనది. సదరు రైతులకు  కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై రూల్స్ ప్రకారం క్రమబద్దీకరణ చేయుటకు గల అవకాశాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలకు జిల్లా కలెక్టర్ ఆదేశించడమైనది.

జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జిల్లాలో  2953 ఎకరాలు  ఆక్వాకల్చర్ జరుగుతుందని. అందులో  1552 ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయని,  1401 ఎకారాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఆక్వాకల్చర్ నిర్వహిస్తున్నారని, సంబంధిత మండల తహశీల్దార్లు 1401 ఎకరాలకు సంబంధించిన నివేదికలు అందజేయాలి అన్నారు. ఆక్వాకల్చర్ చేస్తున్నావారికి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయాల్సింది, లేని వాటిని రద్దు చేయాలన్నారు. ఇది మంచి అవకాశం. జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచాల్సి ఉందని అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్వాకల్చర్ కు సంబంధించిన వివరాలు తెలియజేసారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ ఉన్న వారికి మాత్రమే రాయితీలు వర్తిస్తాయని అందుకే రిజిస్ట్రేషన్ తప్పక కలిగి ఉండాలన్నారు. 5 హెక్టార్లు కన్నా తక్కువ విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను డివిజినల్ స్థాయి కమిటీ ఛైర్మన్ గారైన రెవెన్యూ డివిజినల్ అధికారి వారి ఆమోదంతో కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి నేరుగా పంపవచ్చును 5 హెక్టార్లు కన్నాపై బడి విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను మాత్రం జిల్లా కలెక్టర్ , జిల్లా స్థాయి కమిటీద్వారా కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి పంపడమగునని తెలిపినారు.

ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జి. హారిక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, డి.ఆర్.డి.ఎ ప్రోజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి సితారాముర్తి, మండల రెవెన్యూ అధికారులు,  మత్స్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

Srikakulam

2022-12-06 11:15:32

తుఫాను కేంద్రాలకు మరమ్మతులు చేపట్టాలి..

తుఫాను కేంద్రాల మరమ్మతులు పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సంబంబంధిత అధికారులను ఆదేశించారు.  జిల్లాలోని తుఫాను కేంద్రాల మరమ్మతులు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కేంద్రాల మెంటెనెన్స్ లను పరిశీలించాలని, ఇందుకు కొంత నిధులను కేటాయించడమైనదని,  సమస్యలు ఏమైనా ఉంటే తహసీల్దార్లు గుర్తించాలని ఆదేశించారు.  కార్పస్ ఫండ్ గా ఒక్కో తుఫాను కేంద్రానికి నిధులు మంజూరు చేయడమైనదని డిఆర్డిఎ పిడి విద్యాసాగర్ వివరించారు. తుఫాను కేంద్రాలు, తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఎక్వూప్ మెంట్, సైరన్లు చూడాలని కలెక్టర్ చెప్పారు. 

నిధులు అవసరమైతే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మండలాల్లో అత్యవసర కేంద్రాలు ఉన్నాయని, సైరన్ లు కేటాయించడమైనదని, మరమ్మతులు ఉంటే గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. తహసీల్దార్లు కోస్టల్ మండలాలపై దృష్టి సారించాలని చెప్పారు. తుఫాను కేంద్రాలకు అవసరమైతే అదనపు నిధులు పంచాయతీ రాజ్ ఇంజనీర్లుతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, సిపిఒ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

 

Srikakulam

2022-12-06 11:11:30

ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేది ఆఖరు

ఓటరు తిరస్కరణకు గల కారణాలను అప్లోడ్ చేసి ఓటరుకు తెలియజేయాలని ఓటరు నమోదుపరిశీలకులు ఎ.బాబు తెలిపారు.  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి  ఓటరు నమోదు అధికారులుసహాయ ఓటరు నమోదు అధికారులువివిద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయ అధికారులను బూత్ స్థాయి అధికారులుపోలింగ్ కేంద్రాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయి అధికారులువిఆర్ఓలు మంచి సామర్థ్యం గల యువత ఉన్నారనిఅలాంటి వారిని వినియోగించుకొని శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. అర్హత గల వారని నమోదు చేయడంఅనర్హత గల వారిని తొలగించడం వంటి ప్రోసెస్ గూర్చి తెలియజేయాలన్నారు. మండలాల వారీగా సచివాలయాల సిబ్బంది ఎంత మంది ఉన్నదీ తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.


