1 ENS Live Breaking News

నాడు-నేడు పనులు వేగవంతం పెంచండి

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు - నేడు క్రింద రెండవ విడతలో చేపడుతున్న జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లోని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని  పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు జి.శ్రీనివాసులు,పాఠశాల విద్య కమీషనర్ సురేష్ కుమార్, పాఠశాల వసతులకల్పన కమిషనర్ కె. భాస్కర్  లతో కలిసి   నాడు-నేడు రెండవ విడత కార్యక్రమం, అదనపు తరగతి గదులు నిర్మాణం, ప్రహరీ గోడలు, మౌలిక వసతుల కల్పన, రివాల్వింగ్ ఫండ్ జమ తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షణ అదనపు పథక సమన్వయకర్తలు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

నాడు- నేడు కార్యక్రమం క్రింద జిల్లాలో చేపడుతున్న  అదనపు తరగతి గదులు, ప్రహరీగోడల నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలని అన్నారు.  నాణ్యత లోపం లేకుండ పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులకు నిధుల కొరత సమస్య లేకుండ చర్యలు తీసుకుంటామన్నారు.  వర్షాలు కారణంగా నిర్మాణ పనులు ప్రారంభమై పునాది స్థాయిలో తీసిన గుంతలు నీటితో నిండి ఉన్న చోట ప్రమాదాలు జరగకుండా రేడియం రిబ్బన్, బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాటశాలల్లో డ్రాపౌట్స్ ఉన్న చోట వాస్తవ పరిస్థితిని విచారించి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో నాడు - నేడు  నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సిమెంట్ కొరత కారణంగా నిర్మాణాలకు అవసరం మేరకు సిమెంట్ సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ,  జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర్, జిల్లా వృత్తి విద్యా అధికారి డి.మంజుల వీణ, ఏ పి ఓ వై.శంకర్ రావు, సర్వ శిక్షా అభియాన్ డి ఈ డి.కిషోర్ కుమార్ ,గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి శాంతిస్వర్, తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:13:11

దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన అవసరం

భూగర్భగనుల లీజు అనుమతులు కోరే దరఖాస్తుదారులకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.  కలెక్టర్ కార్యాలయంలో  భూగర్భ గనుల శాఖ, కాలుష్య నియంత్రణ సంస్థ, రెవిన్యూ అధికారులు, లీజు దరఖాస్తుదారులతో గురువారం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన, పర్యావరణ, రెవెన్యూ , జిల్లా పరిపాలన, గనుల లీజు దారులకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. భూగర్భ గనుల లీజు అనుమతులు మంజూరైన వెంటనే క్వారీ పనులు ప్రారంభించాలన్నదే ప్రభుత్వ విధానమని అన్నారు. పనులు ప్రారంభించని పక్షంలో లీజు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా లీజు కొరకు దరఖాస్తు చేసుకునే వారికి సులువుగా అర్థమయ్యేటట్లు చార్ట్ తయారు చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సూచించారు. 

దరఖాస్తుల అనుమతులకు ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ, అవసరమైన చోట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. అనంతరం ఇప్పటివరకు క్వారీ లీజు మంజూరైన ఏ కారణంతో మొదలు కాలేదు, ఉన్న సమస్యలపై క్వారీ లీజు దారులు, అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.హేమ లత, గనుల శాఖ ఉప సంచాలకులు ఎమ్ . బాలాజీ నాయక్, సహాయ సంచాలకులు ఎస్.పి.కె.మల్లేశ్వర రావు,  భూగర్భ గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్యామ్ పీటర్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ జూనియర్ ఇంజనీర్ వీణా లహరి, తదితరులు, పాల్గొన్నారు.

2022-10-13 15:07:13

ఉత్తరాంధ్రాలో 18,745లో దరఖాస్తుల సమర్ఫణ

ఉత్తరాంధ్రాలోని  శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నందు గల 6 జిల్లాల లోను తేది 13.10.2022 నాటికి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా. (1) శ్రీకాకుళం 3231, (2) విజయనగరం - 4149, (3) పార్వతీపురం మన్యం - 735, (4) అల్లూరి సీతారామ రాజు - 923, (5) విశాఖపట్నం – 7047, (6) అనకాపల్లి-266) వెరసి మొత్తం 18,745 ఓటరు దరఖాస్తులు సమర్పించారని జిల్లా కలెక్టర్ డా.ఎ మల్లిఖార్జున తెలియజేశారు.

