1 ENS Live Breaking News

సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్య‌కారుల‌కు ఆర్థిక చేయూత‌

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్య‌కారుల‌కు వివిధ రూపాల్లో ఆర్థిక చేయూత ల‌భిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింద‌ని గుర్తు చేశారు. వేట నిషేధ భృతి, పింఛ‌న్లు, ఆయిల్ స‌బ్పిడీ, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తోంద‌ని పేర్కొన్నారు. అలాగే ప్ర‌మాదాలు సంభ‌వించినప్పుడు అందజేసే ఆర్థిక స‌హాయాన్ని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 లక్ష‌ల‌కు పెంచింద‌ని వివ‌రించారు. సోమ‌వారం ప్ర‌పంచ మత్స్య‌కార దినోత్స‌వం సంద‌ర్భంగా న‌ర్సాపురం నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో  క‌లెక్ట‌ర్ వీసీ హాలు నుంచి ఆన్‌లైన్ ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, ఎమ్మెల్సీ సురేష్ బాబు, మ‌త్స్య శాఖ డీడీ ఎన్.నిర్మలాకుమారి, మ‌త్స్య‌కార కో-ఆప‌రేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ బి. చిన‌ప్ప‌న్న‌తో క‌లిసి పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అనంత‌రం, ఫిషరీష్ డిడి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి వివ‌రించారు. వేట నిషేధ భృతిలో భాగంగా జిల్లాలోని 2944 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ.294 లక్ష‌లు అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. 2200 మందికి ఫించన్లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులు అంద‌జేయ‌టం ద్వారా సీడ్ ఫారం నెల‌కొల్ప‌టం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామ‌ని వివ‌రించారు. మ‌త్య్స‌కారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో మ‌త్స్య కార్పోరేషన్ డైరెక్టర్ ఎం. న‌ర‌సింహులు, మ‌త్స్య‌కార సొసైటీ స‌భ్యులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-11-22 01:01:38

PMMSYద్వారా మ‌త్స్య‌ప‌రిశ్ర‌మ‌ అభివృద్దికి కృషి చేయాలి

 ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద యోజ‌న ప‌థ‌కం ద్వారా జిల్లాలో మ‌త్స్య‌ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ది చేసి, యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఈ ప‌థ‌కం ద్వారా జిల్లాలో మ‌త్య్స ప‌రిశ్ర‌మ వృద్దిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించాల‌ని సూచించారు. పిఎంఎంఎస్‌వై ప‌థ‌కం అమ‌లుపై, క‌లెక్ట‌ర్‌ త‌న ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, మత్స్యకారుల సామాజిక, ఆర్థిక స్థితగతులను మెరుగు పర్చెందుకు పిఎంఎంఎస్వై పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని అన్నారు. 2020-21, 2021-22 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి, పిఎంఎంఎస్‌వై ప‌థ‌కానికి జిల్లాలో మొత్తం 219 మంది ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సాధార‌ణ అభ్య‌ర్ధుల‌కు 40 శాతం, మ‌హిళ‌లు, ఎస్‌సి, ఎస్‌టి మ‌త్స్య‌కారుల‌కు 60 శాతం స‌బ్సిడీని ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.10.89 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.15.01 కోట్ల విలువైన ప్రాజెక్టుల‌కు అనుమ‌తి మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. బ‌యోఫ్లాగ్ విధానంలో చేప‌ల పెంప‌కం, చేప పిల్ల‌ల నిల్వ కేంద్రాలు, స‌ముద్రాలు, న‌దుల్లో  కేజ్ యూనిట్ల ద్వారా చేప‌ల సాగు, ఐస్‌బాక్సుల‌తో మోటార్ సైకిళ్ల పంపిణీ, లైవ్ ఫిష్ విక్ర‌య‌కేంద్రాలు, ఫిష్ కియోస్క్ లు, చేప‌ల బ‌జార్ల ఏర్పాటు, చేప‌ల విక్ర‌య వాహ‌నాలు, మూడు చ‌క్రాల వాహ‌నాలు, చేప‌ల ప‌డ‌వ‌లు, ప‌డ‌వ‌ల‌కు జాడ తెలుసుకొనేందుకు అవసరమైన ప‌రిక‌రాల ఏర్పాటు, వివిధ ర‌కాల చేప‌ల విక్ర‌య కేంద్రాల ఏర్పాటుకు ఈ ప‌థ‌కం క్రింద ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. యూనిట్ల‌ను త్వ‌రగా ఏర్పాటు చేయించ‌డ‌మే  కాకుండా, అవి విజ‌య‌వంతంగా న‌డిచేలా అధికారులు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా న‌డుస్తున్న యూనిట్ల‌ను చూపించి, ఔత్సాహికుల‌కు స్ఫూర్తి క‌ల్గించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