డూప్లికేట్లను తొలగించడంఇంట్లో కూర్చుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. డూప్లికేట్ అంటే డబుల్ ఎంట్రీవయసు తక్కువ ఉండటం వంటి వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓటరు నమోదుతొలగింపు వంటి వాటిపై సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తనకు తెలియజేయాలని 9441412121,

ababu@ias.nic.in చెప్పారు.   బూత్ స్థాయి అధికారులు అర్హతగల  ఓటరు నమోదు కొరకు ఇంటింటికీ ప్రచారం నిర్వహించాలనిఫారం 1 నుంచి 8 వరకు ఫారాలు దగ్గరే ఉంచుకోవాలన్నారు.   ఒకే వ్యక్తి ఫొటోతో రెండు  లేదా అంతకంటే ఎక్కువ ఓటరు నమోదు జరిగినట్లయిటే అటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి  ఓటరు అంగీకారంతో ఒకటి ఉంచి మిగతా వాటిని రద్దు చేయాలన్నారు. 


బూత్ స్థాయి నుండే ఓటర్లు నమోదు గూర్చి తహసీల్దార్లుబూత్ స్థాయి అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. 18-19 వయసు వారిపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా పరిశీలించాలని పేర్కొన్నారు.  ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మెటీరియల్ ను వినియోగించు కోవాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుఓటరు జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తులు పెట్టుకోవాలని తెలపాలన్నారు.  ఓటరు నమోదు పై గ్రామ సచివాలయాల ద్వారా తెలియజేయాలని పరిశీలకులు సూచించారు. బిఎల్ఓ స్థాయిలో సమావేశాలు జరగాలనిమండల స్థాయిలో సహాయ ఓటరు నమోదు అధికారులు ఓటరు నమోదుపై సమీక్షలు జరగాలన్నారు. చేర్పులుమార్పులుతొలగింపులకు గలు కారణాలు తెలిపేది అప్ లోడ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ కు కింద స్థాయి అధికారులే ప్రభుత్వానికి స్తంబాల్లాంటి వారని కొనియాడారు. ఓటరు నమోదుకు ఈ నెల 8వ తేదీ ఆఖరనిఅర్హత గల ఓటర్లనుఓటర్లుగా నమోదు చేయించుకోవాలని చెప్పారు.


         జిల్లా కలెక్టర్జిల్లా ఓటరు నమోదు అధికారి శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు గూర్చి తెలియజేసిజిల్లా నుండి పాలకొండరాజాం నియోజకవర్గాలు పార్వతీపురం మన్యంవిజయనగరం జిల్లాల్లో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో ఓటర్లు నమోదుమైగ్రేషన్ ఓటర్లుకొత్తగా నమోదు అవుతున్న ఓటర్లుతదితర వాటి గూర్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓటరు నమోదు పరిశీలకులకు వివరించారు. గ్రామాల్లో టంటం వేయించి తెలియజేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు నమోదుపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ఇటీవల నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 18-19 వయసు గల వారి నుండి 20 వేల దరఖాస్తులను ఓటరు నమోదుకు స్వీకరించినట్లు వివరించారు. 


