1 ENS Live Breaking News

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

మౌలానా అబుల్ కలాం జయంతి ఘనంగా జరిగింది. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశ మొదటి విద్యా శాఖ మంత్రి గా పనిచేసి, గొప్ప విద్యా విధానానికి మంచి పునాది వేశారని కొనియాడారు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలిక వ్యూహంతో విద్యా విధానాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. విద్యా వ్యాప్తికి పెద్ద ఎత్తున కృషి చేసారని ఆయన అన్నారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు. మక్కాలో గౌరప్రదమైన కుటుంబంలో జన్మించి భారత దేశం విచ్చేసి సేవలు అందించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. వార పత్రిక ప్రారంభించి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి నింపి, స్పందన రప్పించారని దానితో ఇంగ్లీష్ ప్రభుత్వం పత్రికను నిషేధించిందని చెప్పారు. మరో పత్రిక స్థాపించి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. యుక్త వయస్సులోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. దేశ విభజన, ఇతర సందర్భాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉదారంగా పనిచేస్తూ, ఉద్రిక్తతలు తగ్గించుటకు ఎంతగానో కృషి చేశారని ఆయన వివరించారు. ఆజాద్ జయంతి రోజున అల్ప సంఖ్యాక వర్గాల దినోత్సవంగా ప్రకటించడం శుభసూచకమని చెప్పారు. 

ఈ సందర్భంగా అల్ప సంఖ్యాక వర్గాల ప్రతినిధులు షేక్ షఫీ, మహ్మద్ జలాల్, సందీర్ చంద్ర తదితరులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథ రావు,  జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్త్యా కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

manyam

2022-11-11 09:03:48

రాజమండ్రిలో పడిపోయిన రైలు భోగీ..రెండు రైళ్లు రద్దు

Annavaram

రాజమండ్రిలో  రైలు బోగీ పడిపోవడంతో నిర్ణీత సమయానికి వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ 2గంటలు ఆలస్యంగా నడుస్తుందని అన్నవరంలోని రైల్వే సిబ్బంది తెలియజేశారు. వాస్తవానికి అన్నవరం ఈ రైలు ఉదయం 8.5గంటలకు రావాల్సి ఉంది. అదే విధంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుని రద్దుచేసినట్టు కూడా రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు సమాచారాన్ని గమనించాలని సూచిస్తున్నారు. కాగా ఈ సమాచారం ఈరోజువరకూ మాత్రమేనని ప్రకటించారు.

Annavaram

2022-11-09 03:23:31

గోకుల్ పార్కును ప్రారంభించిన విశాఖ మేయర్

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజల సందర్శనార్ధం గోకుల్ పార్కును ఆధునీకరించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె ఆర్కే బీచ్ లోని గోకుల్ పార్కు ను సుమారు రూ.30.50 లక్షలతో ఆధునీకరించిన పనులకు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, ఎం ఎల్ సి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు బీచ్ లో గోకుల్ పార్కులోని శ్రీ కృష్ణ మందిరాన్ని సందర్శిస్తారని వారికి సౌకర్యాల కల్పనకు గోకుల్ పార్కును సుమారు రూ.30.50 లక్షలతో శ్రీ కృష్ణ ని  పిల్లని గ్రోవితో ఆర్చ్, బనియన్ ట్రీతో రాధా కృష్ణులకు నీడ, సందర్శకులకు కూర్చునేందుకు సిమెంటు బెంచీలు, బీచ్ వైపు ఉన్న పిల్లర్సు మరమ్మత్తులు, పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుత్ మొదలైన పనులను ఆధునీకరించాలని తెలిపారు.

అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున బీచ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, మరుగుదొడ్లు మొదలైనవి ఏర్పటుచేసారన్నారు. సందర్శనానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, పూజా సామాగ్రిల యొక్క వ్యర్ధాలను, అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే నగర పరిశుభ్రతకు బీచ్ లో నిషేధిత ప్లాస్టిక్ ను వాడరాదని, ప్రత్యామ్నాయ వస్తువులనే వాడాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పిన్నింటి వరలక్ష్మి, పల్లా శ్రీను, కార్పొరేటర్ ఊరుకూటి నారాయణ రావు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసి రావు, మాజీ అధ్యక్షులు  భరణికానా రామారావు, ప్రధాన కార్యదర్శి మొల్లి అప్పారావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గోలగాని శ్రీనివాస్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, పర్యవేక్షక ఇంజినీరు వేణు గోపాల్, కార్యనిర్వాహక ఇంజినీరు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, జిల్లా యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-11-07 16:05:17

