1 ENS Live Breaking News

దివ్యంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి

సమాజంలో జీవిస్తున్న అందరూ సమానమేనని,మీరు దివ్యంగులు కాదు సకలాంగులని శ్రీకాకుళం జిల్లా విభిన్నప్రతిబావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు ఎం.కిరణ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు, లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్, లయన్స్ ప్రతినిధులు సౌజన్యంతో సేకరించిన నగదు, వస్తువులు ఆరుగురు నిరుపేద వికలాంగులకు అందజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపిక చేసిన విభిన్న ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారు. అనంతరం సహాయ సంచాలకులు కిరణ్ కుమార్  మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు, రుణాలు  ఈ రోజు  అందజేస్తున్నామని అన్నారు. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి  స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసి  ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల  భర్తీ ఇటీవల చేపట్టామని అన్నారు. అర్హులైన వికలాంగులకు లాప్ టాప్స్, టచ్ ఫోన్లు, చంక కర్రలు, శ్రవణ యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, అంధుల చేతికర్రలు సరఫరా చేస్తున్నామని అన్నారు. 

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే పనులు చేపట్టిన వాకర్స్ సంస్థలు, లయన్స్ క్లబ్ సేవలు మరువరానివని కిరణ్ కొనియాడారు. స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు హరికా ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా, లయన్స్ క్లబ్ మాజీ చైర్మన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, ఇంటాక్ కో కన్వీనర్ వావిలపల్లి జగన్నాధ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు బి.వి.రవిశంకర్, బి.దేవీప్రసాద్, గజల్స్ వాసుదేవ్, గోలీ సంతోష్, నల్లబాటి కృష్ణమూర్తి, బొడ్డేపల్లి ప్రసాదరావు, మోనంగి రవి, వూన్న నాగభూషన్ రావు, డాక్టర్ మాదిన ప్రసాదరావు, వంశధార రిటైర్డ్ ఎస్.ఈ.పి. రంగారావు, కిల్లారి రవి,ఎం.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-03 11:17:37

సారికలో ఈనెల 7 న ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ

పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద  విజయనగరం నియోజకవర్గం లో  2 వ విడత ఇళ్ళ స్థలాల  పట్టాల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి  తెలిపారు.   ఈ నెల 7న విజయనగరం నియోజకవర్గం పరిదిలోనున్న సారిక లో పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్ల పై డిప్యూటీ స్పీకర్  మేయర్ విజయలక్ష్మి తో కలసి శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ సూర్య కళ,  మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు తో సమీక్షించారు. సారిక లే అవుట్ నందు 3569  ఇళ్ళ స్థలాలను గుర్తించడం జరిగిందని, వాటిలో 47 వార్డులకు సంబంధించిన  3455 మంది  అర్హులైన లబ్దిదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు.  ఈ నెల 7 న వారందరికీ పట్టాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్, రెవిన్యూ శాఖల వారు సమన్వయంగా పని చేసి  విజయవంతం చేయాలనీ  సూచించారు. వార్డ్ వారీగా లబ్దిదారుల జాబితాలను కార్పొరేటర్లకు అందజేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.

 సచివాలయం ద్వారా లబ్ది దారుల వెరిఫికేషన్ జరగాలని, ఇచ్చిన అడ్రస్ నందు లబ్ది దారు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలనీ తెలిపారు.  లబ్దిదారులందరినీ  వార్డ్ కౌన్సిలర్లు సచివాలయాల సిబ్బంది ద్వారా ఆహ్వానించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి  3 వేల మంది పైబడి  హాజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. మున్సిఅల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు ఏర్పాట్ల పై వివరించారు. 4 బ్లాక్ లుగా ఏర్పాటు చేసి లబ్ది దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టాలు ఇచ్చేందుకు  సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే పట్టాలను తయారు చేయడం జరిగిందని తెలిపారు.   అదే విధంగా  90 రోజుల ఇళ్ళ పట్టాలన్నీ మజూరు చేయడం జరిగిందని, ఎలాంటి పెండింగ్  లేదని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఈ. రేవతీ దేవి, కార్పొరేటర్లు, విజయనగరం ఎం.పి.పి  మామిడి అప్పల నాయుడు,  తహసిల్దార్ బంగార్రాజు,  హౌసింగ్ డి.ఈ , ఎ.ఈ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-12-02 11:38:36