     టిడిపి ఉపాధ్యక్షులు పిఎంజె బాబు మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదు కార్యక్రమల్లో పాల్గొంటున్నారని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధారాలు అందజేస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తొలగింపులువలసలుతదితర సమస్యలుపై మాట్లాడారు. ప్రతీ తొలగింపునకు కారణాలను అప్లోడ్ చేయాలని పరిశీలకులు ఎ. బాబు ఆదేశించారు.   సిపిఎం పార్టీ నుండి కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో 18-19 వయసు గల యువత ఉన్నారని ఓటర్లు నమోదుకు విఆర్ఓను పంపాలని కోరారు. ఓటరు నమోదుపై వాలంటీర్లు పాత్ర గూర్చి తెలపగా ఏ బూత్ లో ఉన్నారో ఆధారాలు అందజేస్తే సంబంధిత విఆర్ఓపై తక్షణ చర్యలు  తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బిజెపి నుండి రవి బాబ్జీ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కు ఇంత వరకు ఎవరూ రాలేదని చెప్పగా పోలింగ్ స్టేషన్ల వారీగా పార్టీలకు సంబంధించి జాబితా రాజకీయ పార్టీల ప్రతినిధుల జాబితూ అందజేస్తే ఆ జాబితాలను బిఎల్ఓలకు అందజేస్తామని కలెక్టర్ వివరించారు. బిజెపి నుండి బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బిఎల్ఎబిఎల్ఓలకు వర్క్ షాప్ నిర్వహించాలని కోరారు.


వైయస్ఆర్ సిపి రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్లు ఓటరు నమోదుపై అవగాహన పరుస్తున్నారని తప్ప ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన లేదని చెప్పగా ఓటరు నమోదు పై వాలంటీర్లు ఏ విధమైన పాత్ర ఉండకూడదని ఓటరు నమోదు పరిశీలకులు ఎ. బాబు చెప్పారు.

     ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డిఓటరు నమోదు అధికారులు ఎ. రాజేశ్వరిజి. జయదేవిసీతారామమూర్తిబి. శాంతివెంకటరామన్,  ఎ.ఇ.ఆర్.ఓ లువివిద రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజె బాబుసిపిఐ పార్టీ నుండి బాబ్జీవై.యస్ఆర్ సిపి నుండి రామకృష్ణబిజెపి నుండి ఉమామహేశ్వరరావురవి బాబ్జీతదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-06 11:04:00

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు కీలకం..

పోలీసు శాఖలో హోంగార్డుల విధులు చాల కీలకమని,జిల్లా హోమ్ గార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక పేర్కొన్నారు. మంగళవారం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో నిర్వహించిన 60వ హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమెండేర్ హోమ్ గార్డు శసికుమార్ ఎస్పీనకు గౌరవ వందనం సమర్పించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శాంతికి చిహ్నంగా పావురాలును గాలిలోకి విడిచిపెట్టారు. హోమ్ గార్డుల  ప్లేటునులు నిర్వహించిన పరేడును ఎస్పీ తిలకించారు.ఈ  సందర్భంగా ఎస్పీ హోమ్ గార్డులనుద్దేశించి మాట్లాడుతూదేశంలో చైనా దేశం తో యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేయుటకు హోంగార్డు అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో హోంగార్డులు సేవలు అందిస్తున్నారు తెలిపారు. జిల్లాలో 1965లో హోమ్ గార్డ్ వ్యవస్థ ప్రారంభమై నేటికి 739 హోంగార్డులలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

హోమ్ గార్డుల సంక్షేమం దృష్ట్యా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమ్ గార్డ్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియా లేరు వారికిచ్చే గౌరవ వేతనం తక్కువ అయినప్పటికీ పోలీసు సిబ్బందితోపాటు సరిసమానంగా విధులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పకృతి వైపరీత్యాల్లోనూ, శాంతభద్రతలు పరిరక్షణలో, రాత్రి గస్తీలతో పాటు వివిధ విఐపిల బందోబస్తు విధులులో  సమయపాలనతో విధులు నిర్వర్తించి మన్నాలను పొందుతున్నారుని కొనియాడారు.హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం నకు చాల ప్రాముఖ్యత ఉందిని కావున ప్రతి ఒక్కరూ బాద్యత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జెడి వి.ఎన్.మణికంఠ అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వరరావు,  డీఎస్పీలు ఎస్ బాలరాజు,జి. శ్రీనివాసరావు,సిహెచ్ ప్రసాద్ రావు, ఆర్ఐలు ప్రేదిపు,ఉమా మహేశ్వరరావు,హోమ్ గార్డులు,తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-06 11:00:26