రాజమండ్రిలో వైభవంగా గోదావరి హారతి

రాజమండ్రిలో కార్తీకమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని గోదావరి హారతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గోదావరి హారతులు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పాల్గొని తిలకించారు. సోమవారం రాత్రి పుష్కర్ ఘాట్ వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గోదావరి హరతుల కార్యక్రమంలో  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, అనపర్తి  శాసన సభ్యులు సత్తి సూర్య నారాయరెడ్డి దంపతులు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ దంపతులు, స్థానిక ప్రజా ప్రతినిదులు, 
వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, చైర్ పర్సన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-11-07 15:31:29

7న యాగంటిలో కార్తీక దీపోత్సవరం

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 7వ తేదీ నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు  కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, టీటీడీ జెఈవో సదా భార్గవి ఆదివారం స్థల పరిశీలన చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 
భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇందుకు తగిన ఏర్పాట్లపై వారు అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే  రామ్ భూపాల్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎ వి ధర్మారెడ్డి సహకారంతో యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి చెంతన కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.

వంబరు 7వ తేదీ సాయంత్రం  5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తమప్రాంతం, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని స్వామి వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీటీడీ, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జెఈవో  సదా భార్గవి మాట్లాడుతూ, కార్తీక దీపోత్సవం నిర్వహణకు అవసరమైన స్థల పరిశీలన జరిపామన్నారు. ఏర్పాట్ల పై స్థానిక, టీటీడీ అధికారులతో సమీక్ష జరిపామన్నారు. 

కార్తీక దీపోత్సవ విశిష్టతను భక్తులకు  తెలిపేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.  టీటీడీ విద్యుత్ విభాగం  ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ  శ్రీనివాస్ , విజివో  మనోహర్ , శ్వేత డైరెక్టర్  ప్రశాంతి , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్  కుమార్ ,ఈఈ  మల్లిఖార్జున ప్రసాద్ , అన్నదానం డిప్యుటీ ఈవో  సుబ్రహ్మణ్యం  పిఆర్వో డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఎమ్మెల్యే , జేఈవో  అధికారులతో  ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులందరూ కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా వేదిక, ఎల్ఈడీ స్క్రీన్లు, డాక్టర్లు ,పారామెడికల్ సిబ్బంది 

డిప్యుటేషన్ ,శ్రీవారి సేవకుల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు సూచనలు ,సలహాలు ఇచ్చారు.  6వతేదీకి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Tirupati

2022-10-30 14:59:57

పారిశ్రామికంగా అనకాపల్లిని అగ్రస్థానంలో నిలుపుతా

పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో అనకాపల్లిని మొట్టమొదటి స్థానంలో నిలుపుతానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో సుమారు 60 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనకాపల్లి అభివృద్ధిని పట్టించుకోలేదని, వేల ఎకరాల ప్రభుత్వ స్థలం వున్నా, పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయలేకపోయాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని పారిశ్రాంగంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనకాపల్లిలో ఎమ్మెస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, తాను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఎమ్మెస్ఏమీ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి మరింత ప్రోత్సాహం అందించారని అమర్నాథ్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వున్నాయని, వీటికి ఎంఎస్ఎమ్ఈ రంగం కూడా తోడైతే ఈ జిల్లాలో చాలా వరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 ప్రస్తుతం ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ లో 36 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. పార్క్ లో 200 ఫ్లాట్లు ఏర్పాటు చేయడానికి విఎంఆర్డిఏ నుంచి త్వరలోనే అనుమతులు లభించనున్నాయని ఆయన తెలియజేశారు. ఎమ్మెస్ఎమ్ఈ పార్క్ ను జాతీయ రహదారులకు అనుసంధానం చేసేందుకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ఆయన తెలియజేశారు. ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆనుకునే మరో 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమర్నాథ్ తెలియజేశారు. "1978 లో మా తాతగారు గుడివాడ అప్పన్న గాజువాకలో ఆటోనగర్ యేర్పాటుకు పునాది వేశారని, ఇప్పుడు నేను కోడూరులో ఎంఎస్ఎమ్ఈ పార్కు శంకుస్థాపన చేయడం అదృష్టoగా భావిస్తున్నాను" అని అమర్ నాథ్ చెప్పారు.
రాష్ట్రంలో ఎంఎస్ఎమ్ఈలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగానే 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెస్ఎంఈలకు రావలసిన ఇన్సెంటివ్ లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారని అమర్నాథ్ వెల్లడించారు. 


ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లాలో సుమారు 25వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే, ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇప్పటికే జిల్లాలో ఉన్న వివిధ పరిస్థితుల్లో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన వెల్లడించారు.
అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతమ్మ  మాట్లాడుతూ అమర్ నాథ్ పరిశ్రమల శాఖ మంత్రిగా మన జిల్లాకు రావటం మన అదృష్టమని అన్నారు. పారిశ్రామిక రంగంలో అనకాపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.
కలెక్టర్ రవి పటాన్ శెట్టి మాట్లాడుతూ భవిష్యత్తులో కోడూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు ఇంత పెద్ద పారిశ్రామికవాడ రావడం ముదావహమని అన్నారు. ఇక్కడ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేస్తున్న ఈ జిల్లాలో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చేవారికి రెవిన్యూ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దుతానని ఎన్నికలలో ఇచ్చిన హామీని అమర్నాథ్ నెరవేరుస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ఎమ్ఈ పార్క్ అనకాపల్లికి రావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న అమర్ నాథ్ పరిశ్రమల శాఖకు సరైన న్యాయం చేస్తున్నారని అన్నారు. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ బీసెట్టి సత్యవతి, జడ్పీటీసీ శ్రీధర్ రాజు, కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీగున్నయ్య నాయుడు, మళ్ళ బుల్లిబాబు, ఎమ్మెస్ఎంఈ డైరెక్టర్ నదియా, కోడూరు సర్పంచ్ శానాపతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2022-10-30 14:44:48

నవంబర్ 7లోగా ఓటరుగా నమోదుకావాలి..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పట్టభధ్రులందరూ ఓటరుగా నమోదుకావాలని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో అధిక సంఖ్యలో పట్టభద్రులు ఉన్నప్పటికీ ఓటరు నమోదు తక్కువగా ఉందన్నారు. గత ఓటరు జాబితాలో పేరు ఉందనే భ్రమలో ఉండవద్దని, ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరుగా నమోదుకావలసిన అవసరం ఉందని చెప్పారు. కావున జిల్లాలో డిగ్రీ పొందిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టభద్రులు ఫారం -18 సమర్పించి ఓటరుగా నమోదుకావచ్చని, తమ సమీప తహసీల్దార్లకు ఓటరు నమోదు ఫారాలను అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరుగా నమోదు అయ్యేందుకు నవంబర్ 7వ తేదీ వరకు అవకాశం ఉందని, కావున ఈలోగా  ఫారం-18లను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా

2022-10-30 14:27:56

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పట్టభద్రుల సత్తా ఏంటో చూపించాలి..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు యొక్క సత్తాచూపించాలంటే ప్రతీ ఒక్క పట్టభద్రుడు ఖచ్చితంగా ఓటరుగా నమోదు కావాలని అల్లూరి చరిత్రపరిశోధకులు, ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రా లోని ఆరు(అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం) జిల్లాలు జిల్లాల్లోని ప్రతీ పట్టభద్రుడు ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. అవకాశం లేనివారు ఆన్ లైన్ లోనైనా నమోదు చేయించుకోవాలన్నారు. శాసన మండలికి నిజమైన ప్రజాప్రతినిధిని, ప్రజలు, నిరుద్యోగ యువత భవిత కోసం పోరాటం చేసే మంచి వ్యక్తులును పంపాలంటే అది ఒక్క ఓటుతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పట్టభద్రులు గెజిడెట్ అటెస్టేషన్ చేయించిన డిగ్రీ ప్రొవిజినల్, ఓటు గుర్తింపుకార్డు జెరాక్సులు, ఫారం-18ను తప్పులు లేకుండా పూర్తిచేసి, ఓటు నమోదుకి దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందన్నారు.

 ప్రతీ పట్టభద్రుడూ తనవంతు భాద్యతగా తాము ఓటు నమోదు చేసుకోవడంతోపాటు, సహచర పట్టభద్రులతో కూడా ఓటు నమోదు చేయించాలని సూచించారు. ఎక్కువ మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు కావడం వలన, అనుకున్న మంచి వ్యక్తులను ఎమ్మెల్సీని చేసుకోవడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మంది తమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లను నమోదుచేసుకొని ఓటరు యొక్కత సత్తాను తెలియజేయాలని అల్లూరి చరిత్రపరిశోధకులు, ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియాకి విడుదలచేసిన ప్రకనటలో పేర్కొన్నారు.