                  ఈ స‌మావేశంలో మ‌త్స్య‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ ఎన్‌.నిర్మ‌లాకుమారి, జెడ్‌పి సిఇఓ డాక్ట‌ర్ ఎం.అశోక్‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి ఎ.క‌ల్యాణ చ‌క్ర‌వ‌ర్తి, జిల్లా వ్య‌వ‌సాయాధికారి తార‌క‌రామారావు, జిల్లా ప‌శు సంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, ఎల్‌డిఎం శ్రీ‌నివాస‌రావు, ఇత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-11-18 10:15:50

కన్స్యూ మర్ ప్రొటెక్షన్ కమిటీ మెంబెర్ గా హెచ్ఎస్ రామకృష్ణ

కాకినాడ జిల్లా కన్స్యూ మర్ ప్రొటెక్షన్ కమిటీ మెంబెర్ గా హెచ్ఎస్‌ రామకృష్ణ నియ మితులయ్యారు.ఈమేరకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీచేశారని సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.  ఈ కమిటీ పదవి కాలం 2025 వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగ దారుల సంఘా ల సమైక్య రాష్ట్ర జనరల్ సెక్రటరీ పనిచేస్తూ గత 24సంవత్సరాల నుంచి ఈ విని యోగందారుల చైతన్య ఉద్యమంలో రామకృష్ణ పనిచేస్తు న్నారు. ఇప్పటికి రాష్ట్రలో అజాద్‌కా అమృత్ మ హోత్సవ్లో భాగంగా 696 మండలం కేంద్రాల్లో వి నియోగదారుల రక్షణ చట్టం 2019పై పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభ పోటీలు నిర్వ హించి.. పాల్గొ న్న ప్రతివారికి పార్టిసిపేట్ సర్టిఫి కెట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం 2023 ఆగష్టు 31వరకూ కొన సాగిస్తామని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో రామకృష్ణ తెలిపారు.

Kakinada

2022-11-17 17:21:58

పుస్తక పఠనం-విజ్ఞాన భాండాగారం..డిఈఓ

పుస్తక పఠనం  విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.డి.వి.రమణ అన్నారు. గురువారం గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా  స్థానిక డి.వి.ఎం. ప్రభుత్వ మున్సిపల్ స్కూల్ లో రాష్ట్ర గ్రంధాలయ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ  గ్రంధాలయాలలో పుస్తకాలు చదివి గొప్ప స్థాయికి వెళ్లారని అన్నారు. పేదరికంలో పుట్టిన అబ్రహం లింకన్ కు ఎనిమిదో ఏటనే  అరేబియన్ నైట్స్, వెబ్  డిక్షనరీ ఇచ్చి చదవమని చెప్పిందని, అలా చదవడం మొదలు పెట్టిన లింకన్  అమెరికా అధ్యక్షుడు  అయ్యే వరకూ చదువుని ఎక్కడా అపలేదన్నారు. మనలో ఆలోచన మొదలైతే పని పూర్తి అవుతుందని, పని చేసుకుంటే  అలవాటు అవుతుందని, అలవాటే మన వ్యక్తిత్వం అవుతుందని అన్నారు. వ్యక్తిత్వం మన భవిష్యత్ నిర్ణయిస్తుందని వివరించారు. మనకు విద్య నేర్పిన గురువు ఎక్కడ కనబడిన నమస్కరించాలని, గురువు పట్ల శిష్యుడు ఎలా ఉండాలో వశిష్ఠుడు రాముడుకి  నేర్పించాడని తెలిపారు. అలానే విద్యార్థులు ప్రతీ రోజు పాఠశాలకు వచ్చే ముందు తల్లిదండ్రులకు నమస్కరించి పాఠశాలకు వస్తే మంచిదన్నారు.