పర్యాటక జిల్లా వాణిజ్య నమోదు తప్పనిసరి

శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార సంస్థలు జిల్లా పర్యాటక శాఖ వాణిజ్యంలో నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్. నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యాటక శాఖ కమీషనరు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటు వంటి హెూటల్స్, రిసార్ట్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, హెూమ్ లు, ఫార్మ్ స్టేలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ బోట్ ఆపరేటర్స్, అడ్వెంచర్ గేమ్స్ ఆపరేటర్స్, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్, ఎంఐసిఐ కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, సర్వీస్ అపార్ట్మెంట్లకు టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. పర్యాటక వాణిజ్యంలో నమోదు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాతి నిధి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ నమోదు ప్రక్రియ ఆన్లైన్ లో www.atourism.gov.in వెబ్ సైట్ ద్వారా చేయాలని చెప్పారు. నమోదుకు సంబంధించిన దరఖాస్తులు, ఫీజు వివరాలు వెబ్ సైట్ లో లభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు నమోదు, ఇతర సందేహాలకు 6309942033 నంబరుకు ఫోన్ లో సంప్రదించ వచ్చని సూచించారు.

Srikakulam

2022-12-05 11:50:00

స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 పై సమావేశం ఏర్పాటు

ప్రత్యేక సారాంశ సవరణపై నేడు సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 కొరకు రోల్ అబ్జర్వర్ గా రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ఎపి అమూల్ ప్రత్యేక అధికారి శ్రీ అహ్మద్ బాబుని  నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.  ఈ సమావేశంలో అబ్జర్వర్ పాల్గొంటారనిఈ నెల 6వ తేదీన ఉదయం 9.30 గం.ల నుండి ఉ.11.00 గం.ల  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్లమెంటు సభ్యులుశాసన సభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇఆర్ఓలతో ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంనకు ప్రజా ప్రతినిదులుఅధికారులు హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Srikakulam

2022-12-05 11:47:41

స్టాఫ్ నర్సులకు వెంటనే సర్వీస్ సర్టిఫికేట్లు ఇవ్వాలి

విజయనగరం జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులుగా చేస్తున్న వారికి తక్షణమే సర్వీస్ సర్టిఫికేట్ లు జారీ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల ను ఆదేశించారు. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్న కారణంగా సోమవారం లోగా అందరికీ సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని చెప్పారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ఉద్యోగి ఒకరు సర్టిఫికేట్ లు నిరాకరించడంతో పాటు తమ పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే మంత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. పద్మలీల తో ఫోన్ లో మాట్లాడి సర్టిఫికేట్ ల జారీతో పాటు మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన శాఖ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Vizianagaram

2022-12-03 14:08:49

ప్రణాళికా బద్దంగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలి

 తప్పులులేని ఓటర్ల జాబితా తయారు చేసేందుకు  ప్రణాళిక రూపొందించుకోవాలని ఓటర్ నమోదు పరిశీలన అధికారి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరి బాబు అన్నారు.  శనివారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం స్పందన  సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి  తోకలిసి ఎం వి శేషగిరిబాబు ఎలక్ట్రోరల్  రోల్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్వచ్ఛమైన ఓటర్లు జాబితా రూపొందించేందుకు స్వీప్ యాక్టివిటీ ఎక్కువగా చేయాలని ఆయన సూచించారు.  క్లైములు ఎంక్వయిరీ చేసేటప్పుడు ఖచ్చితమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రికార్డు మైంటైన్ చేయాలని ఆయన  అన్నారు . గరుడ యాప్ గురించి బిఎల్ఓ లకు శిక్షణ ఇవ్వాలని ,  డేటా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆయన అన్నారు.  తప్పుల  లేని ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వోలు   పనిచేయాలని ఎం వి శేష గిరి బాబు సూచించారు .

