1 ENS Live Breaking News

జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను అధిగమించాలి..

జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మం కింద మంజూరైన ప‌నుల‌ను ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పూర్తిచేయాలని రాష్ట్ర గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా చీఫ్ ఇంజ‌నీర్ టి.గాయ‌త్రీదేవి అధికారులను ఆదేశించారు. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ (జేజేఎం) కార్య‌క్ర‌మం అమ‌లుపై  మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ విధాన‌గౌత‌మి స‌మావేశ మందిరంలో స‌మీక్షా  స‌మావేశం నిర్వహించారు.  జిల్లాలో  ప్ర‌తి గ్రామంలో ప్ర‌తి ఇంటికీ మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే ల‌క్ష్యంతో అమ‌ల‌వుతున్న జ‌ల్ జీవ‌న్ మిష‌న్-హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌తి ఇంటికీ సుర‌క్షిత తాగునీటిని  అందించి.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో కాకినాడ గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎం.శ్రీనివాస్‌, ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా నుంచి ఆర్‌డ‌బ్ల్యూఎస్ ఇంజ‌నీరింగ్ అధికారులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-12-13 13:04:12

క్షయరోగులకు అరబిందో ఫార్మా భారీ సహాయం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  క్ష‌య వ్యాధి నిర్మూల‌న‌లో పెద్ద ఎత్తున స‌హాయం అందించేందుకు ప్ర‌ముఖ ఔష‌ధ ఉత్ప‌త్తుల సంస్థ‌ అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ ముందుకొచ్చింది. దేశంలో క్ష‌య‌వ్యాధి నిర్మూల‌న కోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌ధాన‌మంత్రి టి.బి.ముక్త్ భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాలో 300 మంది క్ష‌య వ్యాధిగ్ర‌స్తుల‌కు ఆరు నెల‌ల‌పాటు పౌష్టికాహారం అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్య‌త నిధుల నుంచి రూ.12.60 ల‌క్ష‌లను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆరు నెల‌ల‌పాటు 300 మంది రోగుల‌కు ఫుడ్ బాస్కెట్‌లు అంద‌జేసేందుకు జిల్లా లెప్ర‌సీ, ఎయిడ్స్‌, క్ష‌య నియంత్ర‌ణ విభాగానికి రూ.12.60 ల‌క్ష‌లు చెక్కు రూపంలో అంద‌జేసింది. 

ఈ మేర‌కు సంస్థ ఎం.డి. కె.నిత్యానంద‌రెడ్డి త‌ర‌పున‌ చెక్కును అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారికి అంద‌జేశారు. ఆరు నెల‌ల‌పాటు ఒక్కో రోగికి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రాకోసం రూ.4200 ఖ‌ర్చు చేసేందుకు వీలుగా ఈ స‌హాయం అందిస్తున్నామ‌ని సంస్థ ప్ర‌తినిధులు వివ‌రించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కోరిన మీద‌ట ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో 1,000 మంది క్ష‌య వ్యాధిగ్ర‌స్తుల‌కు త‌మ ఫౌండేష‌న్ ద్వారా రూ.42 ల‌క్ష‌ల స‌హాయం అందిస్తున్న‌ట్టు సంస్థ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో 400 మందికి రూ.16.80 ల‌క్ష‌లు, శ్రీ‌కాకుళం జిల్లాలో 300 మందికి రూ.12.60 ల‌క్ష‌ల స‌హాయాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్య‌త కింద అంద‌జేశామ‌న్నారు. జిల్లాలో క్ష‌య వ్యాధి నిర్మూల‌నలో భాగంగా రోగుల‌కు పౌష్టికాహారం స‌ర‌ఫ‌రాలో పెద్ద ఎత్తున విరాళం అందించిన అర‌బిందో ఫార్మా ఫౌండేష‌న్ కు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Vizianagaram

2022-12-13 12:44:17

ఉద్యోగుల ఆందోళనకు ఎమ్మెల్సీ మాధవ్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పింఛనర్లు తమకు ఇవ్వవలసిన జీతాలు ప్రతీనెలా 1వ తారీఖున ఇవ్వాలని చేస్తున్న ఆందోళనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , బీజేపీ శాసన సభ పక్ష నేత, ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ తన మద్దతు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వ   ఉద్యోగులకు  ప్రతినెలా 1వ తేదీన రావలసిన జీతాలు, 2వ వారం దాటిన తర్వాత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 2018 నుండి పెరిగిన జీతాల  ఏరియర్సు , 7 డీఏ లు ఇప్పటి వరకు ఇవ్వకపోగా, కనీసం జీతాలు కూడా సమయానికి ఇవ్వక పోవడాన్ని  తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆందోళన చేస్తున్న ఉద్యోగులను  నోటీసులు,కేసులు తో బెదిరించడం సరైన విధానం కాదన్నారు. 