 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో సాధారణ నివాసులైన అర్హులైన వ్యక్తులు తమ పేర్లను నిర్దేశించిన పారమ్ 18లో సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు తేది 07.11.2022 లో గా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖపట్నం) లేదా అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లలో గల అందరు శాసనసభ నియోజకవర్గం ఓటరు నమోదు అధికారులు, రెవిన్యూ డివిజినల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దారు మరియు మండల పరిషత్ డవలప్మెంట్ అధికారులు) వారి కార్యాలయాల్లో కాని www.ceoandhra.nic.in వెబ్సైట్ నందు ఆన్ లైన్ ద్వారా కానీ ఫారం-18. ధరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అర్హులైన వ్యక్తులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం యొక్క తప్పులు లేని ఎలక్టోరల్ రోల్ తయారీలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

2022-10-13 14:51:06

ప్రాధాన్యత నిర్మాణాలు వేగవం పెంచాలి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ వంటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని  రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఉదయం పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, ఎన్ ఆర్ ఈ జి ఎస్,  తదితర అంశాలపై విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.... క్షేత్రస్థాయిలో ప్రభుత్వ భవనాల   నిర్మాణం కోసం స్థల సేకరణ కు సంబంధించి  లక్ష్యాలకు అనుగుణంగా  పూర్తి చేసేలా అధికారులు  చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ భవన నిర్మాణాలకు  కోర్టుకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కార దిశ గా చర్యలు తీసుకోవాలని  తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉంటే తక్షణమే అప్లోడ్  చేయాలన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం  జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  434 రైతు భరోసా  కేంద్రాలుగాను 222  రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, 482 గ్రామ సచివాలయం భవనాలు గాను 320 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, 388 విలేజ్  హెల్త్ క్లినిక్ లు గాను 138 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలపై క ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతి సాధించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి   కుళాయి కనెక్షన్లు తదితర పనులను  నిర్దేశించిన గడువులోపు  పూర్తి చేయాలని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకుని చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాలను విడి గా చేయడం ద్వారా సంపద కేంద్రాలలో తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  పి డి డ్వామా శ్రీనివాస్ ప్రసాద్,  ఆర్ బ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

2022-10-13 09:07:40

ఈశ్రమ్ నమోదు,సేవలు మరిన్నిపెంచాలి

తిరుపతి జిల్లాలో స్పందన వినతులకు సంబంధించి పరిష్కారం అర్థవంతంగా వుండాలని, ఎనీమియా తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని, ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలని మెగా గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ అన్నిజిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా అనంతరం జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ సంబందిత అధికారులతో హాజరయ్యారు. కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై స్పందన వినతుల ను ఆమోదించినప్పుడు అర్జీదారునికి మెసేజ్ అందేలా స్పందన పోర్టల్ లో సదుపాయం ఏర్పాటు చేయబడినదని ఆర్జీలను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించి బియాండ్ ఎస్.ఎల్.ఏ కి వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. సచివాలయంలో సేవలు మరింత పెంచాలని, ఈ-శ్రమ్ నమోదు పెంచాలని అన్నారు. 

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు వాడకం ను జి. ఓ నంబర్ 65 పర్యావరణ అటవీ శాఖ తేదీ 22.09.2022 ప్రకారం 01.11.2022 నుండి నిషేదించిన సందర్భంలో వాటి నియంత్రణ కు చర్యలు చేపట్టాలని సూచించారు.  ఫ్లెక్సీలు బ్యానర్ ల తయారీలో ప్లాస్టిక్ వాడకం చేయకుండా ప్రత్యామ్నాయంగా కాటన్, బయో డి గ్రెడబుల్ వంటి వాటితో తయారు చేసేలా ఉండాలని సూచించారు. వీటి పర్యవేక్షణ మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, పంచాయితీ అధికారులు తప్పనిసరిగా చేయని అన్నారు. వీటిపై అవగాహన మరియు కల్పించాలని కోరారు.