    జిల్లా కలెక్టరు   ప్రశాంతి మాట్లాడుతూ  ఓటర్ల జాబితాలో చేర్పులు ,మార్పులు ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరు అన్నారు ఒకే ఓటర్ రెండు సార్లు నమోదు కాకుండా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  ప్రతి పోలింగ్ స్టేషన్లో  డిసెంబర్ 4  తేదీన ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణ కు ప్రత్యేక క్యాంపు నిర్వహించలన్నారు. క్యాంపు నిర్వహణ తేదీల్లో బిఎల్ఓలు  పొలిటికల్ పార్టీలు నియమించిన ఏజెంట్లతో పాటు ఓటర్ లిస్టులతో సిద్ధంగా ఉండాలన్నారు.  ఓటు నమోదుకు దరఖాస్తు స్వీకరణతో పాటు, ఓటరుకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి సూచించారు.

ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా  భీమవరం ఆర్డీవో  దాసి రాజు,  తణుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి Z. వెంకటేశ్వరరావు , తాడేపల్లిగూడెం హార్టికల్చర్ ఏ డి ఎ.దుర్గేష్, ఆచంట  జిల్లా పరిశ్రమల శాఖ  జి ఎం  వి.ఆదిశేషు,  ఉండి జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. రవి కుమార్ , పాలకొల్లు చేనేత జౌలి శాఖ ఏ డి అప్పారావు,బిజెపి పార్టీ కోమటి. రవి కుమార్,కాంగ్రెసు పార్టీ యం. శేఖర్, వైయస్సార్ పార్టీ కామన. నాగేశ్వర రావు, టిడి పి పార్టీ యం. శ్యాంబాబు, సి పి ఐ పార్టీ కే. భీమారావు, సి పి యం పా ర్టీ జె యన్ వి గోపాలం, పురపాలక సంఘం కమిషనర్లు, తది తరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-12-03 13:35:33

జిల్లాలో ప్ర‌ణాళికాయుతంగా స‌మ‌గ్ర భూ స‌ర్వే

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నియ‌మించిన రీస‌ర్వే డిప్యూటీ త‌హ‌సీల్దార్లు ప్ర‌తిష్టాత్మ‌క స‌మ‌గ్ర భూస‌ర్వే కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేసేందుకు, మ‌రింత ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించేందుకు కృషిచేయాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ఆదేశించారు. శ‌నివారం కాకినాడ క‌లెక్ట‌రేట్ విధాన‌గౌత‌మి స‌మావేశ మందిరంలో కాకినాడ డివిజ‌న్ ప‌రిధిలోని త‌హ‌సీల్దార్లు, డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, రీ స‌ర్వే డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, వీఆర్‌వోల‌కు జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు, భూస‌ర్వే శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ, స‌ర్వే ఏడీ బి.ల‌క్ష్మీనారాయ‌ణ‌ల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ మొద‌టి ద‌శ‌లో కాకినాడ డివిజ‌న్ ప‌రిధిలో తొలి ద‌శ‌లో 121 గ్రామాల‌కు సంబంధించి స‌మ‌గ్ర భూస‌ర్వే రికార్డుల రూప‌క‌ల్ప‌న‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన రెవెన్యూ, స‌ర్వే అధికారుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు. బృంద స్ఫూర్తితో, నిబ‌ద్ధ‌త‌తో క‌ష్ట‌ప‌డి అధికారులు ప‌నిచేశార‌న్నారు. ఇదే స్ఫూర్తితో ఇక‌పైనా ప‌నిచేసి రీస‌ర్వే ప్ర‌క్రియ‌ను ముందుకు తీసుకెళ్లాల‌న్నారు. రీ స‌ర్వే కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా నియ‌మించిన డిప్యూటీ త‌హ‌సీల్దార్లు నెల‌లో 15 రోజులు క్షేత్ర‌స్థాయిలో గ్రామాల్లో ప‌ర్య‌టించాల‌న్నారు.