సమయానికి జీతాలు రాకపోవడం కారణంగా బ్యాంకు రుణాలు తీసుకున్న వారు, దీర్గకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేషెంట్సు (రోగులు), ముఖ్యంగా పింఛనర్లు అనేక ఇబ్బందులు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి  తలెత్తిందని ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ప్రతి నెలా ఇదే తంతు జరగడం వలన ఉద్యోగులలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రతీనెలా 1వ
తేదీన జీతం, ఫించన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

Visakhapatnam

2022-12-13 12:38:08

శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలని టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,  శ్రీనివాస సేతు పనులు  ఇప్పటికే 85 శాతం  పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 60 మీటర్ల స్టీల్ గర్డర్ లను జనవరి 31వ తేదీకి  నాటికి ఏర్పాటు చేయాలన్నారు. డెక్స్ ల్యాబ్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్ వైపు, సుబ్బలక్ష్మి విగ్రహం వైపు, రేణిగుంట రోడ్డు వైపు, తిరుచానూరు రోడ్డు వైపు జరుగుతున్న పనులపై  సమీక్షించారు.

 అదేవిధంగా పాదాచారులు నడి చేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయంలో శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సంస్థ మేనేజర్  రంగస్వామిని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈవోలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, ఎఫ్ ఎ అండ్ సీ ఏవో  బాలాజీ, సి ఇ  నాగేశ్వరరావు,  మున్సిపల్  ఎస్ ఇ   మోహన్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జిఎం చంద్రమౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-12-13 12:15:35

ఒక‌రి నేత్ర‌దానం...ఇద్ద‌రి జీవితాల‌కు వెలుగు

ఒక‌రి నేత్ర‌దానంతో ఇద్ద‌రికి చూపునివ్వ‌డం ద్వారా వారి జీవితాల్లో వెలుగును నింప‌వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి అన్నారు. నేత్ర‌దానం ప‌ట్ల ఉన్న అపోహ‌ల‌ను విడ‌నాడి, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, ముఖ్యంగా యువ‌త ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. కంటోన్మెంటులోని ఇండియ‌న్ రెడ్‌క్రాస్ కొత్త భ‌వ‌నంలో, నేత్ర‌దాన కేంద్రాన్ని మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, స‌ర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అని చెప్పారు. క‌ళ్లు లేనివారికి మాత్ర‌మే చూపువిలువ తెలుస్తుంద‌ని అన్నారు. ఇలాంటి వారికి చూపునిచ్చేందుకు రెడ్ క్రాస్ ఆధ్వ‌ర్యంలో నేత్ర‌దాన కేంద్రాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. 

నేత్ర‌దానం చేసిన వారినుంచి కార్నియాను సేక‌రించ‌డానికి ఈ ఐ బ్యాంకు కార్నియా క‌ల‌క్ష‌న్ సెంట‌ర్‌ ఉప‌యోడ‌ప‌డుతుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతానికి ఎల్‌వి ప్ర‌సాద్ లేబ‌రేట‌రీలో కార్నియాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో ఇక్క‌డే భ‌ద్ర‌ప‌రిచి, కంటి శ‌స్త్ర‌చికిత్స‌ల‌ను కూడా చేసే స్థాయికి రెడ్‌క్రాస్ ఎద‌గాల‌ని ఆకాంక్షించారు. నేత్ర‌దానం చేసిన వారినుంచి క‌ళ్ల‌ను తొల‌గించ‌డం జ‌ర‌గ‌ద‌ని, కేవ‌లం కార్నియాను మాత్ర‌మే సేక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. మ‌ర‌ణించిన త‌రువాత క‌ళ్ల‌ను వృధా చేయ‌కుండా, మ‌రొక‌రి జీవితాల‌కు వెలుగునివ్వాల‌ని సూచించారు. నేత్ర‌దానం ప‌ట్ల భ‌యాన్ని, అపోహ‌ల‌ను విడ‌నాడి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు ముందుకు రావాల‌ని కోరారు.
   