VJF ఎన్నికల్లో విజయంకోసం ప్రత్యర్ధుల మాస్టర్ ప్లాన్

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెస్ క్లబ్. ఈప్రెస్ క్లబ్ లో అధ్యక్ష, కార్యదర్శిల దగ్గర నుంచి సభ్యుల వరకూ అందరికీ ప్రత్యేక గౌరవం, గుర్తింపు వుంటుంది. ఇందులో చాలా మంది వర్కింగ్ జర్నలిస్టులు కాకపోయినా కమిటీలో ఉన్నారు గనుక అలా చెల్లిపోతూ కాలంగడిపేస్తున్నారు. అలాంటి ప్రెస్ క్లబ్ కు 2023 ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆపధర్మ కార్యవర్గం నిర్ణయించింది. ఈమేరకు విశాఖజిల్లా కలెక్టర్ కు ఈ విషయాన్ని కూడా తెలియజేసింది. ఎప్పుడైతే విజెఎఫ్ కి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారో అప్పటినుంచి ఆశావాహులు, ఇప్పటికే రింగ్ అయిపోయిన సభ్యులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అంతేకాదు విజయం కోసం పక్కాగా మాస్టర్ ప్లాన్ వేసుకొని మరీ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్టు ఏంటంటే.. ప్రత్యర్ధులు విజెఎఫ్ సభ్యులకు అర్ధమయ్యే విధంగా అసలు విషయం చెప్పే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతున్నట్టుగా కడపటి వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కుకొని అప్పనంగా పదేళ్లు ఎలాంటి ఎన్నికలూ లేకుండా పరిపాలించేసిన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన తరువాత అసలు రాజకీయం మొత్తం రసవత్తరంగా సాగడం ప్రారంభించింది..

అసలు సభ్యుల సంఖ్యపై రగడ జరిగే అవకాశం..?
విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఓటుహక్కు ఉన్న సభ్యులు సుమారు 800 మంది వరకూ ఉన్నారు. ప్రో మెంబర్లుగా వున్నారో మరో 800 వరకూ ఉన్నారు. ఆతరువాత సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు మరో 500 మంది వరకూ ఉన్నారు. అయితే కోర్టు నిబంధనల ప్రకారం ఎవరికీ కొత్త సభ్యత్వాలు ప్రెస్ క్లబ్ జారీ చేయలేదు. కానీ ప్రెస్ క్లబ్ బయిలా ప్రకారం మరణించిన, జర్నలిస్టులుగా పనిచేయడం మానేసిన వారి ఓట్లను ఎన్నికలకు వెళ్లే నాటికి కార్యవర్గం సిద్దం చేయాల్సి వుంది. గత కార్యవర్గాలు నడిచిన క్రమంలో ఇబ్బడి ముబ్బడిగా రెండు మూడు పత్రికల విలేఖరులకు విజెఎఫ్ మెంబర్ షిప్ లు ఇచ్చేశారు. అందులో చాలా మంది బదిలీలు అయిపోగా.. మరికొందరు మ్రుతిచెందగా,, ఇంకొందరు వృత్తిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. వాస్తవానికి ఇలాంటి ఓటర్లను ప్రెస్ క్లబ్ ఎన్నికలకు వెళ్లేనాటికి తొలగించి, ఆ జాబితా కోర్టుకి తెలియజేసిన తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని లేదంటే ఆ విషయాన్ని బహిర్గతం చేస్తామని ప్రత్యర్ధి వర్గాలు మాస్టర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుత కార్యవర్గం(ఆపధర్మ) ఈ పనిచేయకుండా ఎన్నకలకు వెళితే వాళ్లు దాచిపెట్టిన అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాజ్యాంగబద్దంగా పోరాడతామని కూడా హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుత సభ్యులకు, ఓట హక్కు కలిగి వున్నవారికీ చెప్పి చైతన్యం తీసుకు వస్తున్నారు.