గడప గడప కు మన ప్రభుత్వంకి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని అత్యంత ప్రాధాన్యత పనులు 454 మంజూరు చేశామని అందులో 169 పనులు పురోగతిలో ఉన్నాయని ఇంకను ప్రారంభం కానీ 285 పనులపై దృష్టి పెట్టి సత్వరమే చేపట్టాలని ఆదేశించారు.  గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లేట్ అప్పాయింట్ అయిన వారికి శాఖా పరమైన పరీక్షలు పాస్ అయిన వారి పెండింగ్ ప్రోబేషన్ డిక్లరేషన్ ల ప్రతిపాదనలు ఉంటే పూర్తి చేయాలని PRAN నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  జగనన్న తోడు ఐదవ విడత కు సంబంధించి అప్లికేషన్లకు బ్యాంకుల నుంచి లబ్దిదారులకు డబ్బు వారి ఖాతాలకు జమ అయ్యేలా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కృషి చేయాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు తో పాటు యువతను గుర్తింపు లో వాలంటీర్లు సేవలు వినియోగించుకోవాలి అని వారికి శిక్షణ ఇచ్చి నైపుణ్య పెంపుదల చేపట్టాలని సూచించారు.

మాల్ న్యూట్రిషన్ మరియు స్టంటింగ్ 4 సం. లోపు పిల్లల్లో తగ్గించుటకు చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మాయిలకు అనీమియాను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో స్టేజి కన్వర్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.  ఇంటి నిర్మాణాలకు SHG లోన్లు అవసరమైన వారికి 35000 సకాలంలో అందించాలని, స్లాబ్ స్థాయి, పై కప్పు స్థాయిలో ఉన్న ఇంటి నిర్మాణాలకు ఎలక్ట్రిసిటీ మరియు డ్రైనేజ్, వాటర్ సప్లై తదితర మౌలిక సదుపాయాలు సత్వరమే కల్పించాలని కోరారు. ఆప్షన్ 3 కింద ఉన్న ఇళ్లకు పెద్ద లేఅవుట్ లకు కాంట్రాక్టర్ లతో త్వరిత గతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. UDA పరిధిలోనీ అర్హత కలిగిన మిగిలిపోయిన పట్టా పొందిన లబ్ది దారులకు కొత్త ఇళ్ల మంజూరు కొరకు లబ్దిదారుల వివరాలను సత్వరమే ఆన్లైన్లో అప్లోడ్ చేయమని ప్రతిపాదనలు నెలాఖరు లోపు పంపాలని తెలిపారు. PMAY గ్రామీణ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. డిసెంబర్ 21 నాటికి 15446 గృహాల లక్ష్యాలను అధిగమించేలా మెగా గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని తెలిపారు. ఏపీ టిడ్కో ఇళ్లకు రుణాలు మంజూరు బ్యాంకర్లతో మెప్మా సిబ్బంది మాట్లాడి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లోన్లు ఇప్పించాలని ఆదేశించారు. 

రీ సర్వే పై దృష్టి పెట్టాలి అని త్వరిత గతిన పూర్తి చేయాలి అని అన్నారు. జాతీయ రహదారుల భూ సేకరణ, వాటి పరిహార పంపిణీ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రత్యేక అధికారి రామ చంద్ర రెడ్డి, పిడి హౌసింగ్ చంద్ర శేఖర్ బాబు, ఏ డి సర్వే జయరాజ్, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అధికారి అశోక్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 09:04:34

డిజిటల్ లైబ్రరీలు గ్రౌండింగ్ చేయాలి

ప్రభుత్వ అభివృద్ధి భవన నిర్మాణ పనులలో భాగంగా డిజిటల్ లైబ్రరీల పనులు గ్రౌండింగ్ చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం గ్రామ పంచాయితీ భవనాలు, హెల్త్ క్లీనిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ గ్రామాలు, జలజీవన్ మిషన్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతంలోని అర్ సి పి ఎల్ డబ్ల్యూ ఇ  రోడ్ల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు నివేదికలను పంపించాలని అన్నారు. జిల్లా లోని మండల ఇంజనీరింగ్ అధికారులు, డి ఈ ఈ లను ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. జలజీవన్ మిషన్ క్రింద గ్రామాల్లో ఇంటింటికీ మంచి నీరు అందించే కార్యక్రమం లక్యాలను పూర్తి చేయాలని అన్నారు. 

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు, ప్లాస్టిక్ వ్యర్ధాలు వేరుచేసే చెత్త నుండి సంపద కేంద్రాల నిర్వహణను పరిశీలించాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రాధాన్యతా అభివృద్ధి పనుల నిర్మాణాలకు సిమెంట్ కొరత లేకుండా సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కె. రామచంద్రరావు, జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, పంచాయతీరాజ్ అధికారి ఎమ్.వి. జి. కృష్ణాజి, జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి జె.శాంతిశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 08:20:51

ముంపు బాధితులకు అల్పాహారం అందజేత..