          జిల్లాలో కేన్స‌ర్ నిర్ధార‌ణా శిబిరాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో చాలామందికి అడ్డ‌పొగ త్రాగ‌డం అల‌వాటు వ‌ల్ల‌, నోటి కేన్స‌ర్ కేసులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. స‌ర్వైక‌ల్ కేన్స‌ర్‌, బ్రెస్ట్ కేన్స‌ర్ కూడా కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. ఎంత‌ త్వ‌ర‌గా కేన్స‌ర్‌ను గుర్తించ‌గ‌లిగితే, న‌యం చేసుకొనే అవ‌కాశాలు అంత ఎక్కువ‌గా ఉంటాయ‌ని అన్నారు. దీనికోసం కేన్స‌ర్ స్కీనింగ్ ప‌రీక్ష‌లు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని చెప్పారు.  బైపిసి చ‌దివిన విద్యార్థినుల‌కు నైపుణ్య శిక్ష‌ణా కేంద్రం ద్వారా ఏఎన్ఎం శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. కేన్స‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కృషి చేస్తున్న రెడ్ క్రాస్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను, బోర్డుల‌ను క‌లెక్ట‌ర్‌ ఆవిష్క‌రించారు. నేత్ర‌దాన కేంద్రానికి దాత‌ల నుంచి విరాళాల‌ను స్వీక‌రించారు.

Vizianagaram

2022-12-13 12:11:13

పడాల రామారావు విగ్రహా ఏర్పాటుకి అనుమతివ్వండి

స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు విగ్రహాన్ని స్థానిక గోదావరి గట్టున మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పార్కులో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటు చేసిన అల్లూరి నిలువెత్తు కాంస్య విగ్రహం ప్రక్కన పడాల రామారావు బస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి నివ్వాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలతను జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు కోరారు. ఈ మేరకు ఆమెకు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ స్పందనలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు మాట్లాడుతూ పడాల రామారావు శతాధిక గ్రంథకర్త, అల్లూరి చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉందని,  అలాగే అల్లూరి అనుచరులు, కుటుంబీకులతో సంబంధం ఉన్న గొప్ప వ్యక్తి అని తెలిపారు. పడాల రామారావు మాజీ రాష్ట్రపతి వి. వి. గిరితో సత్కరింపబడ్డారని, పడాల రామారావుపై తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ కూడా పూర్తి చేసుకున్నదని పడాల వీరభద్రరావు కలెక్టర్ కు వివరించారు. 

2017లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఆనాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితో నగరపాలక సంస్థ స్థలాన్ని కేటాయించిందని, అదే స్థలములో అల్లూరి విగ్రహం ప్రక్కన పడాల రామారావు బస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని పడాల వీరభద్రరావు కలెక్టర్ కు విన్నవించగా అందుకు కలెక్టర్ మాధవీలత సుముఖత వ్యక్తం చేసి నగరపాలక సంస్థకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా 2020లో తంతి తపాలా శాఖ వారు పడాల రామారావు పేరున  విడుదల చేసిన ప్రత్యేక కవర్ ను జ్ఞాపికగా పడాల వీరభద్రరావు కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ, కార్యవర్గ సభ్యుడు యర్ర ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-12-12 16:14:58

హోమ్ గార్డ్ డీఎస్పీ గా ఏడుకొండలరెడ్డి

హోమ్ గార్డ్ డీఎస్పీ గా దుండి ఏడుకొండలరెడ్డి సోమవారం భాద్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 1991లో ఏఆర్పిసిగా పోలీస్  డిపార్ట్మెంట్ లో చేరిన ఆయన 1996లో ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందారు. ఇటీవల జరిగిన బదిలీలలో విశాఖ హోమ్ గార్డ్ డీఎస్పీ గా నియమితులయ్యారు. ఈయన విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఆరు జిల్లాలకు ఆయన ఇంచార్జి గా వ్యవహరిస్తారు.  ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గడ్ మొదలగు రాష్ట్రాలలో విధినిర్వహణలో భాగంగా అడవులలో దాదాపుగా లక్ష కిలోమీటర్లపైగా నడిచిన వ్యక్తిగా ఏడుకొండలరెడ్డి పేరొందారు.

Visakhapatnam

2022-12-12 15:58:43

ఓటరు నమోదు, తొలగింపు పారదర్శకంగా చేయాలి

ఓటరు నమోదులు, తొలగింపులు, మార్పులు, చేర్పులు పక్కాగా, పారదర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహాయ ఎలెక్టోరల్ అధికారుల (తహసిల్దార్లు) ను ఆదేశించారు. సోమవరo కలెక్టరేట్ వీడియొ కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లాలోని తహసిల్దార్లు , సబ్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియొ కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ,  ఇప్పటి వరకు అందిన ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-6, తొలగింపులకు సంబంధించి ఫారం -7, బదిలీలకు సంబంధించి ఫారం -8 ల పై క్షేత్ర స్థాయిలో త్వరగా విచారణ  జరిపి పరిష్కరించాలని ఆదేశించారు.  అదేవిధంగా జూలై నుండి నవంబర్ వరకు అందిన శరఖాస్తులు కూడా పరిష్కరించాలన్నారు. తుది ఓటర్ల జాబితా జనవరి ఐదున ప్రచురించాల్సి ఉన్నందున పరిష్కార చర్యలు వేగవంతం చేయాలని, ఎత్తి  పరిస్తితులలోనూ, సరైన కారణం లేకుండా ధరఖాస్తు తిరష్కరణ చేయరాదని, ఓటరుగా తొలగించరాదని హెచ్చరించారు. 