అమ్మ చేతి వంట తింటే  మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు పేపర్ చదవడం వలన మేధస్సు మెరుగు పడుతుందన్నారు. చదవడం వల్ల  మానసిక ఉల్లాసంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా పెరుగుతుందన్నారు. చదవలేను అనే ఆలోచన మానేసి , పై స్థాయికి వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకుని  చదవాలని విద్యార్థులకు సూచించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావు స్ఫూర్తితో కేంద్ర స్థాయిలో పురస్కారాలు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. పాకిస్థాన్ లో ఉండే మాలాలా అనే అమ్మాయి అందరూ చదవాలనే నినదించిందని, టెర్రరిస్టులు  ఆమెని చంపాలని ప్రయత్నిస్తే, వారిని ఎదిరించి పోరాడిందని అన్నారు. ఆమె పట్టుదలకు, కృషికి ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని, విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. పేదరికం  చదువుకు అడ్డు కాదని  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని, వాటిని చేరుకోవడానికి కష్టపడాలని అన్నారు. సెల్ ఫోన్ లపై దృష్టి తగ్గించి, పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

జిల్లా గ్రంధాలయ సంఘం అధ్యక్షులు కె. శివ కేశవ రావు మాట్లాడుతూ గ్రంధాలయ ఉద్యమం 1944 నవంబర్ 14 మొట్టమొదట  చెన్నై లో ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజా గ్రంధాలయాలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనండి వాటిని నెరవేర్చుకోడానికి కృషి చేయండి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి చేరుకోవాలని సూచించారు. ఆడపిల్లలు  దైర్యం గా ఉండాలని తెలిపారు. 

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, పాఠశాల ప్రాధానోపాధ్యాయులు గోవిందరావు, జిల్లా గ్రంధాలయ సంఘం కార్యదర్శి చొక్కాపు శ్రీనివాస రావు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-17 10:36:19

భూ సమస్యలకు శాస్వత పరిష్కారం చూపించాలి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని. వైఎస్సార్ జగనన్న  భూ శాశ్వత హక్కు, భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేను ఆచరణలోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్ సిసిఎల్ ఏ కార్యాలయపు కార్యదర్శి ఇంతి యాజ్ ,సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్ అమరావతి  నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న శాశ్వత భూ హక్కు రీ సర్వే భూముల డిజిటల్ సంతకాలు సరిహద్దురాల్లు ఏర్పాటు గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ ఫైనల్ ఆర్వార్ , 13 నోటిఫికేషన్ డ్రోన్లు ,రోవర్ల వినియోగం , ముటేష న్లు ,సర్వేలో ఉత్పన్నమైన ఫిర్యా దులు పరిష్కారం తదితర అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షిం చి నిర్దేశిత లక్ష్యాలు ఏ మేరకు చేరుకున్నది అడిగి తెలుసుకున్నా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దశల వారీగా సర్వే చేపట్టి భూసమస్యలను పరిష్కరిస్తూ వివాదరహిత భూములను భావితరాలకు అందించేందుకు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నా యని వందేళ్ల క్రితం సర్వే వివరాలతో రూపొందించిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఇప్పటికీ అమలు చేస్తున్నారని.

సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా భూ సంబంధిత లావా దేవీలు కొనసాగిస్తున్నారని. ఒకే సర్వే నెంబర్లు పై పలుమార్లు లావాదేవీలు జరిగాయని. వార సులు ద్వారా పంపిణీలు చేసుకోవడం. బహుమతిగా ఇవ్వడం, క్రయ విక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా సబ్ డివిజన్ భూమి మీద జరగక పోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా రీసర్వేను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారన్నారు. నెట్ వర్క్ సాయంతో ప్రక్రియ సాగుతోందని గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లోనమోదు చేయడం జరుగు తుందన్నారు. అత్యంత పారదర్శ కంగా జవాబు దారితనంతో సర్వే ప్రక్రియ నిర్వహించాలని ఆదేశిం చారు.

జిల్లాలో 93 గ్రామాలకు ఓ ఆర్ ఐ మ్యాపులు వచ్చాయని వాటిలో 13 నోటిఫికేషన్ 60 గ్రామాలకు జారీ చేయడం జరిగిందని 53 గ్రామాలకు రికార్డ్ ల్యాండ్ పార్సిల్ మ్యాపు తయారైందని ఆయన తెలిపారు. గ్రౌండ్ వాల్యుయేషన్ 9 గ్రామాల్లోని గ్రౌండ్ ట్రుతింగ్ ఆరు గ్రామాలలోను పూర్తి అయిందని మూడు గ్రామా లలో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా 13 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని వాటిలో ఆలమూరు మండలం కలవచర్ల,అమలాపురం మండలం పాలగుమ్మి, రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామాలు ఉన్నాయ న్నారు  సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు స్వామిత్వ సర్వే 28 గ్రామ పంచాయతీలో నిర్వహణకు గాను ఓ ఆర్ ఐ మాప్లు వచ్చాయని గ్రౌండ్ ట్రుతింగ్ పూర్త యిందని గ్రౌండ్ వాల్యుయేషన్ పురోగతిలో ఉందన్నారు భూ ఆక్రమణలు భూతగాదాలపై చట్టపరమైన చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-11-17 10:33:40