అనంతపురం నగరంలోని గురువారం వరద ముంపు ప్రాంతాల్లో  మేయర్ మహమ్మద్ వసీం పర్యటించి బాధితులకు అల్పాహారం అందించి సౌకర్యాలపై అరా తీశారు. వరుసగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం మీదుగా వెళ్తున్న నడిమి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వర్షపునీరు వంక సమీపంలోని కాలనీలలోకి వెళుతుండటంతో బాధితులను  కోసం రహమత్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించి సౌకర్యాలపై బాధితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అవసరం ఉన్నట్లు కొందరు మేయర్ దృష్టికి తీసుకురాగా వెంటనే మందులను వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 43,46,48,49వ డివిజన్ల పరిధిలో డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి తోపాటు స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి అల్పాహారం మేయర్ వసీం పంపిణీ చేశారు.బాధితులు ఎవరూ అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని భరోసా కల్పించారు.భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముని శేఖర్, అనిల్ కుమార్ రెడ్డి,ఇషాక్ ,రహంతుల్లా ,నాయకులు దాదా ఖలందర్ ,రమణా రెడ్డి ,భారతి,డిఈ చంద్రశేఖర్ ,ఏఈ బాబావలి తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 05:38:42

ప్రజాసంబంధాల బలోపేతానికి 5జి మరింత ఊతం

ప్రజాసంబంధాలను బలోపేతం చేయడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తు న్నాయని  పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పి.ఆర్.ఎస్.ఐ) విశాఖ శాఖ ఛైర్మన్ డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి పేర్కొన్నారు. విశాఖలోని ఓ హోటల్ లో బుధవారం జరిగిన పి.ఆర్.ఎస్.ఐ. సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా అందుబాటులోకి రానున్న 5జి పరిజ్జానం సోషల్ మీడియా లో విప్లవాత్మక మార్పులకు దారితీయనున్నదని చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్ట్రా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను 98.5 శాతం మంది మెుబైల్ ద్వారా వినియెాగిస్తున్నారని 5జి టెక్నాలజీ రాకతో 2026 సంవత్సరం నాటికి భారత దేశంలో స్మార్ట్ ఫోన్ ల వాడకం 1 బిలియన్ కు చేరనున్నదని చెప్పారు. ప్రజలకు సత్వర సమాచారాన్ని అధికారికంగా చేరవేయడంలో సామాజిక మాధ్యమాల ఉపయెాగం ప్రజాసంబంధాల అధికారులకు తప్పనిసరి అవుతోందన్నారు. 

పి.ఆర్.ఎస్.ఐ. దక్షిణ భారత ఉపాధ్యక్షుడు యు.ఎస్.శర్మ మాట్లాడుతూ, ట్విట్టర్ వాడకంలో అమెరికా తరువాతి స్థానంలో భారత్ ఉందన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ వినియోగం ప్రపంచంలో భారత్ లోనే అధికమన్నారు. సామాజిక మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగించడం  వలన కూడా సైబర్ నేరాల సంఖ్య దేశంలో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా మార్కెటింగ్ నిపుణుడు డి.ఘనశ్యామ్ సామాజిక మాధ్యమాలను ప్రభావ వంతంగా ప్రజా సంబంధాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫెస్ బుక్ వంటివి వినియోగించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పి.ఆర్.ఎస్.ఐ. కార్రదర్శి ఎమ్.కె.వి.ఎల్. నరసింహం. కోశాధికారి ఎన్.వి.నరసింహం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పి.ఆర్. విభాగం అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 13:42:38