జిల్లాలో 2,771 దరఖాస్తులు (ఫారం 6,7,8 లు) రాగా, 1,950 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ ధరఖాస్తులపై పది రోజుల్లోగా చర్యలు పూర్తీ చేయాలన్నారు.  పూర్తి చేసిన తరువాత వాటిని డిజిటలైజేషన్ చేసి పరిష్కారం చేయాలన్నారు. ఒక్కో మండలంలో సుమారు 500 దరఖాస్తులు ఉంటాయని,  ప్రతి మండలంలో కనీసం 40 నుండి 50 మంది బి.ఎల్.ఒలున్నందున ఒక్కో బి.ఎల్.ఓ ఫరిధిలో 10 దరఖాస్తులు మించి ఉండవని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెలాఖరుకు ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్, వచ్చే నెలలో ఎలెక్షన్ కమిషనర్ వచ్చే అవకాశామున్నందున పరిష్కార చర్యలు, ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.  ఈ నెల 22 వ తేదీకి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు.  అదేవిధంగా ప్రతి మండలO లో తప్పనిసరిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 

 ఓటరు విధులలో విఆర్ఎ లు ఉండరాదని,  ఎక్కడైనా ఉంటె వారి స్థానంలో వేరే వారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియొ కాన్ఫరెన్సు లో ప్రధాన కేంద్రం నుండి శిక్షణా కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్నికల పర్యవేక్షకులు నాగ జ్యోతి,  మoడలాలనుoడి తహసిల్దార్లు, సబ్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Paderu

2022-12-12 15:50:30

స్పందన అర్జీలపై తక్షణ స్పందన ఉండాలి..

స్పందన కార్యక్రమంలో  ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తులు ఫిర్యాదులపై వెంటనే తగిన చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డి ఆర్ ఓ పి వెంకటరమణ దరఖాస్తులు స్వీకరించారు. డిఆర్ఓ వికలాంగుల వద్దకు స్వయంగా వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు. ఈరోజు స్పందనకు 176 అర్జీలు వచ్చాయన్నారు.

Anakapalle

2022-12-12 15:17:22

స‌ఖి గ్రూపుల‌ద్వారా సామాజిక మార్పు.. కలెక్టర్

స‌ఖి గ్రూపులకు వివిధ అంశాల‌ప‌ట్ల సంపూర్ణ‌ అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా సామాజికంగా మార్పు తెచ్చేందుకు కృషి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. యునెసెఫ్ స‌హ‌కారంతో జిల్లా వైద్యారోగ్య‌శాఖ ఆధ్వర్యంలో స‌ఖి కౌమార బాలిక‌ల వ‌ర్కుషాపు స్థానిక ఎస్‌విఎన్ హొట‌ల్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. ఈ వ‌ర్క్‌షాపులో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, న‌డ‌వ‌డిక‌, విద్య‌, ఉపాధి, వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ‌, వివిధ ర‌కాల చ‌ట్టాలుపై అవగాహ‌న క‌ల్పించేందుకు స‌ఖి గ్రూపులు ఒక వేదిక‌గా ఉన్నాయ‌ని అన్నారు. ఈ గ్రూపుల‌ను ఆలంబ‌న‌గా చేసుకొని, స‌మాజ‌ దృక్ఫ‌థంలో మార్పును తీసుకురావాల‌ని కోరారు. దీనికోసం వివిధ రంగాల వ్య‌క్తులు, వివిధ శాఖ‌లు మేథోమ‌థ‌నం ద్వారా స‌రైన ప‌రిష్కారాల‌ను క‌నుగొనాల‌ని సూచించారు. ప్ర‌స్తుత స‌మాజంలో  బాలిక‌లు, మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌లకు ప‌రిష్కారాల‌ను క‌నుగొనేందుకు ఇటువంటి వ‌ర్కుషాపులు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఒకే వ‌య‌సు ఉన్న వారంద‌రినీ ఒక గ్రూపుగా  ఏర్పాటు చేయ‌డం ద్వారా, వారి వ్య‌క్తిగ‌త‌ స‌మ‌స్య‌లు సైతం బ‌య‌ట‌కు చెప్పే అవ‌కాశం క‌లుగుతుంద‌ని అన్నారు. బాల్య వివాహాల‌ను అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, దీనికి స‌ఖి గ్రూపులు కృషి చేస్తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. బాలిక‌లు చ‌దువుకొని, వృద్దిలోకి రావ‌డానికి ఉన్న అపార అవ‌కాశాల‌ను గ్రూపు స‌భ్యుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. కేవ‌లం వైద్యం, ఇంజ‌నీరింగ్ మాత్ర‌మే విద్య‌ కాద‌ని, విస్తృతంగా ఉన్న విద్యావ‌కాశాల‌ను వివ‌రించాల‌ని కోరారు.  