జగనన్న కాలనీల్లో మౌళిక వసతులు కల్పించాలి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద అన్ని లేఔట్లలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులను చైతన్య పరుస్తూ గృహ నిర్మాణాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. గురువా రం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద చేపట్టిన గృహ నిర్మాణ పనులు జగనన్న కాలనీ లేఔట్లలో మౌలిక వసతులు కల్పన జగనన్న స్వచ్ఛ సంకల్పం లేవట్ల లెవిలింగు ఇసుక రీచ్ ఆపరేషన్లు తదితర అంశాలు పురోగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవల ప్మెంట్ ,మరియు రాష్ట్ర ప్రత్యేక గ్రామ వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది అజయ్ జైన్లు వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు  ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో త్రాగునీరు అంతర్గత రహదారులు రోడ్లు డ్రైన్లు తాగునీరు కరెంట్ కనెక్షన్ వంటి వసతులు కల్పించి లబ్ధిదారులకు అన్ని విధాలుగా ఉత్తేజపరిచి గృహ నిర్మాణాలను చేపట్టి వారం వారం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదే శించారు.

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద లే ఔట్ల చదును, అంతర్గత రహదా రులు, కల్వర్టుల నిర్మాణం, గృహ నిర్మాణాలు, పీ.ఆర్. ప్రాధాన్యత భవన నిర్మాణాలు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద అందిన ఫిర్యాదుల పరిష్కారం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశిం చారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరే విధంగా జిల్లా స్థాయి అధికారులు ఆయా శాఖల క్షేత్రస్థాయిసిబ్బందితో సమన్వయం చేసుకుని పనులలో పురోగతి సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగు ణంగా డిసెంబర్ 21న  సామూహిక గృహప్రవేశాలకు  ఎంపిక చేసిన లేఔట్లలో అన్ని మౌలిక సదుపా యాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టరు స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలకు అంతరాయం లేకుండా ఇసుక, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయా లను కల్పించాలనిజిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సక్రమంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు  తరలించి వర్మి కంపోస్టు తయారీపై దృష్టి పెట్టాల న్నారు.

గడప గడపకు -మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఇసుక రీచ్ లు ఆపరేషన్లు నిరంతరాయంగా కొనసాగించాలని వర్షాకాలం సీజన్ పూర్తయినందున గృహ నిర్మాణా లను వేగవంతం చేయాలని  ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ సత్తిబాబు, సీపీఓ వెంకటే శ్వర్లు డ్వామా పీడీ, ఎస్ మధుసూ దన్ జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ సుపరింటెండెంట్ ఇంజనీర్లు, చంటిబాబు సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ డిఎంహెచ్వో సిహెచ్ వి భరత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2022-11-17 10:02:17

గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలి

తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ఆయుష్ విభాగం వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ముందస్తు ఏర్పాట్లు పై సమీక్ష చేసి, అనంతరం ఆనం కళా కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్  హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగృత్తగా వ్యవహరించాలని అన్నారు.

రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనను పూర్తి స్థాయి లో విజయవంతం చేయడం కోసం ఆర్ట్స్ కళాశాల నుంచి.. అధికార విడిది, అక్కడ నుంచి ఆనం కళా కేంద్రంలో  జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల్లో పాల్గొని సందేశం ఇస్తారన్నారు.  ఉ.10.45 కు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్, చేరుకుని, మంజీరలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కి చేరుకుని, స్వల్ప విశ్రాంతి అనంతరం ఉ 11.20 కు బయలుదేరి ఉ.11.30 కి ఆనం కళా కేంద్రానికి చేరుకుంటారన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపి, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయుర్వేదిక్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నానున్నారని పేర్కొన్నారు. ఉ.11.30 నుంచి మ.12.30 వరకు "జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ " ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని  మ.12.40 కి మంజీర ప్రవేట్ అతిధి గృహంలో స్వల్ప విరామం  ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ కి  మ.1.00 కు చేరుకుని  విజయవాడ కు బయలుదేరి వెళతారన్నారు.