4.53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

తూర్పుగోదావరి జిల్లాలో 2022 ఖరీఫ్ సీజన్లో 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అంచనా వెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి పౌర సరఫరా ల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, ఏం డి జీ. వీర్య పాండ్యన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జేసీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, 2022-23 ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ కోసం పూర్తి స్థాయి లో సిద్దంగా ఉండాలని   నవంబర్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభించ వలసి ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ జిల్లాలో సుమారు 4.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం 80 లక్షల గన్ని బ్యాగులను సిద్దం చేసుకుంటున్నామని, ఇందుకోసం కోటి బ్యాగుల లక్ష్యంగా అడుగులు వేయడం, సి ఎస్ డి టి లకి బాధ్యత ఇచ్చామన్నారు. మిల్లు లను ఇప్పటికే తనిఖీ చేసిన ట్లు శ్రీధర్ తెలిపారు.  కూలీలు, రవాణా, ధాన్యం సేకరణ కి సంబంధించి గ్రామ స్థాయి లో శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈవారం లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మిల్లుకు - పిపిసి కేంద్రాలను అనుసంధానం చేయడం తో పాటు , ఆరు సమన్వయ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో కూడి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లు జేసీ పేర్కొన్నారు. ఈ సమావేశా నికి ఇంఛార్జి మార్కెటింగ్ జిల్లా మేనేజర్ జీ. త్రినాధ్, డి ఎస్ వో పి. ప్రసాద్ రావు లు హాజరయ్యారు.

2022-10-12 12:36:44

ఇంటినిర్మాణంలో అదనంగా రుణసదుపాయం..

తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ "నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ" నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ₹.35 వేలు వరకు అదనపు రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్డిఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో అదనపు బ్యాంకు లింకేజి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 51919 మంది లబ్ధిదారులకు నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా ఇంటి స్థలాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసే విధానం లో అదనపు ఆర్థిక చేయూత కావలసిన లబ్ధిదారులకు క్షేత్ర స్థాయి సిబ్బంది రూ.35 వేలు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కు కృషి చేయవలసి ఉంటుందన్నారు. 

స్వయం సహాయక సంఘాలలో ఉండే మహిళా సభ్యులతో పాటు, సంఘం లో లేని వారికి కూడా అదనపు బ్యాంకు రుణాలు మంజూరు కై కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలోని 15,173 మందికి రూ.53.11 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 4,062 మందికి రూ. 22.58 కోట్ల మేర అదనపు బ్యాంకు రుణాలు గా అందించడం జరిగిందన్నారు. ఇంకా ఎస్ హెచ్ జి లో ఉన్న వారితో పాటుగా ఎస్.హెచ్. జి ల్లో లేని 14,119 మందికి రుణ సౌకర్యం కల్పించే బాధ్యత మండలం లో పనిచేసే సిబ్బంది తీసుకోవాలన్నారు. ఇందుకోసం బ్యాంకర్ల తో మాట్లాడి ఇళ్ళ నిర్మాణం కోసం చేపట్టే పనులు పూర్తి చేయాలన్నారు. కొవ్వూరు, నిడదవోలు పురపాలక పరిధిలో చక్కని ఇండ్ల స్థలాలు ఉన్నాయని, వాటిలో ఎందుకు ఇంటి నిర్మాణాలు వేగవంతం చెయ్యలేక పోతున్నారని ప్రశ్నించారు. 

గోకవరం, పెరవలి మండలాల్లో పురోగతి కనిపిస్తోందని, కోరుకొండ, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ జిల్లా స్థాయి సగటు కంటే తక్కువగా ప్రగతి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. నాన్ ఎస్ హెచ్ జి లను గ్రూప్ గా ఏర్పాటు చెయ్యాలన్నారు. అదనపు రుణం మంజూరు చేసినా ప్రతి లబ్దిదారుడు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం కోసమే ఆ మొత్తాలు ఖర్చు చేసి, ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.  ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. డేగలయ్య, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం వి ఎస్ ప్రియంవద, డిపిఎం, ఏ పి ఎం లు  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-12 12:34:15

భవిష్యత్ విశాఖ కోసం కలికట్టుగా గర్జిద్దాం

 ''ఇప్పటి వరకు మనం అనేక ఉద్యమాలు చేశాం.. వీటన్నిటికన్నా మించింది విశాఖ గర్జన అని..  ఇది మనం పుట్టిన ప్రాంతం కోసం చేస్తున్నాం'' అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 15న జరిగే విశాఖ గర్జన సభకు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రాంత ప్రజలను సమాయత్తం చేసేందుకు వుడా చిల్డ్రన్ థియేటర్ లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమం భావితరాల కోసం చేస్తున్నదిగా అన్ని వర్గాలవారు గుర్తించాలని, మనప్రాంతానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను వెనుకబాటుతనంలోకి నెట్టేశాయని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసినా, చంద్రబాబు నాయుడు  అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆయన అన్నారు. 