                  ప్ర‌తీఒక్క‌రికీ శారీర‌క ధారుఢ్యం అవ‌స‌ర‌మ‌ని, దీనికోసం ఆట‌లాడ‌టం, ఎక్సైర్‌సైజులు, యోగా నేర్పించాల‌ని సూచించారు. మ‌న జిల్లాను వెన్నాడుతున్న ర‌క్త‌హీన‌త సికిల్ సెల్ ఎనీమియా, థాల‌సీమియా లాంటి వ్యాధుల‌ నివార‌ణ‌కు కృషి చేయాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు. దీనికోసం ఆరోగ్యం సూత్రాలు, పోష‌కాహారాన్ని తీసుకోవ‌డం అల‌వాటు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌ప‌రంగా అత్యుత‌న్న పోష‌కాహారం, అవ‌స‌ర‌మైన‌ మందులు స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని, వాటి వినియోగంపై స‌రైన అవ‌గాహ‌న క‌ల్పించాల్సి ఉంద‌ని చెప్పారు. ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల‌పై ధౌర్జ‌న్యాలు త‌గ్గ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. బాలుర‌కు కూడా గ్రూపుల‌ను ఏర్పాటు చేసి, ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.

                 జిల్లా వైద్యారోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి మాట్లాడుతూ, స‌ఖి కార్య‌క్ర‌మ ఉద్దేశాన్ని ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. బాలిక‌ల‌కు వివిధ అంశాల‌పై అవ‌గాహ‌నతో పాటు భావ వ్య‌క్తీక‌ర‌ణ కూడా అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, వాటి అమ‌లు వెనుక‌నున్న ల‌క్ష్యాల‌ను కూడా ప్ర‌జ‌లకు వివ‌రించిన‌ప్పుడే, పూర్తిస్థాయిలో స‌త్ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చెప్పారు.

                మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ బి.శాంత‌కుమారి మాట్లాడుతూ, త‌మ శాఖాప‌రంగా స‌ఖి కార్య‌క్ర‌మాల‌ను, జిల్లాలో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ల‌ను ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు క‌ళా జాతాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

               యునెసెఫ్ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ శ్రీ‌ల‌త మాట్లాడుతూ, స‌ఖి గ్రూపుల‌ను బ‌లోపేతం చేయ‌డం, ర‌క్ష‌ణాత్మ‌క జీవన విధానాల‌ను తెలిపారు. కౌమార బాలిక‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఆరోగ్య‌ప‌ర‌మైన అంశాలు, వారి ర‌క్ష‌ణ కోసం ఉద్దేశించిన చ‌ట్టాల‌ను వివ‌రించారు.  

                ఉత్త‌మ స‌ఖి గ్రూపుల‌కు మొమోంటోలను క‌లెక్ట‌ర్‌ అంద‌జేశారు. పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు.  వ‌ర్కుషాపులో జిల్లా ముఖ్య ప్ర‌ణాళికాధికారి పి.బాలాజి, అద‌న‌పు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ రామేశ్వ‌రి ప్ర‌భు, యునెసెఫ్ క‌న్స‌ల్టెంట్ కె.శివ‌కిషోర్‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల జిల్లా కోఆర్డినేట‌ర్ అశోక్‌, ప‌లువురు డాక్ట‌ర్లు,  వివిధ శాఖ‌ల ప్ర‌తినిధులు, ఐసిడిఎస్‌ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-12-09 10:35:34

బాపట్ల కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం-8712655881

మాండోస్ తుఫాను నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలియజేశారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు. కాగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెం.8712655881 నెంబరును అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓల అన్ని ప్రభుత్వశాఖలకు తెలియజేశారు. అంతేకాకుండా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లా ప్రజలు ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు.