సభా ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  మూడు రోజుల పాటు జరిగే జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల సందర్భంగా ఉచిత ఆయుర్ వేద, యునాని , తదితర సంప్రదాయ వైద్య సేవలు ఉచితంగా అందచెయ్యడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 

ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఏ సి పి జేవి సతీష్, ఆయుష్ జాతీయ జనరల్ సెక్రెటరీ మనోజ్ జెన, రాష్ట్ర కన్వీనర్ బాలు అక్కియా, ఎడిసి పిఎం సత్య వేణి, ఎస్ ఈ పాండురంగారావు,  ప్రభుత్వ ఆసుపత్రి సూరింటెండెంట్ డా ఆర్. రమేష్, ఎస్ డి సి  కె. గీతాంజలి, డ్వామా పీడీ జీ. రామ్ గోపాల్,  డి హెచ్.వో రాధాకృష్ణ,ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ఆర్ సిహెచ్. చిట్టిబాబు, డి ఐ పి ఆర్ వో సిహెచ్. శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్, తహశీల్దార్లు, పోలీసు అధికారులు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-11-17 09:58:38

ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలి.

మానవాళికి పెను ముప్పు పొంచివున్న ప్లాస్టిక్ సంచుల నిషేధానికి ప్రత్యేక దృష్టిసారించాలని  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు, జగనన్న భూ హక్కు సర్వే నిర్వహణ, జాతీయ ఉపాధి హామీ పనులు, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిబంధనల మేరకు ప్లాస్టిక్ నిషేధం పగడ్బందిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్లాస్టిక్ సంచుల వాడకం నిర్మూలించడం తోపాటు పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెంది సుస్థిరమైన ఆదాయం సాధించేలా తోడ్పాటును అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు మహిళా సంఘాలు ద్వారా విక్రయించి ఆదాయ వనరులను పెంపొందించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు శత శాతం పనులు గ్రౌండింగ్ జరగాలన్నారు. జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని అన్నారు.
     
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు,  జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామీణాభివద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్, జిల్లా సర్వే, భూ  రికార్డుల శాఖ అధికారి ఆర్. రాజ్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-17 09:43:36

రైస్ మిల్లుల్లో తప్పనిసరిగా సిసి కెమెరాలుండాలి

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులలను జిల్లా కలెక్టర్  పి.ప్రశాంతి ఆదేశించారు.బుధవారం రాత్రి  స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం పరిశీలించిన ధాన్యం కొనుగోలు సెంటర్లో కొన్ని లోటుపాట్లను గమనించడం జరిగిందన్నారు.  సొసైటీలు ఏర్పాటు చేసుకున్న పిపిసి ఏజెన్సీ ప్రెసిడెంట్స్ ఆర్బికేల్లో అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కోపరేటివ్ అధికారిని ఆదేశించారు.  టెక్నికల్ అసిస్టెంట్లకు విధులు కేటాయించడంతోపాటు, అసిస్టెంట్ రిజిస్టర్లు ఆర్.బి.కెలను తరచు సందర్శించేలా చూడాలన్నారు.  తొలి విడతలో 34 ఆర్బికేల్లో పి పి సి సెంటర్లను వినియోగంలోకి తీసుకురాగా, నేటికీ వాటి సంఖ్య 67 గా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 153 రైస్ మిల్లులో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మిగిలిన  రైస్ మిల్లులో కూడా వెంటనే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి ప్రతిరోజు డేటాను పరిశీలించేందుకు సమర్పించాలన్నారు. 

జిల్లాలో ఉన్న 296 ఆర్పీకెలలో సుమారు 400 తేమశాతం కొలిచే యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు.  ధాన్యం సేకరణ ముగిసిన ఆర్ బి కే ల నుండి  ఇతర సెంటర్లకు వాటిని తరలించేందుకు కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. బ్యాంక్ గ్యారంటీలను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ ను ఆదేశించారు. జిల్లాలోని ఆర్బికెల్లో ఏ ఏ తేదీల్లో దాన్యం కొనుగోలు జరుగుతుందో షెడ్యూల్ను రూపొందించి ముందుగానే రైతులకు తెలియజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారినీ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, సివిల్ సప్లైస్  డి. ఎం టి శివరాం ప్రసాద్, డీఎస్ఓ ఎన్ సరోజ పాల్గొన్నారు.