విజయనగరం ప్రెస్ క్లబ్ పరిస్థితే వస్తుందా.. తేవడానికే ప్రయత్నమా ?
విజయనగరం జిల్లాలోని ప్రెస్ క్లబ్ కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంలో అక్కడి జిల్లా కలెక్టర్ ఆ ప్రెస్ క్లబ్ ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రెస్ క్లబ్ కలెక్టర్ అద్యక్షతన నిర్వహిస్తున్నారు. ఇపుడు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లోని అంశాలను, ప్రస్తుత కార్యవర్గం నిర్భయంగా  ఓటర్లకు, ఇతర సభ్యులకు తెలియజేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే సరేసరి అని లేదంటే జిల్లా కలెక్టర్ కు, ప్రెస్ అకాడమీకి, విజెఎఫ్  దాచిపెట్టిన అంశాలను వివరించి ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ పరం చేయిస్తామనే సంకేతాలు కూడా పంపిస్తున్నారు. వాస్తవానికి కోర్టు నిబంధనల ప్రకారం ఆపద్ధర్మ అధ్యక్షుని హోదాలోనే ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహణ జరగాలి(కోర్టులో కేసులు ఉన్నందున) . కానీ ప్రెస్ క్లబ్ మొత్తం కార్యక్రమాలు  చేపడుతుందని ఇప్పటికే కొందరు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలిసింది. నిజంగా అదే జరిగితే ప్రెస్ క్లబ్ బయిలా..కోర్టు ఆదేశాలు..ప్రెస్ క్లబ్ లోని ఓటర్లు, మృతి చెందిన వారు,  విధి నిర్వహణ నుంచి తప్పుకున్నవారి జాబితాలు ఇస్తే.. పరిశీలించి నిబంధనలు అతిక్రమించారని తెలిస్తే చర్యలు చేపడతామని కలెక్టర్ కూడా సదరు ఫిర్యాదు దారులకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

విజెఎఫ్ ఎన్నికల్లో కేస్ట్  కోటరీ పనిలో వారంతా బిజీ బిజీ..!
విశాఖలోని విజెఎఫ్ కి ఎన్నికలు నిర్వహిస్తే తమ తమ కార్యవర్గాలను గెలిపించుకోవాలని ఎవరి కోటరీల్లో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు ఈ సారి సామాజిక రంగు పులిమి మరీ కార్యక్రమాలు చేపట్టి తమ  బలా బలాలను ప్రదర్శించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో వైపు ఈసారి కొత్తవారితో కార్యవర్గం ఏర్పాటు చేయాలనే కొందరు సీనియర్లు భావిస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగా రెండు కార్యవర్గాలను కూడా  సిద్దం చేసినట్టు సమాచారం. ఎవరు ఏ విధంగా కోటరీలు చేసుకున్నా..పాత కార్యవర్గంలోని వారే మళ్లీ పోటీచేయాలని ఇప్పటికే బలంగా నిర్ణయించుకున్న తరుణంలో విజెఎఫ్ ఎన్నికల వేడిని మరింతగా పెంచుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కూడా లేని హడావిడి రాజకీయం మొత్తం ఈ  విజెఎఫ్ ఎన్నికల్లోనే ఉందా అన్నట్టుగా జరుగుతున్న కార్యక్రమాలు, చేస్తున్న ప్రచారాలు, గూడు పుఠానీలు, మాస్టర్ ప్లాన్ ను ప్రెస్ సభ్యులను, కొత్తగా ఆరాటపడేవారిని అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.

వాస్తవాలను తెలియజేసేందుకే ఈఎన్ఎస్ ప్రయత్నం..అదరం..బెదరం..
ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net వాస్తవాలను తెలియజేసే క్రమంలో తమ దృష్టికి వచ్చిన వాషయాన్ని మాత్రమే జర్నలిస్టులు, పాఠకుల ముందు ఉంచుతున్నది. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. ఏ ఒక్కరికీ కొమ్ముకాయమని కూడా ఖచ్చితంగా ప్రకటిస్తున్నాం. అసలు విజెఎఫ్ ఎన్నికలు ప్రకటించిన తరువాత తెరవెనుక ఏం  జరుగుతున్నది..ఏం జరగబోతున్నది..వాస్తవాలేంటి..అవాస్థవాలేంటి.. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు..మళ్లీ విజెఎఫ్ లో తమ సీట్లను భర్తీచేసుకునేందుకు జర్నలిస్టులు కానీ వారు ఎంత ఆరాట పడుతున్నారు..ఇప్పటి వరకూ ఏ నెపంతో పదవులు అప్పనంగా అలంకరించారు తదితర విషయాలను మాత్రమే నిర్భయంగా తెలియజేశాం. ఇకపై కూడా తెలియజేస్తాం..ఈ విషయంలో ఈఎన్ఎస్ ని ఎవరో ప్రభావితం చేస్తున్నారని అనుకున్నవారికి ఈ వార్త ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాత్రమం చెప్పగలం. విజెఎఫ్ ఎన్నికల్లో కోర్టు ఏం చెప్పింది..కార్యవర్గం ఏం చేస్తున్నది..ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నది.. ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనే అన్నివిషయాలు తెలియజేసినట్టుగానే..రానున్నరోజుల్లో కూడా వాస్తవాలు ఎవరికీ భయపడకుండా నిర్భయంగా బయటపెడతామని చెబుతున్నాం. అంతేకాకు ఎవరు ఏమనుకున్నా..పట్టించుకునేది లేదని కూడా చెబుతున్నాం. భారత దేశపు తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఈఎన్ఎస్.. ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు.. ఎవరికీ అదరదు..మరెవరికీ బెదరదు..!