Bapatla

2022-12-09 08:56:10

రైతులు దగ్గరుండి భూములు సర్వే చేయించుకోవాలి

భూముల రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ప్పుడు రైతులు ద‌గ్గ‌రుండి త‌మ భూముల కొల‌త‌లు తీయించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. రైతుల స‌మ‌క్షంలోనే వారి భూములను స‌ర్వే చేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న భూముల రీ-స‌ర్వే ప్ర‌క్రియ ఒక సువ‌ర్ణావ‌కాశం లాంటిద‌ని, దీనిని రైతులంతా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.  దాదాపు వందేళ్ల త‌రువాత జ‌రుగుతున్న ఈ భూ స‌ర్వే ప్ర‌క్రియ పూర్త‌యితే, భూ స‌మ‌స్య‌ల‌కు, వివాదాల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని చెప్పారు.  జిల్లాలో రీ స‌ర్వే ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా జ‌రుగుతోంద‌ని ఆమె ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మొద‌టి ద‌శ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 24 మండ‌లాల్లోని 179 గ్రామాల్లో స‌మ‌గ్ర భూ స‌ర్వే పూర్త‌య్యింద‌ని,  సుమారు 11వేల మందికి వెబ్‌ల్యాండ్‌లో న‌మోదు చేయ‌డం ద్వారా, వారి భూముల‌పై స‌ర్వ హ‌క్కులను క‌ల్పించడం జ‌రిగింద‌ని తెలిపారు. రైతులు అపోహ‌లను విడ‌నాడి, అధికారుల‌కు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తే,  స‌మ‌గ్ర భూ స‌ర్వేను మ‌రింత విజ‌య‌వంతంగా వేగంగా పూర్తి చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. భూ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ప్పుడు, రైతులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ భూముల‌వ‌ద్ద ఉండి, ప్ర‌క్రియ‌ను పూర్తి చేయించుకోవాల‌ని, అక్క‌డే సందేహాల‌ను నివృత్తి చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. దీనికోసం ముందుగానే ఆయా రైతులకు స‌మాచారం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

రీ సర్వేతో ఎన్నో ఉప‌యోగాలు
               స‌ర్వే వ‌ల్ల సాదా బై నామా ద్వారా జ‌రిపిన లావాదేవీల‌కు శాశ్వ‌త హక్కులు ల‌భిస్తాయని, ప్ర‌భుత్వ‌, దేవాదాయ భూముల‌కు ర‌క్ష‌ణ క‌లుగుతుందని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా రైతులు ఎదుర్కొంటున్న జీవితకాల స‌మ‌స్య‌ల‌కు ఈ స‌ర్వేద్వారా ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఉద్ఘాటించారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు చుట్టూ రైతులు తిర‌గాల్సిన ప‌నిలేదని, పైసా ఖ‌ర్చు లేకుండా త‌న ఆస్తికి స‌ర్వ హ‌క్కులూ ల‌భిస్తాయని తెలిపారు. ఈ స‌ర్వే ప్ర‌క్రియ ద్వారా సాగుచేసుకుంటున్న పొలాల‌తో పాటు 4 లక్ష‌ల ఖాతాల‌కు సంబంధించిన‌ గ్రామ కంఠాల‌కు, సాదా బై నామా ద్వారా జరిగిన లావాదేవీల‌కు కూడా సంపూర్ణ హ‌క్కులు ల‌భిస్తాయని వివ‌రించారు. వారస‌త్వంగా వ‌చ్చిన భూముల‌కు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే చిటికెలో ప‌రిష్కారం ల‌భిస్తుందన్నారు. స‌రిహ‌ద్దు గొడ‌వులు.. పంప‌కాల చిక్కులు తొల‌గిపోతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక ప‌రిజ్జానాన్ని ఉప‌యోగించి జ‌రుగుతున్న ఈ స‌ర్వే వ‌ల్ల భూముల‌కు సంబంధించి ప్ర‌త్యేక‌ ఎల్‌.పి.ఎం. నంబ‌ర్ ద్వారా అన్ని వివ‌రాలు క్యూ ఆర్ కోడ్‌లో నిక్షిప్త‌మై ఉంటాయని, దీంతో భ‌విష్య‌త్తులో  సంబంధిత‌ రైతుల అనుమతి లేకుండా పేర్లు గానీ, సరిహ‌ద్దులు గానీ మార్చ‌లేరని తెలిపారు. చివరికి రిజిస్ట్రేష‌న్ చేసేట‌ప్పుడు కూడా ఓటీపీ వ‌స్తే గానీ ప్ర‌క్రియ ముగియ‌దన్నారు. అత్యంత క‌చ్చిత‌త్వం, భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ 20వేల స‌ర్వే రాళ్ల‌ను రైతుల భూముల స‌రిహ‌ద్దుల్లో పాతడం జ‌రిగింద‌ని తెలిపారు.