Bhimavaram

2022-11-16 14:10:03

అడ్డగోలుగా ఇచ్చిన సిబిసిఎన్ సి టిడిఆర్ రద్దుచేయాలి

క్రిస్టియన్ మైనార్టీకి చెందిన సిబిసిఎన్సి స్థలం టిడిఆర్ రద్దుచేసి, అడ్డగోలుగా టి డి ఆర్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన జీవీఎంసీ కమిషనర్ పీ రాజబాబు, మేయర్ హరి వెంకట కుమారిలకు సి బి సి ఎన్ సి స్థల బాగోతంపై  ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరిపురం సమీపంలోని సుమారు రూ.500 కోట్ల విలువగల క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన స్థలాన్ని కబ్జా చేయడానికి ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, స్మార్ట్ వైజాగ్ సిటీ మాజీ చైర్మన్ జీవి కలిసి పథకం వేసారని ఆరోపించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ స్థల వివాదం హైకోర్టులో నడుస్తుందని, దీనిపై ఎనిమిది కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు.  ఇవన్నీ దాచేసి18 సంస్థల క్రిస్టియన్ మిషనరీకి చెందిన  18,390 గజాల సీబీసీఎన్సి స్థలాన్ని ఆదిత్య పవన్ డెవలపర్స్ కు  డెవలప్మెంట్ నిమిత్తం ప్లాన్ మంజూరు ఎలా చేశారని ప్రశ్నించారు.  ప్లాన్ అనుమతులకు అవసరమైన ఈసి, స్థల డాక్యుమెంట్లు, గతంలో యూఎల్ సి క్లియరెన్స్ వంటి డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో సమర్పించక పోయినా,  టౌన్ ప్లానింగ్ అధికారులు బి ఏ నెంబర్ కేటాయించినట్టు తెలిపారు. ప్లాన్ అనుమతుల కొరకు 18,390 గజాల స్థలానికి వి ఎల్ టి కింద సుమారు రూ.2.56 కోట్లు జీవీఎంసీకి పన్నులు చెల్లించాలని, ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఉండేందుకు జీవీఎంసీ రెవిన్యూ అధికారులు ఖాళీ స్థలంలో అక్రమంగా 18 ఎస్సేస్మెంట్ నంబర్లు కేటాయించి,   సదరు డెవలపర్లకు  కోట్ల రూపాయల  ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో జీవీఎంసీ ఆదాయానికి నష్టం కలిగించిన సంబంధిత రెవిన్యూ అధికారులపై చట్టపరమైన  చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి  తప్పించాలని కోరారు. సర్వే అధికారుల నివేదిక  ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు  దినకర్ త్యాగరాజ్  పేరుతో 1800 గజాలకు నాలుగు రెట్లు అంటే సుమారు రూ. 62 కోట్ల విలువగల టీడిఆర్ సమర్పించారన్నారు. 2006లో మాస్టర్ ప్లాన్ లో జీవీఎంసీ రోడ్ల నిర్మాణంలో స్థలాలు పోగొట్టుకున్న వారికి, బి ఆర్ టి ఎస్ రోడ్లు వేసేటప్పుడు స్థలాలు కోల్పోయిన వారికి నేటి వరకు టిడిఆర్లు ఇవ్వలేదని, సి బి సి ఎన్ సి స్థలంలో టీడిఆర్ లు కేవలం 18 రోజుల వ్యవధిలో దినకర్ త్యాగరాజ్ కు నాలుగు రెట్లు అధికంగా రూ.62కోట్ల విలువైన టీడిఆర్ ఇచ్చేసారన్నారు.  తణుకులో 350 కోట్ల టిడిఆర్ స్కాం జరిగిందని, దీంతో తణుకు మున్సిపాలిటీ బ్లాక్ లిస్టులో పెట్టిందని, కొంతమంది అధికారులను వైసీపీ నేతలు బలి చేశారని గుర్తు చేశారు. కాబట్టి  సి బి సి ఎన్ సి స్థలానికి అనుమతులు, బీ ఏ నెంబర్ రద్దుచేసి, టి డి ఆర్ లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్ ను కోరినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనసేన నేత శ్రీనివాస్ పట్నాయక్ కూడా ఉన్నారు.