తెలంగాణ పోరాటం రాష్ట్రం కోసం కాదని, హైదరాబాద్ కోసమని, ఇప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదని అమర్ నాథ్ అన్నారు. విభజన సమయంలో మనం చాలా నష్టపోయామని, మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని మూడేళ్ల అయిందని, దీనికి ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు కల్పిస్తున్నాయని అన్నారు. విశాఖను రాజధాని కానిచ్చేదిలేదని దండయాత్ర చేస్తున్న వారిపై విశాఖ ప్రజలు గర్జించాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు. విశాఖను రాజధానిగా చేయడం వెనుక ఉన్న ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం మనపై ఉందని ప్రజాప్రతినిధులకు మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు. భిన్న సంస్కృతులకు ఆలవాలమైన విశాఖ నగరం రాజధానిగా ఎందుకు కాకూడదు? అని అమర్నాథ్ ప్రశ్నించారు.

మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ ను పోరాడి సాధించుకున్నామని, ఇప్పుడు విశాఖ రాజధాని  కాకుండా చేస్తున్న వారితో పోరాడి రాజధానిని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసే మంచి పనులను చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అడక్కుండానే విశాఖను పరిపాలన రాజధానిగా చేసే అపూర్వ అవకాశం మనకు ఇచ్చారని అన్నారు. విశాఖలో వైసిపి నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు. 

ఇలా విమర్శిస్తున్న వారు భూములు ఎవరు కబ్జా చేశారో తన వద్దకు వచ్చి చెప్పాలని అవంతి కోరారు. బాబు నీచ రాజకీయాలకు బలి కావద్దని పవన్ కళ్యాణ్ కు అవంతి హితవు చెప్పారు. తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనం గర్జనకు  తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మేయర్ హరి వెంకట కుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, పలువురు కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వీరు చిల్డ్రన్ థియేటర్ నుంచి సిరిపురం జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు.

2022-10-12 11:39:14

వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకుంటే చరిత్రహీనులవుతారు

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వికేంద్రీకరణకు ఉత్తరాం ధ్ర ప్రాంతం నాయకులు జండా, అజెండాలను పక్కనపెట్టి మద్దతివ్వాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరించేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  నాన్ పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తేదీన చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ లోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

విశాఖ రాజధానిగా వద్దంటూ అమరావతి రైతులు దండయాత్రగా మనమీదికి రావడాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు అన్ని ప్రాంతాలకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే యువకులు విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రైతులు ఈ ఉద్యమానికి మద్దతుగా వస్తున్నారని అమర్నాథ్ తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, ఆఉచ్చులో  చిక్కుకోబోమని అమర్నాథ్ చెప్పారు.

మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, 15న జరిగే విశాఖ గర్జన ఏ వ్యక్తికో, ఏ కులానికో సంబంధించినది కాదని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. రాజకీయ లబ్ది కోసం తాము ఈ పోరాటం చేస్తున్నామని వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని,  వారే వచ్చి ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని, లబ్ధి అంతా వారే పొందినా మాకు అభ్యంతరం లేదని అవంతి అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి నేతలు చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్ముతున్నారని ఆయన ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు.

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖ గర్జన ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీనికి మద్దతుగా గ్రామ, మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో, అన్ని పార్టీలు ఆత్మ ప్రబోధం చేసుకొని పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జేఏసీ వైస్ చైర్మన్ దేవుడు మాస్టార్ మాట్లాడుతూ అన్ని పార్టీలు జెండాలు, అజెండాలు పక్కనబెట్టి వెనకబాటు తనం నుంచి ఉత్తరాంధ్ర బయటపడే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి మీడియా రంగం వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే న్యాయపరంగా, రాజకీయంగా అడ్డుకుంటున్నారని దాన్ని తిప్పికొట్టే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

2022-10-12 11:35:34

స్కిల్ హాబ్స్ లో యువతకు ఉపాది శిక్షణ

తిరుపతి స్కిల్ హాబ్స్ నందు యువతకు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ కమిటీ తగిన ప్రణాళికల ను రూపొందించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సమీక్ష నిర్వహించారు. డీఆర్ఓ  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంకల్ప్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.  జిల్లాలో ప్రతి నెల రెండవ, నాల్గవ  శుక్రవారం జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలోని యువతకు పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యం పై వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ హాబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