 అప్పీళ్ల‌ను స్వీక‌రించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు కృషిచేయాల‌న్నారు. ఇక‌పై ప్ర‌తి నెల‌లో మొద‌టి వారం శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నామ‌ని.. వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, కొత్త అంశాల‌పై అవ‌గాహ‌న పెంపొందించేందుకు ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు దోహ‌దం చేస్తాయ‌న్నారు. భూ హ‌క్కు ప‌త్రాల పంపిణీ ప్ర‌క్రియకు సంబంధించి డిసెంబ‌ర్ 6న మొద‌టి కార్య‌క్ర‌మం పిఠాపురంలో జ‌ర‌గ‌నుంద‌ని.. త‌ర్వాత గ్రామాల వారీగా పంపిణీ జ‌రుగుతుంద‌న్నారు. ప‌త్రాల పంపిణీ పూర్త‌యిన చోట స్టోన్ ప్లాంటేష‌న్‌కు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సూచించారు. స‌ర్వేకు ముందు, స‌ర్వే స‌మ‌యంలో, ఆ త‌ర్వాత ప్ర‌తి ద‌శ‌లోనూ అధికారులు అప్ర‌మ‌త్తంగా, స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. రైతుల నుంచి ఏ ఫిర్యాదు అందినా క్షుణ్నంగా ప‌రిశీలించి, ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా సూచించారు. స‌మావేశంలో కాకినాడ డివిజ‌న్‌లోని త‌హ‌సీల్దార్లు, డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, రీస‌ర్వే డిప్యూటీ త‌హ‌సీల్దార్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Kakinada

2022-12-03 13:20:51

సచివాలయాల సేవలు వినియోగించుకోవాలి

సచివాలయ  సేవలను  ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలని  నోడల్ అధికారి కె.రామచంద్ర రావు అన్నారు.  గ్రామ వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి. చిట్టిబాబు ఆధ్వర్యంలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్, వార్డ్ విద్యా, డేటా ప్రోసెసింగ్ కార్యదర్సులకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమాన్ని శని వారం నిర్వహించారు. ఈ  సందర్బంగా రామ చంద్ర రావు మాట్లాడుతూ సచివాలయాలు అందిస్తున్న సేవలపై ప్రజలకు  అవగాహన  పెంపొందించుటకు  కృషి చేయాలని తెలిపారు. సచివాలయంలో సేవలు పొందేవారి సంఖ్య పెరగాలని, సిబ్బంది అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావలని అన్నారు. రికార్డులు కచ్చితంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో  నిర్వహిస్తున్న విస్తృత  సేవలపై ప్రజలకు వాలంటీర్  ద్వారా అవగాహన పెంపొందించాలని తెలిపారు. జిల్లా కలెక్టరు  నిశాంత్ కుమార్ కు సచివాలయ వ్యవస్థపై నమ్మకం ఉందని, నమ్మకాన్ని నిలుపుకొనే విధంగా  సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు  అందించాలన్నారు.

సచివాలయంలో ఉన్న ఉద్యోగులు సమన్వయంతో  పనిచేయాలన్నారు. ఇ - సర్వీస్ లో బిల్స్ పెండింగ్ లో ఉండరాదని, పెండింగ్ లో ఉన్నయడల వెంటనే  చెల్లించాలన్నారు. త్వరలోనే  నోడల్ అధికారులను  నియమిస్తామని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఏ డి సి ప్రహలాద్,  యస్ బి సి సి డి సి  శ్రీను, ఏపీ ఆన్లైన్ డి సి రాజేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-03 12:51:00

కాకినాడ కలెక్టర్ వినూత్న ప్రయోగం..స్పందన ఎక్కడంటే

ఒక జిల్లా కలెక్టర్ మనసు పెడితే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, సంక్షేమ కార్యక్రమాలు తీరు ప్రజల్లో చాలా చక్కగా వుంటుంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గ్రామస్థాయిలో సచివాలయాల్లో సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. దీనితో స్పందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పందన కార్యక్రమాన్ని మండల 
కేంద్రాల్లో నిర్వహించడం ద్వారా దానిని పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఈ సోమవారం స్పందన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో వారం ఒక్కో మండలంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసినట్టు ఉండటంతోపాటు, స్పందనపై ప్రజల్లో పూర్తిస్థాయి 
చైతన్యం తీసుకురావాలని కూడా నిర్ణయించారు.