Visakhapatnam

2022-11-16 13:51:00

ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు రూ.2.38 కోట్లు మంజూరు

పరిశ్రమలకు సంబంధించి   30 దరఖాస్తులకు సంబంధించి వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాల కింద రూ. 2.38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. పరిశ్రమలు, ఎపీఐఐసీ, గ్రౌండ్ వాటర్, ట్రాన్స్ పోర్టు, అగ్నిమాపక, పంచాయతీ, ఫ్యాక్టరీస్, ట్రాన్స్ కో, లీడ్ బ్యాంకు తదితర శాఖలతో కలిసి జిల్లాస్థాయి పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గత నెల జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై కమిటీ తొలుత చర్చించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ఏక గవాక్ష విధానంలో వచ్చిన 23 దరఖాస్తులలో 15 దరఖాస్తులను కమిటీ ఆమోదించడం జరిగిందన్నారు. ఇందులో 1 దరఖాస్తును తిరస్కరించగా 7దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టరు తెలిపారు.

అదేవిధంగా  ఎంఎస్ఎంఈ లకు సంబంధించి 30 దరఖాస్తులు గాను 2.38 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇందులో జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 2.08కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 59 పరిశ్రమలకుగాను ఇప్పటి వరకు 51 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తి చేయడం జరిగిందని కలెక్టరు తెలిపారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం టి.మురళి, ఏడీ కె.కృష్ణారావు, ఎపీఐఐసీ జేడ్ఎం బి.హరిధర్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జే.రంగలక్ష్మిదేవి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాథాకృష్ణ, ఎల్డీఎం సీహెచ్ఎస్వి.ప్రసాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్. అశోక్, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు, ఇండస్ట్రీస్ ప్రతినిధులు  ఇతర అధికారులు హాజరయ్యారు.

Kakinada

2022-11-16 13:47:08

విలేకరులతో ఉన్న అనుబంధం మరువలేనిది

కాకినాడ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విలేకరులతో తనకున్న అనుబంధం మరువలేనిదని,  విలేకరులకువిద్య,  ఆరోగ్య పరంగా అన్ని విధాల తన వంతు సహాయం నిరంతరం ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అన్నారు. విలేకరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య, విద్య,  వైద్య పరంగా తనకు తెలియజేస్తే విధానపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని కలెక్టర్ విలేకరులకు భరోసా కల్పించారు. బుధవారం కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో కాకినాడ చిన్న మధ్య తరహా దినపత్రికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమారాధన, జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులుగా వారణాసి సూర్యనారాయణ, డాక్టర్ వైవి పరశురాం, అడపా అప్పారావులను పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

   ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జర్నలిస్టులుగా ఎనలేని సేవలు చేస్తారని కొన్నంటిని ప్రాణాలు తెగించి ధైర్య సాహసాలతో వార్తలను తీసుకొని ప్రచారం చేస్తుంటారని అటువంటి విలేకరులను మరువలేమని ఆమె చెప్పారు. కాకినాడలో తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న కాలం నుండి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఈసారి పంట అధిక స్థాయిలో దిగుబడి అయిందని, ఇది చాలా మంచి పరిణామన్నారు. అధిక స్థాయిలో దిగుబడి రావడం రైతులకు ఆనందంగా ఉందని చెప్పారు. విలేకరులకు తన అవసరం వచ్చినప్పుడు సహాయం పడతానని చెప్పారు. అనంతరం కలెక్టర్కి విలేకరులు ధన్యవాదాలు తెలిపారు.

  ఈ కార్యక్రమంలో కాకినాడ నగరానికి,  రూరల్ ప్రాంతానికి చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక వన సమారాధనతో పాటు జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.

Kakinada

2022-11-16 13:43:36

నాడు-నేడు పనులు సత్వరమే పూర్తిచేయాలి

నాడు-నేడు పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్  పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి మండల స్థాయి అధికారులతో నాడు-నేడు పనుల , ఆధార్ అప్డేషన్ , ఏపీ సేవ సర్వీసులు  గృహ నిర్మాణం , జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు,   అమూల్ పాల కేంద్రాల ప్రారంభం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులను సక్రమంగా వినియోగించి ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలో ఏ ఏ  నిర్మాణాలు చేపడుతున్నారో అన్ని పనులకు  ఒకేసారి జరగాలని ఆమె ఆదేశించారు.   ఎక్స్పెండిచర్ కూడా బుక్ చేయాలని కలెక్టర్  ఆదేశించారు.  అదనపు గదులు నిర్మాణం  ,కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ , డ్రింకింగ్ వాటర్ తదితర పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు .  నాడు నేడు పనులకు ఇసుక కొరత లేదని అన్ని పనులు ఒ ఒకేసారి ప్రారంభించి పనులు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు.  

   ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును విధిగా అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డు  పొంది పది సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు అడ్రస్ తదితర వాటిని  ఆప్ డేట్ చేసుకోవాలని ఆమె అన్నారు . పిల్లల ఆధార్ కూడా అప్డేట్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ నెల 18 ,19 తేదీలలో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్డేషన్ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు , దరఖాస్తులు త్యారిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనుల లకు అంచనాలు తయారు చేసి పంపించాలని ,మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.

     జిల్లాలో ప్రతి శనివారం గృహ నిర్మాణాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ మీటింగ్ నిర్వహించి గృహ నిర్మాణానికి సంబంధించిన అధికారులతో చర్చించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని అక్కడే అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారం గృహ నిర్మాణం స్టేజ్ కన్వర్షన్ పనులు చాలా మందకోడిగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేజ్ కన్వర్షన్ పనులు కూడా వేగవతం కావాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స లో డిఇఓ ఆర్.వి రమణ, సమగ్ర శిక్ష ఏ పి సి  పి. శ్యాంసుందర్,  డి ఆర్ డి ఏ పి డి వేణుగోపాల రావు  ,డ్వామా పీడి రాజేశ్వరరావు , డి ఎల్ డి ఓ కే సి హెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-11-16 13:05:38

జిల్లాలో నేటి నుంచి ఇంటింటా కుష్టువ్యాధి సర్వే

కుష్టు వ్యాధి నివారణపై నవంబరు 15 నుండి డిసెంబరు 5వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు చెప్పారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం సర్వే నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమ వారం కర పత్రంను ఆవిష్కరించారు. సర్వేలో ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం, పురుష వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని తెలిపారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్నవారు, కనుబొమ్మలు, రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనుబొమ్మలు మూతపడటం లాంటివి ఎవరికైనా ఉంటే వారు స్వచ్చందంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంకి వచ్చి వివరాలను అందించాలని అన్నారు. కుష్టు వ్యాధి సులభంగా అంటుకునే అంటు వ్యాధి కాదని, ఇది చర్మానికి, నాడీ వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధి అని వివరించారు. క్షయ వ్యాధికి  కారకమైన మైక్రో బాక్టీరియా వల్ల కుష్టు వ్యాధి వస్తుందని చెప్పారు. వైద్య శాస్త్రం ఎంతో అభివద్ధి చెందినా ఇంకా సమాజంలో కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల నిరాదరణ కొనసాగుతూనే ఉందని, పూర్వకాలంలో ఈ వ్యాధికి సరైన మందు ఉండేది కాదని వివరించారు. 1873 లో హన్సన్‌ అనే నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధికి కారకమైన సూక్ష్మజీవిని కనుగొన్నాడని తెలిపారు. దీని వలన శాశ్వతమైన అంగవైకల్యం కలుగుతుందన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదించాలని వివరించారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కుష్టు వ్యాధి చర్మం అసలు రంగు కంటే ముదురు లేదా లేత రంగులో ఉండే  మచ్చల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారన్నారు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి చర్మ లేదా నరాల బయాప్సీ చేసి వ్యాధిని నిర్దారించవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధిని అదుపుచేయుటకు యం.డి.టి మందులను ఆరోగ్య కార్యకర్తలు ఉచితంగా పంపిణీ చేస్తారని, వాటిని వాడవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి ధవళ భాస్కరరావు., డా.వినోద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-11-15 13:00:12

బాధిత కుటుంబాలరు రూ.20లక్షలు అందజేత

దేవరపల్లి కొండగూడెం విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో జరిగిన ప్రమాదం లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు చెందిన ఒకొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటిందని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం కంపెనీ వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాథమిక విచారణ లో తెలియ వచ్చిందని, పూర్తి స్థాయి విచారణ కు ఆదేశించడం జరిగిందని కలెక్టర్ అన్నారు 

ఈ ప్రమాదం కారణంగా దుంగ మహిదర్, ఎంగాల రత్నబాబు, సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారన్నారు. పంచనామా నిమిత్తం మృతదేహాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు  చెందిన చదువుకున్న వ్యక్తికి ఒకరికి కంపెనీ లో ఉద్యోగం,  అంతిమ సంస్కరాలు కోసం తక్షణ ఆర్థిక సహాయం గా కంపెనీ తరపున ఒక్కొక్కరికి రూ. 2.50 లక్షలు ఆర్థిక సహాయం అందజేసినట్టు పేర్కొన్నారు.


Rajamahendravaram

2022-11-15 12:30:27