Visakhapatnam

2022-12-02 11:10:40

వారంలో 22వేల హక్కు పత్రాలు పంపిణీ కావాలి

రాష్ట్రంలో జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పత్రాల జారీలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ను భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ అభినందించారు. హక్కు పత్రాల జారీ, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన రీ సర్వే, వివాద స్థలాలపై చర్యలు, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వారంలోగా మరో 22 వేల భూహక్కు- భూరక్ష పత్రాలను జారీచేయాలని ఆదేశించారు. జిల్లాలో మిగిలిన రీసర్వే పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి ఫ్లైయింగ్ పూర్తి చేయాలన్నారు. రీ సర్వే అనంతరం కొలత రాళ్లు పని పూర్తిచేయాలని వివరించారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం గొప్ప శుభ పరిణామని, ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టరును అభినందిస్తున్నట్లు తెలిపారు.

సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని, మరో వారంలో 22వేల పత్రాలు జారీచేసేందుకు చర్యలు తీసుకోవాలని 
అన్నారు. గడువులోగా మ్యుటేషన్లు,  తీసుకోవాలని, ఇప్పటివరకు పెండింగులో ఉన్నవాటిపై ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-12-02 10:05:36

పోలీసు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా  ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. శుక్రవారం "పోలీసు వెల్ఫేర్ డే" కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయంలో నిర్వహించి. పోలీసు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకూ, హోం గార్డుల నుంచి స్టేషన్ సిబ్బంది వరకూ వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. పోలీసు సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందనే భరోసాని  సిబ్బందికి కల్పించారు.  అదే సమయంలో పోలీసు స్టేషన్ కి వచ్చిన ప్రజల సమస్యలు కూడా ఇదే తరహాలో పరిష్కరించి ప్రభుత్వం నుంచి సత్వర 
న్యాయం జరిగేవిధంగా చూస్తామని ప్రకటించారు.

Vizianagaram

2022-12-02 09:56:08

ఔరా..విశాఖ తీరంలో నేవీడే రిహార్సల్స్ ..

నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తా బవుతోంది. ఆర్కే బీచ్‌లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్‌లో కొద్ది రోజులుగా ముమ్మ రంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుంటున్నారు.దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది.యుద్ధ సమ యంలో నావికాదళం ఎలా స్పంది స్తుం ది.. శత్రువులపై ఎలా ఎదురు దాడికి దిగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.

Visakhapatnam

2022-12-01 05:34:27

యానాంలో ఉ.11దాటితే ప్రాణం పోతున్నా వైద్యం చేయరు

కేంద్రపాలిత ప్రాంతం  యానంలోని ప్రజలకు ఆయుష్ శాఖ ప్రభుత్వ  హోమియోపతి ఆసుపత్రి సిబ్బంది నుంచి వింత ప్రవర్తన ఎదురౌతోంది. ఉదయం 11దాటితే కళ్లముందు ఏం జరిగినా మందులు ఇచ్చేది లేదని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం ఎలాంటి రోగి గ్రస్తులైనా ఉ.11గంటలలోపే రావాలని  ఆ తరువాత వచ్చినా వైద్యం చేయమని స్పష్టం చేస్తున్నారు. ఖాళీగానైనా ఉండొచ్చుకానీ సమయం దాటిన తరువాత వస్తే వైద్యం చేయకూడదనే నిబంధనలున్నాయని సిబ్బంది చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.  యానాం కేంద్రపాలిత ప్రాంతం కావడం ప్రభుత్వశాఖల సిబ్బంది వ్యవహారం ఇక్కడి అడ్మినిస్ట్రేటర్(యూటి ఏరియా ముఖ్య అధికారి) పెద్దగా పట్టించుకోక పోవడం వలన ఆయుష్ శాఖలో హోమియోపతి, ఆయుర్వేద వైద్యసేవలు ఇక్కడి ప్రజలకు దూరమైపోతున్నాయని ఈ ప్రాంత ప్రజలు మండి పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులున్నది ప్రజలకు వైద్యం చేయడానికా..లేదంటే ప్రత్యేక సమయం పేరుతో వైద్యసేవలు అందించకుండా ఉండేందుకా అంటూ మండి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్రమోడి ఆయుశాఖను ప్రజలకు పూర్తిస్థాయిలో చేరువ చేయాలని చూస్తుంటే యానాంలోని ప్రభుత్వ హోమియోపతి డిస్పెన్సరీ(ఆయుష్ వెల్ నెస్ కేెంద్రం) సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