త్వ‌ర‌లో భూహ‌క్కు ప‌త్రాల పంపిణీ
               జిల్లాలో స‌మ‌గ్ర భూ స‌ర్వే ప్ర‌క్రియ‌లో భాగంగా మొద‌టి ద‌శ విజ‌య‌వంతంగా ముగిసిందని, మూడు రెవెన్యూ డివిజ‌న్ల ప‌రిధిలోని 24 మండ‌లాల్లో రీ-స‌ర్వే పూర్త‌యిందని తెలిపారు. దాదాపు 179 గ్రామాల్లోని 11వేల మంది రైతుల‌కు త్వ‌ర‌లోనే సంబంధిత భూ హ‌క్కు ప‌త్రాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింద‌ని తెలిపారు.  రెండో ద‌శ‌క్రింద‌ మ‌రో 150 గ్రామాల్లో స‌ర్వే చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని, ఫిబ్ర‌వ‌రి ముగిసే నాటికి మ‌రొక 75 గ్రామాల్లో  స‌ర్వే ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్టు క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

Vizianagaram

2022-12-08 04:37:43

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చు

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  బుధవారం తహశీల్దార్ల, రెవన్యూ సిబ్బందితో భూ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
 ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ సూచనలిస్తూ భూహక్కు పత్రాలలో ఫోటో మిస్సింగు, వివరాలు నమోదులో తప్పులుంటే మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ హక్కు పత్రాలలో తప్పులున్నా, భూమి వివరాలు నమోదు కాకున్నా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మ్యుటేషను ధరఖాస్తు ద్వారా మార్పులు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని రైతు లందరికీ విలేజ్ రెవిన్యూ అధికారులు తెలియజేయాలన్నారు. నోటీసులు రైతులందరికీ వ్యక్తిగతంగా అందజేసి, రశీదులు తీసుకొని రికార్డు చేయాలన్నారు..  భూ సర్వేకు సంబంధించిన మొత్తం రికార్డు భద్రపరచాలన్నారు.  రైతుల వివాదాలకు సంబంధించిన వారి వాదనలను, రికార్డులను,  మొబైల్ కోర్టు ఆర్డర్లను  భద్రపరచాలని తెలిపారు. రీ సర్వే ప్రక్రియ పక్కాగా అమలుచేయాలని అదికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు నూరుల్ కమర్,  జిల్లా రెవిన్యూ అదికారి జె. వెంకటరావు, జిల్లా సర్వే సెటిల్మెంటు అధికారి కె. రాజకుమార్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వి.ఆర్.ఒ.లు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-07 15:58:09

ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతికి తావుండకూడదు

అవినీతికి తావులేకుండా పథకాలు, కార్యక్రమాలు ల‌బ్ధిదారుల‌కు అందేందుకు అధికారులు కృషిచేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య‌ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ సీహెచ్ విజ‌య‌ప్రతాప్‌రెడ్డి.. క‌మిష‌న్ సభ్యులు జె.కృష్ణకిరణ్, పౌర స‌ర‌ఫ‌రాలు, ఐసీడీఎస్‌, విద్య త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. కాకినాడ అర్బన్ కచేరిపేటలో ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న తీరును ప‌రిశీలించారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం, కందిపప్పు త‌దిత‌ర స‌రుకుల నాణ్యతను పరిశీలించారు. కాకినాడ జగన్నాథపురంలో ఎ.శ్రీనివాసరావుకు చెందిన చౌక ధరల దుకాణాన్ని, అన్నమ్మఘాటిలో ఎంవీవీ సత్యనారాయణ చౌక ధరల దుకాణాన్నిఛైర్మ‌న్ తనిఖీ చేశారు. 


కరప మండలం, పెనుగుదురు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరపలోని శ్రీ నక్కా సూర్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాలను, సరుకుల నాణ్యతను పరిశీలించి పాఠశాల విద్యార్థులకు ఫోర్టిఫైడ్ బియ్యం ప్రాధాన్యం, పోషక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వేలంగిలోని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఎంఎల్ఎస్ పాయింటును సందర్శించి బియ్యం బస్తాలు, కందిపప్పు నిల్వను పరిశీలించి హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురజానపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పౌష్టికాహారం అందించే ఈ కార్య‌క్ర‌మాన్ని విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, మ‌ధ్యాహ్న భోజ‌నం పాఠ‌శాల‌లో చేయాల‌ని సూచించారు. చివరిగా జగన్నాధపురం సెంటర్లో ఉన్న బ‌చ్చు రామం న‌గరపాలక సంస్థ బాలికోన్న‌త పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు పోష‌క విలువ‌లు క‌లిగిన ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన కల్పించారు.