  జిల్లాలోని  యువతకు నైపుణ్యాలను మెరుగుపరచడానికి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమన్వయం చేసుకోవాలని  తెలియజేశారు. పిడి డి ఆర్ డి ఎ  జ్యోతి గారు మాట్లాడుతూ జిల్లాలోని యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ మేళా క్యాలెండర్ ను ప్రణాళికబద్ధంగా జరగాలని అదేవిధంగా  స్కిల్ హాబ్స్ ద్వారా యువతకు శిక్షణ పొందడానికి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ  అధికారి శ్యాం మోహన్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి ,  జె డి ఎమ్ హైమావతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య,  శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ డీన్ నాగరాజు, ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గౌరీ శంకర్, ఎస్వీ ఇంజనీరింగ్  కళాశాల  ప్రిన్సిపాల్ ఆర్ వి ఎస్ సత్యనారాయణ, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

2022-10-12 11:02:15

దేశం కోసం యువత పనిచేయాలి

దేశం కోసం యువత పనిచేయాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు జిల్లాలోని యువతకు పిలుపునిచ్చారు. దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. బుధవారం మునసాబుపేటలోని గురజాడ విద్యా సంస్థలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నెహ్రు యువ కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ యువతకు సామాజిక స్పృహ, బాధ్యతతో పనిచేయాలని కోరారు.

స్వామి వివేకానంద ఆశయాలు, స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసిననాడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. మానవ జీవితంలో తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారికే ఉన్నత భవిష్యత్ ఉంటుందని వివరించారు. తొలుత విద్యార్థుల అభిప్రాయాలను ముఖ్యఅతిథి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం తిలకించారు. ముఖ్యఅతిధికి నెహ్రు యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్ ఉజ్వల్ ఇతర అధికారులతో కలిసి దుశ్శాలువ, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్ ఉజ్వల్, జాతీయ యువ కార్యకర్తలు ఎంపిక కమిటీ సభ్యులు పూడి బాలఆదిత్య, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.వి.ప్రసాదరావు, జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు, ఎస్.సి. కార్పొరేషన్ పథక సంచాలకులు కె.రామారావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరియు జిల్లా చీఫ్ కోచ్  స్పోర్ట్స్ ఎం.మాధురిలత, గురజాడ విద్యాసంస్థలు సంచాలకులు, ప్రిన్సిపాల్ అంబటి రంగారావు, డా.పులఖండం శ్రీనివాసరావు, ఐతం కళాశాల డీన్ ఆచార్య డి.విష్ణుమూర్తి,ఎన్.వై.కె గణాంకాధికారి డి. శ్రీనివాసరావు,ఇతర అధికారులు, పెద్దఎత్తున యువతీయువకులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-12 10:04:11

ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి

జాతీయ ఆహార భద్రత చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథ న్ తో కలిసి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాల మేరకు అందాలని అన్నారు. 

ఈ విషయమై రెండు రోజులుగా విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, రేషన్‌ దుకాణాలు,యం.ఎల్.ఎస్  గోదాములు తనిఖీ చేశామన్నారు. అంగన్‌వాడీ వ్యవస్ధ మరింత మెరుగుపడాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థుల హాజరు సక్రమంగా నమోదు చేయాలన్నారు. పిల్లల జ్ఞాపకశక్తి ,ఆరోగ్యాన్ని మరింత పెంపొందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ అందించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ బియ్యాన్ని అందిస్తున్నామని,  త్వరలోనే రాష్ట్రమంతా సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కును అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. మొబైల్ రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్న బియ్యం కు బదులుగా డబ్బు పంపిణీ వంటి అవకతవకలకు పాల్పడినట్లయితే సంబంధిత రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.

    జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 అమలుకు అధికారులు కృషి చేయాలని, కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి తనిఖీలలో గుర్తించిన లోటుపాట్లును సంబంధిత శాఖల అధికారులు తక్షణమే సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఆహార కమిషన్ మెంబర్ కాంతారావు, స్టేట్ ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్ ,విశాఖపట్నం డీఎస్ఓ సూర్య ప్రకాష్ రావు, అనకాపల్లి జిల్లా డీఎస్ఓ కె.వి.ఎల్.ఎన్ ప్రసాద్, విశాఖ డీఈవో చంద్రకళ , అనకాపల్లి డీఈవో రామలింగేశ్వరరావు , ఐసిడిఎస్ పిడి  వెంకటేశ్వరి, పౌరసరఫరాల శాఖ  డిఎం, విశాఖపట్నం ఐ. రాజేశ్వరి , డిఎం అనకాపల్లి శ్రీలత , ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, ఎంఈఓ లు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 08:59:28