మండలాల్లో స్పందన పెట్టేది ఇందుకే..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు 14వేల 5 ఉన్నాయి. నిజంగా ప్రతీరోజూ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కాకపోయినా వారానికి ఒకరోజు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన అర్జీలు తగ్గాలి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా ఇంకా నేటికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతీసోమవారం స్పందన అర్జీలు వందల సంఖ్యలో 
వస్తున్నాయి..ఇదేదో ఈఎన్ఎస్ చెబుతున్నమాట కాదు స్పందన దరఖాస్తుల సంఖ్యను ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్లు మీడియా ముఖంగా ప్రకటిస్తున్న సంఖ్యలు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో స్పందనను ఏర్పాటు చేశారు. అయినా సచివాలయాల్లో మార్పురాలేదు. గ్రామస్థాయిలోనే స్పందన పూర్తిస్థాయిలో జరగాలంటే మండల స్థాయిలో స్పందన పెడితే తప్పా ఫలితం రాదని భావించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పందనను మండల కార్యాలయాలకు మళ్లించారు.

ఇక సచివాలయ సిబ్బంది కాకమ్మ కబుర్లు చెల్లవు..
కాకినాడ జిల్లాలో జిల్లా కలెక్టర్ మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా స్పందన కార్యక్రమం పెట్టి తీరాలి. లేదంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు కానట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికే పలు మార్లు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు  జారీచేసినప్పటికీ మార్పురాకపోవడంతో అధికారికంగా జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తలచారు. దీనితో సచివాలయ సిబ్బంది కాకమ్మ కబుర్లు, కల్లబొల్లి మాటలు చెప్పడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అంతేకాదు..ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన యూనిఫారంను కూడా ధరించుకు రావాల్సి వుంటుంది. ప్రభుత్వం మంచిగా చెప్పినంతకాలం వినని ప్రభుత్వ సిబ్బంది..జిల్లాల్లో కలెక్టర్లు ఈ తరహా నిర్ణయిం తీసుకుంటే..,అసలు మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న మండల అధికారుల్లో కూడా చలనం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.. చూడాలి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మండల స్థాయిలో నిర్వహించే స్పందన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ తరహా మార్పు తీసుకువచ్చి..ప్రతీసోమవారం నిర్వహించే స్పందనకు అర్జీల సంఖ్యను ఎంతమేరకు తగ్గిస్తుందో..!

Kakinada

2022-12-03 12:22:48

దివ్యంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి

సమాజంలో జీవిస్తున్న అందరూ సమానమేనని,మీరు దివ్యంగులు కాదు సకలాంగులని శ్రీకాకుళం జిల్లా విభిన్నప్రతిబావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు ఎం.కిరణ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు, లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్, లయన్స్ ప్రతినిధులు సౌజన్యంతో సేకరించిన నగదు, వస్తువులు ఆరుగురు నిరుపేద వికలాంగులకు అందజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపిక చేసిన విభిన్న ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారు. అనంతరం సహాయ సంచాలకులు కిరణ్ కుమార్  మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు, రుణాలు  ఈ రోజు  అందజేస్తున్నామని అన్నారు. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి  స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసి  ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల  భర్తీ ఇటీవల చేపట్టామని అన్నారు. అర్హులైన వికలాంగులకు లాప్ టాప్స్, టచ్ ఫోన్లు, చంక కర్రలు, శ్రవణ యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, అంధుల చేతికర్రలు సరఫరా చేస్తున్నామని అన్నారు. 

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే పనులు చేపట్టిన వాకర్స్ సంస్థలు, లయన్స్ క్లబ్ సేవలు మరువరానివని కిరణ్ కొనియాడారు. స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు హరికా ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా, లయన్స్ క్లబ్ మాజీ చైర్మన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, ఇంటాక్ కో కన్వీనర్ వావిలపల్లి జగన్నాధ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు బి.వి.రవిశంకర్, బి.దేవీప్రసాద్, గజల్స్ వాసుదేవ్, గోలీ సంతోష్, నల్లబాటి కృష్ణమూర్తి, బొడ్డేపల్లి ప్రసాదరావు, మోనంగి రవి, వూన్న నాగభూషన్ రావు, డాక్టర్ మాదిన ప్రసాదరావు, వంశధార రిటైర్డ్ ఎస్.ఈ.పి. రంగారావు, కిల్లారి రవి,ఎం.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-03 11:17:37