Visakhapatnam

2022-10-22 01:57:38

నిరుద్యోగులకు ఉపాది శిక్షణతో ఉద్యోగ అవకాశాలు

చదువులు పూర్తిచేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువత తమలోని  ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా  నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గ్రామీణం ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్కిల్ హబ్ సెంటర్ ను ఎంపీ వంగాగీత.. జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగాగీత మాట్లాడుతూ సీఎం విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చదువులు పూర్తి చేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువతలో ఉన్న ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా  జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలియజేశారు.

జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ ప్ర‌స్తుత పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభ్య‌ర్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి..ఉద్యోగ‌, స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు ల‌భించేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేష‌న్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నోడ‌ల్ ఏజెన్సీగా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక‌టి చొప్పున స్కిల్ హ‌బ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో తొలి దశ కింద కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ ఐటీఐ ప్రాంగణంలో ప్రారంభించడం శుభపరిణామమని ఆమె తెలిపారు. రానున్న నాలుగు నెలల్లో రెండో దశ కింద తుని, పెద్దాపురం జ‌గ్గంపేట‌, పిఠాపురం, ప్ర‌త్తిపాడు, కాకినాడ అర్బ‌న్ నియోజ‌వ‌ర్గాల్లోనూ స్కిల్ హ‌బ్‌ల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కలెక్టరు వివ‌రించారు. 

కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి స్థానికంగా ఉన్న పరిశ్రమలలో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలంటే విద్యార్థులు ఎంచుకున్న అంశాలపై  కొంత శిక్షణ పొందడం చాలా అవసరమని ఆయన తెలిపారు. ప్రాముఖ్యంగా యువతకు క్రమశిక్షణ, అంకిత భావం నిబద్దత కలిగి ఉండడంతో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందొచ్చని కన్నబాబు తెలిపారు.  

కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి కార్యక్రమాల ద్వారా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. గొప్ప సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్య శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స‌మావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డి.హ‌రిశేషు, వికాస పీడీ కె.ల‌చ్చారావు, జిల్లా ఉపాధి అధికారి కె.శాంతి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ తదితరులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-10-21 11:38:58

పోలీసు అమరవీరుల త్యాగం శ్లాఘనీయం

విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు శ్లాఘనీయమని ఇంచార్జ్ కలెక్టర్, జెసి ఓ.ఆనంద్, జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యాసాగర్ నాయుడు కొనియాడారు . పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం  ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని వారు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రజల ధన, మాన, ఆస్తుల పరిరక్షణ, శాంతి భ్రతలను కాపాడడంలో సవాళ్ళను ఎదుర్కొని పోలీస్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదుగురు పోలీసులు అమరత్వం పొందారుని వారి సేవలు మరువలేనివని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు చూపించిన ధైర్య సాహసాలు, నిబద్ధత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. 

జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ త్యాగాలను స్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ జరుపుకొని పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించారన్నారు. సమాజం ఎప్పుడూగుర్తుంచుకుంటుందన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో అమరత్వం పొందిన ఎం. గాంధీ, ఎస్ .సూర్యనారాయణ, సిహెచ్ .చిరంజీవిలు, బి. శ్రీరాములు లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు నగదు చెక్ లను జాయింట్ కలెక్టర్, ఎస్ పి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఓ. దిలీప్ కుమార్, ఐటీడీఏ పీవో సి. విష్ణు చరణ్, డి.ఎస్.పి సుభాష్, అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు మనోరంజన్ , ఎస్ .రాజు, బి.ప్రమీల, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-21 09:04:57