Yanam

2022-11-25 08:30:28

PMMSYద్వారా మత్స్యకారులు అభివృద్ది చెందాలి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులు మరింతగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు మంగళవారం విజయనగరం జిల్లా పరిషత్ హాల్లో మత్స్యకారులకు పిఎంఎంఎస్వై 11 ద్వారా 31 మోటార్ వాహనాలు, ఐస్ బాక్సులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మత్సకారులు ఆర్ధికంగా ముందుకి సాగడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ లు  సూర్యకుమారి, నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు పాముల పుష్ప శ్రీవాణి, మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస రావు, బొత్స అప్పల నరసయ్య, అలజంగి జోగారావు, జెడ్పీటీసీ సభ్యులు, సచివాలయ మత్స్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-11-22 08:37:10

మత్స్యకారులు ఆర్ధిక ఉపాది పెంపొందించుకోవాలి..

మత్స్యకారులు తోటపల్లి రిజర్వాయర్ లో పెంచుతున్న చేపల ద్వారా ఆర్ధిక  ఉపాది పెంపొందించుకోవాలని పార్వతీపురం ఐటీడిఏ పీఓ సి.విష్ణు పేర్కొన్నారు. విజయనగరం ఫిష్ సీడ్ ఫారంలో అభివృద్ది చేసిన  2లక్షల చేప పిల్లలను ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ లోకి వేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల కోసం చేపడుతున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు..సిబ్బంది పాల్గొన్నారు.

Thotapalli

2022-11-22 02:47:23

సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్య‌కారుల‌కు ఆర్థిక చేయూత‌

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్య‌కారుల‌కు వివిధ రూపాల్లో ఆర్థిక చేయూత ల‌భిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింద‌ని గుర్తు చేశారు. వేట నిషేధ భృతి, పింఛ‌న్లు, ఆయిల్ స‌బ్పిడీ, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తోంద‌ని పేర్కొన్నారు. అలాగే ప్ర‌మాదాలు సంభ‌వించినప్పుడు అందజేసే ఆర్థిక స‌హాయాన్ని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 లక్ష‌ల‌కు పెంచింద‌ని వివ‌రించారు. సోమ‌వారం ప్ర‌పంచ మత్స్య‌కార దినోత్స‌వం సంద‌ర్భంగా న‌ర్సాపురం నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో  క‌లెక్ట‌ర్ వీసీ హాలు నుంచి ఆన్‌లైన్ ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, ఎమ్మెల్సీ సురేష్ బాబు, మ‌త్స్య శాఖ డీడీ ఎన్.నిర్మలాకుమారి, మ‌త్స్య‌కార కో-ఆప‌రేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ బి. చిన‌ప్ప‌న్న‌తో క‌లిసి పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అనంత‌రం, ఫిషరీష్ డిడి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి వివ‌రించారు. వేట నిషేధ భృతిలో భాగంగా జిల్లాలోని 2944 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ.294 లక్ష‌లు అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. 2200 మందికి ఫించన్లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులు అంద‌జేయ‌టం ద్వారా సీడ్ ఫారం నెల‌కొల్ప‌టం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామ‌ని వివ‌రించారు. మ‌త్య్స‌కారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో మ‌త్స్య కార్పోరేషన్ డైరెక్టర్ ఎం. న‌ర‌సింహులు, మ‌త్స్య‌కార సొసైటీ స‌భ్యులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-11-22 01:01:38