ఈసంద‌ర్భంగా విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం-2013 ప‌రిధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫుడ్ క‌మిష‌న్ ఏర్ప‌డింద‌ని.. ఈ క‌మిష‌న్‌కు తాను రెండో ఛైర్మ‌న్‌గా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు. 2022, మార్చిలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 475 వ‌రకు కేంద్రాల‌ను సంద‌ర్శించిన‌ట్లు వెల్ల‌డించారు. పౌర స‌ర‌ఫ‌రాల వ్య‌వ‌స్థ ఆహార ధాన్యాల పంపిణీ, మ‌ధ్యాహ్న భోజ‌నం, అంగ‌న్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్ట‌ళ్ల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రి మాతృ వంద‌న యోజ‌న (పీఎంఎంవీవై)పై క‌మిష‌న్ దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హిస్తూ లోటుపాట్ల‌ను గుర్తిస్తూ.. స‌రిదిద్దుతున్న‌ట్లు వెల్ల‌డించారు. పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అవినీతి అనేది ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

 అధికారులు, సిబ్బంది నీతినిజాయితీల‌తో ప‌నిచేయాల‌ని విజ‌య ప్ర‌తాప్‌రెడ్డి సూచించారు. మంగ‌ళ‌వారం కాకినాడ జిల్లాలో ప‌ర్య‌ట‌న ప్రారంభ‌మైంద‌ని గురువారం ఉద‌యం వ‌ర‌కు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. ఫుడ్ కమిషన్ ఛైర్మ‌న్ వెంట ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, సివిల్ స‌ప్ల‌య్స్ డీఎం డి.పుష్ప‌మ‌ణి, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.చాముండేశ్వరి, ఏఎస్‌వో టి.ప్రసన్న లక్ష్మీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, ఇన్‌ఛార్జ్ డీఈవో ఆర్‌జే డానియ‌ల్ రాజు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.డి.సలీమ్ త‌దిత‌రులు ఉన్నారు.

Kakinada

2022-12-07 15:52:23

ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి

డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిదారుల‌కు పూర్తిస్థాయిలో సేవ‌లందేలా కృషిచేయాల‌ని.. ఫిర్యా దుల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్యక్ష‌త‌న జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ (డీడీసీ) స‌మావేశం జ‌రిగింది. డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం జిల్లాలో అమ‌లుతీరు, అందుబాటులో ఉన్న ఆరోగ్య మిత్ర‌లు, టీం లీడ‌ర్లు, అర్జీల స్వీక‌ర‌ణ‌, ప‌రిష్కార వ్య‌వ‌స్థ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ‌, నెట్‌వ‌ర్క్‌ ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఉచిత వైద్య సేవ‌లు అందించే వ్య‌వ‌స్థ‌లో ఎవ‌రైనా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలితే క‌ఠిన చర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

 కాకినాడ జిల్లాలో 84 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వ‌ర్క్ కింద ఆమోదం పొంది ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 79 మంది ఆరోగ్యమిత్రలు ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆరోగ్య మిత్ర‌ల‌కు సంబంధించి ఖాళీలు ఏవైనా ఉంటే వెంట‌నే భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ చ‌ర్య‌ల ద్వారా ఆరోగ్య‌శ్రీ సేవ‌ల వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయొచ్చ‌న్నారు. ప్ర‌తి నెల మొదటి బుధవారం డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మావేశాలు ఫ‌ల‌ప్ర‌దంగా జ‌రిగేందుకు వీలుగా నెల‌వారీగా స‌వివర నివేదిక‌ల‌ను అందుబాటులో ఉంచాల‌న్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎంల‌కు ఆరోగ్య‌శ్రీ సేవ‌లు, ప్ర‌త్యేక యాప్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.

 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ ప్ర‌త్యేకంగా నోడ‌ల్ సిబ్బందిని నియ‌మించాల‌ని సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పోస్ట‌ర్ల రూపంలో ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. 104, స్పంద‌న‌, ఐవీఆర్ఎస్‌, వ్య‌క్తిగ‌త మార్గాల ద్వారా అందే ఫిర్యాదుల‌ను, అర్జీల‌ను నిర్దిష్ట గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా గ్రీవెన్సుల ప‌రిష్కారం ఉండాల‌ని క‌లెక్ట‌ర్ కృతికాశుక్లా స్ప‌ష్టం చేశారు. స‌మావేశానికి డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ‌, క‌మిటీ స‌భ్యులు డా. ఎస్.చక్రరావు, ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ‌, ఆరోగ్య‌శ్రీ జిల్లా మేనేజ‌ర్ కె.న‌వీన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-12-07 15:48:02