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లూ కృషిచేస్తున్న పోలీసుల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌ మ‌ని.. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర‌వీరుల త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. శుక్ర‌వారం పోలీసు అమ‌రవీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సందర్భంగా కాకినాడ‌, పాత జిల్లా పోలీసు కార్యాల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పోలీసు అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామ‌చంద్ర‌రావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, అడిష‌న‌ల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్ త‌దిత‌రులు స్తూపం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛాలు ఉంచి అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళులు అర్పించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ 2021, సెప్టెంబ‌ర్ 1 నుంచి 2022, ఆగ‌స్టు 31 వ‌ర‌కు దేశంలో 264 మంది, రాష్ట్రంలో ఎనిమిది మంది విధి నిర్వ‌హ‌ణ‌లో అసువులు బాసారని.. వారి త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని పేర్కొన్నారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రాష్ట్ర పోలీసు శాఖ‌లో విప్లవాత్మ‌క మార్పులకు శ్రీకారంచుట్టార‌ని.. స‌చివాల‌య స్థాయిలో మ‌హిళా పోలీసుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దిశ యాప్‌ను తీసుకురావ‌డం జ‌రిగింద‌ని.. ఈ యాప్ డౌన్‌లోడ్‌లో కాకినాడ జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానం పొంద‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీపావ‌ళి కానుక‌గా ముఖ్య‌మంత్రివ‌ర్యులు 6,511 పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలిపార‌ని.. ఇది చాలా సంతోష‌క‌ర విష‌య‌మ‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో పోలీసు యంత్రాంగం కృషిచేస్తోంద‌ని.. గంజాయి వంటి వాటిని అదుపులో పెట్ట‌డంలో జిల్లా పోలీసు యంత్రాంగం మంచి ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన‌ట్లు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ 1959, అక్టోబరు 21న ఇండో-టిబెట‌న్ స‌రిహ‌ద్దులో దేశ రక్షణ విధులు నిర్వహిస్తూ చైనా సైనికుల దాడిని వీరోచితంగా ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన  సీఆర్‌పీఎఫ్ పోలీస్ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ దేశంలో ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వ‌హించుకుంటున్న‌ట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తోంద‌ని.. చాలా ఏళ్లుగా పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల ఇళ్ల స్థ‌లాల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. నేడు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్‌పీల కృషితో ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను పంపిణీ చేయ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. 

జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను నేడు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పోలీసులు  శాంతి భద్రతలను కాపాడటం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా, నిర్భయంతో జీవిస్తున్నార‌ని.. స‌మాజం ప్రగతి బాటలో పయనిస్తోంద‌ని పేర్కొన్నారు.  పోలీస్ శాఖ రేయింబవళ్లు చేస్తున్న ఈ కృషికి  ప్రజలందరూ తప్పని సరిగా సహకారం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు మాట్లాడుతూ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నార‌ని, వారి సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని పేర్కొన్నారు. పట్టుదల, ఓర్పు, సహనం, సాహసం, త్యాగాలకు మారుపేరుగా పోలీస్ దళాలు నిలుస్తున్నాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హ‌కారంతో పాటు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, డీఎస్‌పీ భీమారావు, పోలీసు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను నేడు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పోలీసులు  శాంతి భద్రతలను కాపాడటం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా, నిర్భయంతో జీవిస్తున్నార‌ని.. స‌మాజం ప్రగతి బాటలో పయనిస్తోంద‌ని పేర్కొన్నారు.  పోలీస్ శాఖ రేయింబవళ్లు చేస్తున్న ఈ కృషికి  ప్రజలందరూ తప్పని సరిగా సహకారం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు మాట్లాడుతూ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నార‌ని, వారి సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని పేర్కొన్నారు. పట్టుదల, ఓర్పు, సహనం, సాహసం, త్యాగాలకు మారుపేరుగా పోలీస్ దళాలు నిలుస్తున్నాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హ‌కారంతో పాటు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, డీఎస్‌పీ భీమారావు, పోలీసు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-10-21 07:52:26

శ్రీవారిని దర్శించుకున్న శ్రీమతి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు  వైవి.సుబ్బారెడ్డి, ఈవో ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా  నిర్మలా సీతారామన్ కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ అంద‌జేశారు.  ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపి డాక్టర్ గురుమూర్తి, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు భానుప్ర‌కాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-10-20 04:43:30

మంచినీటి పథకాలను పునరుద్దరించండి

పెండ్యాల వాటర్ స్కీం కోసం ఏర్పాటు చేసిన  నాలుగు పంపులని పునరుద్ధరించి, ప్రస్తుత సీజన్లో ఆయకట్టు రైతులకు  సాగు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశించారు.  బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఇరిగేషన్ అధికారులు పెండ్యాల ఇరిగేషన్ పథకం పంపుల స్థితి గతులపై వాస్తవ పరిస్థితిని  ఇరిగేషన్ అధికారులు కలెక్టరుకు వివరించారు.   విజేశ్వరం పవర్ ప్లాంట్ ప్రస్తుతం నిలుపుదల చేయడంతో పెండ్యాల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా కావడంలేదని అధికారులు తెలిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పెండ్యాల  ఆయ కట్ట రైతులకు సాగునీటి సమస్య లేకుండా విజేశ్వరం పవర్ ప్లాంట్ కార్యకలాపాలు యధా స్థితి కి వచ్చేంత  వరకు పెండ్యాల పంపింగ్ స్కీము యొక్క పంపుల ద్వారా  కాలువలకు సాగునీరు అందించాలన్నారు. అందుకు అనుగుణంగా వాటికి చేపట్టవలసిన మరమ్మత్తులు, నిర్వహణ పనులను పూర్తి చేసి, సాగు నీరు అందచేసెలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో ఇరిగేషన్  ఈ ఈ ఎన్. దక్షిణా మూర్తి,డి ఈ ఈ వి. సత్య దేవ పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-10-19 15:29:44