PMMSYద్వారా మ‌త్స్య‌ప‌రిశ్ర‌మ‌ అభివృద్దికి కృషి చేయాలి

 ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద యోజ‌న ప‌థ‌కం ద్వారా జిల్లాలో మ‌త్స్య‌ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ది చేసి, యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ ప‌థ‌కం ద్వారా జిల్లాలో మ‌త్య్స ప‌రిశ్ర‌మ వృద్దిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని సూచించారు. పిఎంఎంఎస్‌వై ప‌థ‌కం అమ‌లుపై, క‌లెక్ట‌ర్‌ త‌న ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, మత్స్యకారుల సామాజిక, ఆర్థిక స్థితగతులను మెరుగు పర్చెందుకు పిఎంఎంఎస్వై పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని అన్నారు. 2020-21, 2021-22 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి, పిఎంఎంఎస్‌వై ప‌థ‌కానికి జిల్లాలో మొత్తం 219 మంది ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సాధార‌ణ అభ్య‌ర్ధుల‌కు 40 శాతం, మ‌హిళ‌లు, ఎస్‌సి, ఎస్‌టి మ‌త్స్య‌కారుల‌కు 60 శాతం స‌బ్సిడీని ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.10.89 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.15.01 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు అనుమ‌తి మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. బ‌యోఫ్లాగ్ విధానంలో చేప‌ల పెంప‌కం, చేప పిల్ల‌ల నిల్వ కేంద్రాలు, స‌ముద్రాలు, న‌దుల్లో  కేజ్ యూనిట్ల ద్వారా చేప‌ల సాగు, ఐస్‌బాక్సుల‌తో మోటార్ సైకిళ్ల పంపిణీ, లైవ్ ఫిష్ విక్ర‌య‌కేంద్రాలు, ఫిష్ కియోస్క్ లు, చేప‌ల బ‌జార్ల ఏర్పాటు, చేప‌ల విక్ర‌య వాహ‌నాలు, మూడు చ‌క్రాల వాహ‌నాలు, చేప‌ల ప‌డ‌వ‌లు, ప‌డ‌వ‌ల‌కు జాడ తెలుసుకొనేందుకు అవసరమైన ప‌రిక‌రాల ఏర్పాటు, వివిధ ర‌కాల చేప‌ల విక్ర‌య కేంద్రాల ఏర్పాటుకు ఈ ప‌థ‌కం క్రింద ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. యూనిట్ల‌ను త్వ‌రగా ఏర్పాటు చేయించ‌డ‌మే  కాకుండా, అవి విజ‌య‌వంతంగా న‌డిచేలా అధికారులు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా న‌డుస్తున్న యూనిట్ల‌ను చూపించి, ఔత్సాహికుల‌కు స్ఫూర్తి క‌ల్గించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

                  ఈ స‌మావేశంలో మ‌త్స్య‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ ఎన్‌.నిర్మ‌లాకుమారి, జెడ్‌పి సిఇఓ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, జిల్లా వ్య‌వ‌సాయాధికారి తార‌క‌రామారావు, జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, ఎల్‌డిఎం శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-11-18 10:15:50

కన్స్యూ మర్ ప్రొటెక్షన్ కమిటీ మెంబెర్ గా హెచ్ఎస్ రామకృష్ణ

కాకినాడ జిల్లా కన్స్యూ మర్ ప్రొటెక్షన్ కమిటీ మెంబెర్ గా హెచ్ఎస్‌ రామకృష్ణ నియ మితులయ్యారు.ఈమేరకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీచేశారని సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.  ఈ కమిటీ పదవి కాలం 2025 వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగ దారుల సంఘా ల సమైక్య రాష్ట్ర జనరల్ సెక్రటరీ పనిచేస్తూ గత 24సంవత్సరాల నుంచి ఈ విని యోగందారుల చైతన్య ఉద్యమంలో రామకృష్ణ పనిచేస్తు న్నారు. ఇప్పటికి రాష్ట్రలో అజాద్‌కా అమృత్ మ హోత్సవ్లో భాగంగా 696 మండలం కేంద్రాల్లో వి నియోగదారుల రక్షణ చట్టం 2019పై పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభ పోటీలు నిర్వ హించి.. పాల్గొ న్న ప్రతివారికి పార్టిసిపేట్ సర్టిఫి కెట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం 2023 ఆగష్టు 31వరకూ కొన సాగిస్తామని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో రామకృష్ణ తెలిపారు.