విద్యార్ధుల భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్14417

విద్యార్థి, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా "14417" టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం  తీసుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.  బుధవారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో  జిల్లా పాఠశాల భద్రతా సలహా కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్  అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే మాధవి లత మాట్లాడుతూ, విద్యాబోధన సమయంలో విద్యార్థులకు  సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సమగ్ర భద్రతా చర్యలు చేపట్టెందుకు ప్రతి పాఠశాలలో ఉండే పేరెంట్ కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు.  విద్యార్థుల భద్రతే లక్ష్యంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ తో సహా అన్ని ప్రతి పాఠశాలలో  14417 టోల్ ఫ్రీ సేవల  ను ఏర్పాటు చేశామన్నారు. ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే, తగిన విధంగా స్పందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా   ఖచ్చితంగా స్కూల్స్ లో ఫిర్యాదుల పెట్టే (కంప్లైంట్ బాక్స్)  ఏర్పాటు చేయడం, ప్రతి,15 రోజులకు ఒకసారి వాటిపై చర్చిచించాలన్నారు.  ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో కంప్లైంట్ బాక్స్ లో ఉన్న ఫిర్యాదులను   పరిశీలించి పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం, నివేదిక అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు. 
పిల్లలకు సురక్షితమైన భోధన సౌకర్యాలను, అన్ని పాఠశాలల్లో (స్ట్రక్చరల్ మరియు నాన్ స్ట్రక్చరల్) ప్రమాదాలు నివారణ (డిజాస్టర్ రిస్క్)  తగ్గింపు చర్యలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఇంటి నుండి పాఠశాలకు, పాఠశాల  నుంచి  పిల్లలు ఇంటికి వెళ్లెవరకూ భద్రతను కల్పించడం చాలా కీలకం అన్నారు.  అన్ని మండల విద్యాశాఖాధికారులతో త్రైమాసిక సమీక్ష సమావేశాలు నిర్వహించడం, మండల, గ్రామ స్థాయి భద్రతా సలహా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు స్కూల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై విద్యార్థులకు అవగాహన   కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న టోల్ ఫ్రీ నెంబర్, ఫిర్యాదుల పెట్టే పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు.

   విద్యార్థుల ఆరోగ్య భద్రతకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలల్లో పర్యవేక్షించాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం సాగే విషయం కావున, తరచుగా సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదనలపై చర్చించాలన్నారు. రవాణా శాఖ అధికారులు  ప్రైవేటు పాఠశాలలో, కళాశాలల్లో నడిపే బస్సుల క్రమ అంతరాలలో ,(రెగ్యులర్ గా)  ఫిట్నెస్  తప్పనిసరిగా తనిఖీ చేసి పర్యవేక్షించాలన్నారు.  దిశా యాప్, అగ్ని ప్రమాద నివారణ తదితర అంశాలపై పోలీస్, అగ్నిమాపక అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శాఖాపరంగా నిర్వహిస్తున్న   కార్యక్రమాలను విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూల్ లో దిశ పోస్టర్లను ఉంచి దిశ చట్టంపై పిల్లల్లో  అవగాహన కల్పించాలని  తెలిపారు. స్కూల్స్ లో త్రాగునీటి వసతి, పరిశుభ్రత పరిరక్షణ వంటి వాటిపై సంబందించిన ఆయా శాఖా ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

Rajamahendravaram

2022-10-19 14:57:57

శ్రీ పద్మావతిదేవీని దర్శించుకున్న కేంద్ర మంత్రి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మల సీతారామన్ బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈవో  సదా భార్గవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు నిర్మల సీతారామన్ కు తీర్థప్రసాదాలు అందించారు.  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జాయింట్ కలెక్టర్ బాలాజి ,ఆలయ డిప్యూటి ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Tiruchanur

2022-10-19 14:44:26