Kakinada

2022-11-17 17:21:58

పుస్తక పఠనం-విజ్ఞాన భాండాగారం..డిఈఓ

పుస్తక పఠనం  విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.డి.వి.రమణ అన్నారు. గురువారం గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా  స్థానిక డి.వి.ఎం. ప్రభుత్వ మున్సిపల్ స్కూల్ లో రాష్ట్ర గ్రంధాలయ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ  గ్రంధాలయాలలో పుస్తకాలు చదివి గొప్ప స్థాయికి వెళ్లారని అన్నారు. పేదరికంలో పుట్టిన అబ్రహం లింకన్ కు ఎనిమిదో ఏటనే  అరేబియన్ నైట్స్, వెబ్  డిక్షనరీ ఇచ్చి చదవమని చెప్పిందని, అలా చదవడం మొదలు పెట్టిన లింకన్  అమెరికా అధ్యక్షుడు  అయ్యే వరకూ చదువుని ఎక్కడా అపలేదన్నారు. మనలో ఆలోచన మొదలైతే పని పూర్తి అవుతుందని, పని చేసుకుంటే  అలవాటు అవుతుందని, అలవాటే మన వ్యక్తిత్వం అవుతుందని అన్నారు. వ్యక్తిత్వం మన భవిష్యత్ నిర్ణయిస్తుందని వివరించారు. మనకు విద్య నేర్పిన గురువు ఎక్కడ కనబడిన నమస్కరించాలని, గురువు పట్ల శిష్యుడు ఎలా ఉండాలో వశిష్ఠుడు రాముడుకి  నేర్పించాడని తెలిపారు. అలానే విద్యార్థులు ప్రతీ రోజు పాఠశాలకు వచ్చే ముందు తల్లిదండ్రులకు నమస్కరించి పాఠశాలకు వస్తే మంచిదన్నారు.

అమ్మ చేతి వంట తింటే  మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు పేపర్ చదవడం వలన మేధస్సు మెరుగు పడుతుందన్నారు. చదవడం వల్ల  మానసిక ఉల్లాసంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా పెరుగుతుందన్నారు. చదవలేను అనే ఆలోచన మానేసి , పై స్థాయికి వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకుని  చదవాలని విద్యార్థులకు సూచించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావు స్ఫూర్తితో కేంద్ర స్థాయిలో పురస్కారాలు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. పాకిస్థాన్ లో ఉండే మాలాలా అనే అమ్మాయి అందరూ చదవాలనే నినదించిందని, టెర్రరిస్టులు  ఆమెని చంపాలని ప్రయత్నిస్తే, వారిని ఎదిరించి పోరాడిందని అన్నారు. ఆమె పట్టుదలకు, కృషికి ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని, విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. పేదరికం  చదువుకు అడ్డు కాదని  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని, వాటిని చేరుకోవడానికి కష్టపడాలని అన్నారు. సెల్ ఫోన్ లపై దృష్టి తగ్గించి, పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

జిల్లా గ్రంధాలయ సంఘం అధ్యక్షులు కె. శివ కేశవ రావు మాట్లాడుతూ గ్రంధాలయ ఉద్యమం 1944 నవంబర్ 14 మొట్టమొదట  చెన్నై లో ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజా గ్రంధాలయాలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనండి వాటిని నెరవేర్చుకోడానికి కృషి చేయండి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి చేరుకోవాలని సూచించారు. ఆడపిల్లలు  దైర్యం గా ఉండాలని తెలిపారు. 

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, పాఠశాల ప్రాధానోపాధ్యాయులు గోవిందరావు, జిల్లా గ్రంధాలయ సంఘం కార్యదర్శి చొక్కాపు శ్రీనివాస రావు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-17 10:36:19

భూ సమస్యలకు శాస్వత పరిష్కారం చూపించాలి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని. వైఎస్సార్ జగనన్న  భూ శాశ్వత హక్కు, భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేను ఆచరణలోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్ సిసిఎల్ ఏ కార్యాలయపు కార్యదర్శి ఇంతి యాజ్ ,సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్ అమరావతి  నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న శాశ్వత భూ హక్కు రీ సర్వే భూముల డిజిటల్ సంతకాలు సరిహద్దురాల్లు ఏర్పాటు గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ ఫైనల్ ఆర్వార్ , 13 నోటిఫికేషన్ డ్రోన్లు ,రోవర్ల వినియోగం , ముటేష న్లు ,సర్వేలో ఉత్పన్నమైన ఫిర్యా దులు పరిష్కారం తదితర అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షిం చి నిర్దేశిత లక్ష్యాలు ఏ మేరకు చేరుకున్నది అడిగి తెలుసుకున్నా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దశల వారీగా సర్వే చేపట్టి భూసమస్యలను పరిష్కరిస్తూ వివాదరహిత భూములను భావితరాలకు అందించేందుకు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నా యని వందేళ్ల క్రితం సర్వే వివరాలతో రూపొందించిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఇప్పటికీ అమలు చేస్తున్నారని.

సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా భూ సంబంధిత లావా దేవీలు కొనసాగిస్తున్నారని. ఒకే సర్వే నెంబర్లు పై పలుమార్లు లావాదేవీలు జరిగాయని. వార సులు ద్వారా పంపిణీలు చేసుకోవడం. బహుమతిగా ఇవ్వడం, క్రయ విక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా సబ్ డివిజన్ భూమి మీద జరగక పోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా రీసర్వేను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారన్నారు. నెట్ వర్క్ సాయంతో ప్రక్రియ సాగుతోందని గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లోనమోదు చేయడం జరుగు తుందన్నారు. అత్యంత పారదర్శ కంగా జవాబు దారితనంతో సర్వే ప్రక్రియ నిర్వహించాలని ఆదేశిం చారు.

జిల్లాలో 93 గ్రామాలకు ఓ ఆర్ ఐ మ్యాపులు వచ్చాయని వాటిలో 13 నోటిఫికేషన్ 60 గ్రామాలకు జారీ చేయడం జరిగిందని 53 గ్రామాలకు రికార్డ్ ల్యాండ్ పార్సిల్ మ్యాపు తయారైందని ఆయన తెలిపారు. గ్రౌండ్ వాల్యుయేషన్ 9 గ్రామాల్లోని గ్రౌండ్ ట్రుతింగ్ ఆరు గ్రామాలలోను పూర్తి అయిందని మూడు గ్రామా లలో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా 13 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని వాటిలో ఆలమూరు మండలం కలవచర్ల,అమలాపురం మండలం పాలగుమ్మి, రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామాలు ఉన్నాయ న్నారు  సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు స్వామిత్వ సర్వే 28 గ్రామ పంచాయతీలో నిర్వహణకు గాను ఓ ఆర్ ఐ మాప్లు వచ్చాయని గ్రౌండ్ ట్రుతింగ్ పూర్త యిందని గ్రౌండ్ వాల్యుయేషన్ పురోగతిలో ఉందన్నారు భూ ఆక్రమణలు భూతగాదాలపై చట్టపరమైన చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-11-17 10:33:40

జగనన్న కాలనీల్లో మౌళిక వసతులు కల్పించాలి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద అన్ని లేఔట్లలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులను చైతన్య పరుస్తూ గృహ నిర్మాణాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. గురువా రం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద చేపట్టిన గృహ నిర్మాణ పనులు జగనన్న కాలనీ లేఔట్లలో మౌలిక వసతులు కల్పన జగనన్న స్వచ్ఛ సంకల్పం లేవట్ల లెవిలింగు ఇసుక రీచ్ ఆపరేషన్లు తదితర అంశాలు పురోగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవల ప్మెంట్ ,మరియు రాష్ట్ర ప్రత్యేక గ్రామ వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది అజయ్ జైన్లు వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు  ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో త్రాగునీరు అంతర్గత రహదారులు రోడ్లు డ్రైన్లు తాగునీరు కరెంట్ కనెక్షన్ వంటి వసతులు కల్పించి లబ్ధిదారులకు అన్ని విధాలుగా ఉత్తేజపరిచి గృహ నిర్మాణాలను చేపట్టి వారం వారం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదే శించారు.

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద లే ఔట్ల చదును, అంతర్గత రహదా రులు, కల్వర్టుల నిర్మాణం, గృహ నిర్మాణాలు, పీ.ఆర్. ప్రాధాన్యత భవన నిర్మాణాలు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద అందిన ఫిర్యాదుల పరిష్కారం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశిం చారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరే విధంగా జిల్లా స్థాయి అధికారులు ఆయా శాఖల క్షేత్రస్థాయిసిబ్బందితో సమన్వయం చేసుకుని పనులలో పురోగతి సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగు ణంగా డిసెంబర్ 21న  సామూహిక గృహప్రవేశాలకు  ఎంపిక చేసిన లేఔట్లలో అన్ని మౌలిక సదుపా యాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టరు స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలకు అంతరాయం లేకుండా ఇసుక, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయా లను కల్పించాలనిజిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సక్రమంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు  తరలించి వర్మి కంపోస్టు తయారీపై దృష్టి పెట్టాల న్నారు.

గడప గడపకు -మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఇసుక రీచ్ లు ఆపరేషన్లు నిరంతరాయంగా కొనసాగించాలని వర్షాకాలం సీజన్ పూర్తయినందున గృహ నిర్మాణా లను వేగవంతం చేయాలని  ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ సత్తిబాబు, సీపీఓ వెంకటే శ్వర్లు డ్వామా పీడీ, ఎస్ మధుసూ దన్ జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ సుపరింటెండెంట్ ఇంజనీర్లు, చంటిబాబు సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ డిఎంహెచ్వో సిహెచ్ వి భరత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-11-17 10:02:17